గుడ్‌న్యూస్‌! కానిస్టేబుల్‌ పోస్టులకు దరఖాస్తు గడువు పెంపు 

Extension of application deadline for constable posts Andhra Pradesh - Sakshi

సాక్షి, అమరావతి: పోలీస్‌ కానిస్టేబుల్‌ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి గడువును రాష్ట్ర పోలీసు నియామక మండలి పొడిగించింది. ఇటీవల 611 ఎస్‌ఐ పోస్టులు, 6,100 కానిస్టేబుల్‌ ఉద్యో­గాలకు అభ్యర్థుల వయో పరిమితిని ప్రభు­త్వం రెండేళ్లు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. కాగా ముందు విడుదల చేసిన నోటిఫికేషన్‌ ప్రకారం కానిస్టేబుల్‌ పోస్టు­లకు ఈ నెల 28లోపు దరఖాస్తు చేసుకోవాలి.

వయో పరిమితి రెండేళ్లు సడలింపునిచ్చిన నేపథ్యంలో అర్హత సాధించిన అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకునేందుకు వీలుగా గడువును 2023, జనవరి 7 వరకు పొడిగించింది. ఈ మేరకు పోలీస్‌ నియామక నోటిఫికేషన్‌ను సవరించింది. ఎస్‌ఐ పోస్టులకు మాత్రం ముందు ఇచ్చిన నోటిఫికేషన్‌లో పేర్కొన్న ప్రకారం జనవరి 18లోపు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.     

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top