
ఉత్సాహంగా తెలంగాణ, ఆంధ్ర ఖోఖో పోటీలు
పాయకరావుపేట : క్లస్టర్ – 7 సీబీఎస్ఈ పాఠశాలలకు నిర్వహిస్తున్న తెలంగాణ, ఆంధ్ర ఖో ఖో పోటీలు శ్రీప్రకాష్ విద్యా సంస్థల ప్రాంగణంలో శనివారం ఉత్సాహంగా ప్రారంభమయ్యాయి. అండర్ –14,17,19 బాలురు, బాలికల విభాగంలో సుమారు 180 జట్లు 2000 మందికి పైగా విద్యార్థులు పాల్గొన్నారు. ఈ పోటీలు 3 రోజుల పాటు జరగనున్నాయి. శ్రీ ప్రకాష్ విద్యా సంస్థల అధినేత నరసింహారావు క్రీడాకారులను పరిచయం చేసుకున్నారు. సీనియర్ ప్రిన్సిపాల్ ఎం.వి.వి.ఎస్ మూర్తి, వైస్ ప్రిన్సిపాల్ అపర్ణ, సీబీఎస్ఈ అబ్జర్వర్, ఖో ఖో ఫెడరేషన్ కార్యదర్శి శ్రీనివాస్ పాల్గొన్నారు.

ఉత్సాహంగా తెలంగాణ, ఆంధ్ర ఖోఖో పోటీలు