నేరాల నియంత్రణకు ప్రత్యేక చర్యలు | - | Sakshi
Sakshi News home page

నేరాల నియంత్రణకు ప్రత్యేక చర్యలు

Apr 24 2025 12:27 AM | Updated on Apr 24 2025 12:27 AM

నేరాల నియంత్రణకు ప్రత్యేక చర్యలు

నేరాల నియంత్రణకు ప్రత్యేక చర్యలు

ఆదిలాబాద్‌టౌన్‌: నేరాల నియంత్రణకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నామని ఎస్పీ అఖిల్‌ మహాజన్‌ అన్నారు. బస్టాండ్‌ సమీపంలో ఏర్పాటు చేసిన సబ్‌ కంట్రోల్‌ రూంను బుధవారం ప్రారంభించారు. ఏ ఎస్సై ముకుందరావుకు బాధ్యతలు అప్పగించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. బస్టాండ్‌, పరిసర ప్రాంతాల్లో చిన్నపాటి దొంగతనాలు, ఈవ్‌టీజింగ్‌, రోడ్డు ప్రమాదాలు వంటి ఘటనలు చోటు చేసుకుంటే తక్షణ సాయంగా పోలీసులు అందుబా టులో ఉంటారన్నారు. క్షణాల వ్యవధిలో స్పందించేలా ఉదయం నుంచి రాత్రి వరకు ఏఎస్సైతో పాటు హెడ్‌కానిస్టేబుల్‌, కానిస్టేబుల్‌ అందుబాటులో ఉంటారని తెలిపారు. ఈ సేవలను ప్రజలు వినియోగించుకోవాలని కోరారు. కార్యక్రమంలో ఆదిలా బాద్‌ డీఎస్పీ ఎల్‌.జీవన్‌రెడ్డి, వన్‌టౌన్‌, టూటౌన్‌, ట్రాఫిక్‌ సీఐలు సునిల్‌ కుమార్‌, కరుణాకర్‌రావు, ప్రణయ్‌కుమార్‌, సిబ్బంది పాల్గొన్నారు.

వయోవృద్ధులకు పూర్తి సహకారం

జిల్లా పోలీసు యంత్రాంగం వయోవృద్ధులకు అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తుందని ఎస్పీ అఖిల్‌ మహాజన్‌ అన్నారు. తెలంగాణరాష్ట్ర వయోవృద్ధుల సమాఖ్య ఆధ్వర్యంలో బుధవారం వన్‌టౌన్‌ ఎదుట ఏర్పాటు చేసిన ఉచిత మజ్జిగ పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఇందులో ఆర్డీవో వినోద్‌ కుమార్‌, సంఘం సభ్యులు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

ఎస్పీ అఖిల్‌ మహాజన్‌

బస్టాండ్‌ వద్ద సబ్‌ కంట్రోల్‌ రూం ప్రారంభం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement