ఆదిలాబాద్టౌన్: ప్రజా గాయకుడు, అరుణోదయ నాగన్న సంతాప సభను జయప్రదం చేయాలని ఐఎఫ్టీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి బి.వెంకటనారాయణ కోరారు. ప్రజా సంఘాల ఆధ్వర్యంలో బుధవారం జిల్లా కేంద్రంలోని కుమురంభీం భవన్లో పోస్టర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయ న మాట్లాడుతూ ఈ నెల 25న హైదరాబాద్లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో అరుణోదయ నాగ న్న సంతాప సభ నిర్వహించనున్నట్లు తెలిపారు. ఇందులో ఐఎఫ్టీయూ నాయకులు సుభాష్, మా రుతి, పీడీఎస్యూ జిల్లా అధ్యక్షురాలు దీపలక్ష్మి, ప్రధాన కార్యదర్శి గణేష్, ఉపాధ్యక్షుడు నాగేందర్, పీవైఎల్ నాయకులు మారుతి, హరీష్ పాల్గొన్నారు.


