
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ 12 వసంతాలు పూర్తి చేసుకుని నేడు 13వ సంవత్సరంలోకి అడుగు పెట్టింది. ఈ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో పార్టీ ఆవిర్భావ వేడుకలను నేతలు, కార్యకర్తలు ఘనంగా నిర్వహిస్తున్నారు.
సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ 12 వసంతాలు పూర్తి చేసుకుని నేడు 13వ సంవత్సరంలోకి అడుగు పెట్టింది. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో పార్టీ ఆవిర్భావ వేడుకలను నేతలు, కార్యకర్తలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా వైఎస్సార్సీపీ అభిమానులకు, కార్యకర్తలకు, నాయకులకు, రాష్ట్ర ప్రజలందరికీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. పార్టీ ఆవిర్భావ దినోత్సవంపై సీఎం జగన్ ట్వీట్ చేశారు.
చదవండి: ఆత్మగౌరవానికి ప్రతీక.. సవాళ్లే సోపానాలుగా..
‘‘గత 12 ఏళ్లుగా నా ఈ ప్రయాణంలో నాతో నిలబడి, నాకు వెన్నుదన్నుగా ఉన్న ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు. మన పార్టీ జెండాను తమ గుండెగా మార్చుకున్న నా కార్యకర్తలకు పేరు పేరునా కృతజ్ఞతలు. మన ప్రయాణం ఎప్పటికీ ఇలాగే కొనసాగుతూ ఉండాలని కోరుకుంటున్నాను’’ అంటూ సీఎం జగన్ ట్వీట్ చేశారు.
చదవండి: ప్రజాస్వామ్యంలో వైఎస్సార్సీపీ ఓ రోల్ మోడల్: సజ్జల
గత 12 ఏళ్లుగా నా ఈ ప్రయాణంలో నాతో నిలబడి, నాకు వెన్నుదన్నుగా ఉన్న ప్రతి ఒక్కరికీ, మన పార్టీ జెండాను తమ గుండెగా మార్చుకున్న నా కార్యకర్తలకు పేరు పేరునా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మన ప్రయాణం ఎప్పటికీ ఇలాగే కొనసాగుతూ ఉండాలని కోరుకుంటున్నాను. 2/2#YSRCPFormationDay #YSRCPForAll
— YS Jagan Mohan Reddy (@ysjagan) March 12, 2023