వినాయక నిమజ్జనంలో విషాదం.. జనంపై దూసుకెళ్లిన కారు | Car Rams Into Devotees During Ganesh Immersion In Paderu, More Details Inside | Sakshi
Sakshi News home page

వినాయక నిమజ్జనంలో విషాదం.. జనంపై దూసుకెళ్లిన కారు

Aug 31 2025 7:39 PM | Updated on Sep 1 2025 12:29 PM

Car Rams Into Devotees During Ganesh Immersion in Paderu

సాక్షి,అల్లూరి జిల్లా: వినాయక నిమజ్జనంలో విషాదం చోటు చేసుకుంది. పాడేరులో వినాయక నిమజ్జన కార్యక్రమం జరిగే సమయంలో భక్తులపైకి ఓ కారు దూసుకెళ్లింది.

ఈ దుర్ఘటనలో ఐదుగురు భక్తులు తీవ్రంగా గాయపడ్డారు. అప్రమత్తమైన స్థానికులు క్షాతగాత్రలను పాడేరు ఆసుపత్రి కి తరలించారు. వారిలో ముగ్గురు పరిస్థితి అత్యంత విషంగా ఉన్నట్లు తెలుస్తోంది. ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. ప్రమాదం జరిగిన తీరును ఆరాతీస్తున్నారు. 

Advertisement
 
Advertisement
Advertisement