
చందా వివరాలు
నెలసరి వేతనం రూ. 21,000 లేదా అంతకంటే తక్కువ ఉన్న కార్మికులకు ఈఎస్ఐ వర్తిస్తుంది. దివ్యాంగులకు ఈ పరిమితి రూ. 25,000. కార్మికుల వాటా మొత్తం వేతనంపై 0.75 శాతం ఉంటుంది. మొత్తం వేతనంపై 3.25 శాతం ఉంటుంది. ఈ రెండు వాటాలను కలిపి ప్రతి నెలా 15వ తేదీలోగా ఆన్లైన్లో చెల్లించాలి. రూ. 176 లేదా అంతకంటే తక్కువ దినసరి వేతనం పొందే కార్మికులకు చందా మినహాయింపు ఉంటుంది, కానీ యజమాని వాటా చెల్లించాల్సి ఉంటుంది. మరిన్ని వివరాల కోసం నరసింహనగర్లోని ఉప ప్రాంతీయ కార్యాలయాన్ని లేదా టోల్ఫ్రీ నంబర్ 1800–11–2526ను సంప్రదించవచ్చు.