ఏడు కచిడీలు @ రూ.2 లక్షలు
సఖినేటిపల్లి: పల్లిపాలెం కేంద్రంగా సముద్రంపై శుక్రవారం వేటకు వెళ్లిన మత్య్సకారుల పంట పండింది. శనివారం వలకు చిక్కిన ఇతర మత్స్య సంపదతో పాటు 7 కచిడీ చేపలు, మరి కొన్ని టేకు చేపలను ఫిష్ మార్కెట్కు తీసుకువచ్చారు. వీటిల్లో కచిడీ రకం చేపలకు మంచి ధర పలికింది. రూ.2లక్షలకు పైబడి వెచ్చించి ఆ చేపలను ఓ కొనుగోలుదారుడు దక్కించుకున్నాడు. అలాగే సుమారు 200 కేజీల బరువున్న టేకు చేపను కొనుగోలుదారుడు రూ.20 వేలకు వేలంలో పాడుకున్నాడు. ఔషధాల తయారీలో ఈ చేపను వినియోగిస్తారని మత్య్సకారులు చెబుతున్నారు.
ఏడు కచిడీలు @ రూ.2 లక్షలు


