వ్యాక్సిన్ల కోసం  గ్లోబల్‌ టెండర్లు 

Cm Jagan Orders Global Tenders For Vaccines - Sakshi

 ఆ మేరకు టెండర్లు లోడ్‌ చేసిన ఏపీ అధికారులు

బిడ్ల దాఖలుకు 3 వారాల గడువు

300 టన్నుల సామర్థ్యంతో కృష్ణపట్నం లేదా కడపలో మెడికల్‌ ఆక్సిజన్‌ ప్లాంట్‌

యుద్ధ ప్రాతిపదికన చర్యలకు సీఎం జగన్‌ ఆదేశం

45 ఏళ్లకు పైబడిన వారందరికీ వ్యాక్సినేషన్‌

మొదటి డోస్‌ పూర్తి అయిన వారికి రెండో డోస్‌ తర్వాతే మిగిలిన వారికి వ్యాక్సిన్‌

రాష్ట్రానికి ఇప్పటి వరకు 75,49,960 డోసులు రాక

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ప్రజలకు వీలైనంత త్వరగా కోవిడ్‌–19 వ్యాక్సిన్‌ అందించాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తీసుకున్న నిర్ణయం మేరకు అధికారులు వాటి కోసం గ్లోబల్‌ టెండర్లను పిలిచారు. ఈ విషయాన్ని వారు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌కు తెలిపారు. రాష్ట్ర అవసరాలను దృష్టిలో ఉంచుకుని కోవిడ్‌ వ్యాక్సిన్ల కోసం గ్లోబల్‌ టెండర్లు పిలిచామని వెల్లడించారు. వ్యాక్సిన్లు సరఫరా చేసే కంపెనీలు మూడు వారాల్లో తమ బిడ్లు దాఖలు చేయాలని ప్రభుత్వం నిర్దేశించిందన్నారు.

కోవిడ్‌–19 నియంత్రణ, నివారణ, ఆక్సిజన్‌ సరఫరా, వ్యాక్సినేషన్‌పై గురువారం సీఎం వైఎస్‌ జగన్‌ తన క్యాంపు కార్యాలయంలో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ రాష్ట్రంలో 45 ఏళ్లకు పైబడిన వారందరికీ వ్యాక్సిన్‌ ఇవ్వాలని, మొదటి డోస్‌ పూర్తి అయిన వారికి రెండో డోస్‌ ఇచ్చిన తర్వాతే మిగిలిన వారికి వ్యాక్సిన్‌ ఇవ్వాలని అధికారులకు దిశా నిర్దేశం చేశారు. భవిష్యత్తులో కూడా మెడికల్‌ ఆక్సిజన్‌ కొరత రాకుండా ప్రణాళిక సిద్ధం చేయాలని ఆదేశించారు. ప్రస్తుతం రోజుకు మెడికల్‌ ఆక్సిజన్‌ వినియోగం 600 టన్నులు దాటిన దృష్ట్యా భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని దీర్ఘకాలిక ప్రణాళిక అవసరం అన్నారు.

రాష్ట్రంలో ప్రతిపాదిత కృష్ణపట్నం స్టీల్‌ ప్లాంట్‌తో పాటు, కడపలో ఏర్పాటు చేస్తున్న స్టీల్‌ ప్లాంట్‌కు ఉపయోగపడేలా.. అదే సమయంలో రాష్ట్రంలో రోగుల అవసరాలను తీర్చేలా ఒక ఆక్సిజన్‌ ప్లాంట్‌ను నిర్మించే ఆలోచన చేయాలని చెప్పారు. కృష్ణపట్నం లేదా కడపలో మెడికల్‌ ఆక్సిజన్‌ ప్లాంట్‌ను యుద్ధ ప్రాతిపదికన తీసుకొచ్చే విషయమై దృష్టి పెట్టాలని ఆదేశించారు. కనీసం 300 టన్నుల ఆక్సిజన్‌ ఉత్పత్తి సామర్థ్యంతో ఆ ప్లాంట్‌ ఉండాలని, ఇప్పుడున్న ఆక్సిజన్‌కు ఇది అదనం అవుతుందన్నారు. ఇంకా సమీక్ష వివరాలు ఇలా ఉన్నాయి.

ఆక్సిజన్‌ సేకరణ, సరఫరా 

  • ఏప్రిల్‌ 20 నాటికి 360 మెట్రిక్‌ టన్నుల ఆక్సిజన్‌ కేటాయింపులు ఉంటే ప్రస్తుతం వినియోగం సుమారు 600 మెట్రిక్‌ టన్నులకు పైగా చేరిందని అధికారులు తెలిపారు. ప్రస్తుతానికి కేటాయింపులు 590 టన్నుల వరకు ఉన్నాయని చెప్పారు. 
  • ప్రత్నామ్నాయ విధానాల ద్వారా ఆ లోటు అధిగమించడానికి ప్రయత్నిస్తున్నామని, వివిధ జిల్లాలకు 8 క్రయోజనిక్‌ స్టోరేజ్‌ ట్యాంకులు పంపిణీ చేశామని అధికారులు వెల్లడించారు. 
  • లిక్విడ్‌ మెడికల్‌ ఆక్సిజన్‌ సరఫరా చేసే వాహనాల సంఖ్యను 56 నుంచి 78కి పెంచామని అధికారులు వెల్లడించారు. ట్యాంకరు రాగానే దాని నుంచి రీఫిల్‌ చేసి పంపిణీ చేయడానికి మరో 14 వాహనాలను ఏర్పాటు చేశామని తెలిపారు. 
  • పాత వాహనాల్లో ఉన్న ట్యాంకర్లకు మరమ్మతులు చేసి 44 కిలో లీటర్ల స్టోరేజీ ఏర్పాటు చేశామని,  ఒడిశాలోని వివిధ కర్మాగారాల నుంచి రోజుకు 210 మెట్రిక్‌ టన్నుల ఆక్సిజన్‌ తీసుకు రావడానికి 36 వాహనాలను వినియోగిస్తున్నామని వివరించారు. 
  • ఇందులో నాలుగు వాహనాలను ప్రతిరోజూ విజయవాడ నుంచి వైమానిక దళం విమానం ద్వారా భువనేశ్వర్‌కు ఎయిర్‌ లిఫ్ట్‌ చేస్తున్నామని తెలిపారు. 
  •  రాష్ట్రానికి 2 ఐఎస్‌ఓ ట్యాంకర్లు వస్తున్నాయని, దుర్గాపూర్‌లో వాటికి ఆక్సిజన్‌ నింపి తీసుకొస్తున్నామని చెప్పారు. వచ్చే నెల (జూన్‌) మధ్యంతరానికి మరో 25 ట్యాంకర్లు రానున్నాయని వెల్లడించారు. 

ఆస్పత్రుల్లో ఆక్సిజన్‌ సామర్థ్యం పెంచండి 

  • ఆస్పత్రుల్లో ఆక్సిజన్‌ బెడ్లకు అనుగుణంగా సరైన ప్రెజర్‌తో ఆక్సిజన్‌ వెళ్లేలా అన్ని రకాల చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు. నేవీ, ఇతర సాంకేతిక సిబ్బంది సహాయం తీసుకుని ప్రెజర్‌ తగ్గకుండా అందరికీ సమరీతిలో ఆక్సిజన్‌ వెళ్లేలా చూడాలని సూచించారు.
  • ఇందు కోసం అవసరమైన పరికరాలను సమకూర్చుకోవాలని చెప్పారు. కాగా, ఆస్పత్రిలో పైపులైన్లను పరిశీలించి, అవసరమైన మార్పులు చేస్తున్నామని, పైపులైన్‌ వ్యవస్థను మెరుగు పరచడానికి నేవీ సహకారం తీసుకుంటున్నామని అధికారులు తెలిపారు. 

అందుబాటులోకి మరిన్ని సదుపాయాలు 

  • సీఎం ఆదేశాలతో 15 వేల ఆక్సిజన్‌ కాన్సంట్రేటర్లు, 10 వేల డి టైప్‌ సిలిండర్లు త్వరలో ఆస్పత్రులకు అందుబాటులోకి రానున్నాయి. అదనంగా 250 వెంటిలేటర్లు ఏర్పాటు చేస్తుండగా, వాటిలో ఇప్పటికే 50 సరఫరా చేశామని అధికారులు తెలిపారు. 
  • 125 కిలోలీటర్ల ఆక్సిజన్‌ మెగా స్టోరేజీ ట్యాంకు కోసం విధి విధానాలు ఖరారు చేస్తున్నామని చెప్పారు. దీన్ని ప్రతిపాదిత ఆక్సిజన్‌ తయారీ ప్లాంట్‌ వద్ద పెట్టించాల్సిందిగా సీఎం ఆదేశించారు. 
  • కొత్తగా 6,500 మెడికల్‌ గ్యాస్‌ పైపులైన్ల ఏర్పాటుతో పాటు రాష్ట్రంలో 53 చోట్ల పీఎస్‌ఏ ఆక్సిజన్‌ ప్లాంట్లు ఏర్పాటు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. 
  • ఆస్పత్రుల ఆవరణల్లో జర్మన్‌ హేంగర్లను ఏర్పాటు చేస్తున్నామని అధికారులు తెలిపారు. అక్కడున్న ఏరియాను బట్టి కనీసం 25 నుంచి 50 బెడ్లు ఏర్పాటు చేస్తున్నామని, రెండు మూడు రోజుల్లో అన్ని జిల్లాల్లో వీటి ఏర్పాటు పూర్తవుతుందని వివరించారు. 

ఆస్పత్రులు – బెడ్లు 

  • రాష్ట్ర వ్యాప్తంగా కోవిడ్‌ చికిత్స కోసం 669 ఆస్పత్రులను గుర్తించగా, వాటిలో మొత్తం 47,693 బెడ్లు ఉన్నాయని అధికారులు తెలిపారు. వాటిలో 39,749 బెడ్లు ఆక్యుపైడ్‌ అని, వాటిలో సగానికి పైగా, అంటే 26,030 బెడ్లు ఆరోగ్యశ్రీ కింద ఉన్నాయని చెప్పారు. 
  • అన్ని ఆస్పత్రులలో ఐసీయూ బెడ్లు 6513, నాన్‌ ఐసీయూ ఆక్సిజన్‌ బెడ్లు 23,357, నాన్‌ ఐసీయూ నాన్‌ ఆక్సిజన్‌ బెడ్లు 17,823 ఉన్నాయని తెలిపారు. మొత్తం 3,460 వెంటిలేటర్లు ఉన్నాయని చెప్పారు.
  • గతేడాది సెప్టెంబర్‌లో కరోనా తొలి దశ తీవ్ర స్థాయిలో ఉన్నప్పుడు రాష్ట్రంలో కోవిడ్‌ చికిత్స కోసం 261 ఆస్పత్రులను గుర్తించగా, వాటిలో మొత్తం 37,441 బెడ్లు, 2,279 వెంటిలేటర్లు మాత్రమే ఉండగా.. ఇప్పుడు వాటి సంఖ్య గణనీయంగా పెరిగింది.
  •  కోవిడ్‌ చికిత్స కోసం రాష్ట్ర వ్యాప్తంగా స్పెషలిస్టులు, జీడీఎంఓ స్టాఫ్‌ నర్సులు, టెక్నీషియన్లు, డేటా ఎంట్రీ ఆపరేటర్లు, ఎంఎన్‌ఓ, ఎఫ్‌ఎన్‌ఓలు కలిపి మొత్తం 17,901 పోస్టులు భర్తీ చేసినట్లు అధికారులు వివరించారు.
  • అన్ని జిల్లాల్లో ప్రస్తుతం 6,42,911 ఎన్‌–95 మాస్కులు, 7,18,086 పీపీఈ కిట్లు, 38,26,937 సర్జికల్‌ మాస్క్‌లు, 82,884 హోం ఐసొలేషన్‌ కిట్లు, 21,340 రెమ్‌డిసివిర్‌ ఇంజక్షన్లు ఉన్నాయని అధికారులు తెలిపారు.
  • కేంద్రం నుంచి రాష్ట్రానికి ఇప్పటి వరకు 75,49,960 కోవిడ్‌ వ్యాక్సిన్‌ డోస్‌లు వచ్చాయని, వాటిలో కోవిషీల్డ్‌ 62,60,400 కాగా, కోవాక్సిన్‌ 12,89,560 డోస్‌లు ఉన్నాయని చెప్పారు. 
  • ఈ సమీక్షలో డిప్యూటీ సీఎం, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల కాళీ కృష్ణ శ్రీనివాస్‌ (నాని), వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. 

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వార్తలు

08-05-2022
May 08, 2022, 17:43 IST
కెవాడియా(గుజరాత్‌): కోవిడ్‌ మహమ్మారి వల్ల భారత్‌లో 40.7 లక్షల మంది మృతి చెందారని అంచనా వేస్తూ ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌ఓ)...
03-05-2022
May 03, 2022, 03:08 IST
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో కరోనా టీకా పంపిణీ వేగంగా సాగుతోంది. 12 నుంచి 14 ఏళ్ల పిల్లల్లో 80.82 శాతం...
02-05-2022
May 02, 2022, 03:12 IST
సాక్షి, అమరావతి: కరోనా నుంచి పూర్తిస్థాయిలో రక్షణ కల్పించే టీకాలు అందుబాటులోకి వచ్చేవరకు ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిందేనని పబ్లిక్‌ హెల్త్‌...
24-04-2022
Apr 24, 2022, 11:03 IST
కన్న తండ్రిని కాపాడుకునేందుకు పడిన వేదన.. ఆస్పత్రి సేవల కోసం చేసిన శోధన.. అంటరాని వాళ్లను చేసి అందరూ దూరం...
21-04-2022
Apr 21, 2022, 11:52 IST
న్యూఢిల్లీ: దేశంలో మళ్లీ కరోనా వైరస్‌ విజృంబిస్తోంది. కొవిడ్‌ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. తాజాగా గడిచిన 24 గంటల్లో కొత్తగా 2380...
20-04-2022
Apr 20, 2022, 13:36 IST
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో కరోనా వైరస్‌ వ్యాప్తి అంతకంతకూ విజృంభిస్తోంది. గత వారం రోజులుగా పాజిటివ్‌ కేసులు భారీగా నమోదవుతున్నాయి....
18-04-2022
Apr 18, 2022, 15:39 IST
వైద్య నిపుణుల ఊహ కంటే ముందే భారత్‌లో ఫోర్త్‌ వేవ్‌ అడుగుపెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ మేరకు పెరుగుతున్న కేసుల్ని...
17-04-2022
Apr 17, 2022, 13:16 IST
సాక్షి, న్యూఢిల్లీ: దేశ రాజధానిలో కరోనా కలవరం రేపుతోంది. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 1150 కొత్త కేసులు నమోదుకాగా.....
16-04-2022
Apr 16, 2022, 13:09 IST
సాక్షి, న్యూఢిల్లీ: చైనాలో మళ్లీ పెరుగుతున్న కరోనా కేసులతో పలు నగరాల్లో కోవిడ్ ఆంక్షలు విధించారు. మరోవైపు భారత్‌లో కూడా...
11-04-2022
Apr 11, 2022, 01:28 IST
అకస్మాత్తుగా గుండెపోటు వచ్చే అవకాశం ఉంది. శరీరంలో కొవ్వు అధికంగా ఉన్నవాళ్లలో రక్తం గడ్డకట్టడం, చిక్కబడడం పెరిగి ప్రమాదాలకు దారి...
06-04-2022
Apr 06, 2022, 18:09 IST
ముంబై: రెండేళ్ల నుంచి కరోనా మహమ్మారి ప్రజలను పట్టి పీడిస్తూనే ఉంది. వైరస్‌ కట్టడికీ ఎన్ని ప్రయత్నాలు చేసినా రూపం మార్చుకొని...
06-04-2022
Apr 06, 2022, 15:27 IST
ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రపంచవ్యాప్తంగా కరోనా తగ్గిపోయిందని అనుకోవడానికి లేదు. దీన్ని మనం హెచ్చరికగా తీసుకుని భారత్‌కు ఇక ఏమీ కాదనే...
06-04-2022
Apr 06, 2022, 05:09 IST
సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో మంగళవారం 16,267 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా, అందులో 30మంది వైరస్‌ బారినపడ్డారు. దీంతో...
27-03-2022
Mar 27, 2022, 21:30 IST
చైనాలో కనివినీ ఎరుగని రీతిలో పెరుగుతున్నకరోనా కేసులు. పరిస్థితి అంత తేలిగ్గా అదుపులోకి వచ్చే స్థితి ఏ మాత్రం కనబడటం లేదు.
21-03-2022
Mar 21, 2022, 12:59 IST
ఫోర్త్‌ వేవ్‌ రూపంలో కాకున్నా జూన్, జూలై నెలల్లో కరోనా కొత్త వేరియంట్లు వచ్చే అవకాశం ఉందన్నారు గాంధీ ఆస్పత్రి...
28-02-2022
Feb 28, 2022, 09:43 IST
న్యూఢిల్లీ: కోవిడ్‌ టీకా కోవోవ్యాక్స్‌ను బూస్టర్‌ డోస్‌గా వాడేందుకు వీలుగా మూడో దశ ట్రయల్స్‌కు అనుమతివ్వాలని సీరం ఇన్‌స్టిట్యూట్‌ డీసీజీఐ...
28-02-2022
Feb 28, 2022, 08:26 IST
హీరోయిన్‌ శ్రుతి హాసన్‌ కరోనా బారిన పడింది. ఈ విషయాన్ని ఆమె స్వయంగా సోషల్‌ మీడియాలో వెల్లడించింది. ఈ మేరకు...
24-02-2022
Feb 24, 2022, 14:35 IST
పూర్తిస్థాయిలో కరోనా ముప్పు తొలగిపోలేదని.. వేవ్‌ రాకున్నా, వేరియంట్లు ఉన్నాయని ప్రొఫెసర్‌ రాజారావు అభిప్రాయపడ్డారు.
19-02-2022
Feb 19, 2022, 07:42 IST
సాక్షి, అమరావతి: ముక్కు ద్వారా తీసుకునే కరోనా వ్యాక్సిన్‌ డ్రాప్స్‌ మూడోదశ క్లినికల్‌ ట్రయల్స్‌ శుక్రవారం విశాఖపట్నంలోని విమ్స్‌లో ప్రారంభించినట్టు...
17-02-2022
Feb 17, 2022, 18:38 IST
కోవిడ్‌ వైరస్‌ సోకి కోలుకుని అస్సలు టీకాలు తీసుకోని వారిలో దీర్ఘకాలం పాటు కరోనా సమస్యలు, లక్షణాలు కొనసాగుతున్నట్టు వెల్లడైంది. ...



 

Read also in:
Back to Top