గిడుగు జయంతిని జరుపుకోవడం తెలుగును సన్మానించుకోవడమే | CM YS Jagan Pays Tribute To Gidugu Ramamurthy On His Birth Anniversary | Sakshi
Sakshi News home page

గిడుగు జయంతిని జరుపుకోవడం తెలుగును సన్మానించుకోవడమే

Aug 30 2020 5:01 AM | Updated on Aug 30 2020 5:01 AM

CM YS Jagan Pays Tribute To Gidugu Ramamurthy On His Birth Anniversary - Sakshi

సాక్షి, అమరావతి: తెలుగు భాషా ఉద్యమకారుడు గిడుగు వెంకట రామమూర్తి జయంతిని తెలుగు భాషా దినోత్సవంగా జరుపుకోవడం తెలుగును సన్మానించుకోవడమేనని సీఎం వైఎస్‌ జగన్‌ అన్నారు. గిడుగు రామమూర్తి పంతులు జయంతిని పురస్కరించుకుని ఆయన శనివారం ట్వీట్‌ చేస్తూ.. ‘గ్రాంథికాన్ని సరళీకరించి వ్యవహారిక భాషలో ఉన్న అందాన్ని, పలకడంలో ఉండే సౌఖ్యాన్ని తెలియజెప్పిన భాషోద్యమకారుడు గిడుగు రామమూర్తి గారు. పండితులకే పరిమితమైన సాహిత్య సృష్టిని వచన భాషతో సామాన్యులకందించిన గిడుగు జయంతిని తెలుగు భాషా దినోత్సవంగా జరుపుకోవడం తెలుగును సన్మానించుకోవడమే’ అని పేర్కొన్నారు. 

నాగార్జునకు జన్మదిన శుభాకాంక్షలు
సినీ హీరో అక్కినేని నాగార్జునకు సీఎం వైఎస్‌ జగన్‌ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. శనివారం ఈ మేరకు ఆయన ట్వీట్‌ చేశారు. అత్యంత ప్రశంసనీయమైన నటుల్లో ఒకరైన నాగార్జునకు దేవుడు ఆయురారోగ్యాలను ప్రసాదించాలని, భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.

Advertisement
 
Advertisement
Advertisement