రాష్ట్రంలో 3,840 మంది డిశ్చార్జ్

3840 Covid Victims discharged In AP And 10376 Positives Reported Newly  - Sakshi

మొత్తం కోలుకున్న వారు 63,864 మంది

తాజాగా 10,376 మందికి పాజిటివ్‌ 

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో గురువారం ఉదయం 9 గంటల నుంచి శుక్రవారం ఉదయం 9 వరకు 61,699 మందికి కరోనా పరీక్షలు నిర్వహించడంతో మొత్తం పరీక్షల సంఖ్య 19,51,776కి చేరింది. కొత్తగా 10,376 మందికి పాజిటివ్‌గా తేలింది. దీంతో మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,40,933కి చేరినట్టు వైద్యారోగ్యశాఖ బులెటిన్‌లో పేర్కొంది. ఇదే సమయంలో 3,840 మంది డిశ్చార్జ్‌ కావడంతో మొత్తం కోలుకున్న వారి సంఖ్య 63,864కు చేరింది. తాజాగా 68 మంది మృతితో మొత్తం మరణాలు 1,349కి చేరాయి. యాక్టివ్‌ కేసులు 75,720 ఉన్నాయి. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top