సాక్షి,పాడేరు: ప్రాథమిక విద్యకు పూర్తిస్థాయి సౌకర్యాలు కల్పించడంలో కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. నిధులు మంజూరు చేయకపోవడం వల్ల గత ప్రభుత్వంలో మొదలైన పనులు అర్ధంతరంగా నిలిచిపోయాయి. దీని ప్రభావం 967 పాఠశాలల అభివృద్ధిపై చూపింది.
గత ప్రభుత్వం సంకల్పించినా..
గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం నాడు–నేడు పథకంలో రెండవ విడతగా 2023–24 విద్యాసంవత్సరంలో 967 పాఠశాలల అభివృద్ధి, మౌలిక సదుపాయాల కల్పనకు శ్రీకారం చుట్టింది. ప్రతి పాఠశాలకు రూ.5లక్షల నుంచి రూ.30లక్షల వరకు అంచనా వ్యయంతో పనులు ప్రారంభించింది. పాఠశాలల భవనాలు, మరుగుదొడ్లు, వంటషెడ్లకు మరమ్మతులు,తాగునీటి సౌకర్యాల కల్పన, రన్నింగ్ వాటర్, విద్యుత్ సౌకర్యం, ఫాన్లు, లైట్లు, ఫర్నిచర్ తదితర సౌకర్యాలకు గత ప్రభుత్వం ప్రాధాన్యమిచ్చింది. పాఠశాలల తల్లిదండ్రుల కమి టీ, హెచ్ఎంలు, ఉపాధ్యాయుల ప ర్యవేక్షణలో 80 శాతం వరకు అభివృద్ధి పనులు జరిగాయి. వీటికి అప్పటి వైఎస్సార్సీపీ ప్రభుత్వం సీఎఫ్ఎంఎస్ నిధులు సుమారు రూ.106 కోట్ల 27లక్షలు కేటా యించింది. వీటితో పాఠశాలలకు శ్లాబ్లు, గచ్చులు, గోడలకు ప్లాస్టింగ్, పైకప్పునకు కొత్త రేకులు, మరుగు దొడ్లు, వంటషెడ్లకు మరమ్మతులు జరి గాయి. అయితే మిగిలిన 20శాతం పను లు పూర్తి చేయాల్సిన సమయంలో ఎన్ని కల కోడ్ రావడంతో మిగతా నిధుల విడుదల నిలిచిపోయింది. ఆ తరువాత అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం నాడు–నేడు పాఠశాలల అభివృద్ధి పనులను ఎక్కడికక్కడ నిలిపివేసింది.
విద్యార్థులకు ఇబ్బందులు
కూటమి ప్రభుత్వం పాఠశాలల అభివృద్ధి పనులను పట్టించుకోనందున విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. నాడు–నేడు రెండవ విడతలో పాఠశాలలు అభివృద్ధి చెందుతాయని, ఉపాధ్యాయులు, విద్యార్ధులు, తల్లిదండ్రులు ఎంతో సంతోషించారు. గత విద్యాసంవత్సరంలో పనులు జరగకపోగా,ఈ విద్యాసంవత్సరంలోను ఆయా పాఠశాలల పెండింగ్ పనులపై కూటమి ప్రభుత్వం ఎలాంటి ప్రకటన చేయలేదు. మొత్తం పనులు పూర్తి చేయాలంటే ప్రతి పాఠశాలకు రూ.5లక్షల నుంచి రూ.10లక్షల వరకు నిధులు విడుదల చేయాల్సి ఉంటుంది. ఈ పరిస్థితుల్లో విద్యార్థులు ఆసౌకర్యాల మధ్య అవస్థలు పడుతూ చదువులు సాగిస్తున్నారు. అయినా ప్రభుత్వం నుంచి స్పందన కరువైంది.
నాడు–నేడు రెండవ విడతపాఠశాలల వివరాలు
మండలం పాఠశాలల గత ప్రభుత్వంలో సంఖ్య నిధులు(రూ.లక్షల్లో) ముంచంగిపుట్టు 69 808.95
ఎటపాక 34 456.26
పెదబయలు 83 784.17
చింతూరు 33 464.81
డుంబ్రిగుడ 82 857.66
అనంతగిరి 51 484.28
వై.రామవరం 29 385.52
కొయ్యూరు 26 365.79
గంగవరం 16 242.33
రాజవొమ్మంగి 36 454.82
వి.ఆర్.పురం 21 203.11
మారేడుమిల్లి 9 97.4
రంపచోడవరం 40 557
కూనవరం 18 143.98
హుకుంపేట 49 554.67
దేవిపట్నం 19 230.86
అడ్డతీగల 32 534.19
అరకులోయ 62 542.24
పాడేరు 27 299.26
జీకే వీధి 64 512.74
చింతపల్లి 101 1051.14
జి.మాడుగుల 66 596.48
రెండో విడత పనులకు గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో నిధుల మంజూరు
చురుగ్గా పనులు
ఎన్నికల తరువాత నిధుల విడుదలను నిలిపివేసిన కూటమి ప్రభుత్వం
967 పాఠశాలల అభివృద్ధిపై ప్రభావం
అసౌకర్యాల మధ్య విద్యార్థుల
చదువులు
అభివృద్ధి పనులు పూర్తి చేయాలి
మా కుమారుడు చదువుతున్న గుత్తులపుట్టు పాఠశాలలో నాడు–నేడు పనులు పూర్తి కాలేదు. పాఠశాల భవనాల అభివృద్ధితో పాటు మరుగుదొడ్లకు రన్నింగ్ వాటర్, సురక్షిత తాగునీటి సౌకర్యాలు కల్పించాలి.
– డూరు రాజు, గుత్తులపుట్టు, పాడేరు మండలం
నాడు–నేడుకు గ్రహణం
నాడు–నేడుకు గ్రహణం
నాడు–నేడుకు గ్రహణం