Breadcrumb
Live Updates
తిరుపతి పర్యటనలో సీఎం జగన్
కంపెనీలకు పూర్తి సహకారం అందిస్తాం: సీఎం జగన్
రెండు ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశామని, మూడు ప్రాజెక్ట్లను ప్రారంభించామని సీఎం వైఎస్ జగన్ అన్నారు. టీసీఎల్ ద్వారా 2వేల మందికి, ఫాక్స్ లింగ్ ద్వారా 2 వేల మందికి, సన్నీ ఆప్కోటెక్ ద్వారా 3 వేల మందికి ఉపాధి అవకాశాలు కలుగుతాయన్నారు. జిల్లాలో ఏర్పాటు చేసిన ప్రాజెక్టుల ద్వారా దాదాపు 20 వేల మందికి ఉపాధి లభించనుందన్నారు. కంపెనీలకు ఎలాంటి ఇబ్బంది వచ్చినా పూర్తి సహకారం అందిస్తామని సీఎం జగన్ అన్నారు.
సన్నీ ఆప్కోటిక్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థను ప్రారంభించిన సీఎం జగన్
తిరుపతి: సన్నీ ఆప్కోటిక్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రారంభించారు. మొబైల్ ఫోన్ కెమెరా లెన్స్.. సన్నీ ఆప్కోటెక్ తయారు చేస్తోంది. వివిధ రకాల మొబైల్ కంపెనీలకు కెమెరాలను ఆ సంస్థ సరఫరా చేయనుంది. రూ.254 కోట్ల పెట్టుబడితో ఏర్పాటు చేయగా, 3వేల మందికి ఉద్యోగ అవకాశం కలగనుంది.
2023 సెప్టెంబర్ కల్లా అందుబాటులోకి..
శంకుస్థాపన అనంతరం సీఎం జగన్ మాట్లాడుతూ.. అపాచీ పరిశ్రమ ఏర్పాటుతో 10వేల మందికి ఉద్యోగాలు వస్తాయి. ప్రపంచంలో అత్యుత్తమ కంపెనీ ఇక్కడ పరిశ్రమ ఏర్పాటు చేయడం సంతోషంగా ఉంది. 2023 సెప్టెంబర్ కల్లా పరిశ్రమ అందుబాటులో వస్తుంది. 80 శాతం మంది స్థానికులకే ఉద్యోగాలు రానున్నాయి' అని తెలిపారు.
అపాచీ పరిశ్రమకు సీఎం జగన్ శంకుస్థాపన
ఇనగలూరులో అపాచీ పరిశ్రమకు సీఎం జగన్ శంకుస్థాపన.
అపాచీ పరిశ్రమలో ఆడిడాస్ షూలు, లెదర్ జాకెట్స్, బెల్ట్లు వంటి ఉత్పత్తులు.
మొదటి దశలో రూ. 350 కోట్లు, వచ్చే ఐదేళ్లలో మరో 350 కోట్ల పెట్టుబడి.
అపాచీ పరిశ్రమ ద్వారా మొత్తం 15 వేల మందికి ఉపాధి.
వకుళామాత ఆలయాన్ని ప్రారంభించిన సీఎం జగన్
వకుళామాత ఆలయాన్ని ప్రారంభించిన సీఎం జగన్. అమ్మవారిని తొలి దర్శనం చేసుకున్న సీఎం జగన్
వకుళామాత ఆలయంలో సీఎం జగన్
ఆలయ ఆవరణలో మొక్క నాటిన సీఎం జగన్
వకుళామాత ఆలయ ఆవరణలో మొక్కనాటిన సీఎం జగన్. తిరుపతిలో వకుళామాత ఆలయాన్ని ప్రారంభిస్తున్న సీఎం జగన్. సీఎం జగన్కు పూర్ణకుంభంతో స్వాగతం పలికిన పండితులు.
వకుళామాత ఆలయంలో సీఎం జగన్
తిరుపతి శ్రీ వకుళామాత ఆలయంలో సీఎం జగన్. శ్రీ వకుళామాత ఆలయ ప్రారంభోత్సవం, పూజల్లో పాల్గొననున్న సీఎం జగన్.
కాసేపట్లో వకుళామాత ఆలయానికి సీఎం జగన్
పూర్ణాహుతిలో పాల్గొని వకుళామాతను తొలి దర్శనం చేసుకోనున్న సీఎం జగన్
రేణిగుంట ఎయిర్పోర్ట్లో సీఎం జగన్కు సాదర స్వాగతం
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి రేణిగుంట ఎయిర్పోర్ట్లో సాదర స్వాగతం లభించింది. ఉప ముఖ్యమంత్రి కే నారాయణ స్వామి, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రార్డె, జిల్లా కలెక్టర్ కె వెంకట రమణారెడ్డి తదితరులు సీఎం జగన్కు స్వాగతం పలికారు.

శ్రీ వకుళమాత ఆలయ ప్రారంభోత్సవంలో పాల్గొననున్న సీఎం జగన్
తిరుపతి రూరల్ మండలం పేరూరులో శ్రీ వకుళమాత ఆలయ ప్రారంభోత్సవం, పూజల్లో పాల్గొంటారు. పలు పరిశ్రమ యూనిట్ల నిర్మాణ పనుల భూమిపూజలో పాల్గొంటారు.
సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి తిరుపతి పర్యటన లో భాగంగా పలు పరిశ్రమలు ప్రారంభించనున్నారు. శ్రీకాళహస్తి లోని ఇలగనూరులో అపాచి పాదరక్షలు తయారీ కేంద్రాన్ని ప్రారంభించనున్నారు.
తిరుపతి బయల్దేరిన సీఎం జగన్
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తిరుపతి జిల్లా పర్యటనకు బయల్దేరారు. గన్నవరం నుండి రేణిగుంట విమానాశ్రయానికి బయల్దేరిన సీఎం జగన్.
Related News By Category
Related News By Tags
-
ఎట్టకేలకు మోక్షం
తిరుమల: వైఎస్సార్సీపీ హయాంలో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా చేపట్టిన శ్రీ పద్మావతి చిన్న పిల్లల హృదయాలయ ఆస్పత్రి ఆధునికీకరణకు ఎట్టకేలకు టీటీడీ కదిలింది. ఈ ఆస్పత్రిలో గత...
-
అమర జవాన్లకు వైఎస్ జగన్ ఘననివాళి
సాక్షి, అమరావతి: 1971లో జరిగిన యుద్ధంలో దేశ విజయం కోసం ప్రాణాలర్పించిన సైనికుల వీరత్వానికి, త్యాగానికి గౌరవప్రదమైన నివాళి అర్పిస్తున్నామని వైఎస్సార్సీపీ అధ్యక్షులు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి...
-
వైఎస్ జగన్పై దర్యాప్తు అవసరం లేదు
సాక్షి, హైదరాబాద్: మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో చంద్రబాబు చేతిలో పావుగా మారి వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డిపై బురదజల్లేందుకు యత్నించిన ఎల్లో మీడియా, నర్రెడ్డి సునీతల...
-
ఫేక్ సొసైటీతో భూకబ్జా కుట్ర
విజయవాడ నడిబొడ్డున ఖరీదైన భవానీపురంలోని జోజినగర్లో భూముల కబ్జాకు 2016లోనే కన్నేశారు. 1981 నాటి డేట్తో ఒక ఫేక్ సొసైటీని 2016లో ఏర్పాటు చేశారు. అప్పుడు టీడీపీ ప్రభుత్వమే అధికారంలో ఉంది. ఇప్పుడు జోజిన...
-
మరో 36 మెడికల్ పీజీ సీట్ల మంజూరు
సాక్షి, అమరావతి: మాజీ సీఎం వైఎస్ జగన్ ప్రభుత్వ హయాంలో ప్రారంభించిన ఐదు వైద్య కళాశాలలకు నేషనల్ మెడికల్ కమిషన్ (ఎన్ఎంసీ) 36 పీజీ సీట్లను కొత్తగా మంజూరు చేసింది. ఈ విద్యా సంవత్సరంలో తొలి విడతలో 60 ...


