breaking news
women entry
-
జిమ్లోనూ వేధింపులా!
ఆరోగ్య స్పృహ పెరగడంతో గతంతో పోల్చితే జిమ్కు వస్తున్న మహిళల సంఖ్య పెరిగింది. ఇది సానుకూల కోణం అయితే, ప్రతికూల కోణం... జిమ్లో వివిధ రూపాల్లో మహిళల భద్రతకు, డిగ్నిటీకి ఎదురవుతున్న ముప్పు. దే«శవ్యాప్తంగా ఎన్నో రాష్ట్రాలలోని జిమ్, ఫిట్నెస్ కేంద్రాలలో లైంగిక వేధింపులు ఎదుర్కొన్న మహిళలు, టీనేజర్లకు సంబంధించిన ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. దీన్ని దృష్టిలో పెట్టుకొని జాతీయ మానవ హక్కుల కమిషన్ (ఎన్హెచ్ఆర్సీ) జిమ్లు, ఫిట్నెస్ సెంటర్ల పనితీరు, నియంత్రణపై నివేదికను కోరుతూ అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలితప్రాంతాల ప్రధాన కార్యదర్శులకు నోటీసులు జారీ చేసింది. ప్రస్తుత మార్గదర్శకాలు, పర్యవేక్షణ విధానాలపై సమాచారాన్ని సమర్పించాలని క్రీడలు, యువజన వ్యవహారాల మంత్రిత్వ శాఖను కోరింది..మన దేశంలో ఫిట్నెస్ సంస్కృతి వేగంగా పెరుగుతున్న నేపథ్యంలో మహిళలు తమ కంఫర్ట్ జోన్ల నుంచి బయటికి వస్తున్నారు. ఇది ఆహ్వానించదగిన పరిణామమే అయినప్పటికీ భద్రతాపరంగా మహిళలకు సమస్యలు ఎదురవుతున్నాయి.→ అలహాబాద్ హైకోర్ట్ ఆందోళనజిమ్లోకి వచ్చే అమ్మాయిలను అశ్లీల దృష్టితో చూడడం, అసభ్యంగా కామెంట్ చేయడం, రహస్యంగా సెల్ఫోన్తో వీడియోలు తీయడంలాంటివి దేశవ్యాప్తంగా చాలా జిమ్లలో జరుగుతున్నాయి. ఉత్తరప్రదేశ్లోని మేరuЇకు చెందిన జిమ్ ట్రైనర్ నితిన్ సైనీ కేసు విచారణ సందర్భంగా, తగిన రక్షణ చర్యలు లేకుండా జిమ్లలో పురుష ట్రైనర్ ద్వారా శిక్షణ ΄÷ందుతున్న మహిళల భద్రత, ప్రైవసీలపై అలహాబాద్ హైకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. బాధితురాలు ట్రయల్ కోర్టు ముందు వినిపించిన తన వాంగ్మూలంలో నితిన్ సైనీ ఒక మహిళను అశ్లీలంగా వీడియో తీశాడని, తనలాంటి మహిళలకు అశ్లీల వీడియోలు పంపుతున్నాడని ఆరోపించింది.ఈ నేపథ్యంలో నితిన్ సైనీ జిమ్ చట్ట ప్రకారం సక్రమంగా నమోదు చేయబడిందా... లేదా? జిమ్లో మహిళా ట్రైనర్లు ఉన్నారా లేదా?... తెలియజేసే వ్యక్తిగత అఫిడవిట్ దాఖలు చేయాలని మేరuЇలోని బ్రహ్మపురి పోలీస్ స్టేషన్ దర్యాప్తు అధికారిని కోర్టు ఆదేశించింది.→ మహిళా ట్రైనర్లు తప్పనిసరిఫ్రభుత్వ, ప్రైవేట్ జిమ్లలో మహిళా ట్రైనర్లను తప్పనిసరిగా నియమించాలని హరియాణా రాష్ట్ర మహిళా కమిషన్ ప్రభుత్వాన్ని కోరింది. లైంగిక వేధింపులను నివారించడానికి మహిళా ట్రైనర్ల నియామకం ఉపకరిస్తుందని చెప్పింది. పురుషులు మాత్రమే ట్రైనర్లుగా ఉండే జిమ్లలో మహిళల అసౌకర్యానికి, లైంగిక వేధింపులకు సంబంధించి పలు ఫిర్యాదులు అందాయని కమిషన్ తెలియజేసింది. జిమ్లో తమకు అసౌకర్యంగా అనిపిస్తే, లైంగిక వేధింపులు ఎదురైతే ఉమెన్ కమిషన్ అధికారిక వెబ్సైట్కు ధైర్యంగా ఫిర్యాదు చేయాలని కోరింది. హరియాణాలోనే కాదు దేశవ్యాప్తంగా ఎన్నో రాష్ట్రాలలోని మహిళా కమిషన్లు ప్రైవేట్, ప్రభుత్వ జిమ్లలో మహిళా ట్రైనర్ల నియామకాన్ని తప్పనిసరి చేయాలని కోరుతున్నాయి.→ నిజమేనంటారా?!‘మిగిలిన విషయాల మాట ఎలా ఉన్నా జిమ్లో బ్యాక్గ్రౌండ్ చెకప్ స్ట్రిక్ట్గా ఉండాలి. సీసీటీవి నిఘా ఉండాలి’ అంటున్నాడు గురుగ్రామ్లోని ‘సెక్టర్ 29 ఫిట్నెస్ సెంటర్’కు చెందిన ఒక పర్సనల్ ట్రైనర్.‘మార్కెట్లో సర్టిఫైడ్ ఉమెన్ ట్రైనర్ల కొరత చాలా ఉంది’ అంటున్నాడు మరో ట్రైనర్.అయితే ఈ కొరత నిజమేనా? కృత్రిమమా... అనేది తెలియాల్సి ఉంది.‘ఉమెన్ ట్రైనర్లు ఉంటే సౌకర్యంగా ఫీల్ అవుతారు. ప్రతి విషయాన్ని మేల్ ట్రైనర్లతో పంచుకోవడం, చర్చించడం మహిళలకు సౌకర్యంగా అనిపించదు’ అంటుంది ఫిట్నెస్ ట్రైనర్ చారు సేథ్.→ ఇలా అయితే కష్టమే!నమోదవుతున్న కేసుల కంటే జిమ్లలో బాధితుల సంఖ్య ఎక్కువగా ఉందని, ‘నలుగురికి తెలిస్తే పరువు పోతుంది’లాంటి భయాల వల్ల, రకరకాల ఒత్తిళ్ల వల్ల ఫిర్యాదు చేయడానికి వెనకాడుతున్న మహిళల సంఖ్య ఎక్కువగా ఉందని చెబుతుంది మానవ హక్కుల కమిషన్. ఫిట్నెస్ కేంద్రాలకు సంబంధించి వస్తున్న ఫిర్యాదులపై స్పందించడానికి, పరిష్కార మార్గాలు కనుగొనే నిర్మాణాత్మక వ్యవస్థ లేకపోవడంపై కమిషన్ ఆందోళన వ్యక్తం చేసింది.అనేక రాష్ట్రాలలో జిమ్ల స్థాపన, నిర్వహణకు సంబంధించి ఒకే రకమైన నిబంధనలు లేవు. దీంతో చాలామంది జిమ్ నిర్వాహకులకు జవాబుదారీతనం లేకుండా పోతోంది. జిమ్లపై వచ్చిన ఫిర్యాదులు, వాటిపై తీసుకున్న చర్యలపై సమగ్ర వివరాలు అందించాలని మానవ హక్కుల కమిషన్(ఎన్హెచ్ఆర్సి) రాష్ట్రాలను కోరింది. భద్రతా సమస్యలతో పాటు జిమ్లలో ఆరోగ్య సమస్యలు కూడా ఉన్నాయని ఎన్హెచ్ఆర్సి గుర్తించింది. సరైన అనుమతులు, నాణ్యత తనిఖీలు లేకుండా కొన్ని జిమ్లు ఫుడ్ సప్లిమెంట్లను విక్రయిస్తున్నాయని కమిషన్ గమనించింది. అనుమతిలేని ఫుడ్సప్లిమెంట్లను విక్రయించడం వల్ల టీనేజర్లు, యువతీయువకులలో హార్మోన్ల అసమతుల్యత, ఇతర శారీరక సమస్యలు వస్తున్నాయి.రాష్ట్రాల నుంచి నివేదికలు అందిన తరువాత జిమ్లు, ఫిట్నెస్ కేంద్రాల పనితీరును నియంత్రించడానికి దేశవ్యాప్తంగా ఒకేరకమైన నిబంధలను ప్రవేశపెట్టాలని కమిషన్ సిఫారసు చేసే అవకాశం ఉంది. జిమ్క్రిప్ ట్రెండ్వేధింపుల ఫిర్యాదుపై నటుడు, ఫిట్నెస్ కోచ్ భాస్కర్ తములీని పోలీసులు అరెస్ట్ చేశారు. గుంజన్ అనే సెలబ్రిటీ ఫిట్నెస్ కోచ్పై మహిళలను లైంగిక వేధింపులకు గురిచేస్తున్నాడనే ఫిర్యాదు రావడంతో ఎఫ్ఐఆర్ నమోదైంది... ఇలా చెప్పుకుంటూ పోతే ఇవి కొన్ని సంఘటనలు మాత్రమే. జిమ్లోని మహిళలపై జరిగే కనిపించే, కనిపించని వేధింపులకు సంబంధించి సోషల్ మీడియా వేదికగా అవగాహన పెంచడానికి టిక్ టాక్లో జిమ్క్రిప్ ట్రెండ్ మొదలైంది. ఈ ట్రెండ్లో కీలక పాత్ర పోషిస్తోంది నటాలీ. తాను వివిధ సందర్భాలలో జిమ్లో లైంగిక వేధింపులకు గురయ్యానని చెప్పింది లండన్కు చెందిన 23 ఏళ్ల ఫిట్నెస్ ఇన్ఫ్లూయెన్సర్ నటాలీ టార్నెట్. ‘జిమ్లో ఎదురైన లైంగిక వేధింపుల వల్ల నేను చాలా బాధపడ్డాను. అందుకే జిమ్ వేధింపుల గురించి మాట్లాడడం, అవగాహన పెంచడాన్ని నా లక్ష్యంగా చేసుకున్నాను’ అంటుంది నటాలీ. -
మహిళల హక్కుల్ని వాయిదా వేయలేం
న్యూఢిల్లీ: నేషనల్ డిఫెన్స్ అకాడమీ (ఎన్డీయే) ప్రవేశ పరీక్షకు హాజరయ్యేందుకు మహిళలను అనుమతించడాన్ని వచ్చే సంవత్సరానికి వాయిదా వేయాలన్న కేంద్ర ప్రభుత్వ వినతిని సుప్రీంకోర్టు తిరస్కరించింది. మహిళల హక్కులను నిరాకరించాలని తాము కోరుకోవడం లేదని స్పష్టం చేసింది. వారికి ఎన్డీయేలో ప్రవేశం కల్పించడం మరో ఏడాది వాయిదా వేయలేమని తేల్చిచెప్పింది. 2022 మే నాటికి ఎన్డీయే నోటిఫికేషన్ జారీ చేస్తామని, మహిళలను అనుమతిస్తామని కేంద్రం చెప్పగా, న్యాయస్థానం అంగీకరించలేదు. తాము ఇదివరకే ఇచ్చిన ఆదేశాల ప్రకారం... ఈ ఏడాది నవంబర్లోనే వారిని పరీక్ష రాసేందుకు అనుమతించాలని స్పష్టం చేసింది. అత్యవసర పరిస్థితుల్లో సైనిక దళాలు అత్యుత్తమ సేవలు అందిస్తుంటాయని జస్టిస్ ఎస్.కె.కౌల్ నేతృత్వంలోని సుప్రీంకోర్టు ధర్మాసనం గుర్తుచేసింది. ఎన్డీయేలో మహిళలను చేర్చుకొనేందుకు ఇక ఎలాంటి జాప్యం లేకుండా అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వానికి సూచించింది. ఈ విషయంలో యూపీఎస్సీ, రక్షణ శాఖ కలిసి పని చేయాలని పేర్కొంది. ఎన్డీయేలో మహిళా అభ్యర్థుల కోసం సమగ్రమైన కరిక్యులమ్ రూపొందించాలని, ఇందుకోసం రక్షణ దళాల ఆధ్వర్యంలో నిపుణులతో కూడిన స్టడీ గ్రూప్ను యుద్ధప్రాతిపదికన ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఎన్డీయేలో మహిళలకు శిక్షణ ఇచ్చే విషయంలో సలహాలు, సూచనలు ఇవ్వడానికి బోర్డ్ ఆఫ్ ఆఫీసర్ల సమావేశం నిర్వహించాలని తెలిపింది. ఎన్డీయేలో మహిళలకు ప్రవేశం నిరాకరించడాన్ని ఆక్షేపిస్తూ న్యాయవాది కుశ్ కల్రా దాఖలు చేసిన పిటిషన్పై సుప్రీంకోర్టు ధర్మాసనం బుధవారం విచారణ చేపట్టింది. కేంద్ర ప్రభుత్వం అదనపు సొలిసిటర్ జనరల్ ఐశ్వర్య భాటీ వాదనలు వినిపించారు. నవంబర్ 14న జరిగే పరీక్షకు మహిళలను అనుమతించలేమని, అందుకు సమయం సరిపోదని చెప్పారు. ఈ సమస్యను పరిష్కరించగల సామర్థ్యం ప్రభుత్వానికి ఉందని ధర్మాసనం బదులిచి్చంది. ఎన్డీయే ప్రవేశ పరీక్ష కోసం మహిళలు ఉత్సాహంగా ఎదురు చూస్తున్నారని, వారిని నిరాశపర్చలేమని ధర్మాసనం వ్యాఖ్యానించింది. -
శబరిమల ఆలయం : పది మంది మహిళలకు నో ఎంట్రీ..
తిరువనంతపురం : శబరిమల ఆలయం తలుపులు శనివారం సాయంత్రం తెరుచుకోనున్న క్రమంలో ఆలయం లోకి ప్రవేశించేందుకు వచ్చిన పది మంది మహిళలను పోలీసులు తిప్పిపంపారు. వీరిని ఏపీకి చెందిన మహిళా భక్తులుగా భావిస్తున్నారు. శబరిమలలో పది నుంచి 50 సంవత్సరాల లోపు మహిళలు ప్రవేశించవచ్చని, పూజలు నిర్వహించవచ్చని సుప్రీం కోర్టు ఉత్తర్వులు జారీ చేసిన నేపథ్యంలో ఆలయం వద్ద ఎలాంటి ఘర్షణలు చోటుచేసుకోకుండా పోలీసులు పెద్ద ఎత్తున మోహరించారు. ఆలయ పరిసరాల్లో పదివేల మంది పోలీసులను నియమించారు. కాగా శబరిమలను సందర్శించాలనే మహిళలు కోర్టు ఉత్తర్వులతో వస్తే భద్రత కల్పిస్తామని కేరళ దేవాదాయ మంత్రి కదకంపల్లి సురేంద్రన్ స్పష్టం చేశారు. శబరిమల ఆలయం ఆందోళనలు చేపట్టే ప్రాంతం కాదు..తృప్తి దేశాయ్ వంటి సామాజిక కార్యకర్తలు తమ బలప్రదర్శన చేసే స్థలం కాదని చెప్పారు. ఏమైనా మహిళా భక్తులు కోర్టు ఉత్తర్వులతో రావాలని సూచించారు. మీడియా ప్రతినిధులు సైతం సంయమనం పాటించాలని, సంచలనం కోసం ప్రయత్నించే వ్యక్తులు, నేతల అత్యుత్సాహానికి సహకరించరాదని స్పష్టం చేశారు. కాగా శతాబ్ధాల తరబడి రుతుక్రమం పాటించే మహిళలను శబరిమల ఆలయానికి అనుమతించని నిబంధనలను బేఖాతరు చేస్తూ సుప్రీం తీర్పు నేపథ్యంలో గత ఏడాది పూణేకు చెందిన మహిళా హక్కుల కార్యకర్త తృప్తి దేశాయ్ శబరిమలలో అడుగుపెట్టిన సంగతి తెలిసిందే.మరోవైపు నవంబర్ 20 తర్వాత తనకు ప్రభుత్వం భద్రత కల్పించకపోయినా శబరిమల సందర్శిస్తానని తృప్తి దేశాయ్ స్పష్టం చేశారు. తమకు భద్రత కల్పించాలని కేరళ ప్రభుత్వాన్ని కోరతానని, ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా దర్శనం కోసం తాను శబరిమల వెళ్లితీరతానని ఆమె చెప్పారు. మరోవైపు సుప్రీం కోర్టు తీర్పు నేపథ్యంలో శబరిమల ఆలయంలోకి యువతుల ప్రవేశం గురించి తాము న్యాయ సలహాను తీసుకుంటామని ట్రావన్కోర్ దేవసం బోర్డు అధ్యక్షుడు ఎన్ వాసు వెల్లడించారు. -
మసీదుల్లో మహిళల ప్రవేశం : కేంద్రానికి సుప్రీం నోటీసులు
-
మసీదుల్లో మహిళల ప్రవేశం.. సుప్రీం నోటీసులు
సాక్షి, న్యూఢిల్లీ : మసీదుల్లో ప్రార్ధనలు చేసుకునేందుకు ముస్లిం మహిళలను అనుమతించాలని కోరుతూ దాఖలైన పిటిషన్ విచారణకు సర్వోన్నత న్యాయస్ధానం అంగీకరించింది. పుణేకు చెందిన దంపతులు దాఖలు చేసిన ఈ పిటిషన్పై బదులివ్వాలని జస్టిస్ ఎస్ఏ బోబ్డే నేతృత్వంలోని సుప్రీం బెంచ్ కేంద్ర ప్రభుత్వానికి మంగళవారం నోటీసులు జారీ చేసింది. శబరిమల ఆలయంలో మహిళల అనుమతికి సంబంధించిన కేసులో సుప్రీం కోర్టు తీర్పు నేపథ్యంలో తాజా పిటిషన్పై విచారణ చేపడతామని సుప్రీం బెంచ్ పిటిషనర్ల తరపు న్యాయవాదికి తెలిపింది. కాగా శబరిమల ఆలయంలోకి అన్ని వయసుల మహిళలను అనుమతిస్తూ గత ఏడాది సెప్టెంబర్ 28న సుప్రీం కోర్టు రాజ్యాంగ ధర్మాసనం సంచలన తీర్పు వెలువరించిన సంగతి తెలిసిందే. మరోవైపు రాజ్యాంగ నిబంధనల ప్రకారం దేశ పౌరులెవరినీ వారి మతం, జాతి, కులం, జెండర్, పుట్టిన ప్రాంతం ఆధారంగా వివక్షకు గురిచేయరాదని, ముస్లిం మహిళలను మసీదుల్లోకి అనుమతించకపోవడం లింగవివక్ష, సమానత్వ హక్కులకు తూట్లు పొడవడమేనని పిటిషనర్లు పేర్కొన్నారు. విదేశాల్లో మసీదుల్లోకి మహిళలను అనుమతిస్తున్నారా అని పిటిషనర్లను కోర్టు ప్రశ్నించింది. -
‘ట్రావెన్కోర్’ యూటర్న్
-
అయ్యప్ప భక్తుల మహా ఉపవాస దీక్ష
-
కేరళలో ఉద్రిక్తంగా మారిన బంద్
-
ఎవరిది ఒప్పు? ఎవరిది తప్పు?
-
చరిత్రాత్మకం: శబరిమల ఆలయంలోకి మహిళలు
-
నాకేదైనా జరిగితే కేరళ సీఎం,డీజీపీలదే బాధ్యత
-
శబరిమల తీర్పుపై సుప్రీంకోర్టులో విచారణ
-
ప్రభుత్వంతో చర్చల ప్రశ్నే లేదు
తిరువనంతపురం: శబరిమల అయ్యప్ప ఆలయంలోకి అన్ని వయసుల మహిళలకు ప్రవేశం కల్పించాలన్న సుప్రీం కోర్టు తీర్పుపై కేరళ ప్రభుత్వం రివ్యూ పిటిషన్ దాఖలు చేసేంత వరకూ ప్రభుత్వంతో చర్చల ప్రశ్నే లేదని ఆలయ పూజారులు తేల్చిచెప్పారు. ఆలయంలో మహిళల ప్రవేశంపై సుప్రీం కోర్టు తీర్పును అమలు చేస్తామని, స్వామి సన్నిధానంలో మహిళా పోలీసులను నియమిస్తామన్న కేరళ ప్రభుత్వం నిర్ణయంపైనా రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. అయ్యప్ప ఆలయంతో సంబంధాలున్న పూర్వపు రాజులు పండాళం రాయల్స్ కూడా ఇదే విషయాన్ని ప్రభుత్వానికి స్పష్టం చేశారు. సుప్రీంకోర్టు తీర్పు అమలుపై సోమవారం మాట్లాడేందుకు పండాళం రాయల్స్ కుటుంబ సభ్యులు, ఆలయ పూజారులను కేరళ ప్రభుత్వం చర్చలకు ఆహ్వానించింది. అయితే దీనిపై సుప్రీంకోర్టులో రాష్ట్ర ప్రభుత్వం రివ్యూ పిటిషన్ దాఖలు చేయనంతవరకూ చర్చల ప్రసక్తే లేదని ఆలయ ప్రధాన పూజారుల్లో ఒకరైన కందరారు మోహనారు తెలిపారు. -
తీర్పులు కాదు..సంప్రదాయాలే ముఖ్యం!
చెన్నై: శబరిమల ఆలయంలోకి అన్ని వయసుల మహిళలు ప్రవేశించొచ్చని సుప్రీంకోర్టు తీర్పునిచ్చినా సంప్రదాయాలను ఉల్లంఘించలేమని హిందూ మహిళా భక్త సంఘాలు అంటున్నాయి. 50 ఏళ్ల వయసు వచ్చే వరకు వేచిచూస్తామని, తర్వాతే ఆలయాన్ని దర్శిస్తామని సంఘాలు తేల్చాయి. చెన్నైలోని గంగాదీశ్వర ఆలయంలో శనివారం భారత్ హిందూ మున్నాని ఆధ్వర్యంలో ‘లైట్ల్యాంప్’ ప్రార్థనా సమావేశం జరిగింది. రుతుక్రమం ముగిసేదాకా(50 ఏళ్లు) శబరిమల ఆలయాన్ని సందర్శించమని ఈ సందర్భంగా మహిళా భక్తులు ప్రతినబూనారు. ‘కోర్టు తీర్పులు ఎలా వచ్చినా పురాతన సంప్రదాయాలను గౌరవిస్తాం. సంప్రదాయాలపై నమ్మకాన్ని చాటిచెప్పడానికే లైట్ల్యాంప్ ప్రార్థన నిర్వహించాం. విశ్వాసాల మేరకే శబరిమలను సందర్శించాలని మహిళా భక్తులు ప్రతినబూనారు’ అని హిందూ మక్కల్ కచ్చి చీఫ్ అర్జున్ సంపత్ చెప్పారు. -
‘శబరిమల’పై తీర్పు రిజర్వు
న్యూఢిల్లీ: శబరిమల ఆలయంలో మహిళల ప్రవేశంపై నిషేధాన్ని వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్ల విచారణ బుధవారం ముగిసింది. దీంతో సుప్రీంకోర్టు తన తీర్పును రిజర్వులో ఉంచింది. త్వరలోనే తీర్పును ప్రకటిస్తామని ధర్మాసనం తెలిపింది. ఇరుపక్షాల లాయర్లు రాతపూర్వక వాదనలను సేకరించి వారంలోగా తమ ముందు ఉంచాలని ఆదేశించింది. చివరి రోజు విచారణలో కేరళ ప్రభుత్వం తరఫు లాయర్ జయ్దీప్ గుప్తా వాదనలు వినిపించారు. శబరిమల ఆలయంలోకి 10–50 ఏళ్ల మధ్యనున్న మహిళలు రాకుండా నిషేధం విధించడం రాజ్యాంగ విరుద్ధం అని ఆయన అన్నారు. -
అయ్యప్ప బ్రహ్మచర్యానికి రాజ్యాంగ రక్షణ
న్యూఢిల్లీ: శబరిమల ఆలయ ప్రధాన దైవం అయ్యప్పస్వామి బ్రహ్మచర్యాన్ని పరిరక్షించడానికి రాజ్యాంగంలో నిబంధనలున్నాయని నాయర్ సర్వీస్ సొసైటీ సుప్రీంకోర్టుకు తెలిపింది. ఆలయంలోకి మహిళలను అనుమతించాలని కోరుతూ దాఖలైన పిటిషన్ను ఈ సొసైటీ వ్యతిరేకిస్తున్న సంగతి తెలిసిందే. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రా నేతృత్వంలోని రాజ్యాంగ ధర్మాసనం ముందు ఈ సంస్థ తరఫు లాయర్ కె.పరాశరన్ బుధవారం వాదనలు వినిపించారు. ఈ మొత్తం వ్యవహారంలో పరిశీలించదగ్గ అంశం అయ్యప్పస్వామి బ్రహ్మచర్యమే అని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ‘ ఆలయంలోకి వచ్చే వారు యువతులు, మహిళలను వెంట తీసుకురావొద్దు. పిల్లలు, తల్లి, సోదరికి మినహాయింపు ఉంటుంది. సందర్శకులు తప్పనిసరిగా బ్రహ్మచర్యాన్ని పాటించాలని దీనర్థం కాదు. కానీ వారు బ్రహ్మచర్యాన్ని పాటిస్తున్నట్లు కనిపించాలి. దేవాలయాల్లోకి అన్ని వర్గాలను అనుమతించాలన్న రాజ్యాంగ నిబంధన 25(2) సామాజిక సంస్కరణలకే పరిమితం. 26(బి) నిబంధన కింద చేర్చిన మత వ్యవహారాలకు వర్తించదు’ అని పరాశరన్ అన్నారు. మహిళలను ఆలయాల్లోకి అనుమతిస్తూ ప్రభుత్వం చట్టం చేస్తే పరిస్థితి ఏంటని బెంచ్ ప్రశ్నించగా..చాలా ఏళ్ల నాటి ఇలాంటి సంప్రదాయాల రాజ్యాంగబద్ధతను పరిశీలిస్తున్న సమయంలో అక్కడి ప్రధాన దైవం ప్రత్యేకతను దృష్టిలో పెట్టుకోవాలని బదులిచ్చారు. వాదనలు నేడు కూడా కొనసాగనున్నాయి. దివ్యాంగుల సౌకర్యం పట్టదా? రవాణా సౌకర్యాలు, బహిరంగ ప్రదేశాల్లో దివ్యాంగులకు అనుకూలంగా మార్పులు చేయడంలో జరుగుతున్న ఆలస్యంపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇందుకు సంబంధించి గత డిసెంబర్లో తాము జారీచేసిన ఉత్తర్వులను అమలుచేయడంలో విఫలమైన కేంద్రానికి చీవాట్లు పెట్టింది. ఇప్పటి దాకా తీసుకున్న చర్యలు వివరిస్తూ ప్రమాణపత్రం దాఖలుచేయాలని జస్టిస్ ఏకే సిక్రి, జస్టిస్ అశోక్ భూషణ్ల ధర్మాసనం ఆదేశించింది. తమ ఆదేశాలను పట్టించుకోని రాష్ట్రాల తీరుపై కూడా బెంచ్ అసహనం వ్యక్తం చేసింది. -
మహిళలు కూడా దేవుడి సృష్టే
-
దర్గాలోకి మహిళల ప్రవేశం ఓకే..
-
దర్గాలోకి మహిళల ప్రవేశం ఓకే.. ఆపై స్టే
-
దర్గాలోకి మహిళల ప్రవేశం ఓకే.. ఆపై స్టే
ముంబైలోని ప్రఖ్యాత హజీ అలీ దర్గాలోకి మహిళల ప్రవేశాన్ని బాంబే హైకోర్టు అనుమతించింది. కానీ కాసేపటికే.. తన తీర్పు మీద ఆరు వారాల స్టే విధించింది. పురుషులతో పాటే మహిళలను కూడా దర్గలోకి అనుమతించొచ్చని, మహారాష్ట్ర ప్రభుత్వం వారి భద్రతకు తగిన ఏర్పాట్లు చేయాలని హైకోర్టు ఆదేశించింది. మహిళల ప్రవేశాన్ని నిషేధించడం వ్యక్తులకు రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కులకు విరుద్ధమని కోర్టు అభిప్రాయపడింది. దర్గాలోకి మహిళలను ప్రవేశించనివ్వడం లేదంటూ భారతీయ ముస్లిం మహిళా ఆందోళన్కు చెందిన నూర్జహాన్ నియాజ్, జకియా సోమన్ అనే మహిళలు కోర్టులో ప్రజాహిత వ్యాజ్యం దాఖలు చేశారు. హైకోర్టు ఇచ్చిన తీర్పు చరిత్రాత్మకమని, ఖురాన్ ప్రకారం, రాజ్యాంగం ప్రకారం తమకున్న హక్కులను ఇన్నాళ్లకు పునరుద్ధరించారని జకియా హర్షం వ్యక్తం చేశారు. 2012 కంటే ముందు దర్గాలోకి మహిళలను అనుమతించేవారని పిటిషనర్లు వాదించారు. హజీ అలీ దర్గా మహిళలను లోపలకు ప్రవేశించనివ్వకపోవడం సరికాదని మహారాష్ట్ర ప్రభుత్వం కూడా ఇంతకుముందు తెలిపింది. ప్రార్థనలు చేసే హక్కు పురుషులకు, మహిళలకు సమానంగా ఉండాలని చెప్పింది. కాగా హైకోర్టు తీర్పుపై తాము సుప్రీంకోర్టులో అప్పీలు చేయనున్నట్లు హజీ అలీ ట్రస్టు తరఫు న్యాయవాది తెలిపారు. దాంతో అందుకు అనుకూలంగా స్పందించిన హైకోర్టు, తామిచ్చిన తీర్పు అమలుపై ఆరు వారాల స్టే విధించింది. దర్గా లోపలి ప్రాంతం బాగా రద్దీగా ఉంటుందని, అందువల్ల అక్కడ మహిళలకు భద్రత ఉండదని దర్గా తరఫు న్యాయవది వాదించారు. షరియత్ చట్టాన్ని పరిగణనలోకి తీసుకోకుండా కోర్టు తీర్పు ఇచ్చినట్లుందని, ఈ చట్టంలో మహిళలకు కొన్ని హద్దులు ఉన్నాయని దర్గాకు చెందిన మౌలానా సాజిద్ రషీదీ తెలిపారు. ఈ విషయాల్లో కలగజేసుకోడానికి ముందు వాటి గురించి తెలుసుకోవాలన్నారు. ఇప్పుడు ఇదంతా ఒక రాజకీయ క్రీడ అయిపోయిందని అన్నారు.


