
బిషప్ డేనియల్ 75వ వసంత వేడుకలు
నర్సీపట్నం : యోరూషలేం ప్రార్ధనామందిరం నిర్వాహకులు రెవ డా..అరసాడ డేనియల్ 75వ జన్మదిన వేడుకలను సంఘ సభ్యులు, కుటుంబ సభ్యులు ఆదివారం ఘనంగా నిర్వహించారు. వసంత వేడుకలను చర్చిలో నిర్వహించారు. ఈ వేడుకలకు ముఖ్య అతిథులుగా ఇన్మూనియల్ మినిస్ట్రీస్ బిషప్ డాక్టర్ జీవన్ రాయ్, యుసీఐఎం అధినేత బిషఫ్ కెఆర్.సింగ్ విచ్చేసారు. డేనియల్, అమ్మాణి దంపతులను ముఖ్య అతిథులు ఘనంగా సత్కరించారు. డేనియల్ సేవలను వారు కొనియాడారు. ఈ వేడుకల్లో కృపాసిల్వన్, థామస్, నాహోర్, జాన్బాబు, కృపారావు, బెతస్ధ నారాయణరావు, జి.రవి, శరత్, ఆశ, రాణి పాల్గొన్నారు.