-
శాన్వికకు సీఎం జగన్ ఆపన్నహస్తం.. కలెక్టర్ దినేష్కుమార్కు ఆదేశాలు
దర్శి: ప్రకాశం జిల్లా దర్శి పట్టణానికి చెందిన తలసేమియా బాధిత బాలికకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆపన్నహస్తం అందించారు. దర్శిలో మంగళవారం జరిగిన ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్ కుమారుడి రిసెప్షన్ వేడుకలకు హాజరైన ముఖ్యమంత్రి నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఈ సందర్భంగా పట్టణంలోని గాంధీనగర్కు చెందిన నిషితకుమారి ఏకైక సంతానం అయిన ఎనిమిదేళ్ల బసవనాట శాన్విక అనారోగ్య పరిస్థితిని స్థానికులు, నాయకులు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. శాన్విక తలసేమియాతో బాధపడుతోందని, నెలకు రెండుసార్లు రక్త మార్పిడి చేయించాల్సి వస్తోందని చెప్పారు. నెలకు రూ.12 వేలకుపైగా ఖర్చవుతున్నట్లు తెలిపారు. ఓ నెగిటివ్ గ్రూపు రక్తం దొరకటం కూడా కష్టంగా ఉందన్నారు. పాపకు బోన్మ్యారో (ఎముక మజ్జ) చికిత్స చేయించాలని, అందుకు దాదాపు రూ.30 లక్షల వరకు ఖర్చవుతుందని వైద్యులు చెప్పినట్లు సీఎంకు తెలిపారు. గ్రామ సచివాలయంలో వెటర్నరీ అసిస్టెంట్గా పనిచేస్తున్నానని, సుమారు ఆరేళ్ల కిందట తన భర్త తనను పట్టించుకోకుండా వదిలేసి ఇంటినుంచి వెళ్లిపోయాడని బాలిక తల్లి నిషితకుమారి చెప్పారు. తన ఉద్యోగంతో కుటుంబాన్ని పోషించుకుంటున్నానని, లక్షలు ఖర్చు పెట్టి వైద్యం చేయించే స్థోమత లేదని ప్రభుత్వం తరఫున ఆదుకోవాలని ముఖ్యమంత్రిని కోరారు. ప్రస్తుతం తల్లిదండ్రుల వద్ద ఉంటున్నానని, వారి పోషణ బాధ్యత కూడా తానే చూసుకుంటున్నానని తెలిపారు. చిన్నారి శాన్వికతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రత్యే కంగా మాట్లాడారు. అధైర్యపడవద్దని, ప్రభుత్వం తరఫున సహాయం చేస్తామని బాధితురాలి కుటుంబానికి ధైర్యం చెప్పారు. అవసరమైన ప్రక్రియ వెంటనే ప్రారంభించాలని కలెక్టర్ దినేష్కుమార్ను ఆదేశించారు. జగనన్నకు జీవితాంతం రుణపడి ఉంటాం పాపే నాకు ప్రాణం.. నా పాపకు ప్రాణం పోస్తానన్న సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి నేను జీవితాంతం రుణ పడి ఉంటా. నువ్వు బాధపడకు.. నేను చూసుకుంటానని ఆయన నాకు భరోసా ఇచ్చారు. వెంటనే నా పాపకు వైద్యం చేయించాలని అధికారులను ఆదేశించారు. మధ్యాహ్నం కల్లా సీఎం క్యాంప్ కార్యాలయం నుంచి, కలెక్టర్ దినేష్కుమార్ నుంచి, తహశీల్దార్ కార్యాలయం నుంచి ఫోన్లు చేసి పాప వివరాలు తీసుకున్నారు. నా పాపకు ప్రాణం పోస్తున్నారు. నాకెంతో సంతోషంగా ఉంది. – నిషితకుమారి, శాన్విక తల్లి దర్శి పర్యటనలో సీఎంను కలిసిన చిన్నారి శాన్విక, తల్లిదండ్రులు. తలసేమియాతో బాధపడుతున్న శాన్వికకు వైద్యం అందించాలని అధికారులను ఆదేశించిన సీఎం. pic.twitter.com/LoI5tSCegA — CMO Andhra Pradesh (@AndhraPradeshCM) December 20, 2022 -
సీఎం జగన్ను అడిగిన 6 రోజుల్లోనే వైద్యానికి రూ.12లక్షలు
సాక్షి, అమలాపురం టౌన్: పట్టణంలోని నారాయణపేటకు చెందిన 9 ఏళ్ల దంగేటి జశ్వంత్ తలసేమియా వ్యాధితో బాధపడుతున్న పరిస్థితిపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తక్షణమే స్పందించి తొలి విడతగా రూ.12 లక్షలను గురువారం మంజూరు చేశారు. జశ్వంత్ శస్త్ర చికిత్సకు రూ.21 లక్షలు ఖర్చువుతుందని, అంత ఖర్చు భరించే స్తోమత ఆ కుటుంబానికి లేదని, మీరే ఆదుకోవాలని ఈ నెల 4న తూర్పుగోదావరి జిల్లా పర్యటనకు వచ్చిన ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి దృష్టికి సెంట్రల్ డెల్టా బోర్డు చైర్మన్ కుడుపూడి బాబు తీసుకుని వెళ్లిన సంగతి తెలిసిందే. చలించిన ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి తక్షణమే సంబంధిత అధికారులను చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కుడుపూడి బాబు సీఎం దృష్టికి ఈ విషయాన్ని తీసుకుని వెళ్లిన మర్నాడే తాడేపల్లి సీఎం కార్యాలయం నుంచి ఒక ప్రతినిధి అమలాపురంలోని రోగి జశ్వంత్ ఇంటికి వెళ్లి అతని వైద్య రికార్డులను పరిశీలించి వెళ్లారు. జశ్వంత్ తండ్రి కనకరాజును తాడేపల్లికి గురువారం వచ్చి సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి మంజూరు చేసిన రూ.12 లక్షల చెక్ను తీసుకుని వెళ్లాలని వర్తమానం వచ్చిది. కనకరాజు గురువారం తాడేపల్లి వెళ్లి ఆ చెక్ను తీసుకున్నారు. హైదరాబాద్లోని అమెరికన్ అంకాలజీ ఇనిస్టిట్యూట్ కేన్సర్ సెంటరు పేర చెక్ ఇచ్చారు. మిగిలిన రూ.9 లక్షలను జశ్వంత్కు శస్త్ర చికిత్స అయిన తర్వాత ఆ ఆస్పత్రి ఇచ్చిన పత్రాలకు అనుగుణంగా మంజూరు చేస్తామని అక్కడి అధికారులు తెలిపారు. సీఎంకు జశ్వంత్ కుటుంబీకులు, కుడుపూడి బాబు కృతజ్ఞతలు తెలిపారు. చదవండి: (అన్ని విధాల మైనార్టీలకు న్యాయం చేస్తున్నాం: సీఎం జగన్) -
తలసీమియా బాధిత చిన్నారికి హెచ్ఐవీ పాజిటివ్.. అసలేం జరిగిందంటే..
సాక్షి, హైదరాబాద్: తలసీమియాతో బాధపడుతున్న తమ మూడేళ్ల కుమారుడికి ఓ బ్లడ్ బ్యాంక్లో రక్తం ఎక్కించడంతో(బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్) హెచ్ఐవీ పాజిటివ్ వచ్చిందని, దీనికి కారణమైన బ్లడ్ బ్యాంక్పై చర్యలు తీసుకోవాలంటూ సదరు బాలుడి తండ్రి నల్లకుంట పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సీఐ మొగిలిచర్ల రవి కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. రంగారెడ్డి జిల్లా, రాంపల్లి గ్రామానికి చెందిన వ్యక్తికి మూడేళ్ల కుమారుడు ఉన్నాడు. పుట్టిన సమయంలో బాలుడిని పరీక్షించిన నిలోఫర్ వైద్యులు తలసేమియాతో బాధ పడుతున్నట్లు తెలిపారు. వైద్యుల సూచన మేరకు బాలుడికి గత రెండున్నరేళ్లుగా విద్యానగర్ అచ్యుతా రెడ్డి మార్గ్లోని రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్లో రక్తం ఎక్కిస్తున్నారు. ఈ క్రమంలో గత నెల 20న కూడా అతడికి రక్తం ఎక్కించారు. ఆ తర్వాత ఓ ఆస్పత్రిలో బాలునికి రక్త పరీక్షలు చేయించగా హెచ్ఐవీ పాజిటివ్ అని తేలింది. అనుమానంతో మరో ఆస్పత్రిలో రక్త పరీక్షలు చేయించగా అక్కడ అదే ఫలితం రావడంతో ఆందోళన చెందిన తల్లిదండ్రులు రెండు ఆస్పత్రుల్లోనూ రక్త పరీక్షలు చేయించుకోగా వారికి నెగిటివ్ అని వచ్చింది. ఈ విషయమై సదరు బ్లడ్ బ్యాంక్ వైద్యులను ప్రశ్నించగా తాము అన్ని రకాల పరీక్షలు చేసిన తర్వాతే దాతల నుంచి రక్తం సేకరిస్తామని చెప్పారు. తమ వద్ద ఎలాంటి పొరపాటు జరగలేదన్నారు. దీంతో బాధిత బాలుడి తండ్రి నల్లకుంట పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సోమవారం సాయంత్రం కేసు నమోదు చేసుకున్న పోలీసులు సదరు బ్లడ్ బ్యాంక్ నుంచి రికార్డులు తెప్పించి దర్యాప్తు చేస్తున్నారు. రక్తం ఎక్కించుకుంటున్న వారిలో ఆందోళన ఇదిలా ఉండగా గత రెండేళ్లుగా రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్లో రక్తం ఎక్కించుకున్న వారు ఆందోళన చెందుతున్నారు. తమకు హెచ్ఐవీ సోకిందేమోననే అనుమానంతో వారు ల్యాబ్లకు పరుగులు తీస్తూ రక్త పరీక్షలు చేయించుకుంటున్నారని సమాచారం. ఎలాంటి పొరపాటు జరుగలేదు రక్తం సేకరించే ముందు దాతలకు అన్ని రకాల పరీక్షలు నిర్వహించిన తర్వాతే రక్తం సేకరిస్తాం. మా బ్లడ్ బ్యాంక్లో 20 పడకల ఆస్పత్రి ఉంది. తలసీమియా బాధితులకు ఉచితంగా రక్తం ఎక్కిస్తాం. గత రెండున్నరేళ్లలో బాధిత బాలుడికి బ్లడ్ బ్యాంక్ ఆస్పత్రిలో 42 సార్లు రక్తం ఎక్కించాం. ఈ క్రమంలో గత నెలలో బాలుడిని పరీక్షించి హెచ్ఐవీ సోకిందని అతడి తండ్రికి ముందే చెప్పాం. బాలుడికి హెచ్ఐవీ సోకడంలో తమ బ్లడ్ బ్యాంక్ తప్పిదం ఏమీ లేదు. హెచ్ఐవీ సోకిన వారిలో విండో పీరియడ్ ఉంటుంది, ఆ విండో పీరియడ్ తర్వాతనే వ్యాధి నిర్ధారణ అవుతుంది. బ్లడ్ బ్యాంక్ ఆస్పత్రి రికార్డులు పూర్తిగా నల్లకుంట పోలీసులకు చూపించాం. – డాక్టర్ పిచ్చి రెడ్డి, రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ సొసైటీ డైరెక్టర్ -
8 ఏళ్లకే 87 సార్లు రక్తం ఎక్కించారు..
సాక్షి, అలంపూర్: ఆ బాలుడి వయస్సు కేవలం ఎనిమిదేళ్లే.. కానీ, మాయదారి జబ్బు సోకడంతో జీవితానికి ఎదురీదుతున్నాడు.. రక్తపిపాసి తలసేమియా సోకడంతో ఇప్పటికే 87 సార్లు రక్తం ఎక్కించారు.. వ్యాధి శాశ్వత నివారణకు ఆపరేషన్ చేయాల్సిందేనని వైద్యులు తేల్చిచెప్పారు. దీంతో తల్లిదండ్రులు నిరుపేదలు కావడంతో ఆపన్నహస్తం కోసం ఎదురుచూస్తున్నారు. మొదటి సంతానమే.. జోగుళాంబ గద్వాల జిల్లా రాజోళి మండలం మాన్దొడ్డికి చెందిన భాస్కర్, లక్ష్మీదేవిల మొదటి సంతానంగా జన్మించిన హేమంత్కుమార్కు పుట్టుకతోనే తలసేమియా వ్యాధి ఉంది. ఈ వ్యాధి ఉండటం వల్ల శరీరంలో రక్తం పెరగదు. దీంతో తల్లిదండ్రులు బాబుకు ఏడాదిన్నర వయస్సు నుంచి వైద్యుల సూచన మేరకు నిర్ణీత రోజులకొకసారి రక్తం ఎక్కిస్తున్నారు. ఇప్పటికే ఆ చిన్నారి బాబుకు 87 సార్లు రక్తం ఎక్కించారు. ఇలా ఎక్కువగా రక్తం ఎక్కించడం వల్ల శరీరంలోని ప్రతి అవయవంలో ఐరన్ ఎక్కువవుతుందని వైద్యులు చెబుతున్నారు. ఇప్పటికే బాబుకు అవయవాల్లో ఐరన్ ఎక్కువ కావడంతో, దాని కోసం కూడా మందులు వాడుతున్నారు. బాబు కోసం గ్రామం వదిలి.. తమ కొడుకును కాపాడుకునేందుకు తల్లిదండ్రులు మారుమూల గ్రామం మాన్దొడ్డి నుంచి జడ్చర్లకు తమ నివాసాన్ని మార్చారు. తండ్రి భాస్కర్ ప్రైవేట్ కంపెనీలో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్నాడు. ఆస్పత్రిలో వైద్యం తీసుకునేందుకు, హైదరాబాద్ వెళ్లేందుకు కూడా ఇక్కడి నుంచి దగ్గరవుతుందని జడ్చర్లలోనే ఉంటున్నామని బాలుడి తల్లిదండ్రులు వాపోతున్నారు. బాబు ఎదుర్కొంటున్న ఆరోగ్య సమస్యకు ఆపరేషన్ ద్వారా శాశ్వత పరిష్కారం లభిస్తుందని, అందుకు రూ.10 లక్షల అవసరం కాగా.. ఇప్పటికే ఎంతో ఖర్చు చేశామని, కడుపు కట్టుకుని రూ.2 లక్షలు పోగు చేసుకున్నామని, మిగతా డబ్బును దాతలు ఎవరైనా అందిస్తే తమ కుమారుడికి నిండు జీవితాన్ని అందించినవారవుతారని విజ్ఞప్తి చేస్తున్నారు. బాధిత కుటుంబానికి సహాయం చేయదలిచిన వారు 8985548806 గూగుల్ పే నంబర్ ద్వారా, స్టేట్ బ్యాంక్ అకౌంట్ నంబర్ 32383343535 శాంతినగర్ శాఖ ద్వారా కానీ సహాయం చేయాలని, పూర్తి వివరాలకు సెల్ నం. 85550 40715ను సంప్రదించాలని హేమంత్ తల్లిదండ్రులు కోరుతున్నారు. -
రక్తదానం..నిలుపుతోంది ప్రాణం
చార్మినార్: తలసేమియా వ్యాధితో బాధపడుతున్న చిన్నారులను ఆదుకోవాల్సిన అవసరముంది. అటు ప్రభుత్వంతో పాటు స్వచ్ఛంద సంస్థలు విరివిరిగా ముందుకొచ్చి సహాయ సహకారాలను అందజేయాలని తలసేమియా చిన్నారుల తల్లిదండ్రులు కోరుతున్నారు. ఇప్పటికే కొన్ని స్వచ్ఛంద సంస్థలు ముందుకొచ్చి తమ సంస్థల ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాలను ఏర్పాటు చేసి అవసరమైన మేరకు రక్తాన్ని అందజేస్తున్నారు. తలసేమియా చిన్నారులను ఆదుకోవడానికి రక్తదాతలు స్వచ్ఛందంగా ముందుకు రావాల్సిన అవసరముంది. పండుగలు, పర్వదినాలు, శుభకార్యాలప్పుడు తమ రక్తాన్ని స్వచ్ఛందంగా దానం చేయడానికి ముందుకొచ్చినప్పుడు తలసేమియా చిన్నారులను ఆదుకోవడానికి వీలు పడుతుంది. అంతేకాకుండా వేసవిలో స్వచ్చందంగా రక్తదానం చేయడానికి యువతీ యువకులు ముందుకు రావాల్సిన అవసరముంది. తలసేమియాతో బాధపడే చిన్నారులకు తలసేమియా అండ్ సికిల్ సెల్ సొసైటీ, బ్లడ్ బ్యాంక్ అవసరమైనప్పుడల్లా ఉచితంగా రక్తం అంది స్తోంది. రక్తం ఎక్కించుకోవడానికి (బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్) దిక్కు తోచని స్థితిలో ఉన్న బాధితులను సొసైటీ ఆదుకుని ఆపన్న హస్తం అందిస్తోంది. రక్తంలో ఎర్రరక్త కణాలు క్షీణించడంతో... రక్తంలో ఎర్రరక్త కణాలు క్షీణించడంతో తలసేమియా వ్యాధి సోకుతుంది. పుట్టినప్పటి నుంచే చిన్నారులకు ఈ వ్యాధి వస్తుండటంతో వ్యాధిగ్రస్తులతో పాటు వారి కుటుంబ సభ్యులు నరకయాతన అనుభవిస్తున్నారు. క్రమం తప్పకుండా బ్లడ్ ట్రాన్స్ప్యూజన్ (రక్తం ఎక్కించుకోవడం) జరిగితే తప్పా... చిన్నారులు బతకలేని దుర్భర పరిస్థితులు నెలకొన్నాయి. ఎంతోమంది పేద చిన్నారులు తలసేమియా వ్యాధితో బాధపడుతున్నారు. వీరందరికి రక్తంతో పాటు ఆర్థిక అవసరాలు రోజు రోజుకు పెరుగుతున్నాయి. మానవతా ధృక్పథంతో యువత ముందుకొచ్చి తలసేమియా చిన్నారులను ఆదుకోవాల్సిన అవసరముంది. పిల్లలకు ఈ వ్యాధి వారసత్వంగా ఎలా సంక్రమిస్తుందంటే.. ♦ తల్లిదండ్రుల్లో ఒకరు తలసేమియా క్యారియర్ కలిగి ఉంటే, 50 శాతం వారి పిల్లలు తలసేమియా క్యారియర్గా ఉంటారు. 50 శాతం ఏ వ్యాధి లేకుండా మాములుగా ఉంటారు. ♦ తల్లిదండ్రులిద్దరూ తలసేమియా క్యారియర్స్ అయితే పిల్లల్లో 25 శాతం సాధారణమైన వారు, 50 శాతం క్యారియర్స్, 25 శాతం తలసేమియా వ్యాధి గ్రస్తులుంటారు. ♦ తల్లిదండ్రుల్లో ఒకరు తలసేమియా వ్యాధి, ఇంకొకరు క్యారియర్గా ఉంటే వారి పిల్లలు 50 శాతం క్యారియర్, 50 శాతం తలసేమియా వ్యాధిగ్రస్తులవుతారు. ♦ తల్లిదండ్రులిద్దరూ తలసేమియా వ్యాధితో బాధపడుతుంటే.... వారి పిల్లలు 100 శాతం తలసేమియా వ్యాధిగ్రస్తులవుతారు. చిన్నారుల జీవితాలను కాపాడడానికి... చిన్నారుల జీవితాలను కాపాడడానికి తలసేమియా అండ్ సికిల్ సెల్ సొసైటీ బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్, బ్లడ్ బ్యాంక్లను ఏర్పాటు చేసింది. సొసైటీ సభ్యులు చిన్నారుల జీవిత కాలాన్ని పెంచే ప్రయత్నం చేస్తున్నారు. కేవలం హైదరాబాద్ నగరంలోని చిన్నారులే కాకుండా రాష్ట్రంలోని ఇతర జిల్లాల నుంచి ఇక్కడికి వస్తుంటారు. మూడు వారాలకొకసారి రక్తం ఎక్కించుకోవాల్సి ఉంటుంది. ఇందుకోసం ఎన్నో ఇబ్బందులను తట్టుకుని చిన్నారుల తల్లిదండ్రులు శివరాంపల్లిలోని ఎన్పీఏ దగ్గరలోని కార్యాలయానికి చేరుకుంటున్నారు. సకాలంలో బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ జరగకపోతే...చిన్నారుల ప్రాణాలకు ముప్పు ఏర్పడుతుంది. తలసేమియాతో బాధపడే చిన్నారులను రక్షించడానికి సొసైటీ కృషి చేస్తోంది. తలసేమియా వ్యాధి నుంచిచిన్నారులను రక్షించడానికి.. ♦ పెళ్లికి ముందు వధువు, వరుడు హెచ్బీఏ2 పరీక్ష ద్వారా వ్యాధి రోగ నిర్ధారణ చేయించుకోవాలి. ♦ ఏదైనా కుటుంబంలో ఎవరైన తలసేమియా వ్యా«ధి కలిగి ఉన్నట్లయితే... ఆ కుటుంబంలోని సభ్యులందరూ హెచ్బీఏ2 రోగ నిర్ధారణ రక్త పరీక్ష చేయించుకోవాలి. ♦ తలసేమియా వ్యాధికి ఒక వ్యక్తి రోగ నిర్ధారణ అనుకూలంగా ఉంటే వెంటనే డాక్టర్ను సంప్రదించాలి. ♦ గర్భిణీలు హెచ్బీఏ2 పరీక్ష చేయించుకోవాలి. ♦ గర్భధారణ సమయంలో మద్యపానం, ధూమపానం చేయరాదు.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
Lok Sabha Election 2024: యాదవ భూమిలో ఎస్పీకి అగ్నిపరీక్ష
పీఠమెక్కేదెవరో..?
మెరుగైన వైద్యసేవలు అందించాలి
ఉచిత శిక్షణను సద్వినియోగం చేసుకోవాలి
బాబు మట్టికొట్టుకు పోతాడు
● పెన్షన్ డబ్బుల కోసం పండుటాకుల కష్టాలు ● బ్యాంకు చుట్టూ తప్పని ప్రదక్షిణలు ● ఆటోల్లో తిరగలేక నీరసిస్తున్న వృద్ధులు ● మండే ఎండల్లో అభాగ్యుల ముప్పుతిప్పలు ● ఎంత పనిచేశావు చంద్రబాబూ అంటూ కన్నీరుపెడుతున్న అవ్వాతాతలు
● ఆగమోక్తం..భాష్యకారుల ఉత్సవం
పేదల ప్రభుత్వాన్ని ఆశీర్వదించండి
మాపై ఎందుకంత కక్ష
నేడు పలమనేరుకుసీఎం వైఎస్ జగన్
తప్పక చదవండి
- వైఎస్ భాస్కర్రెడ్డికి బెయిల్
- పట్టభద్రుల ఎమ్మెల్సీ బీఆర్ఎస్ అభ్యర్థిగా ఏనుగుల రాకేశ్రెడ్డి
- దశ దిశ మార్చే విజన్ అంటే ఇదే కదా!
- రేవంత్ ప్రచారం చేయకుండా నిషేధించాలి
- నేడు 4 చోట్ల సీఎం రేవంత్ ప్రచారం
- వరల్డ్కప్కు వెస్టిండీస్ జట్టు ప్రకటన.. విధ్వంసకర ఆటగాళ్లకు ఛాన్స్
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన టాలీవుడ్ స్టార్ హీరోయిన్
- ICC: నంబర్ వన్గా ఆసీస్.. అందులో మాత్రం టీమిండియానే టాప్
- కోర్టు పెండింగ్లో ఉన్న కేసు గురించి ఎలా మాట్లాడతారు?
- మద్యం పాలసీ కేసు.. మనీష్ సిసోడియాకు ఊరట
Advertisement