సాక్షి, తిరుపతి జిల్లా: శ్రీకాళహస్తి పట్టణంలో కూటమి నేతల్లో విభేదాలు తారాస్థాయికి చేరుకున్నారు. జనసేన పార్టీ కార్యకర్త శివ కుమార్ ఇంటిని అర్ధరాత్రి జేసీబీతో కూల్చివేశారు. పానగల్ ఉరంధూరు ఆర్చ్ దగ్గర నిర్మాణంలో ఉన్న ఇంటిని మున్సిపల్ అధికారులు కూల్చివేశారు. మార్చి 28న మున్సిపల్ అధికారులు బెదిరించారని జనసేన కార్యకర్త శివ తెలిపారు. కూల్చిన ఇంటిని జనసేన నాయకురాలు వినూత కోట పరిశీలించారు. జనసేన నాయకులను ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ టార్గెట్ చేసి వేధిస్తున్నారని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.


