ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే అరెస్టు చేస్తారా? | Botcha Satyanarayana Slams Alliance Government | Sakshi
Sakshi News home page

ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే అరెస్టు చేస్తారా?

Nov 19 2025 4:28 PM | Updated on Nov 19 2025 4:40 PM

Botcha Satyanarayana Slams Alliance Government

సాక్షి,విజయవాడ: రాష్ట్రంలో ప్రజాస్వామ్యయుతంగా పాలన జరగడం లేదని కూటమి ప్రభుత్వంపై వైఎస్సార్‌సీపీ నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే అరెస్టు చేస్తారా? అని ప్రశ్నించారు. విజయవాడలో బుధవారం బొత్స సత్యనారాయణ మీడియాతో మాట్లాడారు.  చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటామంటే అన్నీ రోజులు ఒకేలా ఉండవు. ఏవీఎస్‌వో సతీష్‌ కేసులో అభిప్రాయం చెబితే కేసులు పెడతారా? ప్రధాన ప్రతిపక్షం బాధ్యతగా మేం ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూనే ఉంటాం. 

స్టీల్‌ ప్లాంట్‌పై చంద్రబాబు వ్యాఖ్యల్ని ఖండిస్తున్నాం. స్టీల్‌ ప్లాంట్‌పై మీ వైఖరేంటి అని అడిగితే అహంకారంగా మాట్లాడుతారా.  బాధ్యత గల సీఎంగా చంద్రబాబు వ్యవహరించడంలేదు. ఆయన వ్యవహార శైలిపై అనేక అనుమానాలున్నాయి. ఇది అంబేద్కర్‌ రాజ్యాంగమా? తాలిబాన్ల రాజ్యాంగమా? అని కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement