బడిగంటలు మోగే వేళాయే..

Andhra Pradesh Govt Released Schools Reopen Schedule - Sakshi

నవంబర్‌ 2 నుంచి పాఠశాలలు, కళాశాలలు

9, 10, ఇంటర్‌ క్లాసులు ప్రారంభం

6, 7, 8 తరగతులకు నవంబర్‌ 23 నుంచి, 1 నుంచి 5 తరగతులకు 

డిసెంబర్‌ 14 నుంచి బోధన రోజు విడిచి రోజు,ఒక్క పూట మాత్రమే క్లాసులు 

షెడ్యూల్‌ విడుదల చేసిన ప్రభుత్వం

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో వచ్చే నెల 2 నుంచి పాఠశాలలు, కళాశాలలు తెరుచుకోనున్నాయి. పాఠశాలల్లో మూడు దశల్లో రోజు విడిచి రోజు తరగతులను నడపనున్నారు. కోవిడ్‌ వ్యాపించకుండా అధికారులు అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని తరగతుల పునఃప్రారంభానికి సంబంధించిన షెడ్యూల్‌ను గురువారం విడుదల చేశారు. దీని ప్రకారం.. నవంబర్‌ 2 నుంచి 9, 10, 11/ఇంటర్‌ మొదటి సంవత్సరం, 12/ఇంటర్‌ రెండో సంవత్సరం తరగతులు రోజు విడిచి రోజు.. హాఫ్‌డే మాత్రమే నిర్వహిస్తారు.

ఉన్నత విద్యకు సంబంధించిన అన్ని కాలేజీలకూ కూడా నవంబర్‌ 2నే తరగతులు ప్రారంభిస్తారు. రొటేషన్‌ పద్ధతిలో తరగతులు ఉంటాయి. నవంబర్‌ 23 నుంచి 6, 7, 8 తరగతులకు బోధన మొదలవుతుంది. డిసెంబర్‌ 14 నుంచి 1, 2, 3, 4, 5 తరగతులను ప్రారంభిస్తారు. 1 నుంచి 8వ తరగతి వరకు కూడా రోజు విడిచి రోజు, హాఫ్‌డే మాత్రమే క్లాసులు నిర్వహిస్తారు. అన్ని ప్రభుత్వ, ప్రైవేటు విద్యా సంస్థలకు ఇదే షెడ్యూల్‌ వర్తిస్తుంది.

చదవండి: రూ.17,300 కోట్లతో వైద్య రంగానికి చికిత్స 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top