
పాడేరు ఘాట్లో అడ్డంగా నిలిచిన ఆర్టీసీ బస్సు
సాక్షి,పాడేరు: ఘాట్రోడ్డులోని యేసు ప్రభువు విగ్రహం మలుపు వద్ద రోడ్డుకు అడ్డంగా ఆర్టీసీ బస్సు నిలిచిపోవడంతో ఇరువైపులా గంటన్నర సేపు ట్రాఫిక్ స్తంభించింది. యోగాంధ్రకు సంబంధించి గాజువాక డిపో నుంచి ఈ ప్రాంతానికి వస్తున్న ఆర్టీసీ బస్సు గురువారం మధ్యాహ్నం 1.30గంటల సమయంలో మలుపు వద్ద ఒక్కసారిగా నిలిచిపోయింది. ఘాట్ మార్గంలో డ్రైవింగ్కు కొత్తకావడంతో డ్రైవర్ తిప్పలేకపోయాడు. రోడ్డుకు అడ్డంగా బస్సు నిలిచిపోవడంతో ఘాట్లో ఇరువైపులా సుమారు కిలోమీటరు మేర వాహన రాకపోకలు నిలిచిపోయాయి. గంటన్నర సేపు ట్రాఫిక్ స్తంభించడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. అడ్డంగా నిలిచిన బస్సును ఆర్టీసీ డ్రైవర్లు, ఇతర వాహనాల సిబ్బంది తొలగించి ట్రాఫిక్ను పునరుద్ధరించారు.
గంటన్నర సేపు నిలిచిన ట్రాఫిక్

పాడేరు ఘాట్లో అడ్డంగా నిలిచిన ఆర్టీసీ బస్సు