
యోగాంధ్రకు బస్సులు.. గిరిజనులకు అవస్థలు
సాక్షి,పాడేరు: యోగాంధ్ర నేపథ్యంలో మారుమూల గ్రామాలకు వెళ్లాల్సిన ఆర్టీసీ బస్సులను రద్దు చేయడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. జిల్లా కేంద్రమైన పాడేరు ఆర్టీసీ డిపోలో 46 బస్సులు ఉన్నాయి. వీటిలో 20 బస్సులను విశాఖలో జరిగే యోగాంధ్రకు కేటాయించడంతో గురువారం మధ్యాహ్నం నుంచి మారుమూల గ్రామాలకు వెళ్లేందుకు సమస్యలు ఎదురయ్యాయి. మరో వైపు విశాఖ డిపో నుంచి పాడేరు వచ్చే ఆరు సర్వీసుల్లో ఐదింటిని రద్దు చేశారు. దీంతో పాడేరు నుంచి విశాఖపట్నం వెళ్లేందుకు అవకాశం లేకుండా పోయింది. పాడేరు–విశాఖపట్నం మధ్య ప్రతి 45 నిమిషాలకు ఒక బస్సు తిరిగేది. గురువారం మధ్యాహ్నం 2.30 నుంచి నాలుగు గంటల వరకు విశాఖపట్నానికి బస్సులు నడవలేదు. దీంతో ప్రయాణికులు చోడవరం వెళ్లే బస్సును ఆశ్రయించారు. సాయంత్రం 4.30గంటల నుంచి 6.30గంటల వరకు విశాఖ, చోడవరం వెళ్లే బస్లు లేకపోవడంతో ప్రయాణికులు సర్వీసు జీపులను ఆశ్రయించారు. మైదాన ప్రాంతాలకు విధులకు వెళ్లే పోలీసులు కూడా గంటల తరబడి పాడేరు కాంప్లెక్స్లో నిరీక్షించారు. వీరిలో కొంతమంది సర్వీసు జీపులను ఆశ్రయించాల్సి వచ్చింది. పాడేరు నుంచి అరకులోయ, జోలాపుట్టు, చింతపల్లి రూట్లలో బస్సు సర్వీసులు తగ్గడంతో అన్ని వర్గాల ప్రయాణికులు సమస్యలు ఎదుర్కొన్నారు. మధ్యాహ్నం నుంచి చింతపల్లి ప్రాంతానికి బస్సులు లేవు. దీంతో నాలుగు గంటల తరువాత వచ్చిన కొయ్యూరు మండలం మంప వెళ్లే బస్సును ఆశ్రయించారు. జి.మాడుగుల, చింతపల్లి, జీకేవీధి, కొయ్యూరు మండలాల ప్రయాణికులు మంప బస్సులో వెళ్లారు.
రెండు గంటలపాటుపడిగాపులు
చింతపల్లి వెళ్లేందుకు ఆర్టీసీ బస్సు కోసం పాడేరు ఆర్టీసీ కాంప్లెక్స్లో రెండు గంటల పాటు పడిగాపులు పడ్డా. మధ్యాహ్నం 2గంటల నుంచి చింతపల్లి వెళ్లేందుకు బస్సు లేదు. సాయంత్రం వచ్చిన మంప బస్సు ఆధారమైంది. ఏజెన్సీలో బస్ సర్వీసులను కుదించడం బాధాకరం.
– వంతాల రాంబాబు,
అన్నవరం, చింతపల్లి మండలం
పాడేరు డిపోలోని 46 సర్వీసుల్లో
20 కేటాయింపు
పలు రూట్లలో బస్సుల్లేక ఇబ్బందులు
గమ్యానికి చేరుకునేందుకు
ప్రయాణికుల అష్టకష్టాలు

యోగాంధ్రకు బస్సులు.. గిరిజనులకు అవస్థలు

యోగాంధ్రకు బస్సులు.. గిరిజనులకు అవస్థలు

యోగాంధ్రకు బస్సులు.. గిరిజనులకు అవస్థలు

యోగాంధ్రకు బస్సులు.. గిరిజనులకు అవస్థలు