అక్టోబరు 5కి ‘జగనన్న విద్యా కానుక’ వాయిదా 

Jagananna Vidya Kanuka Postponed To October 5th - Sakshi

పాఠశాల విద్య  సంచాలకులు వాడ్రేవు చినవీరభద్రుడు

సాక్షి, అమరావతి: ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించాలనుకున్న ‘జగనన్న విద్యాకానుక’ కార్యక్రమాన్ని తాత్కాలికంగా వాయిదా వేస్తున్నట్లు పాఠశాల విద్య సంచాలకులు వాడ్రేవు చినవీరభద్రుడు  శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. ‘జగనన్న విద్యాకానుక’ కార్యక్రమాన్ని సెప్టెంబరు 5న ప్రభుత్వం నిర్వహించాలనుకున్న విషయం విదితమే. అయితే కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన  కోవిడ్-19, అన్ లాక్ 4.0 మార్గ దర్శకాల ప్రకారం సెప్టెంబరు 30 దాకా పాఠశాలలు తెరవకూడదని నిర్ణయించడంతో ఈ కార్యక్రమాన్ని అక్టోబరు 5కి వాయిదా వేశామని ఆయన పేర్కొన్నారు. (చదవండి: రైతులకు మేలు జరగాలి: సీఎం జగన్)‌

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top