96.25 శాతం పింఛన్ల పంపిణీ పూర్తి | 96 percent above pensions distribution completed in AP | Sakshi
Sakshi News home page

96.25 శాతం పింఛన్ల పంపిణీ పూర్తి

Jan 3 2021 5:57 AM | Updated on Jan 3 2021 5:57 AM

96 percent above pensions distribution completed in AP - Sakshi

రొద్దంలో పింఛన్లు పంపిణీ చేస్తున్న పెళ్లి కూతురు గాయత్రి

సాక్షి, అమరావతి/రొద్దం: రాష్ట్రంలో పింఛన్ల పంపిణీ రెండో రోజు శనివారం కూడా కొనసాగింది. లబ్ధిదారుల ఇళ్ల వద్దకు వెళ్లి వలంటీర్లు పింఛన్లు పంపిణీ చేశారు. రెండు రోజుల్లో 59,41,480 మందికి రూ. 1,425.06 కోట్ల మేర పంపిణీ పూర్తి చేశారు. మొత్తం 96.25 శాతం పంపిణీ పూర్తయింది. ఆదివారం కూడా ఈ పంపణీ కొనసాగనుంది.  
ఒంగోలు నగరంలో దివ్యాంగుడు దుర్గావలికి పింఛన్‌ ఇస్తున్న వలంటీర్‌ కోటి   

పెళ్లి కూతురుగానే.. పింఛన్ల పంపిణీ 
ఆ వలంటీర్‌కు పెళ్లి కుదిరింది. శనివారం తొలి పసుపు (పెళ్లికూతురుని చేయడం). అయినా కూడా పింఛన్ల పంపిణీ చేసి అందరిమన్ననలు పొందింది అనంతపురం జిల్లా రొద్దం గ్రామ వలంటీర్‌ గాయత్రి. పింఛను లబ్ధిదారులకు ఎలాంటి ఇబ్బంది తలెత్తకూడదనే ఉద్దేశంతో బాధ్యతను నెరవేర్చింది. సీఎం జగనన్న సంకల్పంలో తాను భాగస్వామిని కావడం సంతోషంగా ఉందని ఈ సందర్భంగా ఆమె తెలిపింది.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement