
మోదమ్మను దర్శించుకున్న ట్రైనీ ఐఏఎస్లు
సాక్షి,పాడేరు: పాడేరు మోదకొండమ్మతల్లిని ట్రైనీ ఐఏఎస్లు శుక్రవారం దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు.రాష్ట్రంలోని పలు జిల్లాలకు చెందిన ట్రైనీ ఐఏఎస్ సచిన్రాహర్ (అనంతపురం), చిట్టపులి నరేంద్రపడాల్ (చిత్తూరు), పృధ్వీరాజ్కుమార్ డొనక (శ్రీకాకుళం), పరేహిన్ జాహిద్ (కృష్ణ), మనీషా(కాకినాడ), సందీప్ రఘువంశీ (తిరుపతి), చిరంజీవి నాగ వెంకట సాహిత్ కనల (అల్లూరి సీతారామరాజు జిల్లా)కు ఆలయ ప్రధాన అర్చకుడు సుబ్రహ్మణ్యం, ఆలయ కమిటీ ప్రధాన కార్యదర్శి కిల్లు కోటిబాబునాయుడు, వీఆర్వో వెంకటలక్ష్మి ఘనంగా సత్కరించారు. అమ్మవారి చిత్రపటం, ప్రసాదం వారికి అందజేశారు. వీరిలో చిట్టపులి నరేంద్రపడాల్ జిల్లాలో ముంచంగిపుట్టు మండలానికి చెందిన వారు కావడం విశేషం.