చూపులో సైకిల్‌.. రేటులో బుల్లెట్‌ 

Furniture Dealer From Kakinada Bought Bicycle From Italy - Sakshi

సాక్షి, ఫిఠాపురం: చూడటానికి అది సైకిలే కానీ రేటులో మాత్రం బుల్లెట్‌తో పోటీ పడుతోంది. సామాన్యుడి వాహనం సైకిల్‌ అసామాన్యంగా మారిపోయింది. కాకినాడకు చెందిన ఓ ఫర్నిచర్‌ వ్యాపారి తన కుమారుడు చైతన్య కోసం ఏకంగా విదేశాల నుంచి సైకిల్‌ కొనుగోలు చేశారు. ఇటలీకి చెందిన ఈ సైకిల్‌ రేటు అక్షరాలా రూ.1.40 లక్షలు.

మోటారు సైకిల్‌ మాదిరిగా రిజిస్ట్రేషన్‌ నంబరుతో పాటు లైసెన్సు కలిపి అంత ధర అయ్యిందని చెబుతున్నారు. చూడటానికి మామూలు సైకిల్‌లానే ఉన్నా నిర్మాణంలో కొత్తదనం కనిపిస్తోంది. బుల్లెట్‌ బండి రేటుతో పోటీ పడుతున్న ఈ సైకిల్‌ ప్రస్తుతం పిఠాపురం రోడ్డులో ఆకర్షణగా నిలుస్తోంది.    

(చదవండి: రిపోర్ట్‌లో అసలు గుట్టు.. మరో మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకుని..)

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top