West Bengal Assembly
-
కాషాయ భారతం: 21 రాష్ట్రాలు.. రాజ్యసభలో 113 సీట్లు
తాజా అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు భారత ప్రజాస్వామ్య చరిత్రలో ఒక పెను ప్రకంపనలు సృష్టించాయి. పశ్చిమ బెంగాల్లో భారతీయ జనతా పార్టీ సాధించిన చరిత్రాత్మక విజయం కేవలం ఒక రాష్ట్రానికే పరిమితమైనది కాదు.. అది దశాబ్దాలుగా కొనసాగుతున్న ప్రాంతీయ పార్టీల ఆధిపత్యానికి ముగింపు లాంటిది. 2014 నుండి విస్తరిస్తున్న బీజేపీ జాతీయ రాజకీయ యంత్రాంగం ఇప్పుడు తూర్పు భారతదేశంలోకి విజయవంతంగా ప్రవేశించి, తన లక్ష్యాలను పూర్తి చేసింది. దేశంలోని 31 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలో 21 చోట్ల జాతీయ ప్రజాస్వామ్య కూటమి (ఎన్డీఏ) అధికారంలో ఉంటూ అత్యధిక భౌగోళిక ప్రాంతంపై తిరుగులేని ఆధిపత్యాన్ని చాటుకుంటోంది.తూర్పు భారత్పై కాషాయ పట్టుఒకప్పుడు బీజేపీ సిద్ధాంతాలకు ఏమాత్రం చోటులేదని భావించిన రాష్ట్రాలలో ఇప్పుడు ఆ పార్టీ విజయదుందుభి మోగిస్తోంది. బిహార్, బెంగాల్, ఒడిశా రాష్ట్రాలను కలుపుతూ పిలిచే ‘అంగ, వంగ, కళింగ’ ప్రాంతాన్ని కైవసం చేసుకోవడం ద్వారా బీజేపీ ఒక సరికొత్త మైలురాయిని చేరుకుంది. 2024లో ఒడిశాలో నవీన్ పట్నాయక్ను గద్దె దించడం ద్వారా మొదలైన ప్రయాణం, 2025లో బిహార్ ముఖ్యమంత్రిగా నితీష్ కుమార్ తప్పుకున్న తర్వాత సమ్రాట్ చౌదరి బాధ్యతలు చేపట్టడం, ఇప్పుడు బెంగాల్ను హస్తగతం చేసుకోవడం ఆ పార్టీ పకడ్బందీ వ్యూహాలకు నిదర్శనం.మమతా బెనర్జీ శకానికి ముగింపుపశ్చిమ బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ ఆధిపత్యానికి దాదాపుగా తెరపడింది. ముఖ్యంగా మమతా బెనర్జీ కంచుకోట అయిన భవానీపూర్లో సువేందు అధికారి చేతిలో 15,000 పైగా ఓట్ల తేడాతో ఓడిపోవడం ప్రాంతీయ ఆధిపత్య పతనానికి ప్రతీకగా మిగిలింది. 2026 ఓట్ల లెక్కింపు టీఎంసీకి తుది వీడ్కోలు పలుకుతుందని హోంమంత్రి అమిత్ షా ఎన్నికల ప్రచారంలో చేసిన జోస్యం అక్షరాలా వాస్తవరూపం దాల్చింది.హిందీ బెల్ట్ దాటి అప్రతిహత విస్తరణప్రధానమంత్రి నరేంద్ర మోదీ వ్యక్తిగత చరిష్మా, అమిత్ షా సంస్థాగత వ్యూహాల కలయికతో బీజేపీ ఎన్నికల యంత్రాంగం అప్రతిహతంగా ముందుకు సాగుతోంది. ఉత్తరప్రదేశ్, గుజరాత్, మధ్యప్రదేశ్ వంటి హిందీ రాష్ట్రాల్లో 45 శాతానికి పైగా ఓటు బ్యాంకుతో అజేయంగా నిలుస్తున్న ఆ పార్టీ, కొత్త ప్రాంతాలకు కూడా వేగంగా విస్తరిస్తోంది. 2022లో గుజరాత్లో 182కి 156 స్థానాలు గెలుచుకోవడం, ప్రభుత్వ సంక్షేమ పథకాల లబ్ధిదారులను నమ్మకమైన ఓటు బ్యాంకుగా మలచుకోవడం బీజేపీ బలపడేందుకు కారణమైంది.సంస్థాగత మార్పులు, పెరుగుతున్న ప్రభావంబీజేపీ ఎదుగుదల కేవలం ఓట్ల శాతానికే పరిమితం కాలేదు. ప్రభుత్వ వ్యవస్థల రూపురేఖలను సైతం మారుస్తోంది. రాష్ట్ర ఎన్నికల్లో వరుస విజయాలతో రాజ్యసభలో 2014లో 65గా ఉన్న సభ్యుల సంఖ్యను నేడు 113కి పెంచుకోగలిగింది. తద్వారా గతంలో ప్రతిపక్షాలు అడ్డుకున్న అనేక కీలక చట్టాలను సులభంగా ఆమోదించుకుంటోంది. న్యాయవ్యవస్థపై కూడా రాజకీయ ప్రభావం పెరుగుతోందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. సుప్రీంకోర్టులో ఆధార్ (Aadhaar) కేసులో జస్టిస్ చంద్రచూడ్ అసమ్మతి తెలిపినప్పటికీ, బిల్లును మనీ బిల్లుగా 4-1 మెజారిటీతో ఆమోదించడం, మాజీ ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగోయ్ రాజ్యసభకు నామినేట్ కావడం ఇందుకు ఉదాహరణలుగా చెబుతున్నారు.వ్యూహాత్మక ఎన్నికల విధానాలుచట్టపరమైన, ఎన్నికల యంత్రాంగాలను తమకు అనుకూలంగా వాడుకోవడంలో ప్రస్తుత పాలకులు ఎంతో నైపుణ్యం కనబరుస్తున్నారు. ఆర్టికల్ 370 రద్దు దగ్గరి నుంచి, అస్సాంలో ముస్లిం ప్రాబల్య నియోజకవర్గాలను 35 నుంచి 22కి తగ్గించిన డీలిమిటేషన్ ప్రక్రియ వరకు బీజేపీ తన మార్కును చూపించింది. 2026 బెంగాల్ ఎన్నికలలో కూడా ఎన్నికల సంఘం ముందుగా 96 లక్షల ఓట్లను తొలగించి, ఆ తర్వాత 25 లక్షలకు సర్దుబాటు చేయడం తుది ఫలితాలపై తీవ్ర ప్రభావం చూపింది. బెంగాల్, అస్సాం ఎన్నికలను ఎన్నికల సంఘం మద్దతుతో హైజాక్ చేశారని రాహుల్ గాంధీ లాంటి ప్రతిపక్ష నేతలు ఆరోపించారు.ఏక పార్టీ వ్యవస్థ దిశగా భారత్?భారత రాజకీయ ముఖచిత్రం పూర్తిగా కాషాయమయమవుతున్న తరుణంలో, దేశం ఏక-పార్టీ పాలన దిశగా పయనిస్తోందా అనే చర్చ ముమ్మరమైంది. రాజ్యాంగబద్ధంగా మనం చైనా లాగా ఏక-పార్టీ వ్యవస్థ కాకపోయినా, ప్రస్తుత అధికార కేంద్రీకరణ ఇందిరా గాంధీ కాలాన్ని గుర్తు చేస్తోంది. ప్రతిపక్షాల స్థానం బాగా కుంచించుకుపోతోందని, తమ పోరాటానికి మరింత సహనం అవసరమని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే అంగీకరిస్తున్నారు. దక్షిణాదిన తమిళనాడు, కేరళలో ఇంకా సవాళ్లు ఉన్నప్పటికీ, జాతీయ రాజకీయాలను ఇప్పుడు ఒకే ఒక శక్తి నిర్దేశిస్తోందనడంలో ఎలాంటి సందేహం లేదు.ఇది కూడా చదవండి: ‘కమల’ వ్యూహం: బెంగాల్ రిపీట్.. పంజాబ్ డిలీట్! -
దీదీ పతనం.. కాంగ్రెస్కు ఊపిరి
పశ్చిమ బెంగాల్ తాజా అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు భారతీయ రాజకీయాల్లో ఒక పెను సంచలనంగా మారాయి. పైపైన చూస్తే ఇది అధికార తృణమూల్ కాంగ్రెస్పై భారతీయ జనతా పార్టీ సాధించిన అద్భుత విజయంగా మాత్రమే కనిపిస్తుంది. కానీ ఈ ఫలితాల లోతుల్లోకి వెళితే ఒక ఆసక్తికరమైన రాజకీయ కోణం దాగి ఉంది. దశాబ్ద కాలంగా బెంగాల్లో నామమాత్రంగా మిగిలిపోయిన కాంగ్రెస్ పార్టీకి ఈ ఫలితాలు మళ్లీ ప్రాణం పోశాయి. మమతా బెనర్జీ ఓటమి కాంగ్రెస్కు శుభవార్తగా మారిందనేది ఇప్పుడు రాజకీయ వర్గాల్లో అత్యంత ఆసక్తికరమైన చర్చగా మారింది.శూన్యం నుంచి.. మళ్లీ మొదలైన ప్రస్థానం2021 అసెంబ్లీ ఎన్నికల్లో ఒక్క సీటు కూడా గెలుచుకోలేక చతికిలపడిన కాంగ్రెస్ పార్టీ ఈ తాజా ఎన్నికల్లో కనీసం రెండు నియోజకవర్గాల్లోనైనా జెండా ఎగురవేయగలిగింది. ముర్షిదాబాద్ జిల్లాలోని ఫరక్కా, రాణినగర్ స్థానాల్లో కాంగ్రెస్ సాధించిన అనూహ్య విజయం కేవలం అంకెల పరమైన పెరుగుదల మాత్రమే కాదు. ఫరక్కాలో కాంగ్రెస్ అభ్యర్థి మోతాబ్ షేక్ 63,050 ఓట్లు సాధించి, తన సమీప బీజేపీ అభ్యర్థిపై 8,193 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ఇక్కడ ఒకప్పటి బలమైన అధికార పార్టీ టీఎంసీ 47,256 ఓట్లతో ఏకంగా మూడో స్థానానికి పడిపోయింది.ముక్కోణపు పోటీలో.. ఆశ్చర్యకరమైన ఫలితాలురాణినగర్ నియోజకవర్గంలోనూ కాంగ్రెస్ అభ్యర్థి జుల్ఫికర్ అలీ హోరాహోరీ పోరులో టీఎంసీపై 2,701 ఓట్ల తేడాతో విజయం సాధించారు. ఇక్కడ సీపీఐ(ఎం) మరింత వెనుకబడగా, బీజేపీ ఏకంగా నాలుగో స్థానానికి పరిమితమైంది. ముర్షిదాబాద్ జిల్లాలో ఒకప్పుడు కేవలం టీఎంసీ వర్సెస్ బీజేపీ అన్నట్లుగా ఉన్న ద్విముఖ పోరు.. ఇప్పుడు బహుముఖ పోటీగా మారిందని ఈ రెండు స్థానాల ఫలితాలు స్పష్టం చేస్తున్నాయి. మైనారిటీలు, గ్రామీణ ఓటర్లపై టీఎంసీకి ఉన్న పట్టు సడలడమే ఈ పరిణామాలకు ప్రధాన కారణం.ఓట్ల చీలికతో.. కాంగ్రెస్కు కలిసొచ్చిన కాలంటీఎంసీ ఓటు బ్యాంకు చీలిపోవడం కాంగ్రెస్కు పరోక్షంగా లాభించింది. అధికార పార్టీకి దూరమైన ఓట్లన్నీ నేరుగా బీజేపీకే వెళ్లిపోలేదు. ఆ ఓట్లు విడిపోయి, స్థానికంగా సంస్థాగత బలం ఉన్న చిన్న పార్టీలకు, ముఖ్యంగా కాంగ్రెస్కు మళ్లాయి. దీనిని కాంగ్రెస్ వైపు వీచిన గాలి అనడం కంటే, టీఎంసీ పతనంతో ఏర్పడిన శూన్యాన్ని భర్తీ చేసే ప్రక్రియ అనడం వాస్తవం. అధికార పార్టీ బలహీనపడటం వల్ల బీజేపీ విస్తరణకు మార్గం సుగమం అయినప్పటికీ, ఏకకాలంలో కాంగ్రెస్కు కొన్ని చోట్ల అనుకూల వాతావరణం ఏర్పడింది.అధిర్ రంజన్ ఇలాకాలో.. అనూహ్య పరిణామంరాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ ఓటు శాతం కేవలం 3 శాతానికి అటూఇటుగా ఉన్నప్పటికీ, మైనారిటీ ప్రాబల్య ప్రాంతాల్లో ఆ పార్టీ ప్రభావం తీవ్రంగా కనిపించింది. దశాబ్దాలుగా కాంగ్రెస్ సీనియర్ నేత అధిర్ రంజన్ చౌదరికి కంచుకోటగా ఉన్న బహరంపూర్లో బీజేపీ నిర్ణయాత్మక విజయం సాధించింది. ఇక్కడ కాంగ్రెస్ రెండో స్థానంలో నిలవగా, టీఎంసీ మరింత బలహీనపడి కిందకు పడిపోయింది. చౌదరికి ఇది వ్యక్తిగతంగా పెద్ద ఎదురుదెబ్బ అయినప్పటికీ, అధికార వ్యతిరేక ఓటును ఆకర్షించడంలో కాంగ్రెస్ ద్వితీయ ప్రత్యామ్నాయంగా నిలిచిందని ఈ పరిణామం స్పష్టం చేస్తోంది.‘ఇండియా’ కూటమిలో.. మమతకు తగ్గిన పట్టుపశ్చిమ బెంగాల్లో టీఎంసీ పతనం కేవలం ఆ రాష్ట్రానికే పరిమితం కాలేదు, ‘ఇండియా’ కూటమిలోని అంతర్గత సమీకరణలను కూడా సమూలంగా మార్చేసింది. బీజేపీని ధీటుగా ఎదుర్కోగలిగేది ప్రాంతీయ పార్టీలేనని, ప్రతిపక్షాలకు నాయకత్వం వహించే సత్తా కాంగ్రెస్కు లేదని ఇన్నాళ్లూ మమతా బెనర్జీ బలంగా వాదిస్తూ వచ్చారు. అయితే తన సొంత నియోజకవర్గం భవానీపూర్లో బీజేపీ అభ్యర్థి సువేందు అధికారి చేతిలో మమతా బెనర్జీకి ఎదురైన పరాభవం కూటమిలో ఆమె ప్రభావాన్ని తీవ్రంగా దెబ్బతీసింది.పునర్వైభవం కాదు.. మనుగడకు మార్గంమమత పరాజయంతో ఇండియా కూటమిలో నాయకత్వ పోరు తగ్గుముఖం పట్టి, కూటమి పగ్గాలపై కాంగ్రెస్కు పరోక్షంగా మరింత స్వేచ్ఛ లభించింది. అయితే, బెంగాల్ ఫలితాలను కాంగ్రెస్ పార్టీ పూర్తిస్థాయి పునర్వైభవంగా భావించడానికి వీల్లేదు. రాష్ట్రవ్యాప్తంగా టీఎంసీ పతనంతో లబ్ధి పొంది బీజేపీ ప్రధాన ప్రత్యామ్నాయంగా స్థిరపడింది. అయితే, ముర్షిదాబాద్లో లభించిన విజయాలు కాంగ్రెస్ ఉనికికి ఊపిరిపోశాయి. బెంగాల్ రాజకీయ చిత్రం నుంచి దాదాపు కనుమరుగైపోయిన ఒక జాతీయ పార్టీకి, ఫరక్కా, రాణినగర్ ఫలితాలు లబ్ధి చేకూర్చాయని నిపుణులు అంటున్నారు.ఇది కూడా చదవండి: కామ్రేడ్లకు భారీ షాక్.. చివరి కోట పతనం! -
నందిగ్రామ్ సెగలు: పోలీసులపై సువేందు ఫైర్
నందిగ్రామ్: పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల తొలి దశ పోలింగ్ అత్యంత ఉత్కంఠ భరితంగా మారింది. రాజకీయంగా కీలకమైన నందిగ్రామ్ నియోజకవర్గంలో ఎన్నికల ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరుకున్నాయి. పోలీసులు.. ఓటర్లను భయభ్రాంతులకు గురిచేస్తున్నారని ఆరోపిస్తూ బీజేపీ అభ్యర్థి సువేందు అధికారి చేసిన సంచలన ఆరోపణలు బెంగాల్ రాజకీయాల్లో పెను ప్రకంపనలు సృష్టిస్తున్నాయి.పోలీసుల పక్షపాత వైఖరిపై ఫైర్తమ పోలింగ్ ఏజెంట్ను పోలీసులు అక్రమంగా నిర్బంధించారని నందిగ్రామ్, భవానీపూర్ స్థానాల నుంచి బరిలో ఉన్న సువేందు అధికారి ఆరోపించడంతో వివాదం మొదలైంది. ఎన్నికల విధుల్లో ఉన్న పోలీసుల తటస్థతపై ఆయన తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ముఖ్యంగా పింగ్లా పోలీస్ స్టేషన్ ఓసీ చిన్మోయ్ ప్రమాణిక్ ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని, వెంటనే ఆయనను సస్పెండ్ చేసి, విధుల నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. ఈ విషయాన్ని ఇప్పటికే చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ (సీఈఓ) మనోజ్ అగర్వాల్, పోలీసు పరిశీలకుల దృష్టికి తీసుకెళ్లినట్లు ఆయన స్పష్టం చేశారు. VIDEO | West Bengal election: BJP candidate from Bhabanipur and Nandigram, Suvendu Adhikari, said,"Murder accused Sheikh Shahuddin is threatening voters. I am not afraid of anything. My fight is not against any religion. My fight is against the goons of TMC."… pic.twitter.com/z2EYl7Tmjs— Press Trust of India (@PTI_News) April 23, 2026‘ఆ గూండాలతోనే నా పోరాటం’ఓటర్లను ప్రభావితం చేసేందుకు అధికార పార్టీ బెదిరింపులకు పాల్పడుతోందని సువేందు తీవ్ర ఆరోపణలు చేశారు. ‘హత్య కేసులో నిందితుడైన షేక్ షాహుద్దీన్ ఓటర్లను బెదిరిస్తున్నాడు. నేను దేనికీ భయపడను. నా పోరాటం ఏ మతానికి వ్యతిరేకం కాదు, కేవలం టీఎంసీ గూండాలపైనే నా యుద్ధం’ అని ఆయన పేర్కొన్నారు. బిన్పూర్, ఖరగ్పూర్ లాంటి ఇతర ప్రాంతాల్లోనూ బీజేపీ కార్యకర్తలే లక్ష్యంగా దాడులు జరుగుతున్నాయని, ఏజెంట్లను బలవంతంగా తీసుకెళ్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. పోలింగ్కు ముందు రోజు రాత్రి కూడా నందిగ్రామ్లో టీఎంసీ, బీజేపీ వర్గాల మధ్య దాడులు, ప్రతిదాడులు చోటుచేసుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది. -
ముగిసిన మొదటి విడత ప్రచారం
కోల్కతా: పశ్చిమబెంగాల్ అసెంబ్లీకి జరుగుతున్న ఎన్నికల్లో మొదటి విడత పోలింగ్ ప్రచార గడువు మంగళవారం సాయంత్రం 6 గంటలతో ముగిసింది. అసెంబ్లీలోని మొత్తం 294 సీట్లకు గాను ఈ నెల 23వ తేదీన 152 నియోజకవర్గాలకు పోలింగ్ జరగనుంది. ఈ పోలింగ్లో 3.60 కోట్ల అర్హులైన ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. టీఎంసీ, బీజేపీ మధ్య హోరాహోరీ పోరు నెలకొన్న ఈ ఎన్నికల కోసం ఎన్నికల కమిషన్ భారీగా భద్రతా ఏర్పాట్లను చేపట్టింది. మొదటి విడతలో 8 వేల పోలింగ్ బూత్లను అత్యంత సమస్యాత్మకంగా గుర్తించింది. పోలింగ్ సజావుగా సాగేందుకు సుమారు 2,450 కంపెనీలు, రెండున్నర లక్షల కేంద్ర బలగాలను రంగంలోకి దించింది. అదనంగా 2,193 క్విక్ రెస్పాన్స్ టీంలను ఏర్పాటు చేసింది.రాష్ట్రంలోని మాల్దా, ముర్షిదాబాద్, ఉత్తర్ దినాజ్పూర్, కూచ్ బెహార్, బిర్బూమ్, బురŠాద్వన్ జిల్లాలపై ఈసీ ఎక్కువ దృష్టి కేంద్రీకరించింది. మొదటి విడతలో ప్రతిపక్ష బీజేపీ నేత సువేందు అధికారి బరిలో నిలిచిన నందిగ్రామ్, కేంద్ర మాజీ మంత్రి నిశిత్ ప్రామాణిక్ పోటీలో ఉన్న మాతాభంగ, కాంగ్రెస్ నేత ఆధిర్ రంజన్ చౌదరి పోటీ చేస్తున్న బెహరంపూర్ తదితర నియోజకవర్గాలున్నాయి. పశ్చిమ్ మేదినీపూర్ జిల్లా ఖరగ్పూర్ సదర్లో రాష్ట్ర బీజేపీ మాజీ అధ్యక్షుడు దిలీప్ ఘోష్, టీఎంసీకి చెందిన ప్రదీప్ సర్కార్ ముఖాముఖి తలపడుతున్నారు. ఈ నెల 29వ తేదీన రెండో విడత పోలింగ్, మే 4వ తేదీన ఓట్ల లెక్కింపు జరగనున్నాయి.టీఎంసీ, బీజేపీ మధ్యే అసలు పోటీటీఎంసీ వరుసగా నాలుగోసారి అధికారం చేపట్టేందుకు చెమటోడ్చుతుండగా, మమతా బెనర్జీని గద్దె దించేందుకు బీజేపీ విశ్వప్రయత్నాలు చేస్తోంది. రాష్ట్రంలో చేపట్టిన సర్ ప్రక్రియతో 91 లక్షల ఓట్లు తొలగింపునకు గురి కావడం తమకు కలిసి వస్తోందని కాషాయ దళం ఆశతో ఉంది. మొదటి విడత ఎన్నికల ప్రచార కార్యక్రమాల్లో బీజేపీ అభ్యర్థుల తరఫున ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్ షా, తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రంలో ఎన్నికల హింస, దిగజారిన శాంతి భద్రతల అంశం, పెచ్చుమీరిన అవినీతిపై సీఎం మమతా బెనర్జీ సారథ్యంలోని టీఎంసీ ప్రభుత్వ తీరును ఎండగట్టారు.ఓటు బ్యాంకు రాజకీయాల కోసం చొరబాట్లను టీఎంసీ ప్రోత్సహిస్తోందని వీరు ఆరోపణలు గుప్పించారు. కాగా, టీఎంసీ అధినేత్రి, సీఎం మమతా బెనర్జీ, ఆమె మేనల్లుడు, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి అభిషేక్ విస్తృతంగా ప్రచారం చేపట్టారు. సర్ ద్వారా బీజేపీ ఓటరు జాబితాను తారుమారు చేసి, అనుకూలంగా మార్చుకుందని వీరు విమర్శించారు. కేంద్ర విభాగాలను వాడుకుంటూ బీజేపీ నాయకులు తమ అభ్యర్థులను లక్ష్యంగా చేసుకుంటున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో బీజేపీకి అధికారమిస్తే చేపలు, గుడ్లు, మాంసంపై నిషేధం తీసుకువస్తుందని, ప్రజల ఆహార అలవాట్లను కూడా శాసిస్తుందని ప్రజలను టీఎంసీ హెచ్చరించారు. కాగా, కాంగ్రెస్ తరఫున ఆ పార్టీ చీఫ్ మల్లికార్జున ఖర్గే, అగ్ర నేత రాహుల్ గాంధీ తమ పార్టీ అభ్యర్థుల తరఫున ప్రచారంలో పాల్గొన్నారు. అయితే, ప్రస్తుత పరిస్థితుల్లో కాంగ్రెస్తోపాటు గతంలో దశాబ్దాలపాటు అధికారంలో ఉన్న సీపీఎం ప్రభావం కూడా అంతంత మాత్రమేనని పరిశీలకులు అంటున్నారు. -
పట్టు కోసం ‘దీదీ’.. పక్కా వ్యూహంలో బీజేపీ
కోల్కతా: పశ్చిమ బెంగాల్ రాజకీయ, సాంస్కృతిక సిగలో ప్రధాన కేంద్రంగా నిలిచిన కోల్కతా.. 2026 అసెంబ్లీ ఎన్నికలకు మరోసారి అత్యంత కీలక యుద్ధభూమిగా మారింది. కోల్కతాలో తన పట్టు నిలుపుకోవాలని అధికార తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ)పట్టుదలతో ఉండగా, పట్టణ ఓటర్లను తమవైపు తిప్పుకునే పక్కా వ్యూహంతో బీజేపీ బరిలోకి దిగింది. తాజాగా వెలువడిన ఒపీనియన్ పోల్స్ ఈసారి ఎన్నికల పోరు ఎంత ఉత్కంఠభరితంగా ఉండనుందో స్పష్టం చేస్తున్నాయి. అధికార పార్టీకి కాస్త సానుకూలత ఉన్నప్పటికీ, బీజేపీ అనుసరిస్తున్న సరికొత్త అర్బన్ వ్యూహాలతో పోరు మరింత ఉత్కంఠ భరితంగా మారనున్నదని తాజా నివేదికలు స్పష్టం చేస్తున్నాయి.అసలు సిసలు పోరుకోల్కతా నగర పరిధిలో సుమారు 11 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. ఇందులో అందరి దృష్టిని ఆకర్షిస్తున్న హై-ప్రొఫైల్ స్థానం ‘భవానీపూర్’. ఇక్కడ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి, బీజేపీ కీలక నేత సువేందు అధికారికి మధ్య నేరుగా కురుక్షేత్రం నెలకొంది. ఇటీవలి ఒపీనియన్ పోల్స్ ప్రకారం, పశ్చిమ బెంగాల్లో టీఎంసీ తన ఆధిపత్యాన్ని మరోసారి కొనసాగించే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా టీఎంసీ 140 నుంచి 170 స్థానాలను గెలుచుకోవచ్చని, అదే సమయంలో బీజేపీ సైతం బలమైన పోటీనిస్తూ 100 నుంచి 150 స్థానాలను కైవసం చేసుకునే అవకాశం ఉందని అంచనాలు వెలువడుతున్నాయి. ఇది రసవత్తరమైన పోటీని సూచిస్తున్నది.కోల్కతాలో గట్టి పోటీ..గ్రామీణ బెంగాల్తో పోలిస్తే కోల్కతా నగరంలో అధికార పార్టీకి సవాలు గట్టిగానే ఉండబోతోందని రాష్ట్ర స్థాయి వర్గాలు, రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. స్థానిక ఎమ్మెల్యేలపై ఉన్న తీవ్ర వ్యతిరేకతను, పాలనాపరమైన లోపాలను, పట్టణ ఓటర్లలో రగులుతున్న అసంతృప్తిని తమకు అనుకూలంగా మలచుకోవడానికి బీజేపీ పావులు కదుపుతోంది. ‘ ఈసారి కోల్కతాలో ఏ పార్టీకీ ఏకపక్ష విజయం దక్కదు. టీఎంసీకి క్షేత్రస్థాయిలో బలమైన సంస్థాగత పునాది ఉన్నప్పటికీ, నగరంలోని ఎంపిక చేసిన కొన్ని ప్రాంతాల్లో బీజేపీ గణనీయంగా పుంజుకుంది’ అని ఓ సీనియర్ రాజకీయ విశ్లేషకుడు స్థానిక మీడియాతో వ్యాఖ్యానించారు.బలమైన సానుకూల అంశాలునగరంలో పోటీ తీవ్రంగా మారుతున్నప్పటికీ, అధికార పార్టీకి ఇప్పటికీ పలు బలమైన సానుకూల అంశాలు ఉన్నాయి..గత దశాబ్ద కాలంగా అధికారంలో ఉండటం వల్ల క్షేత్రస్థాయిలో ఏర్పడిన పటిష్టమైన సంస్థాగత నెట్వర్క్.పట్టణ ప్రాంతాల్లోని లబ్ధిదారులకు నేరుగా లబ్ధి చేకూరుస్తున్న సంక్షేమ పథకాలు.ముఖ్యంగా దక్షిణ కోల్కతాలో మమతా బెనర్జీకి ఉన్న వ్యక్తిగత ఆదరణ, ఛరిష్మా.భవానీపూర్, బల్లిగంజ్, ఉత్తర కోల్కతాలోని పలు ప్రాంతాల్లో టీఎంసీ సంస్థాగతంగా అత్యంత బలంగా ఉందని రాష్ట్ర వర్గాలు చెబుతున్నాయి. ఇక్కడ క్షేత్రస్థాయి సమీకరణాలు ఇప్పటికీ ఆ పార్టీకే అనుకూలంగా కనిపిస్తున్నాయి.వ్యూహం మార్చిన ‘కమలం’మరోవైపు, బీజేపీ కూడా కోల్కతాపై మునుపెన్నడూ లేని విధంగా ప్రత్యేక దృష్టి సారించింది. గతంలో ఎక్కువగా గ్రామీణ ప్రాంతాలపైనే ఆధారపడిన ఆ పార్టీ.. ఇప్పుడు తన పంథా మార్చుకుంది. నగరంలోని మౌలిక సదుపాయాల కొరత, ఉద్యోగాల సృష్టి, పౌర సమస్యలను ఎత్తిచూపుతూ నిర్దిష్ట నియోజకవర్గాలను లక్ష్యంగా చేసుకొని ‘మైక్రో-లెవల్’ ప్రచారానికి శ్రీకారం చుట్టింది. కోల్కతాలోని కీలక స్థానాలను గెలుచుకోవడం రాష్ట్రంలో ప్రభుత్వ ఏర్పాటుకు అత్యంత కీలకమని బీజేపీ సీనియర్ నేతలు స్పష్టం చేస్తున్నారు.క్షేత్రస్థాయిలో ఉద్రిక్త వాతావరణంహోరాహోరీ ప్రచారాలు, వీధి స్థాయి ఘర్షణలు, భవానీపూర్ లాంటి ప్రతిష్టాత్మక పోరుతో కోల్కతాలో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. ట్రాఫిక్ రద్దీ నుంచి వాయు కాలుష్యం వరకు నగరంలోని పౌర సమస్యలు కూడా ఈసారి ఓటర్ల ఆలోచనలను తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయి. పౌర సమాజ సంఘాలు సైతం ఈ పట్టణ సమస్యలను తక్షణమే పరిష్కరించాలని అన్ని రాజకీయ పార్టీలపై తీవ్ర ఒత్తిడి తెస్తున్నాయి.తీర్పు ఎటువైపు?ఒపీనియన్ పోల్స్, గత ఎన్నికల చరిత్ర టీఎంసీకి కాస్త పైచేయి ఇస్తున్నప్పటికీ.. బీజేపీ అనూహ్యంగా బలపడుతుండటంతో ‘సిటీ ఆఫ్ జాయ్’లో ఇకపై వన్సైడ్ వార్ లేనట్టే. పోలింగ్ శాతం, అభ్యర్థుల ఎంపిక, చివరి నిమిషంలో జరిగే ప్రచార సరళి.. ఇవన్నీ కోల్కతాలోని పలు నియోజకవర్గాల్లో మెజారిటీని తారుమారు చేసే అవకాశం ఉందని రాజకీయ పండితులు స్పష్టం చేస్తున్నారు. పార్టీల ఎత్తులు, పైఎత్తులతో కోల్కతా పోరు యావత్ దేశం దృష్టిని ఆకర్షిస్తోంది.ఇది కూడా చదవండి: ‘సైలెంట్ పీరియడ్’ షురూ.. ఈ 48 గంటల్లో.. -
శ్రీరామ నవమి ఇకపై ప్రభుత్వ సెలవుదినం!
పశ్చిమ బెంగాల్లో తొలిసారిగా శ్రీరామ నవమి సందర్భంగా ఏప్రిల్ 17న సెలవు ఇవ్వనున్నారు. ఈ విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఒక ప్రకటనలో తెలిపింది. లోక్సభ ఎన్నికలకు ముందు ప్రభుత్వం ఇటువంటి ప్రకటన చేయడం చర్చనీయాంశంగా మారింది. పశ్చిమ బెంగాల్లో దుర్గాపూజ, కాళీపూజ, సరస్వతీ పూజలను ఘనంగా జరుపుకుంటారు. అయితే గత కొన్ని సంవత్సరాలుగా శ్రీరామ నవమి, హనుమాన్ జయంతిని వైభవంగా నిర్వహిస్తున్నారు. రాష్ట్రంలో శ్రీ రామ నవమికి నేటి వరకూ సెలవు లేదు. గత ఏడాది శ్రీరామనవమి సందర్భంగా రాష్ట్రంలో పలుచోట్ల హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి. ఈ నేపధ్యంలో బీజేపీ పలు విమర్శలు గుప్పించింది. శ్రీరామనవమి రోజున జనం ఊరేగింపులు నిర్వహించే హక్కులను కాలరాయడానికి పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని బీజేపీ గతంలో వ్యాఖ్యానించింది. ఈ నేపధ్యంలోనే రానున్న శ్రీరామ నవమికి పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం సెలవు ప్రకటించిందనే వార్తలు వినిపిస్తున్నాయి. తృణమూల్ ప్రభుత్వం హిందువులను దగ్గర చేసుకునే ప్రయత్నం చేస్తున్నదంటూ పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. -
బెంగాల్ అసెంబ్లీలో టీఎంసీ-బీజేపీ ఎమ్మెల్యేల కొట్లాట
-
బెంగాల్ అసెంబ్లీలో రచ్చ రచ్చ.. కొట్టుకున్న ఎమ్మెల్యేలు, వీడియో వైరల్
లక్నో: పశ్చిమబెంగాల్ శాసనసభలో అధికార పార్టీ టీఎంసీ, బీజేపీ ఎమ్మెల్యేల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఈ సందర్భంగా నేతల మధ్య తోపులాటలు జరిగాయి. రాంపూర్హాట్, బీర్భూమ్ హింసాత్మక ఘటనలపై చర్చలు జరపాలంటూ బీజేపీ ఎమ్మెల్యే, ప్రతిపక్షనేత సువేందు అధికారి డిమాండ్ చేశారు. స్పీకర్ పోడియం వద్ద నిరసనలు తెలియజేశారు. ఈ నేపథ్యంలో టీఎంసీ, బీజేపీ నేతల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఎమ్మెల్యేలు ఒకరినొకరు కొట్టుకున్నారు. ఈ గొడవలో బీజేపీ ఎమ్మెల్యే మనోజ్ తిగ్గ బట్టలు చిరిగిపో.. టీఎంసీ ఎమ్మెల్యే అసిత్ మజుందర్ ముక్కుకు గాయమైంది. మరోవైపు శాసనసభలో జరిగిన గందరగోళం నేపథ్యంలో శాసనసభ ప్రతిపక్షనేత సువేందుతో సహా అయిదుగురు బీజేపీ ఎమ్మెల్యేలను స్పీకర్ సస్పెండ్ చేశారు. స్పీకర్ చర్యపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ సువిందు సహా బీజేపీ సభ్యులందరూ సభ భయట నిరసనకు దిగారు. బీజేపీ నేతలపై జరిగిన దాడి నేపథ్యంలో స్పీకర్ చర్యలు తీసుకోకుంటే న్యాయపరమైన పోరాటం చేస్తామని తెలిపారు. చదవండి: కశ్మీర్ ఫైల్స్.. కేజ్రీవాల్కు స్ట్రాంగ్ కౌంటర్ కాగా పశ్చిమబెంగాల్లోని బీర్భూమ్ జిల్లాలో పది ఇళ్లకు నిప్పంటించిన ఘటనలో ఎనిమిది మంది సజీవ దహనమైన విషయం తెలిసిందే. టీఎంసీ నాయకుడు తృణమూల్ కాంగ్రెస్ నాయకుడు బాద్ షేక్ హత్యకి ప్రతీకారంగా మార్చి 21న ఈ ఘటన చోటుచేసుకుంది. బీర్భూమ్ సజీవ దహనాలపై విచారణ బాధ్యతను కలకత్తా హైకోర్టు ఆదేశాల మేరకు సీబీఐ స్వీకరించింది. ఈ దారుణ ఘటనపై పలు కేసులు నమోదు చేసింది. -
బెంగాల్ అసెంబ్లీలో హైడ్రామా
కోల్కతా: పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు సోమవారం ప్రారంభమయ్యాయి. తొలిరోజే సభలో హైడ్రామా చోటుచేసుకుంది. ఇటీవల రాష్ట్రంలో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో హింసను ఖండిస్తూ బీజేపీ ఎమ్మెల్యేలు సభలో నిరసనకు దిగారు. గవర్నర్ జగదీప్ ధన్ఖర్ ప్రసంగాన్ని అడ్డుకున్నారు. హింసకు సంబంధించిన పోస్టర్లు, ఫోటోలను బీజేపీ సభ్యులు అసెంబ్లీలో ప్రదర్శించారు. వెల్లో బైఠాయించారు. శాంతించాలని, వెనక్కి వెళ్లి సీట్లలో కూర్చోవాలని గవర్నర్ పదేపదే విజ్ఞప్తి చేసినప్పటికీ వారు వినిపించుకోలేదు. జైశ్రీరామ్, భారత్ మాతాకీ జై అంటూ పెద్ద ఎత్తున నినాదాలతో సభను హోరెత్తించారు. ప్రసంగాన్ని విరమించి, బయటకు వెళ్లిపోయేందుకు గవర్నర్ సన్నద్ధం కాగా, ముఖ్యమంత్రి మమతా బెనర్జీతోపాటు అధికార తృణమూల్ కాంగ్రెస్ సభ్యులు జోక్యం చేసుకున్నారు. బయటకు వెళ్లొద్దంటూ గవర్నర్కు విజ్ఞప్తి చేశారు. ఇప్పటికైనా నిరసన ఆపాలని గవర్నర్ కోరినప్పటికీ బీజేపీ ఎమ్మెల్యేలు వెనక్కి తగ్గలేదు. దీంతో అధికార తృణమూల్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సైతం బీజేపీ సభ్యులకు వ్యతిరేకంగా నినాదాలు ప్రారంభించారు. మళ్లీ గవర్నర్ బయటకు వెళ్లేందుకు ప్రయత్నించగా, తృణమూల్ ఎమ్మెల్యేలు ఆయనను వారించారు. చేసేది లేక నినాదాల హోరు కొనసాగుతుండగానే గవర్నర్ తన ప్రసంగాన్ని పూర్తిచేశారు. అసెంబ్లీలో బీజేపీ సభ్యుల తీరు పట్ల ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వారి వ్యవహార శైలి ప్రజాస్వామ్యాన్ని కించపర్చేలా ఉందన్నారు. బెంగాల్లో రాజ్యాంగ సంక్షోభం సృష్టించాలన్నదే వారి కుట్ర అని ధ్వజమెత్తారు. మున్సిపల్ ఎన్నికల్లో హింసాకాండపై మాత్రమే తాము నిరసన తెలిపామని, సభను అడ్డుకోలేదని బీజేపీ ఎమ్మెల్యే సువేందు అధికారి చెప్పారు. (చదవండి: గోవాలో హంగ్.. కింగ్ మేకర్ అయ్యేది ఎవరో?) -
అది సభా హక్కుల ఉల్లంఘనే
కోల్కతా: సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీఐబీ), ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)కి చెందిన ఇద్దరు అధికారులపై పశ్చిమ బెంగాల్ అసెంబ్లీలో బుధవారం అధికార తృణమూల్ కాంగ్రెస్ పార్టీ హక్కుల తీర్మానం ప్రవేశపెట్టింది. నారద స్టింగ్ ఆపరేషన్ కేసులో తృణమూల్ కాంగ్రెస్కు చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలను అరెస్ట్ చేసేటప్పుడు ముందస్తుగా సమాచారం అందివ్వలేదని అది సభాహక్కుల ఉల్లంఘన కిందకే వస్తుందని ఆ తీర్మానం పేర్కొంది. తృణమూల్ కాంగ్రెస్ మంత్రి తపస్ రాయ్ సభలో ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. నారద స్టింగ్ ఆపరేషన్ కేసుకి సంబంధించి ఈ ఏడాది మొదట్లో అధికార పార్టీకి చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు ఫిరాద్ హకీమ్, మదన్ మిత్రా, సుబ్రతా ముఖర్జీలను సీబీఐ అధికారులు అరెస్ట్ చేశారని, వారిని అరెస్ట్ చేయడానికి ముందు స్పీకర్ బిమన్ బెనర్జీ అనుమతి తీసుకోలేదని, ఆయనకు ఏ విధమైన సమాచారాన్ని కూడా అందివ్వలేదని తపస్ రాయ్ చెప్పారు. ఈడీ కూడా వారి ముగ్గురిపై అభియోగాలు నమోదు చేసిందని వెల్లడించారు. సీబీఐ, ఈడీ సభా హక్కుల్ని ఉల్లంఘించారని, స్పీకర్కు ఇవ్వాల్సిన మర్యాద ఇవ్వలేదన్నారు. సీబీఐ డిప్యూటీ ఎస్పీ సత్యేంద్ర సింగ్, ఈడీ అసిస్టెంట్ డైరెక్టర్ రతిన్ బిశ్వాస్పై సభా హక్కుల ఉల్లంఘనను ప్రవేశపెడుతున్నట్టుగా వెల్లడించారు. ఈ అంశాన్ని స్పీకర్ బిమన్ బెనర్జీ హక్కుల కమిటీ పరిశీలనకు పంపారు. వచ్చే అసెంబ్లీ సమావేశాల్లోగా దీనిపై విచారణ జరిపి నివేదిక అందించాలని విజ్ఞప్తి చేశారు. -
దీదీ ఎత్తుగడ: ఏకంగా గవర్నర్కే గురి!
పశ్చిమ బెంగాల్ పాలనలో కేంద్రం జోక్యానికి చెక్ పెట్టేందుకు, రివెంజ్ దిశగా మమతా బెనర్జీ పావులు కదుపుతోంది. ఇందులో భాగంగా గవర్నర్ ధన్ఖర్ను గద్దెదించేందుకు ఏకంగా అసెంబ్లీలో తీర్మానం చేయబోతున్నట్లు సమాచారం. కోల్కతా: పాలనాపరంగా పశ్చిమ బెంగాల్ గవర్నర్ జగ్దీప్ ధన్ఖర్కు, ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి మొదటి నుంచే పొసగడం లేదు.ఈ క్రమంలో ఆయన బహిరంగంగానే దీదీ తీరును, పాలనను తప్పుబడుతూ వస్తున్నాడు. ఇంకోవైపు అసెంబ్లీ ఎన్నికల టైం నుంచి ఆ విమర్శలు తారా స్థాయికి చేరుకున్నాయి. ఈ తరుణంలో ఆయన్ని గవర్నర్ గిరి నుంచి సాగనంపేందుకు దీదీ పాచికలు కదుపుతోంది. ధన్ఖర్ను సాగనంపే విషయంపై ఇదివరకే మమతా, బిమన్ బెనర్జీతో చర్చించినట్లు సమాచారం. జులై 2 నుంచి అసెంబ్లీ సమావేశాలు జరిగే అవకాశం ఉంది. ఆ సమావేశాల్లో మొదటి సెషన్లో.. అది కూడా గవర్నర్ స్పీచ్ అనంతరమే తీర్మానం ప్రవేశపెట్టాలని, తద్వారా తమ పవర్ ఏంటో చూపించాలని టీఎంసీ నేతలు ఉవ్విళ్లూరుతున్నారు. లోక్సభ స్పీకర్కీ.. గవర్నర్ ధన్ఖర్ బెంగాల్ అసెంబ్లీ వ్యవహారాల్లో అతిగా జోక్యం చేసుకుంటున్నారంటూ స్పీకర్ బిమన్ బెనర్జీ, లోక్సభ స్పీకర్ ఓం బిర్లాకు మంగళవారం ఫిర్యాదు చేశారు. ‘పెండింగ్ బిల్లులు సంతకం చేయకుండా జాప్యం చేస్తున్నాడని, ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా.. అనైతికంగా గవర్నర్ తీరు ఉందని’ ఫిర్యాదులో బిమన్ పేర్కొన్నట్లు తెలుస్తోంది. ఇక టీఎంసీ సీనియర్ నేతలు కూడా గవర్నర్ను దించేయడమే ఎజెండాగా పెట్టుకుని అసెంబ్లీలో అడుగుపెట్టాలని నిర్నయించుకున్నారు. ఒక పార్టీకి ప్రతినిధిగా వ్యవహరిస్తున్న గవర్నర్ తీరు హేయనీయంగా ఉందంటూ వరుసగా టీవీ ఛానెల్స్ డిబెట్లలో పాల్గొంటున్నారు. ఇక బెంగాల్లో శాంతిభద్రతలు కాపాడుతున్న గవర్నర్ను.. తామూ కాపాడుకునేందుకు ప్రయత్నిస్తామని బీజేపీ స్టేట్ ఛీఫ్ దిలీప్ ఘోష్ చెబుతున్నాడు. -
వాళ్లు రెచ్చగొడతారేమో.. మీరు రెచ్చిపోకండి
కోల్కతా/న్యూఢిల్లీ: పశ్చిమబెంగాల్లో ఎన్నికల ఫలితాలు వెలువడిన అనంతరం పలు హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి. అధికార టీఎంసీ దాడుల్లో తమ పార్టీ కార్యకర్తలు పలువురు మృతి చెందడం, గాయపడటం జరిగిందని బీజేపీ ఆరోపించింది. ప్రతిపక్ష కార్యకర్తలపై దాడుల ఘటనలపై నివేదిక అందించాలని కేంద్ర హోం శాఖ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది. తృణమూల్ కాంగ్రెస్ అభ్యర్థులు గెలిచిన ప్రాంతాల్లో బీజేపీ సహా పలు రాజకీ య పార్టీల కార్యకర్తలే లక్ష్యంగా దాడులు జరిగాయనీ, దీనిపై నివేదిక అడిగినట్లు హోం శాఖ ప్రతినిధి ఒకరు ట్విట్టర్లో తెలిపారు. బుర్ద్వాన్లో టీఎంసీ, బీజేపీ మద్దతుదారుల నడుమ ఆది, సోమవారాల్లో జరిగిన ఘర్షణల్లో నలుగురు మృతి చెందారని అధికారులు తెలిపారు. వీరిలో ముగ్గురు తమ కార్యకర్తలేనంటూ టీఎంసీ ప్రకటించింది. కాగా, ప్రత్యర్థుల దాడిలో నందిగ్రామ్లోని బీజేపీ పార్టీ కార్యాలయం తగులబడి పోతుండగా, ప్రజలు పరుగులు తీస్తున్నట్లున్న వీడియోను ఆ పార్టీ సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేసింది. దాడుల్లో చనిపోయిన పార్టీ కార్యకర్తలు నలుగురితోపాటు దుస్తుల దుకాణాన్ని లూటీ చేస్తున్న దృశ్యాలు కూడా అందులో ఉన్నాయి. తృణమూల్ శ్రేణుల దాడుల్లో తమ పార్టీ మద్దతుదారులు ఆరుగురు చనిపోగా, వారిలో ఒక మహిళ కూడా ఉన్నారని బీజేపీ ఆరోపించింది.అయితే మహిళ మరణంపై ఆయన కుమారుడు, స్థానిక బీజేపీ నాయకుడు ఆశిష్ క్షేత్రపాల్ మాట్లాడుతూ..ఉదయం 11 గంటల సమయంలో టీఎంసీ కార్యకర్తలు ఖేలాహోబ్ (ఆట మొదలైంది) నినాదాలు చేస్తూ దాడులకు తెగబడ్డారు. మేం ప్రతిఘటించడంతో టీఎంసీ మద్దతుదారులు పారిపోయి దొడ్డిదారిన నా ఇంట్లోకి ప్రవేశించారు. ఇంట్లో ఉన్న నా కుటుంబసభ్యులపై దాడి చేశారు. ఈ దాడిలో నా తల్లి మరణించిందని ఆవేదన వ్యక్తం చేశారు. దాడి అనంతరం మా ప్రాంతానికి చెందిన 17-18 ఇళ్లను ధ్వంసం చేసి దోచుకున్నారని చెప్పారు. కాగా, హింసాత్మక ఘటనలపై నివేదిక ఇవ్వాలని రాష్ట్ర గవర్నర్ జగ్దీప్ ధన్కర్ అధికార యంత్రాంగాన్ని ఆదేశించారు. ఈ నేపథ్యంలో, తమ పార్టీ కార్యకర్తలను ప్రశాంతంగా ఉండాలంటూ సీఎం మమతా బెనర్జీ కోరారు. రెచ్చగొట్టినా సంయమనం పాటించాలని వారికి విజ్ఞప్తి చేశారు. ఎన్నికల ఫలితాలు వచ్చాక కూడా బీజేపీ కార్యకర్తలు టీఎంసీ మద్దతుదారులపై దాడులకు పాల్పడ్డారని ఆమె ఆరోపించారు. పశ్చిమబెంగాల్లో రెండు రోజులపాటు మకాం వేసేందుకు బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా మంగళవారం రానున్నారు. చదవండి: పెళ్లి 3 గంటల్లో పూర్తవ్వాలి, 31 మందికే చాన్స్, లేదంటే.. -
రసవత్తరం కానున్న బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు
కోల్కతా: పశ్చిమ బెంగాల్ ఎన్నికలు రసవత్తరంగా మారనున్నాయి. తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) సీనియర్ నాయకుడు, తిరుగుబాటు నేత సువేందు అధికారి ఆ పార్టీకి తల నొప్పిగా మారనున్నారు. టీఎంసీ పార్టీ నాయకుడు సౌగతా రాయ్(49) అయిదుగు పార్టీ నాయకులతో రెండు రోజుల పాటు కీలక సమావేశం నిర్వహించారు. సువేందు నిర్ణయంలో ఏదైనా మార్పు ఉంటే మళ్లీ చర్చించి నిర్ణయం తీసుకుంటామని ఆయన అన్నారు. (చదవండి: పశ్చిమ బెంగాల్లో విషాదం, 11 మంది మృతి) పార్టీలో మొదలైన ముసలం టీఎంసీ యూత్ వింగ్ చీఫ్, డైమండ్ హార్బర్ ఎంపీ అభిషేక్ బెనర్జీకి పార్టీలో ప్రాధాన్యత పెరగడంతో ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సన్నిహితుల మధ్య విభేదాలు మొదలయ్యాయి. దీంతో పార్టీ ఫిరాయించిన చాలా మంది బీజేపీలో చేరడంతో గత సంవత్సరం జరిగిన లోక్సభ ఎన్నికల్లో తీవ్ర ప్రభావం చూపింది. బెంగాల్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ కేవలం రెండు సీట్లు మాత్రమే గెలుచుకుంటే.. లోక్సభ ఎన్నికల్లో మాత్రం 40 స్థానాలకు గానూ 18 గెలుచుకుంది. మారనున్న సమీకరణాలు సువేందు పార్టీ మారకపోయినా.. పార్టీ నుంచి నిష్క్రమిస్తే మాల్డా, ముర్షిదాబాద్, పురులియా, బంకురా, పశ్చిమ మిడ్నాపూర్ ప్రాంతాల్లోని స్థానిక నాయకులపై ప్రభావం చూపనుంది. సువేందు పదవిని రద్దు చేసే వరకు ఈ ప్రాంతంలో ఆయన అధికారి పార్టీ ఇన్చార్జిగా ఉన్నారు. ఆయన తండ్రి, సోదరుడు ఇద్దరు కూడా టీఎంసీ పార్టీ ఎంపీలుగా కొనసాగుతున్నారు. ఆదివారం నిర్వహించిన మీడియా సమావేశంలో సువేందు మాట్లాడుతూ.. అభిషేక్ బెనర్జీకి పార్టీలో అగ్రస్థానం చేరుకోవడానిక దొడ్డి దారి ఎంచుకున్నారని తీవ్ర ఆరోపణలు చేశారు. అయితే దీనిపై బెనర్జీ స్పందిస్తూ... ‘‘నేను డైమండ్ హార్బర్ వంటి కఠినమైన నియోజకవర్గం నుంచి ఎంపీ కావడానికి పారాచూట్, నిచ్చెనను ఉపయోగించలేదు. డైమండ్ హార్బర్ నా సొంత నియోజకవర్గం. మా కుటుంబంలో వారు కూడా చాలా పదవులు కలిగి ఉన్నారు’ అని అన్నారు. మంగళవారం ఉత్తర కోల్కత్తాలో జరిగిన సమావేశంలో ఎన్నికల ప్యూహకర్త ప్రశాంత్ కిషోర్తోపాటు బెనర్జీ హాజరయ్యారు. -
నోట్ల రద్దుకు వ్యతిరేకంగా పశ్చిమ బెంగాల్ తీర్మానం
కోల్కతా: పెద్దనోట్లు రద్దు చేస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ బుధవారం తీర్మానాన్ని ఆమోదించింది. నిబంధన 169 కింద ప్రభుత్వం ప్రవేశపెట్టిన తీర్మానంపై చర్చ బుధవారం వరకు ముగిసింది. నోట్ల రద్దు నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్న సీపీఎం, కాంగ్రెస్ ఈ తీర్మానానికి మద్దతు తెలపలేదు. నోట్ల రద్దు నిర్ణయాన్ని కేంద్రం వెనక్కి తీసుకోవాలన్న అధికార పార్టీ డిమాండ్ను అవి వ్యతిరేకించాయి. ‘నల్లధనానికి మేం వ్యతిరేకమే. నోట్లరద్దు నిర్ణయాన్ని ప్రణాళిక లేకుండా తీసుకున్నారు. దీంతో నగదు సరఫరా ఆగిపోయింది. దేశంలో మాంద్యం లాంటి వాతావరణం నెలకొంది. మోదీ నాయకత్వం వల్ల ఎప్పుడూ చూడని పరిస్థితులు తలెత్తాయి’ అని ఆర్థిక మంత్రి అమిత్ మిత్రా అన్నారు.


