
కాఫీలో సమగ్ర సస్యరక్షణతో అధిక దిగుబడి
చింతపల్లి: గిరిజన రైతాంగం కాఫీ తోటల్లో సమగ్రంగా సస్యరక్షణ చర్యలు చేపడితే అధిక దిగుబడులు సాధించవచ్చునని చింతపల్లి కేంద్ర కాఫీ బోర్డు జూనియర్ లైజన్ ఆఫీసర్ రవికుమార్ అన్నారు. గురువారం మండలంలోని బలపం పంచాయతీలో కాఫీ రైతులకు నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. కాఫీ తోటల్లో మంచి దిగుబడులు సాధించేందుకు సస్యరక్షణ, యాజమాన్యంపై రైతులు ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. కాఫీ తోటలకు సోకే తెగుళ్లు, వాటి నివారణ చర్యలపై ఆయన అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎల్వో శశిప్రియ, ఏఈవో ధర్మారాయ్, కాఫీ సిబ్బంది పాల్గొన్నారు.