సీఎం జగన్‌ సమక్షంలో వైఎస్సార్‌సీపీలో చేరిన టీడీపీ మాజీ ఎమ్మెల్యే

Former TDP MLA GV Srinath Reddy Joined in YSRCP - Sakshi

సాక్షి, తాడేపల్లి: అన్నమయ్య జిల్లా పీలేరు నియోజకవర్గం టీడీపీ మాజీ ఎమ్మెల్యే జీవీ శ్రీనాథ్‌ రెడ్డి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సమక్షంలో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరారు.

శ్రీనాధ్‌ రెడ్డితో పాటు పీలేరు నియోజకవర్గ టీడీపీ నేతలు జి వి. రాకేష్‌ రెడ్డి, ఎం.వెంకట కృష్ణారెడ్డి, వి.ఉమాకాంత్‌ రెడ్డి, బి.నరేందర్‌ రెడ్డి, జి.నరేష్‌కుమార్‌ రెడ్డి పార్టీ కండువా కప్పుకున్నారు. ఈ కార్యక్రమంలో రాజంపేట ఎంపీ పీవీ మిథున్‌రెడ్డి, పీలేరు ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి, మైనారిటీస్‌ కమిషన్‌ ఛైర్మన్‌ ఇక్బాల్‌ అహ్మద్‌ ఖాన్‌ పాల్గొన్నారు. 

చదవండి: (రాజకీయాలకు దూరంగా ఉన్నా.. ఎంపీ కోమటిరెడ్డి సంచలన వ్యాఖ్యలు)

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top