సీఐ వేణుగోపాల్ను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు

సాక్షి, శ్రీకాకుళం: జిల్లాలోని కాశీబుగ్గ సీఐ వేణుగోపాల్ను పోలీస్ ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. పలాస మండలం టెక్కలి పట్నంకు చెందిన రమేష్, జగన్ అనే యువకుల మధ్య వారి గ్రామంలో గొడవ జరిగింది. ఇద్దరూ పరస్పరం కాశీబుగ్గ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసుకున్నారు. ఈ విషయమై పోలీస్ స్టేషన్కు వచ్చిన జగన్ అనే దళితుడుని సీఐ వేణుగోపాల్ బూటుకాలితో తన్నారు. ఈ ఘటన వీడియో క్లిప్పింగ్లు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీనిని ఏపీ డీజీపీ కార్యాలయం సీరియస్గా తీసుకొని విచారణ చేపట్టింది. ప్రాథమిక విచారణ జరిపిన అనంతరం విశాఖపట్నం డీఐజీ కాళిదాస్ రంగారావు సీఐ వేణుగోపాలన్ను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి