breaking news
Yousuf Pathan
-
బిన్నీ విధ్వంసం, యువీ, పఠాన్ మెరుపులు.. సెమీస్లో ఇండియా
ప్రపంచ చాంపియన్షిప్ ఆఫ్ లెజెండ్స్-2025లో ఇండియా చాంపియన్స్ సెమీస్ చేరింది. లీసెస్టర్ వేదికగా తప్పక గెలవాల్సిన మ్యాచ్లో వెస్టిండీస్ చాంపియన్స్ను చిత్తు చేసి సెమీ ఫైనల్ బెర్తు ఖరారు చేసుకుంది. డబ్ల్యూసీఎల్ తాజా సీజన్ (WCL 2025)లో టీమిండియాకు ఇది తొలి విజయమే అయినా.. ఏకంగా టాప్-4కు అర్హత సాధించడం విశేషం.వరుస ఓటములుఈ టీ20 టోర్నమెంట్లో డిఫెండింగ్ చాంపియన్గా బరిలోకి దిగింది ఇండియా. తొలి మ్యాచ్లో పాకిస్తాన్తో తలపడాల్సి ఉండగా.. ఇరుదేశాల మధ్య ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో దాయాదితో మ్యాచ్ను రద్దు చేసుకుంది. అనంతరం సౌతాఫ్రికా చాంపియన్స్తో తలపడి 88 పరుగుల తేడాతో ఓటమిని చవిచూసింది.ఆ తర్వాత ఆస్ట్రేలియా చాంపియన్స్తో మ్యాచ్లో నాలుగు వికెట్ల తేడాతో ఓడిపోయింది. అనంతరం ఇంగ్లండ్ చాంపియన్స్ చేతిలో 23 పరుగుల తేడాతో పరాజయం పాలైంది. ఇలా వరుస ఓటములతో సెమీస్ అవకాశాలు సంక్లిష్టం చేసుకున్న యువరాజ్ సేన.. విండీస్తో తాజా మ్యాచ్లో మాత్రం అదరగొట్టింది.చెలరేగిన భారత బౌలర్లుగ్రేస్ రోడ్ మైదానంలో టాస్ గెలిచి తొలుత బౌలింగ్ చేసిన ఇండియా.. వెస్టిండీస్ను 144 పరుగులకు కట్టడి చేసింది. ఇండియా బౌలర్ల ధాటికి విండీస్ టాపార్డర్ కుప్పకూలింది. ఓపెనర్లు లెండిల్ సిమ్మన్స్ (2), కెప్టెన్ క్రిస్ గేల్ (9)తో పాటు వన్డౌన్ బ్యాటర్ చాడ్విక్ వాల్టన్ (0) ఇలా వచ్చి అలా వెళ్లిపోయారు.మిగతా వారిలో డ్వేన్ స్మిత్ (20) కాస్త ఫర్వాలేదనిపించగా.. కీరన్ పొలార్డ్ వింటేజ్ ఆటను గుర్తుచేశాడు. కేవలం 43 బంతుల్లోనే 3 ఫోర్లు, 8 సిక్సర్లు బాది 74 పరుగులతో అజేయంగా నిలిచాడు. ఫలితంగా వెస్టిండీస్ నిర్ణీత 20 ఓవర్లలో తొమ్మిది వికెట్ల నష్టానికి 144 పరుగులు చేసింది. భారత బౌలర్లలో పీయూశ్ చావ్లా మూడు వికెట్లు పడగొట్టగా.. వరుణ్ ఆరోన్, స్టువర్ట్ బిన్నీ రెండేసి వికెట్లు కూల్చారు. పవన్ నేగి ఒక వికెట్ దక్కించుకున్నాడు.14 ఓవర్లలోనే ఛేదించాలిఅయితే, సెమీస్ సమీకరణల దృష్ట్యా ఈ లక్ష్యాన్ని ఇండియా చాంపియన్స్ 14 ఓవర్లలోనే ఛేదించాలి. తద్వారా సెమీ ఫైనల్ రేసులో ఉన్న ఇంగ్లండ్ కంటే మెరుగైన రన్రేటుతో ముందుకు వెళ్లే వీలుంటుంది. ఇలాంటి తరుణంలో ఇండియా చాంపియన్స్ అద్భుతమే చేసింది. కేవలం ఐదు వికెట్లు నష్టపోయి 13.2 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించి సత్తా చాటింది.బిన్ని మెరుపు అర్ధ శతకంస్టువర్ట్ బిన్ని మెరుపు అర్ధ శతకంతో చెలరేగి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. కేవలం 21 బంతుల్లోనే మూడు ఫోర్లు, నాలుగు సిక్సర్ల సాయంతో 50 పరుగులతో అజేయంగా నిలిచి జట్టును విజయతీరాలకు చేర్చాడు. కెప్టెన్ యువరాజ్ సింగ్ (11 బంతుల్లో 21)తో పాటు యూసఫ్ పఠాన్ (7 బంతుల్లో 21 నాటౌట్) ధనాధన్ దంచికొట్టారు. Mountains are there to be climbed 💪Faced with a stiff target of 145 in 14.1 overs to qualify for the semis, India got there with ease thanks to fireworks from Stuart Binny & Yusuf Pathan 🇮🇳#WCL2025 pic.twitter.com/eGOorYFQbq— FanCode (@FanCode) July 29, 2025మిగతా వారిలో ఓపెనర్ శిఖర్ ధావన్ (18 బంతుల్లో 25) రాణించగా.. రాబిన్ ఊతప్ప (8), గురుకీరత్ సింగ్మాన్ (7), సురేశ్ రైనా (7) విఫలమయ్యారు. ఇక 13.2 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 148 పరుగులు చేసిన ఇండియా చాంపియన్స్ ఇంగ్లండ్ను వెనక్కి నెట్టి సెమీస్లో అడుగుపెట్టింది.పాక్తో సెమీస్... ఇండియా ఆడుతుందా? ఆరుజట్లు పాల్గొంటున్న ఈ టోర్నీలో పాకిస్తాన్, సౌతాఫ్రికా చాంపియన్స్ ఐదింట చెరో నాలుగు గెలిచి ముందుగానే సెమీస్ బెర్తు ఖరారు చేసుకున్నాయి. ఇక ఆస్ట్రేలియా చాంపియన్స్ ఐదింట రెండు, ఇండియా చాంపియన్స్ (రన్రేటు: -0.558) ఒకటి గెలిచి టాప్-4లో నిలిచాయి. ఇంగ్లండ్ ఐదింట ఒకటి (రన్రేటు: -0.809), వెస్టిండీస్ చాంపియన్స్ ఐదింట ఒకటి (రన్రేటు: -2.302) మాత్రమే గెలిచి.. నెట్ రన్రేటు పరంగానూ వెనుకబడి ఎలిమినేట్ అయ్యాయి. ఇదిలా ఉంటే.. తొలి సెమీ ఫైనల్లో ఇండియా చాంపియన్స్ పాకిస్తాన్తో తలపడాల్సి ఉంది. అయితే, ఈ మ్యాచ్లో ఇండియా ఆడుతుందా? లేదంటే టోర్నీ నుంచే తప్పుకొంటుందా? అనేది తేలాల్సి ఉంది. చదవండి: ‘స్టోక్స్ చేసింది కరెక్టే.. జడ్డూ, వాషీ అలా చేయడం సరికాదు’ -
IND vs AUS: ధావన్ ధనాధన్.. పఠాన్ విధ్వంసం.. యువీ ఫెయిల్
ఆస్ట్రేలియా చాంపియన్స్తో మ్యాచ్లో ఇండియా చాంపియన్స్ (INDCH vs AUSCH) భారీ స్కోరు సాధించింది. ఓపెనర్ శిఖర్ ధావన్ ధనాధన్ ఇన్నింగ్స్తో దంచికొట్టగా.. ఆల్రౌండర్ యూసఫ్ పఠాన్ విధ్వంసకర ఇన్నింగ్స్తో విరుచుకుపడ్డాడు. వీరిద్దరి అద్భుత ప్రదర్శన నేపథ్యంలో.. నిర్ణీత 20 ఓవర్లలో ఇండియా చాంపియన్స్ నాలుగు వికెట్లు మాత్రమే నష్టపోయి 203 పరుగులు సాధించింది.కాగా ప్రపంచ చాంపియన్షిప్ ఆఫ్ లెజెండ్స్ (WCL 2025)లో భాగంగా శనివారం నాటి మ్యాచ్లో ఇండియా- ఆస్ట్రేలియా తలపడుతున్నాయి. ఇంగ్లండ్లోని లీడ్స్లో గల హెడింగ్లీ మైదానంలో టాస్ గెలిచిన ఆస్ట్రేలియా తొలుత బౌలింగ్ ఎంచుకుంది.ధావన్ సెంచరీ మిస్ఈ క్రమంలో బ్యాటింగ్కు దిగిన ఇండియా చాంపియన్స్కు ఓపెనర్లు రాబిన్ ఊతప్ప (Robin Uthappa), శిఖర్ ధావన్ శుభారంభం అందించారు. ఊతప్ప 21 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 37 పరుగులు చేయగా.. ధావన్ మెరుపు ఇన్నింగ్స్తో ఆకట్టుకున్నాడు. మొత్తంగా 60 బంతులు ఎదుర్కొన్న గబ్బర్ 12 ఫోర్లు, ఒక సిక్స్ సాయంతో 91 పరుగులు చేశాడు.The 𝕆𝔾 duo roll back the good 'ol days 🔥Team 🇮🇳 race to 62/2 in six overs all thanks to a flurry of boundaries 🤩Are we in for a 200+ total? Find the answers right away, LIVE on FanCode 😎#WCL2025 pic.twitter.com/PGO86izRKQ— FanCode (@FanCode) July 26, 2025 ఆఖరి వరకు అజేయంగా ఉన్న ధావన్.. దురదృష్టవశాత్తూ.. సెంచరీకి తొమ్మిది పరుగుల దూరంలో నిలిచిపోయాడు. ఇక వన్డౌన్ బ్యాటర్ అంబటి రాయుడు డకౌట్ కాగా.. సురేశ్ రైనా (11) కూడా నిరాశపరిచాడు. కెప్టెన్ యువరాజ్ సింగ్ (3) కూడా విఫలం కాగా.. యూసఫ్ పఠాన్ తుపాన్ ఇన్నింగ్స్తో విరుచుకుపడ్డాడు.పఠాన్ ఫటాఫట్ కేవలం 23 బంతుల్లోనే 52 పరుగులతో పఠాన్ దుమ్ములేపాడు. ధావన్తో కలిసి ఆఖరి వరకు నాటౌట్గా నిలిచిన ఈ బ్యాటింగ్ ఆల్రౌండర్ ఇన్నింగ్స్లో మూడు ఫోర్లు, నాలుగు సిక్సర్లు ఉన్నాయి. ఇక ఆస్ట్రేలియా బౌలర్లలో డానియల్ క్రిస్టియన్ ఊతప్ప, అంబటి రాయుడు రూపంలో రెండు వికెట్లు తీయగా.. కెప్టెన్ బ్రెట్ లీ రైనా వికెట్ దక్కించుకున్నాడు. ఇక డీ ఆర్సీ షార్ట్ యువరాజ్ సింగ్ రూపంలో కీలక వికెట్ తనఖాతాలో వేసుకున్నాడు. లక్ష్యాన్ని ఛేదించిన ఆసీస్ చాంపియన్స్ఇండియా చాంపియన్స్ విధించిన 204 పరుగుల లక్ష్యాన్ని ఆస్ట్రేలియా చాంపియన్స్.. మరో బంతి మిగిలి ఉండగానే ఛేదించింది. ఓపెనర్లు షాన్ మార్ష్ (11), క్రిస్ లిన్ (25).. వన్డౌన్లో వచ్చిన డీ ఆర్సీ షార్ట్ (20) నిరాశపరిచినా.. లోయర్ ఆర్డర్ అద్భుతంగా ఆడింది.డానియెల్ క్రిస్టియన్ 28 బంతుల్లో 39 పరుగులు సాధించగా.. కల్లమ్ ఫెర్గూసన్ మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. కేవలం 38 బంతుల్లోనే ఐదు ఫోర్లు, నాలుగు సిక్సర్లు బాది 70 పరుగులతో ఆఖరి వరకు అజేయంగా నిలిచాడు. బెన్ కటింగ్ వేగంగా (6 బంతుల్లో 15) ఆడగా.. రాబ్ క్వినీ (8 బంతుల్లో 16 నాటౌట్) కూడా ఆకట్టుకున్నాడు. ఫలితంగా 19.5 ఓవర్లలో ఆరు వికెట్లు నష్టపోయి ఆసీస్ 207 పరుగులు చేసింది. దీంతో ఇండియా చాంపియన్స్ నాలుగు వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. భారత బౌలర్లలో పీయూశ్ చావ్లా మూడు వికెట్లు తీయగా.. హర్భజన్ సింగ్ రెండు, వినయ్ కుమార్ ఒక వికెట్ దక్కించుకున్నారు.యువీ సేనకు భంగపాటుకాగా అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలికిన దిగ్గజాలతో ఇంగ్లండ్ డబ్ల్యూసీఎల్ టీ20 టోర్నమెంట్ గతేడాది మొదలైంది. అరంగేట్ర సీజన్లో ఫైనల్ చేరిన యువీ సేన.. టైటిల్ పోరులో దాయాది పాకిస్తాన్ను చిత్తు చేసి ట్రోఫీ గెలిచింది. ఇక 2025 సీజన్లో డిఫెండింగ్ చాంపియన్గా బరిలోకి దిగిన ఇండియా చాంపియన్స్ ఒడిదుడుకులు ఎదుర్కొంటోంది.ఇరుదేశాల మధ్య ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో పాకిస్తాన్తో జరగాల్సిన తొలి మ్యాచ్ రద్దు కాగా.. రెండో మ్యాచ్లో సౌతాఫ్రికా చాంపియన్స్ చేతిలో ఓటమిపాలైంది. తాజాగా మూడో మ్యాచ్లో ఆస్ట్రేలియా చాంపియన్స్ చేతిలోనూ ఓడిపోయింది.కాగా ఇండియా, పాకిస్తాన్, సౌతాఫ్రికా, ఆస్ట్రేలియా, వెస్టిండీస్, ఇంగ్లండ్ పాల్గొంటున్న ఈ టీ20 టోర్నీ తాజా సీజన్లో.. సౌతాఫ్రికా చాంపియన్స్ ఇప్పటికి నాలుగు మ్యాచ్లు పూర్తి చేసుకుని మూడు గెలిచింది. తద్వారా ఆరు పాయింట్లతో పట్టికలో అగ్రస్థానంలో కొనసాగుతోంది. మరోవైపు ఇండియా చాంపియన్స్ ఇంకా ఖాతా తెరవలేదు. పాక్తో మ్యాచ్ రద్దైన నేపథ్యంలో ఒక పాయింట్ రాగా.. పట్టికలో అట్టడుగున ఆరో స్థానంలో ఉంది.చదవండి: వైభవ్ సూర్యవంశీ మిస్సయ్యాడు! సౌతాఫ్రికా స్టార్ ప్రపంచ రికార్డు -
IND vs SA: డివిలియర్స్ సంచలన ‘రిలే క్యాచ్’.. వీడియో వైరల్
సౌతాఫ్రికా దిగ్గజ బ్యాటర్ ఏబీ డివిలియర్స్ (AB De Villiers) పునరాగమనంలో అదరగొట్టాడు. దాదాపు నాలుగేళ్ల విరామం తర్వాత మైదానంలో రీఎంట్రీ ఇచ్చిన ఏబీడీ బ్యాటింగ్లోనే కాదు.. ఫీల్డింగ్లోనూ అద్భుతం చేశాడు. సంచలన ‘రిలే క్యాచ్’(Relay Catch)తో మెరిసి.. ఇండియా చాంపియన్స్కు ఊహించని షాకిచ్చాడు.సౌతాఫ్రికా తరఫున 2018లో చివరి అంతర్జాతీయ మ్యాచ్ ఆడిన డివిలియర్స్.. 2021లో ఐపీఎల్కూ వీడ్కోలు పలికాడు. ఈ క్రమంలో తాజాగా వరల్డ్ చాంపియన్షిప్ ఆఫ్ లెజెండ్స్-2025 (WCL 2025) సీజన్తో రీఎంట్రీ ఇచ్చాడు. ఇంగ్లండ్ వేదికగా జరుగుతున్న ఈ టీ20 టోర్నమెంట్లో సౌతాఫ్రికా చాంపియన్స్ జట్టుకు ఏబీడీ కెప్టెన్గా ఉన్నాడు.అజేయ అర్ధ శతకంఇక ఈ టోర్నీలో తొలుత వెస్టిండీస్ చాంపియన్స్ను బాలౌట్లో ఓడించిన సౌతాఫ్రికా.. తమ రెండో మ్యాచ్లో ఇండియా చాంపియన్స్ను ఢీకొట్టింది. నార్తాంప్టన్లో మంగళవారం రాత్రి జరిగిన ఈ మ్యాచ్లో డివిలియర్స్ ధనాధన్ దంచికొట్టాడు. అజేయ అర్ధ శతకం (30 బంతుల్లో 63, 3 ఫోర్లు, నాలుగు సిక్సర్లు)తో మెరిసి జట్టుకు భారీ స్కోరు అందించాడు. ఈ క్రమంలో నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 208 పరుగులు చేసింది సౌతాఫ్రికా.ఇండియా చాంపియన్స్కు ఓటమిఅనంతరం లక్ష్య ఛేదనలో భారత్.. 18.2 ఓవర్లలో తొమ్మిది వికెట్లు నష్టపోయి 111 పరుగులే చేసింది. ఫలితంగా డక్వర్త్ లూయీస్ పద్ధతి ప్రకారం 88 పరుగుల భారీ తేడాతో ఓటమిపాలైంది. ఈ మ్యాచ్లో ఇండియా బ్యాటర్ యూసఫ్ పఠాన్ను అవుట్ చేయడంలో డివిలియర్స్ చేసిన ప్రయత్నం హైలైట్గా నిలిచింది.క్యాచ్ పట్టి.. సహచర ఫీల్డర్కు అందించిఇండియా చాంపియన్స్ ఇన్నింగ్స్లో ఎనిమిదో ఓవర్లో ఇమ్రాన్ తాహిర్ బంతితో రంగంలోకి దిగాడు. ఈ క్రమంలో పఠాన్ వైడ్ లాంగాఫ్ దిశగా బంతిని గాల్లోకి లేపగా.. బౌండరీ దిశగా పయనించింది. అయితే, ఇంతలో డివిలియర్స్ వేగంగా పరిగెత్తుకుని వచ్చి బంతిని ఒడిసిపట్టాడు.అయితే, తాను బౌండరీ రోప్ను తాకే ప్రమాదం ఉండటంతో సహచర ఫీల్డర్ సరేల్ ఎర్వీ వైపు బంతిని విసిరాడు. వెంటనే స్పందించిన అతడు బాల్ను సురక్షితంగా క్యాచ్ పట్టాడు. దీంతో ఇమ్రాన్ తాహిర్ సంబరాలు చేసుకోగా.. యూసఫ్ పఠాన్ బిత్తరపోయాడు. ఇలా ఏబీడీ 41 ఏళ్ల వయసులోనూ తగ్గేదేలే అన్నట్లు తన అద్భుత ఫీల్డింగ్ ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.చదవండి: ‘అభ్యంతరకరమైన పదాలు వాడాడు’.. గిల్ స్ట్రాంగ్ కౌంటర్!𝐏𝐞𝐭𝐢𝐭𝐢𝐨𝐧 𝐭𝐨 𝐠𝐞𝐭 𝐀𝐁 𝐝𝐞 𝐕𝐢𝐥𝐥𝐢𝐞𝐫𝐬 𝐨𝐮𝐭 𝐨𝐟 𝐫𝐞𝐭𝐢𝐫𝐞𝐦𝐞𝐧𝐭 📑✍️Even after four years away from the game, he's making the impossible look easy 😮💨#WCL2025 #ABD pic.twitter.com/ixmXJ6YBSK— FanCode (@FanCode) July 22, 2025 -
మా అన్నను ఆడించేందుకు.. నాపై వేటు వేశారు: భారత మాజీ క్రికెటర్
సీకే నాయుడు- సీఎస్ నాయుడు, క్రిపాల్ సింగ్- ఏజీ మిల్కా సింగ్, సుభాష్- బాలూ గుప్తే, అమర్ సింగ్- లధా రామ్జీ, మాధవ్- అరవింద్ ఆప్టే, మోహిందర్- సురీందర్ అమర్నాథ్, వజీర్ అలీ- నజీర్ అలీ, టీమిండియాకు ప్రాతినిథ్యం వహించిన అన్నదమ్ముల జోడీలు ఇవి.ప్రస్తుతం ఆక్టివ్గా ఉన్న హార్దిక్ పాండ్యా- కృనాల్ పాండ్యా (Hardik Pandya- Krunal Pandya)లతో పాటు మాజీ ఆటగాళ్లు పఠాన్ బ్రదర్స్ కూడా ఈ జాబితాలో ఉన్నారు. అన్న యూసఫ్ పఠాన్ (Yousuf Pathan) బ్యాటింగ్ ఆల్రౌండర్ అయితే.. తమ్ముడు ఇర్ఫాన్ పఠాన్ (Irfan Pathan) బౌలింగ్ ఆల్రౌండర్. అన్న కంటే ముందు తమ్ముడే అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టాడు. అయితే, ఎవరికి వారు తమదైన శైలిలో దూసుకుపోయి గుర్తింపు సాధించారు.ఇక వీరిద్దరు మహేంద్ర సింగ్ ధోని సారథ్యంలో 2007 టీ20 ప్రపంచకప్ గెలిచిన, 2011 వన్డే వరల్డ్కప్ గెలిచిన భారత జట్టులో సభ్యులు కావడం మరో విశేషం. ఇదిలా ఉంటే.. ఒకానొక సందర్భంలో పరిమిత ఓవర్ల క్రికెట్లో అన్న యూసఫ్ సేవలు వినియోగించుకునే క్రమంలో టీమిండియా యాజమాన్యం తమ్ముడు ఇర్ఫాన్ను నిర్దాక్షిణ్యంగా పక్కన పెట్టిందట.కోచ్ నాతో ఇదే అన్నాడుఈ విషయాన్ని ఇర్ఫాన్ పఠాన్ తాజాగా వెల్లడించాడు. శ్రీలంక పర్యటనలో భాగంగా తాను అద్భుత ప్రదర్శన కనబరిచినా.. తదుపరి న్యూజిలాండ్ టూర్లో ఒక్క మ్యాచ్ కూడా ఆడే అవకాశాన్ని మేనేజ్మెంట్ ఇవ్వలేదని తెలిపాడు. యూసఫ్ కోసం తనను తప్పించామని నాటి కోచ్ గ్యారీ కిర్స్టన్ స్వయంగా తనతో అన్నట్లు తెలిపాడు.మా అన్నను ఆడించేందుకు.. నాపై వేటు వేశారుఈ మేరకు సోనీ స్పోర్ట్స్ నెట్వర్క్ షోలో మాట్లాడుతూ.. ‘‘టీమిండియాలో నా స్థానాన్ని నా సోదరుడు తీసుకున్నాడు. 2009లో శ్రీలంకతో మ్యాచ్లో మేమిద్దరం కలిసి ఆడి.. గెలిచాం. రెండు మ్యాచ్లలో కలిపి నేను నాలుగు వికెట్లు తీశాను.జట్టులో నా చోటు పదిలమైందని అనుకున్నాను. కానీ న్యూజిలాండ్తో నాకు ఒక్క మ్యాచ్ కూడా ఆడే అవకాశం రాలేదు. ఆ తర్వాత జట్టు నుంచి తప్పించారు.అప్పుడు గ్యారీ కిర్స్టన్.. ‘సారీ.. నీకు జట్టులో చోటు లేదు.. ఎందుకంటే.. ఏడో స్థానంలో ఆడేందుకు మేము మీ సోదరుడి పేరును పరగణనలోకి తీసుకున్నాం’ అని చెప్పాడు’’’ అని ఇర్ఫాన్ పఠాన్ చెప్పుకొచ్చాడు. జట్టు కూర్పు కోసం ఎవరిపై ఎప్పుడు ఎందుకు వేటు వేస్తారో తెలియని పరిస్థితి ఉంటుందని పేర్కొన్నాడు. ఇంగ్లండ్- టీమిండియా మధ్య టెస్టు సిరీస్ నేపథ్యంలో చర్చ సందర్భంగా ఇర్ఫాన్ ఈ విషయాన్ని వెల్లండించాడు.బ్రదర్స్ అదుర్స్కాగా గుజరాత్కు చెందిన 40 ఏళ్ల ఇర్ఫాన్ పఠాన్ పేస్ బౌలింగ్ ఆల్రౌండర్. 2003- 2012 వరకు టీమిండియాకు ఆడిన ఈ లెఫ్టార్మ్ ఫాస్ట్ మీడియం బౌలర్.. 29 టెస్టుల్లో 100, 120 వన్డేల్లో 173, 24 టీ20 మ్యాచ్లలో 28 వికెట్లు కూల్చాడు.అదే విధంగా.. ఎడమచేతి వాటం గల ఇర్ఫాన్ పఠాన్ టెస్టుల్లో 1105, వన్డేల్లో 1544, టీ20లలో 127 పరుగులు సాధించాడు. మరోవైపు.. 42 ఏళ్ల యూసఫ్ పఠాన్ 2007- 2012 మధ్య కాలంలో 57 వన్డేల్లో 810, 22 టీ20లలో 236 పరుగులు చేశాడు. ఈ రైటార్మ్ ఆఫ్ బ్రేక్ బౌలర్ ఖాతాలో 33 వన్డే వికెట్లు, 13 టీ20 వికెట్లు ఉన్నాయి.చదవండి: ఏ ఒక్కరినో తప్పుబట్టను.. కెప్టెన్ నిర్ణయం ప్రకారమే అలా చేశాం: గంభీర్𝘒𝘢𝘩𝘢𝘯𝘪 𝘣𝘩𝘢𝘪𝘺𝘰 𝘬𝘪...𝘗𝘢𝘵𝘩𝘢𝘯 𝘬𝘪 𝘻𝘶𝘣𝘢𝘯𝘪! 😊#SonySportsNetwork #GroundTumharaJeetHamari #ENGvIND #NayaIndia #DhaakadIndia #TeamIndia #ExtraaaInnings | @IrfanPathan @rpsingh @Vimalwa pic.twitter.com/AkdeeMzz67— Sony Sports Network (@SonySportsNetwk) June 24, 2025 -
చరిత్ర సృష్టించిన క్లాసెన్.. ఐపీఎల్ చరిత్రలోనే తొలిసారిగా ఇలా..
కోల్కతా నైట్ రైడర్స్తో మ్యాచ్లో సన్రైజర్స్ హైదరాబాద్ స్టార్ హెన్రిచ్ క్లాసెన్ (Heinrich Klaasen) చిరస్మరణీయ ఇన్నింగ్స్ ఆడాడు. ఆద్యంతం ఆకాశమే హద్దుగా చెలరేగుతూ.. ఫోర్లు, సిక్సర్ల వర్షం కురిపిస్తూ పొట్టి క్రికెట్లోని అసలైన మజా అందించాడు.కేవలం 37 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేసుకున్న క్లాసెన్.. క్యాష్ రిచ్ లీగ్లో వేగవంతమైన శతకం (Fastest Century) బాదిన మూడో క్రికెటర్గా యూసఫ్ పఠాన్ రికార్డును సమం చేశాడు. ఇక కేకేఆర్తో మ్యాచ్లో మొత్తంగా 39 బంతులు ఎదుర్కొన్న ఈ సౌతాఫ్రికా స్టార్ ఏడు ఫోర్లు, తొమ్మిది సిక్సర్ల సాయంతో 105 పరుగులతో అజేయంగా నిలిచాడు.ఐపీఎల్ చరిత్రలోనే తొలిసారిగా ఇలా..ఈ క్రమంలో క్లాసెన్ సరికొత్త రికార్డు సాధించాడు. ఐపీఎల్ చరిత్రలో అత్యధిక స్ట్రైక్రేటు (269.23)తో సెంచరీ బాదిన తొలి విదేశీ క్రికెటర్, ఓవరాల్గా రెండో బ్యాటర్గా నిలిచాడు. ఈ జాబితాలో యూసఫ్ పఠాన్ అతడి కంటే ముందున్నాడు. ఇలా కేకేఆర్తో ఆదివారం నాటి మ్యాచ్ సందర్భంగా క్లాసెన్ రెండు అరుదైన రికార్డులు తన ఖాతాలో వేసుకున్నాడు. కాగా ఓవరాల్గా క్లాసెన్కు ఐపీఎల్లో ఇది రెండో సెంచరీ.110 పరుగుల తేడాతో జయభేరి అంతేకాదు జట్టు విజయంలో కీలక పాత్ర పోషించి ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’గానూ ఈ వికెట్ కీపర్ బ్యాటర్ నిలిచాడు. ఇక మ్యాచ్ విషయానికొస్తే... ఢిల్లీలోని అరుణ్జైట్లీ స్టేడియంలో జరిగిన పోరులో సన్రైజర్స్ కేకేఆర్ను చిత్తు చేసింది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన కమిన్స్ బృందం.. నిర్ణీత 20 ఓవర్లలో కేవలం మూడు వికెట్లు నష్టపోయి 278 పరుగుల మేర భారీ స్కోరు సాధించింది.ఓపెనర్లు అభిషేక్ శర్మ (16 బంతుల్లో 32), ట్రవిస్ హెడ్ (40 బంతుల్లో 76) శుభారంభం అందించగా.. క్లాసెన్ సునామీ ఇన్నింగ్స్తో స్కోరు బోర్డును పరుగులు తీయించాడు. మిగతా వాళ్లలో ఇషాన్ కిషన్ 29, అనికేత్ వర్మ 12(నాటౌట్) పరుగులు చేశారు.ఇక లక్ష్య ఛేదనలో కేకేఆర్ 18.4 ఓవర్లలో కేవలం 168 పరుగులు మాత్రమే చేసి ఆలౌట్ అయింది. ఫలితంగా సన్రైజర్స్ 110 పరుగుల తేడాతో జయభేరి మోగించి.. ఈ సీజన్ను విజయంతో ముగించింది. రైజర్స్ బౌలర్లలో జయదేవ్ ఉనాద్కట్ (3/24), ఇషాన్ మలింగ (3/31), హర్ష్ దూబే (3/34) మూడేసి వికెట్లతో అద్భుతంగా రాణించారు.హెన్రిచ్ క్లాసెన్ సాధించిన రికార్డులుఐపీఎల్లో అత్యంత వేగవంతమైన సెంచరీ వీరుల జాబితాలో చోటు1. క్రిస్ గేల్- 30 బంతుల్లో శతకం2. వైభవ్ సూర్యవంశీ- 35 బంతుల్లో శతకం3. యూసఫ్ పఠాన్- 37 బంతుల్లో శతకం4. హెన్రిచ్ క్లాసెన్- 37 బంతుల్లో శతకం5. డేవిడ్ మిల్లర్- 38 బంతుల్లో శతకంఐపీఎల్లో అత్యధిక స్ట్రైక్రేటుతో వందకు పైగా పరుగులు సాధించింది వీరే1. యూసఫ్ పఠాన్- రాజస్తాన్ రాయల్స్ తరఫున 2010లో ముంబై ఇండియన్స్పై 270.27 స్ట్రైక్రేటుతో 100 రన్స్2. హెన్రిచ్ క్లాసెన్- సన్రైజర్స్ తరఫున 2025లో కోల్కతా నైట్ రైడర్స్పై 169.23 స్ట్రైక్రేటుతో 105 రన్స్ (నాటౌట్)3. డేవిడ్ మిల్లర్- పంజాబ్ కింగ్స్ (కింగ్స్ ఎలెవన్ పంజాబ్) తరఫున 2013లో ఆర్సీబీపై 265.78 స్ట్రైక్రేటుతో 101 రన్స్ (నాటౌట్)4. వైభవ్ సూర్యవంశీ- రాజస్తాన్ రాయల్స్ తరఫున గుజరాత్ టైటాన్స్పై 2025లో 265.78 స్ట్రైక్రేటుతో 1015. క్రిస్ గేల్- ఆర్సీబీ తరఫున 2013లో పుణె వారియర్స్పై 265.14 స్ట్రైక్రేటుతో 175 రన్స్ (నాటౌట్).చదవండి: Pat Cummins: ఫైనల్ చేరాల్సిన జట్టు.. మా వాళ్లను చూస్తే నాకే భయమేసిందిSky is not the limit when he's batting! 🫡🎥 Glimpse of the 𝙃𝙚𝙞𝙣𝙧𝙞𝙘𝙝 𝙆𝙡𝙖𝙖𝙨𝙚𝙣 𝙨𝙝𝙤𝙬 en route his mind-blowing 105*(39) 🚀Scorecard ▶ https://t.co/4Veibn1bOs #TATAIPL | #SRHvKKR | @SunRisers pic.twitter.com/WaOSR90wrg— IndianPremierLeague (@IPL) May 25, 2025 -
బౌలర్లను ఉతికారేసిన యువరాజ్.. సిక్సర్ల వర్షం! వీడియో
వరల్డ్ ఛాంపియన్షిప్ ఆఫ్ లెజెండ్స్ టోర్నీ రెండో సెమీఫైనల్లో ఆస్ట్రేలియా ఛాంపియన్లను ఇండియా ఛాంపియన్స్ 86 పరుగుల తేడాతో చిత్తు చేసింది. నార్తాంప్టన్ వేదికగా జరిగిన ఈ సెమీస్ పోరులో ఇండియా ఛాంపియన్స్ కెప్టెన్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు.ఆసీస్ బౌలర్లను యువీ ఊచకోత కోశాడు. యువరాజ్ కేవలం 28 బంతుల్లో 59 పరుగులు చేసి ఔటయ్యాడు. అతడి ఇన్నింగ్స్లో 4 ఫోర్లు, 5 సిక్స్లు ఉన్నాయి. అతడి ఇన్నింగ్స్కు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది. ఇది చూసిన నెటిజన్లు సింగ్ ఈజ్ కింగ్ అంటూ కామెంట్లు చేస్తున్నారు. మరి కొంతమంది ఆసీస్ అంటే అంత కసి ఎందుకన్న అంటూ పోస్ట్లు చేస్తున్నారు. గతంలో కూడా ఐసీసీ నాకౌట్స్ మ్యాచ్ల్లో ఆసీస్పై యువీ అద్భుత ఇన్నింగ్స్లు ఆడాడు. 2000లో ఆసీస్తో జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీ సెమీఫైనల్లో 84 పరుగులు చేసిన యువీ.. 2007 టీ20 వరల్డ్కప్ సెమీపైనల్లో కంగరూలపై హాఫ్ సెంచరీతో విరుచుకు పడ్డాడు. 2011 క్వార్టర్ ఫైనల్, 2014 టీ20 వరల్డ్కప్లో ఆసీస్తో జరిగిన మ్యాచ్ల్లో ఈ సిక్సర్ల వీరుడు హాఫ్ సెంచరీలతో మెరిశాడు. ఇక ఈ మ్యాచ్ విషయానికి వస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన 6 వికెట్ల నష్టానికి 254 పరుగుల భారీ స్కోర్ సాధించింది. అనంతరం 255 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆసీస్.. నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 168 పరుగులకే పరిమితమైంది. ఈ విజయంతో భారత్ ఫైనల్లో అడుగుపెట్టింది. శనివారం జరగనున్న ఫైనల్లో దాయాది పాకిస్తాన్తో భారత్ తాడోపేడో తెల్చుకోనుంది. 2000, 2007, 2011 and now 2024 🚀Yuvi keeps his date with the Aussies in the Knockouts! 👊🏽#WCLonFanCode @YUVSTRONG12 pic.twitter.com/tjqtJJhnH4— FanCode (@FanCode) July 12, 2024 -
ఇర్ఫాన్ పఠాన్ భావోద్వేగ పోస్టు
హార్డ్ హిట్టింగ్ బ్యాట్స్మన్ యూసుఫ్ పఠాన్కు ఐపీఎల్ 2020 వేలంలో చుక్కెదురైంది. సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు అతడిని వదులుకోగా.. రూ. కోటి కనీస ధరతో అతడు వేలంలో ఉన్నాడు. అయితే ఏ జట్టు కూడా యూసుఫ్ పఠాన్ను తీసుకునేందుకు సుముఖత వ్యక్తం చేయలేదు. ఈ క్రమంలో టీమిండియా క్రికెటర్, యూసుఫ్ తమ్ముడు ఇర్ఫాన్ పఠాన్ ట్విటర్లో స్పందించాడు. ‘తాత్కాలిక ఇబ్బందులు ఏవీ కూడా నీ కెరీర్ను ప్రభావితం చేయలేవు. నీ అత్యుత్తమ ఆటతీరును ఎప్పటికీ మరిచిపోలేము. నిరంతరం నిన్ను ప్రేమిస్తూనే ఉంటా. నువ్వే నిజమైన మ్యాచ్ విన్నర్వి’ అంటూ భావోద్వేగ ట్వీట్ చేశారు. కాగా, యూసుఫ్ పఠాన్ 2019 ఐపీఎల్ సీజన్లో సన్రైజర్స్ తరపున ఆడి పేలవ ప్రదర్శన కనబరిచిన విషయం తెలిసిందే. ఆల్ రౌండర్ యూసుఫ్ పఠాన్ 10 మ్యాచ్లు ఆడి, 13.33 సగటుతో కేవలం 40 పరుగులనే సాధించాడు. ఐపీఎల్ మొత్తం సీజన్లో కేవలం ఆరు బంతులు మాత్రమే బౌలింగ్ చేశాడు. ఇక యూసుఫ్తో పాటు చాలామంది స్టార్ క్రికెటర్లకు 2020 ఐపీఎల్ వేలం నిరాశే మిగిల్చింది. ఆసీస్ పేసర్ ప్యాట్ కమ్మిన్స్, ఆసీస్ స్టార్ ఆటగాడు మ్యాక్స్వెల్లు అత్యధిక ధరకు అమ్ముడుపోయారు. కమ్మిన్స్ రూ. 15 కోట్లకు పైగా అమ్ముడు పోగా, మ్యాక్స్వెల్ను రూ. 10.5 కోట్లకు కోల్కతా నైట్ రైడర్స్ కొనుగోలు చేసింది. చదవండి: ముగిసిన ఐపీఎల్ వేలం కోట్లాభిషేకం Small hiccups doesn’t define your career,you have been outstanding thru out. A real match winner. Love you always Lala @iamyusufpathan pic.twitter.com/h3tw3AjoGS— Irfan Pathan (@IrfanPathan) December 19, 2019 -
డోప్ టెస్ట్లో యూసఫ్ పఠాన్ విఫలం
-
పఠాన్కు షాకిచ్చిన బీసీసీఐ
సాక్షి, ముంబై : టీమిండియా బ్యాట్స్మన్ యూసఫ్ పఠాన్కు బీసీసీఐ షాక్ ఇచ్చింది. డోప్ టెస్ట్లో విఫలం కావటంతో అతనిపై 5 నెలల వేటు వేస్తున్నట్లు ప్రకటించింది. గతేడాది ఓ దేశీవాళి టీ-20 మ్యాచ్ సందర్భంగా నిర్వహించిన పరీక్షల్లో యూసఫ్ నిషేధ ఉత్ప్రేరకాన్ని తీసుకున్నట్లు తేలింది. టర్బ్యూటలైన్(దగ్గు మందుకు సంబంధించింది) పదార్థాన్ని యూసఫ్ తీసుకున్నాడు. ఒకవేళ ఆటగాడు ఆ డ్రగ్ను తప్పనిసరిగా తీసుకోవాల్సి వస్తే మాత్రం అందుకు అధికారులు అనుమతి తప్పనిసరిగా తీసుకోవాల్సి ఉంటుంది. కానీ, పఠాన్ గానీ, టీం డాక్టర్ గానీ ఈ విషయాన్ని అధికారులకు తెలియజేయలేదు. ఇక డోపింగ్ ఆరోపణలు వచ్చినప్పుడే బీసీసీఐ అతన్ని తాత్కాలికంగా సస్పెండ్ చేసింది. దీంతో అతను రంజీ మ్యాచ్లకు కూడా దూరం అయ్యాడు. పఠాన్ ఇచ్చిన వివరణకు సంతృప్తి చెందిన బీసీసీఐ తక్కువ శిక్షతో సరిపెట్టినట్లు తెలుస్తోంది. కాగా, గత ఆగష్టు 15వ తేదీ నుంచి అతనిపై నిషేధం అమలులోకి రాగా.. ఆ లెక్కన జనవరి 14తో ఆ సస్పెన్షన్ ముగియనుండటం పఠాన్కు ఊరటనిచ్చే విషయం. ఇంతకు ముందు 2012లో ఐపీఎల్ ప్రదీప్ సంగ్వాన్ కూడా ఇలాగే డోపింగ్కు పాల్పడి 18 నెలల నిషేధం ఎదుర్కున్నాడు. -
నిరుపేదల కోసం.. పఠాన్ బ్రదర్స్
సాక్షి, న్యూఢిల్లీ: నిరుపేద పిల్లలను క్రికెటర్లుగా తీర్చిదిద్దేందుకు భారత క్రికెటర్లు ఇర్ఫాన్ పఠాన్, యూసఫ్ పఠాన్లు నడుం బిగించారు. పఠాన్ క్రికెట్ అకాడమీ పేరిట నిరుపేద పిల్లలకు మొబైల్ సంస్థ ‘ఒప్పో’ అందించిన 20 లక్షల స్కాలర్ షిప్ సాయంతో రెండేళ్ల పాటు శిక్షణ ఇవ్వనున్నారు. ఈ క్యాంపుకు రెండు దశల్లో నిర్వహించిన సెలక్షన్ పోటీల్లో 17 మంది నిరుపేద క్రికెటర్లను ఎంపికయ్యారు. ఈ పోటీలకు 50 మంది పాల్గొనగా తొలి రౌండ్లో 30 మంది ఎంపికవ్వగా.. రెండో రౌండ్లో 17 మందిని ఎంపిక చేశారు. ఈ పిల్లలంతా పఠాన్ బ్రదర్స్ ఆధ్వర్యంలో పలువురి క్రికెట్ దిగ్గజాల శిక్షణతో రాటుదేలనున్నారు. -
ఐపీఎల్: మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ వీరులు వీరే..
హైదరాబాద్: ఐపీఎల్ పదో సీజన్ నేడు హైదరాబాద్ లో ప్రారంభం కానుంది. తొలి మ్యాచ్ లో గతేడాది విన్నర్ సన్ రైజర్స్ హైదరాబాద్, రన్నరప్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్లు తలపడనున్నాయి. అయితే ఓవరాల్ ఐపీఎల్ సీజన్లలో అత్యధిక మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డుల రికార్డు వెస్టిండీస్ విధ్వంసక ఆటగాడు క్రిస్ గేల్ పేరిట ఉంది. గేల్ ఖాతాలో 15 మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ లున్నాయి. ఇందులో 14 అవార్డులను కేవలం మూడు సీజన్లలో సాధించడం విశేషం. 2011లో ఆరు, 2012లో ఐదు, 2013లో 3 సొంతం చేసుకున్నాడు. బెంగళూరు రాయల్ చాలెంజర్స్ కు ప్రాతినిధ్యం వహిస్తున్న గేల్ ఆ జట్టు తరఫున 14 మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ లు, మొదట్లో ప్రాతినిధ్యం వహించిన కోల్ కతా నైట్ రైడర్స్ ఆటగాడిగా ఒక అవార్డు సాధించాడు. 2011, 12 సీజన్లలో అత్యధిక పరుగుల వీరుడిగా నిలిచిన విషయం తెలిసిందే. 2. యూసఫ్ పఠాన్ మొదటి మూడు సీజన్లు రాజస్థాన్ రాయల్స్ కు, 2011 నుంచి కోల్ కతా నైట్ రైడర్స్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు యూసఫ్ పఠాన్. రాజస్థాన్ ఆటగాడిగా 9 మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ లు, కేకేఆర్ ఆటగాడిగా 5 అవార్డులు తన ఖాతాలో వేసుకున్నాడు. ఓవరాల్ గా 14 మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ లతో రెండో స్థానంలో నిలిచాడు పఠాన్. 3. మైక్ హస్సీ ఈ ఆస్ట్రేలియా ఆటగాడు ఐపీఎల్ తొలి సీజన్లలో పరుగుల వేటలో ముందున్నాడు. ఆపై ఇతడి జోరు తగ్గింది. అయితే మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ తో చెన్నై సూపర్ కింగ్స్ తరఫున ఐపీఎల్ కెరీర్ స్టార్ట్ చేశాడు. ఓవరాల్ గా 11 మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ లు హస్సీ ఖాతాలో ఉన్నాయి. కింగ్స్ ఎలెవన్ పంజాబ్ పై చేసిన సెంచరీ ఇతడి కెరీర్ లో ఎప్పటికీ ప్రత్యేకమే. 4. గౌతమ్ గంభీర్ ఐపీఎల్ స్థిరంగా రాణిస్తున్న ఆటగాళ్లలో కేకేఆర్ కెప్టెన్ గౌతమ్ గంభీర్ ఒకడు. మొదటి మూడు సీజన్లలో ఢిల్లీ డేర్ డెవిల్స్ తరఫున, ఆ తర్వాతి నుంచి కోల్ కతా నైట్ రైడర్స్ కు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. ఢిల్లీ ఆటగాడిగా 3, కేకేఆర్ ఆటగాడిగా 8 మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ లు కొల్లగొట్టాడు గంభీర్. 2008, 2012 సీజన్లలో అత్యధిక పరుగుల ఆటగాళ్లతో రెండో స్థానంలో నిలిచాడు. 5. వీరేంద్ర సెహ్వాగ్ ఐపీఎల్ తొలి ఆరు సీజన్లు ఢిల్లీ డేర్ డెవిల్స్ కు, ఆ తర్వాతి సీజన్లలో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ కు ప్రాతినిధ్యం వహించాడు సెహ్వాగ్. ఢిల్లీ ఆటగాడిగా 10, పంజాబ్ ప్లేయర్ గా ఒక్క మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ సెహ్వాగ్ తన ఖాతాలో వేసుకున్నాడు. 2008, 2011 సీజన్లలో రెండు చొప్పున, 2012లో మూడు, 2009, 2010, 2013, 2014లలో ఒక్కో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ నెగ్గాడు. 6. ఎంఎస్ ధోనీ గత సీజన్లో నిషేధం పడే వరకూ ఐపీఎల్ ఆరంభం నుంచి ధోనీ చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ గా వ్యవహరించాడు. 2016లో కొత్త ప్రాచైజీ రైజింగ్ పుణే సూపర్ జెయింట్స్ తరఫున ఆడాడు. ఓవరాల్ గా 112 మ్యాచ్ లాడిన ధోనీ 11 మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ లు నెగ్గాడు ధోనీ. 99 ఇన్నింగ్స్ లలో బ్యాటింగ్ చేసి 14 హాఫ్ సెంచరీల సాయంతో 40.84 సగటుతో 2614 పరుగులు చేశాడు. -
టి20 ప్రపంచకప్కు వచ్చేస్తా
మార్చిలో స్వదేశంలో జరిగే టి20 ప్రపంచ కప్ సమయానికి భారత జట్టులోకి వచ్చేస్తానని ఆల్రౌండర్ యూసుఫ్ పఠాన్ ధీమా వ్యక్తం చేశాడు. చివరిసారిగా 2012లో భారత్ తరఫున తను టి20 మ్యాచ్ ఆడాడు. ‘ఈ ఏడాది ఐపీఎల్తో పాటు రంజీట్రోఫీలోనూ నిలకడగా రాణించా. బౌలర్గా పూర్తి కోటా ఓవర్లు వేస్తున్నాను. సరైన దిశలో వెళుతున్నందున టి20 ప్రపంచకప్ సమయానికి జట్టులోకి వస్తానని నమ్ముతున్నా’ అని యూసుఫ్ చెప్పాడు. -
ప్రేక్షకుడిని కొట్టిన యూసుఫ్ పఠాన్
వడోదరా: పేలవ ఫామ్తో భారత జట్టులో చోటు కోల్పోయిన యూసుఫ్ పఠాన్ వివాదంలో చిక్కుకున్నాడు. జమ్మూ కశ్మీర్తో జరిగిన రంజీ మ్యాచ్ సందర్భంగా యూసుఫ్ ఓ ప్రేక్షకుడి చెంప చెళ్లుమనిపిం చాడు. మంగళవారం మూడో రోజు ఆటలో యూ సుఫ్ (9) అవుటై వెళ్తున్న సందర్భంలో పెవిలియన్ దగ్గర కూర్చొన్న ప్రేక్షకుడు ఒకరు అసభ్య పదజాలంతో దూషించాడు. తర్వాత కొంత మంది ప్రేక్షకులు జాదవ్, రాయుడులను కూడా గెలి చేయడంతో యూసుఫ్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. దీంతో ఆ ప్రేక్షకుడిని డ్రెస్సింగ్ రూమ్కు పిలిపించి తిడుతూ చెంపమీద ఓ దెబ్బ వేశాడు. యూసుఫ్ చేసిన తప్పు లెవల్-3 కిందకు వచ్చినప్పటికీ ఇదే తొలిసారి కావడంతో బోర్డు మందలింపుతో సరిపెట్టింది.