
సాక్షి, అమరావతి: ఇంటర్మిడియెట్ సప్లిమెంటరీ పరీక్షా ఫలితాలను మంగళవారం విడుదల చేయనున్నారు. తొలుత ఇంటర్ ద్వితీయ సంవత్సరం ఫలితాలను ప్రకటించనున్నారు. మే 24 నుంచి ఈ నెల ఒకటో తేదీ వరకు సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించగా, ద్వితీయ సంవత్సరం విద్యార్థులు 1,37,587 మంది హాజరయ్యారు.
సప్లి ఫలితాల కోసం క్లిక్ చేయండి
వోకేషనల్ సప్లి రిజల్ట్స్ కోసం క్లిక్ చేయండి
ఇంటర్మిడియెట్ బోర్డు సప్లిమెంటరీ పరీక్షల జవాబు పత్రాలను తొలిసారి డిజిటల్ విధానంలో మూల్యాంకనం చేసింది. ఈ నెల 26న ఇంటర్ ప్రథమ సంవత్సరం ఫలితాలను ప్రకటించనున్నట్లు బోర్డు అధికారులు తెలిపారు.