రాష్ట్రంలో ఎక్కడా లేనివిధంగా కళ్యాణదుర్గంలో మద్యం షాపులన్నీ ‘కళ్యాణి వైన్స్’కే లాటరీలో తగిలాయట. ఇదెక్కడి వింతో నాకు అర్థం కావడం లేదు. తన సొంత డబ్బుతో పేదలకు మంచి చేస్తానని వచ్చిన టీడీపీ ఎమ్మెల్యే.. అనుచరులకు మద్యం వ్యాపారం అప్పగించారు. వారేమో జలగలు రక్తం తాగినట్టు.. రెక్కలుముక్కలు చేసుకుని పేదలు సంపాదించిన సొమ్మునంతా తాగేస్తున్నారు. ఏ సందు చూసినా బెల్టుషాపులే. నేరుగా డోర్ డెలివరీ చేయడం ఇంకా దారుణం. బెల్టుషాపులపై ప్రజలు తిరగబడాలి.
– డాక్టర్ తలారి రంగయ్య, మాజీ ఎంపీ,
కళ్యాణదుర్గం వైఎస్సార్సీపీ సమన్వయకర్త


