
తిరుమల,సాక్షి: తిరుమలలో మరోసారి అపచారం జరిగింది. శ్రీవారి ఆలయంపై డ్రోన్తో భక్తులు షూట్ చేశారు. భక్తుల సమాచారంతో టీటీడీ విజిలెన్స్ అధికారులు అప్రమత్తమయ్యారు. డ్రోన్తో చిత్రీకరించిన మహారాష్ట్ర భక్తుడిని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం, పోలీసులకు అప్పగించారు.శ్రీవారి ఆలయంపై డ్రోన్ ఎగుర వేయడంపై విచారణ చేపట్టారు. విచారణలో మహారాష్ట్ర భక్తుడు సుమారు 15 నిమిషాల పాటు డ్రోన్ కెమెరాతో చిత్రీకరించినట్లు తేలుస్తోంది.