-
డ్రగ్స్ మహమ్మారి సామాజిక రుగ్మత
రాష్ట్ర ఎక్సైజ్ శాఖ కమిషనర్ చంద్రవదన్ హైదరాబాద్: సమాజాన్ని పట్టిపీడిస్తున్న డ్రగ్స్ వినియోగం ఓ సామాజిక రుగ్మతగా మారిందని, దీనిని రూపుమాపేందుకు ప్రతి ఒక్కరూ చేయి కలిపి పోరాడాలని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ కమిషనర్ చంద్రవదన్ అన్నారు. ఇటీవల నగరాన్ని కుదిపేస్తున్న డ్రగ్స్ వ్యవహారంలో ఏ ఒక్క వర్గాన్నికానీ, వ్యక్తినికానీ లక్ష్యంగా చేసుకోలేదని, కావాలనే కొందరు తప్పుడు ప్రచారం చేస్తూ సమస్యను పక్కదారి పట్టించడానికి ప్రయత్నిస్తున్నారని విచారం వ్యక్తం చేశారు. తెలంగాణ చాంబర్ ఆఫ్ ఈవెంట్స్ ఇండస్ట్రీ(టీసీఈఐ) ఆధ్వర్యంలో ఆదివారం ఇక్కడ ఏర్పాటు చేసిన ఒక కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. హైదరాబాద్ ‘డ్రగ్ క్యాపిటల్’గా మారిందని కొన్ని వర్గాలు చేస్తున్న ప్రచారాన్ని తీవ్రంగా ఖండించారు. డ్రగ్స్ వాడకందారులు, సరఫరాదారులు, రవాణాదారులు సహ డ్రగ్స్తో సంబంధం కలిగిన ఎవ్వరినీ ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు. డ్రగ్స్ దందాపై విచారణ చేస్తున్న అకున్ సబర్వాల్ అత్యంత సమర్థమైన అధికారి అని ప్రశంసించారు. అనంతరం డ్రగ్స్కు వ్యతిరేకంగా టీసీఈఐ నిర్వహించిన మోటార్బైక్ ర్యాలీని ఆయన జెండా ఉపి ప్రారంభించారు. సంస్థ కార్యదర్శి టీఎస్ ఠాకూర్ విలేకరులతో మాట్లాడుతూ ఈవెంట్ మేనేజ్మెంట్ రంగంలోని వివిధ విభాగాల సంస్థలు, వ్యక్తులను ప్రోత్సహించేందుకు టీసీఈఐ ఎక్సలెన్సీ అవార్డులు అందించనున్నట్లు తెలిపారు. ఈ నెల 25న హైటెక్స్లో నిర్వహించే అవార్డు ప్రదానోత్సవంలో పలువురు బాలీవుడ్, టాలీవుడ్ ప్రముఖులు సహ పలువురు సెలబ్రిటీలు పాల్గొంటారని తెలిపారు. ప్రస్తుతం ఈవెంట్ మేనేజ్మెంట్ రంగం దేశవ్యాప్తంగా ప్రతిఏటా 20 శాతం వృద్ధి సాధిస్తోందని, దేశవ్యాప్తంగా 2017లో రూ.6,500 కోట్ల వ్యాపారం నిర్వహించే అవకాశాలు ఉన్నాయని చెప్పారు. హైదరాబాద్లో ఈ ఏడాది దాదాపు రూ. 600 కోట్ల వ్యాపారానికి అవకాశం ఉందన్నారు. -
సీజేఐగా జస్టిస్ ఖేహర్
న్యూఢిల్లీ: దేశ సర్వోన్నత న్యాయస్థానం (సుప్రీంకోర్టు) 44వ ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ)గా జస్టిస్ జగదీష్ సింగ్ ఖేహర్ బుధవారం ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్రపతి భవన్లోని దర్బార్ హాలులో బుధవారం నిర్వహించిన కార్యక్రమంలో ఆయనతో రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ పదవీ స్వీకార ప్రమాణం చేయించారు. 64 ఏళ్ల జస్టిస్ ఖేహర్ ఆంగ్లంలో దేవుని పేరిట ప్రమాణం చేశారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ టీఎస్ ఠాకూర్ పదవీ కాలం జనవరి మూడుతో ముగియడం తెలిసిందే. తన స్థానంలో సుప్రీంకోర్టులో అత్యంత సీనియర్ అయిన జస్టిస్ ఖేహర్ పేరును గత నెలలో జస్టిస్ ఠాకూర్ సిఫార్సు చేయడమూ విదితమే. దేశ చరిత్రలో సిక్కు వర్గానికి చెందిన వ్యక్తి సీజేఐగా బాధ్యతలు చేపట్టడం ఇదే తొలిసారి. ఈ ఏడాది ఆగస్టు 27 వరకు జస్టిస్ ఖేహర్ సీజేఐగా కొనసాగుతారు. జస్టిస్ ఖేహర్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతోపాటు పలువురు కేంద్రమంత్రులు, ఇతర ప్రముఖులు హాజరయ్యారు. పలు కీలక ధర్మాసనాల్లో.. జస్టిస్ ఖేహర్ సుప్రీంకోర్టులో కీలక తీర్పులు వెలువరించిన పలు ధర్మాసనాల్లో పాలుపంచుకున్నారు. జాతీయ జ్యుడీషియల్ నియామకాల కమిషన్(ఎన్జేఏసీ)ను రద్దు చేయడమేగాక.. అత్యున్నత న్యాయ వ్యవస్థలో న్యాయమూర్తుల నియామకం కోసం కొలీజియం వ్యవస్థను పునరుద్ధరిస్తూ తీర్పు చెప్పిన ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనానికి జస్టిస్ ఖేహర్ నేతృత్వం వహించడం తెలిసిందే. -
‘పరిశ్రమ’ నిర్వచనం చెప్పండి..
న్యూఢిల్లీ: ‘పారిశ్రామిక వివాదాల చట్టం–1947’ ప్రకారం పరిశ్రమ (ఇండస్ట్రీ) అనే పదానికి సరైన నిర్వచనం ఏంటో తేల్చే పనిని 9 మంది సభ్యుల ధర్మాసనానికి బదిలీ చేస్తూ ఏడుగురు సభ్యుల సుప్రీంకోర్టు ధర్మాసనం ఆదేశాలిచ్చింది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ టీఎస్ ఠాకూర్ నేతృత్వంలోని ఏడుగురు సభ్యుల ధర్మాసనం..‘బాగా చిక్కుముడులతో కూడిన ఈ అంశాన్ని 9 మంది న్యాయమూర్తుల ధర్మాసనానికి బదిలీ చేస్తున్నాం. ఆ ధర్మాసనాన్ని త్వరలోనే సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి ఏర్పాటు చేస్తారు’అని పేర్కొంది. 1978 నుంచి పరిశ్రమ అనే పదానికి నిర్వచనంపై వివాదం నడుస్తోంది. 1978లో ఏడుగురు సభ్యుల ధర్మాసనం, 1996, 2001ల్లో త్రిసభ్య ధర్మాసనాలు, 2005లో ఐదుగురు సభ్యుల ధర్మాసనం, తాజగా ఏడుగురు సభ్యుల ధర్మాసనం..ఇలా ఈ కేసును ఇప్పటికే పలు ధర్మాసనాలు విచారించాయి. తాజాగా 9 మంది సభ్యుల ధర్మాసనానికి ఇది చేరనుంది. -
దేశానికి సేవ చేయండి
- సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి టీఎస్ ఠాకూర్ - ఘనంగా దామోదరం సంజీవయ్య లా వర్సిటీ స్నాతకోత్సవం సాక్షి, విశాఖపట్నం: న్యాయవాద వృత్తిలోకి వచ్చే ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతతో దేశానికి సేవ చేయాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి టీఎస్ ఠాకూర్ పిలుపునిచ్చారు. కార్పొరేట్ సంస్థలు చూపించే రాయితీలు, ఆఫర్లకు ఆకర్షితులు కావద్దని పేర్కొన్నారు. ఈ వృత్తిలోకి వచ్చేవారికి ఉజ్వల భవిష్యత్ ఉందని, ఆర్థికపరమైన ప్రయోజనాలకు తలొగ్గి కార్పొరేట్ సంస్థల వైపు మొగ్గు చూపితే ఉన్నత స్థాయిని కోల్పోతారన్నారు. దామోదరం సంజీవయ్య న్యాయ విశ్వవిద్యాలయం 2, 3 స్నాతకోత్సవాలు శనివారం విశాఖ పోర్టు కళావాణి ఆడిటోరియంలో ఘనంగా జరిగాయి. స్నాతకోత్సవానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన జస్టిస్ ఠాకూర్ కీలకోపన్యాసం చేశారు. ప్రసంగం ఆయన మాటల్లోనే.. నేడు పరిస్థితులు మారాయి.. దేశంలో న్యాయవిద్య ఆది నుంచి నిర్లక్ష్యానికి గురవుతూనే ఉంది. నేను లా విద్యనభ్యసించిన రోజుల్లో కనీసం తరగతి గదులు కూడా లేవు. నేడు పరిస్థితులు మారాయి. సౌకర్యాలు పెరిగాయి. అవకాశాలు మెండుగా ఉన్నాయి. లా చదివే ప్రతి ఒక్కరూ ప్లేస్మెంట్స్ కోసం ఎదురు చూడడం, కార్పొరేట్ సంస్థలిచ్చే ఆఫర్స్ కోసం ఆసక్తి చూపడం సరికాదు. ప్రతిభావంతులకు రూ.లక్షల జీతాలతో అవకాశాలు వస్తున్నాయి. కానీ ఒకసారి కార్పొరేట్ సంస్థల్లో అడుగుపెడితే నాలుగు గోడలకే పరిమితమైపోతారు. అదే ఎవరైనా సీనియర్ వద్ద పదేళ్లు శిక్షణ పొందితే సుప్రీంకోర్టు వరకు వెళ్లొచ్చు. నైపుణ్యత సంపాదిస్తే న్యాయమూర్తులుగా ఎదిగి చీఫ్ జస్టిస్ పీఠాన్ని అధిరోహించవచ్చు. అక్కడ సౌకర్యాలుండటం లేదు దేశంలో ఏటా 60 వేల మంది లా పట్టాదారులు బయటికొస్తుంటే.. వారిలో కేవలం 2 వేల మంది మాత్రమే వర్సిటీల నుంచి వస్తున్నారు. మిగిలిన 58 వేల మంది ప్రైవేటు లా కళాశాలల నుంచి వస్తున్నారు. అక్కడ పూర్తి స్థాయి న్యాయ విద్యను పొందే సౌకర్యాలుండడం లేదు. లా కళాశాలలు, యూనివర్సిటీలు కూడా పరిశోధన కేంద్రాలుగా అభివృద్ధి చెందాలి. హైకోర్టు ఏర్పాటు చేయాలి: సీఎం స్నాతకోత్సవంలో పాల్గొన్న ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ త్వరితగతిన హైకోర్టు ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోవాలని చీఫ్ జస్టిస్ను కోరారు. అనంతరం 2011–15, 2012–16 సంవత్సరాల మధ్య డిగ్రీ పూర్తి చేసిన వారికి పట్టాలతోపాటు ఈ రెండు బ్యాచ్లలో అత్యుత్తమ ప్రతిభను కనపర్చిన వారికి సుప్రీంకోర్టు సీజే ఠాకూర్, యూనివర్సిటీ చాన్స్లర్, హైకోర్టు సీజే రమేష్ రంగనాథన్, సీఎం తదితరులు పురస్కారాలు ప్రదానం చేశారు. ఏపీ శాసనమండలి చైర్మన్ చక్రపాణికి జస్టిస్ ఠాకూర్ చేతుల మీదుగా డాక్టర్ ఆఫ్ లా ప్రదానం చేశారు. -
తదుపరి సీజేఐగా జస్టిస్ ఖేహర్
కేంద్రానికి లేఖ రాసిన ప్రస్తుత సీజేఐ జస్టిస్ ఠాకూర్ - జనవరి 4న ప్రమాణం.. 44వ ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు - పలు కీలక తీర్పుల్లో భాగస్వామ్యం - ఆగస్టు 27 వరకు ఆ పదవిలో కొనసాగనున్న ఖేహర్ న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు తదుపరి ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ)గా జస్టిస్ జగదీష్సింగ్ ఖేహర్ బాధ్యతలు చేపట్టనున్నారు. న్యాయమూర్తుల నియామకం కోసం తెచ్చిన వివాదాస్పద జాతీయ న్యాయ నియామకాల కమిషన్ (ఎన్జేఏసీ) చట్టాన్ని కొట్టివేస్తూ సంచలన తీర్పు ఇచ్చిన ఐదుగురు జడ్జిల రాజ్యాంగ ధర్మాసనానికి ఆయనే నేతృత్వం వహించారు. ప్రస్తుత ప్రధాన న్యాయమూర్తి టీఎస్ ఠాకూర్ పదవీకాలం వచ్చే జనవరి 3న ముగుస్తుంది. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టులో అందరికంటే సీనియర్ అరుున జస్టిస్ ఖేహర్ను ఆ పదవిలో నియమించాలంటూ జస్టిస్ ఠాకూర్ మంగళవారం కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాశారు. జస్టిస్ ఖేహర్ జనవరి 4న ప్రమాణం చేసి 44వ సీజేఐగా బాధ్యతలు స్వీకరిస్తారు. దాదాపు 8 నెలలపాటు అంటే ఆగస్టు 27 వరకు ఆయన ఈ పదవిలో కొనసాగుతారు. దేశ చరిత్రలో సిక్కువర్గానికి చెందిన వ్యక్తి సీజేఐగా బాధ్యతలు చేపట్టనుండటం ఇదే తొలిసారి కావడం విశేషం. పలు ధర్మాసనాలకు నేతృత్వం.. జస్టిస్ ఖేహర్ సుప్రీంకోర్టులో పలు ధర్మాసనాలకు నేతృత్వం వహించారు. పలు కీలక తీర్పుల్లో భాగస్వామ్యం పంచుకున్నారు. ఎన్జేఏసీ కేసును విచారించిన ధర్మాసనానికి నేతృత్వం వహించడంతోపాటు గత జనవరిలో అరుణాచల్ప్రదేశ్లో రాష్ట్రపతి పాలనను రద్దుచేసిన ధర్మాసనానికి కూడా ఆయనే నేతృత్వం వహించడం గమనార్హం. అలాగే సహారా చీఫ్ సుబ్రతారాయ్ను జైలుకు పంపిన కేసును విచారించిన ధర్మాసనంలోనూ ఆయన పాలుపంచుకున్నారు. ఇటీవల ఒకేరకమైన పనికి ఒకే వేతనం ఉండాలంటూ కాంట్రాక్టు ఉద్యోగుల కేసులో కీలక తీర్పిచ్చిన ధర్మాసనానికీ ఆయన నేతృత్వం వ్యవహరించారు. ఇటీవల అటార్నీ జనరల్ ముకుల్ రోహత్గీ వ్యాఖ్యలకు స్పందనగా, న్యాయవ్యవస్థకు లక్ష్మణరేఖ ఉందంటూ జస్టిస్ ఖేహర్ చెప్పడంతో.. జడ్జిల నియామకంపై న్యాయ, కార్యనిర్వాహక వ్యవస్థల మధ్య ఉన్న విభేదాలు మరోసారి ప్రస్ఫుటమయ్యారుు. 2జీ స్పెక్ట్రమ్ కుంభకోణం కేసు నేపథ్యంలో అన్ని సహజ నవరులను వేలం ద్వారానే విక్రరుుంచాలంటూ తీర్పు ఇచ్చిన ఐదుగురు జడ్జిల ధర్మాసనంలోనూ జస్టిస్ ఖేహర్ భాగస్వామిగా ఉన్నారు. అలాగే ఏ సహజ వనరును కూడా చారిటీ, విరాళం పేరుతో ప్రైవేటుకు ధారాదత్తం చేయకూడదంటూ ఈ కేసులో ఆయన విడిగా రాసిన తీర్పులో స్పష్టంచేశారు. సహజ వనరులను దుర్వినియోగం చేయకూడదన్నారు. అంచెలంచెలుగా... పలు ధర్మాసనాల్లో భాగస్వామిగా ఉన్న జస్టిస్ ఖేహర్.. అవినీతి కేసులో ఆరోపణలున్న కర్ణాటక హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ పీడీ దినకరన్ను పదవి నుంచి తప్పించేందుకు రాజ్యసభ నియమించిన విచారణ కమిటీకి చైర్మన్గానూ పనిచేశారు. ఆయన సెప్టెంబర్ 13, 2011న సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పదోన్నతి పొందారు. అంతకుముందు జస్టిస్ ఖేహర్ కర్ణాటక హైకోర్టు చీఫ్ జస్టిస్గా చేశారు. ఉత్తరాఖండ్ హైకోర్టు చీఫ్ జస్టిస్గా, పంజాబ్-హరియాణా హైకోర్టు తాత్కాలిక ప్రధానన్యాయమూర్తిగానూ చేశారు. ఫిబ్రవరి 8, 1999న పంజాబ్-హరియాణా హైకోర్టు జడ్జిగా నియమితులయ్యారు. ఆగస్టు 28, 1952న జన్మించిన ఆయన పంజాబ్ వర్సిటీ నుంచి ఎల్ఎల్ఎం పట్టా పొంది 1979లో న్యాయవాదిగా నమోదుచేసుకున్నారు. 1992 జనవరిలో పంజాబ్ అదనపు అడ్వొకేట్ జనరల్గా, ఆ తర్వాత చండీగఢ్ సీనియర్ స్టాండింగ్ కౌన్సెల్గా చేశారు. 1995 ఫిబ్రవరిలో సీనియర్ అడ్వొకేట్ హోదా పొందారు. పలు యూనివర్సిటీలు, కార్పొరేట్ సంస్థలు, పలు కంపెనీలు, సహకార సంస్థలకు న్యాయవాదిగా ఉన్నారు.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
పేమెంట్స్ బ్యాంకులకు ఉజ్వల భవిష్యత్తు!
మేఘాలయలో హిట్లర్ను అరెస్టు చేసిన కెన్నెడీ?
మీ ఆశీర్వాదంతో విజయం సాధిస్తాం
పేదింట విషాదం
నూకాంబిక అమ్మవారి బాలాలయానికి పోటెత్తిన భక్తులు
రమేష్ రౌడీయిజంతో జల్లా ప్రజల్లో భయభ్రాంతులు
ఎన్. గజపతినగరంలో టీడీపీకి గట్టి షాక్
ప్రధాని మోదీ పర్యటన సందర్భంగా ట్రాఫిక్ మళ్లింపు
జగన్ మళ్లీ సీఎం కావడం తథ్యం
‘చేనేత’ను ఆదుకున్నది జగన్ ప్రభుత్వమే
తప్పక చదవండి
- ట్రాక్టర్ అదుపు తప్పి..కాలువలోకి దూసుకెళ్లి..
- Today Telugu Horoscope: ఈ రాశివారికి పేరుప్రతిష్ఠలు పెరుగుతాయి
- గుండె ఘోష విన్నారు..
- ఏ1 చంద్రబాబు, ఏ2 లోకేశ్
- నిప్పుతో చెలగాటమా!
- రవీంద్రజాలం... జడేజా ఆల్రౌండ్ షో
- మంచి మాట: నోరు మంచిదైతే...
- జగన్ మళ్లీ ఎందుకు గెలుస్తారంటే...
- ఇలాగేనా మాట్లాడేది?
- జ్వరంతో బాధపడుతున్నారు.. అయినా అదరగొట్టారు: రుతురాజ్
Advertisement