
డీఎంహెచ్వోగా విశ్వేశ్వరనాయుడు
● వైఎస్సార్ కడప జిల్లాకు జమాల్బాషా బదిలీ
● జోనల్ మలేరియా అధికారిగా
నియామకం
సాక్షి,పాడేరు: జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి (ఎఫ్ఏసీ)గా డాక్టర్ తమర్బ విశ్వేశ్వరనాయుడును నియమిస్తూ వైద్య ఆరోగ్యశాఖ హెల్త్ డైరెక్టర్ నుంచి శుక్రవారం ఉత్తర్వులు జారీ అయ్యాయి. జిల్లా నేత్ర చికిత్సా విభాగం ప్రోగ్రామ్ అధికారిగా విధులు నిర్వహిస్తున్న ఆయనకు డీఎంహెచ్వోగా పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించారు. అలాగే ఇంతవరకు డీఎంహెచ్వోగా పనిచేస్తున్న డాక్టర్ సి.జమాల్బాషాను వైఎస్సార్ కడప జిల్లా జోనల్ మలేరియా అధికారిగా బదిలీ చేశారు. మూడేళ్ల పాటు ఇక్కడ సేవలందించిన ఆయన జిల్లాలో గిరిజనుల వైద్యానికి ఎంతో శ్రమించారు.