
టీచర్ లేక టీసీలకు బ్రేక్
● గరిమండలో విద్యార్థుల అవస్థలు
కొయ్యూరు: మండలంలోని బూదరాళ్ల పంచాయతీ గరిమండలో ట్రైబల్ వెల్ఫేర్ పాఠశాలకు ఉపాధ్యాయుడు లేకపోవడంతో టీసీలు పొందేందుకు విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. ఇక్కడ పనిచేస్తున్న ఉపాధ్యాయుడికి కొద్దిరోజుల క్రితం జరిగిన ఉన్నత విద్య నిమిత్తం సెలవుపై వెళ్లారు. ఆయన స్థానంలో ఎవ్వరినీ నియమించలేదు. సింగిల్ టీచర్ కావడంతో ఈ విద్యాసంవత్సరంలో పాఠశాల ఇప్పటికీ తెరచుకోలేదు. దీంతో ఇక్కడ ఐదవ తరగతి పాసైన విద్యార్థులు టీసీలు పొందేందుకు ఇబ్బందులు పడుతున్నారు. ఇక్కడ తక్షణం ఉపాధ్యాయుడి నియామకానికి చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు. దీనిపై ఎంఈవో రాంబాబును వివరణ కోరగా గరిమండ పాఠశాలకు మరో ఉపాధ్యాయుడిని సర్దుబాటు చేయాలని స్కూల్ కాంప్లెక్స్ హెచ్ఎంకు చెబుతామని తెలిపారు.