
ప్రజా సమస్యలు పరిష్కరించండి
పాడేరు : ప్రజా సమస్యలు పట్ల సంబంధిత శాఖల అధికారులు చిత్తశుద్ధితో పని చేసి త్వరితగతిన పరిష్కరించాలని డీఆర్వో పద్మలత ఆదేశించారు. శుక్రవారం స్థానిక ఐటీడీఏ సమావేశ మందిరంలో మీకోసం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వారి నుంచి పలు సమస్యలపై ఆమె 43 అర్జీలను స్వీకరించారు. ప్రధానంగా తాగునీరు, రహదారుల నిర్మాణం, భూ సమస్యలు, రేషన్ కార్డులు, విద్యుత్ సదుపాయం తదితర వాటిపై ప్రజలు వినతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయశాఖ అధికారి ఎస్బీఎస్ నంద్, జిల్లా ఉద్యానవనఖ అధికారి రమేష్కుమార్రావు, ట్రాన్స్కో ఎస్ఈ ప్రసాద్, డీఎంహెచ్వో డాక్టర్ జమాల్బాషా, పంచాయతీరాజ్ ఈఈ కొండయ్య పడాల్, పలు శాఖల అధికారులు పాల్గొన్నారు.
డీఆర్వో పద్మలత
43 అర్జీల స్వీకరణ