ప్రజలు, ఉద్యోగుల సహకారంతో ప్రగతి పథం

- - Sakshi

పరవాడ: నిర్వాసిత గ్రామాల ప్రజలు, ఉద్యోగుల సహకారంతో సింహాద్రి ఎన్టీపీసీ అభివృద్ధి పథంలో నడుస్తుందని సంస్థ జీజీఎం సంజయ్‌కుమార్‌ సిన్హా అన్నారు. దీపాంజిలినగర్‌లోని స్టేక్‌ హోల్డర్స్‌ (వాటాదారులు) సమావేశంలో ఆయన మాట్లాడారు. మండలంలోని అన్ని గ్రామాలను అభివృద్ధి చేయడమే సంస్థ లక్ష్యమన్నారు. గ్రామీణ ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించడానికి తమ వంతు కృషి చేస్తామన్నారు. సీఎస్సార్‌ నిధులతో విద్య, వైద్యం, తాగునీరు, రహదారులు, స్కిల్‌ డెవలప్‌మెంట్‌ వంటి మౌలిక సదుపాయాలు కల్పించి ప్రజలకు అండగా ఉంటామన్నారు. ఏజీఎం హెచ్‌ఆర్‌ రుమాఢిశర్మ, ఎంపీడీవో వి.హేమసుందర్రావు, ఈవోపీఆర్డీ పద్మజ, ఎంఈవో సునీత, ఆర్‌డబ్ల్యూఎస్‌ ఏఈ షణ్ముఖ, వ్యవసాయాధికారి చంద్రావతి, పంచాయతీరాజ్‌ ఏఈ రామారావు, వాడచీపురుపల్లి, పరవాడ పీహెచ్‌సీ వైద్యాధికారులు కనకప్పారావు, ఐ.ఆర్‌.రంజిత్‌ పాల్గొన్నారు.

Read latest Anakapalle News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top