దళిత యువకుడిపై సీఐ దౌర్జన్యం | CI atrocities on Dalit youth at Anakapalli Andhra Pradesh | Sakshi
Sakshi News home page

దళిత యువకుడిపై సీఐ దౌర్జన్యం

Dec 7 2025 7:05 AM | Updated on Dec 7 2025 7:05 AM

CI atrocities on Dalit youth at Anakapalli Andhra Pradesh

నర్సీపట్నం: అనకాపల్లి జిల్లా నర్సీపట్నానికి చెంది­న దళిత యువకుడు, వైఎ­స్సార్‌సీపీ యూత్‌ పట్ట­ణ అధ్యక్షుడు అల్లంపల్లి ఈశ్వ­రరావుపై పట్టణ సీఐ గఫూర్‌ దౌర్జన్యానికి పాల్పడ్డాడు. బాధితుడు విడుదల చేసిన వీడియో ప్రకారం.. ఈశ్వ­రరావు వేధిస్తు­న్నా­డంటూ ఆయ­న భార్య లక్ష్మి పట్టణ పోలీ­సులకు శుక్రవారం ఫిర్యాదు చేసింది. విచారణ కోసం ఈశ్వర­రావును   పిలి­పించిన పోలీసులు.. రాత్రంతా స్టేష­న్‌లోనే ఉంచారు. సీఐ గఫూర్‌ తనపై భౌతిక దాడి చేశారని, దీంతో తనకు విని­కిడి సమస్య తలెత్తిందని, దాడితో పాటు జాతి పేరుతో తన­ను సీఐ తిట్టా­రని ఆరోపించా­డు. 

ఈ మేరకు పోలీసు ఉన్న­తాధికారులకు ఫిర్యా­దు చే­శా­డు. ఈ విషయమై టౌన్‌ సీఐ గఫూర్‌ను వివ­రణ కోరగా తాను చేయిచేసు­కోలేదని తెలిపా­రు. ఈశ్వర­రావుపై దాడిని విస్తృత దళిత సంఘాల ఐక్య వేదిక ఖండించింది. భార్య, భర్తల విష­యంలో చట్టప­రమై­న చర్యలు తీసుకోవాలి తప్ప, భౌతికంగా దాడి చేయడాన్ని ఐక్యవేదిక రాష్ట్ర క­మిటీ కన్వీనర్‌ బూసి వెంకటరావు ఖండించా­రు. దాడి­పై విచారణ జరిపించాలని జాతీయ మా­న­వ హక్కుల సంఘం సభ్యురాలు విజయ భార­తికి ఫిర్యాదు చేసినట్లు  వెంకటరావు తెలిపారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement