ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన మరో లారీ : క్లీనర్‌ మృతి | - | Sakshi
Sakshi News home page

ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన మరో లారీ : క్లీనర్‌ మృతి

Aug 26 2025 8:06 AM | Updated on Aug 26 2025 8:06 AM

ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన మరో లారీ : క్లీనర్‌ మృతి

ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన మరో లారీ : క్లీనర్‌ మృతి

నక్కపల్లి: జాతీయ రహదారిపై గొడిచర్ల కొత్తూరు సమీపంలో ఆగి ఉన్న లారీని మరో లారీ ఢీకొట్టింది. సోమవారం జరిగిన ఈ ప్రమాదంలో క్లీనర్‌ మరణించాడు. పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం.. రాజమహేంద్రవరం నుంచి విశాఖ వైపు వెళ్తున్న లారీ టైరు పంక్చర్‌ అయింది. దాంతో రోడ్డు పక్కన నిలిపి టైరు మారుస్తుండగా, వెనుక నుంచి వచ్చిన మరో లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో వెనుక లారీలో ఉన్న పశ్చిమ బెంగాల్‌కు చెందిన క్లీనర్‌ ప్రదీప్‌ రామ్‌నాయక్‌(55) అక్కడికక్కడే దుర్మరణం చెందాడు. మరో వ్యక్తికి గాయాలయ్యాయి. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. వెనుక నుంచి ఢీకొట్టిన లారీ ముందుభాగం నుజ్జయింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement