-
బ్రిటన్ అమెరికా దాడులు
వాషింగ్టన్: హౌతీ ఉగ్రవాద ముఠాపై అమెరికా, బ్రిటన్ విరుచుకుపడ్డాయి. మిలిటెంట్ల ఆవాసాలు, ఆయుధాగారాలపై ఆ దేశాల సంయుక్త దళాలు గురు, శుక్రవారాల్లో భారీగా బాంబు దాడులు జరిపాయి. యుద్ధ నౌకలు, జలాంతర్గాములు, ఫైటర్ జెట్ల ద్వారా ఏకకాలంలో తోమహాక్ క్షిపణులు తదితరాలు ప్రయోగించి పలు లక్ష్యాలను ఛేదించినట్టు అమెరికా అధికార వర్గాలు తెలిపాయి. వీటిలో యెమన్ రాజధాని సనా, ఎర్రసముద్రంలో హౌతీల కంచుకోట హుదాయ్దా వంటివి కూడా ఉన్నట్టు వివరించాయి. అక్కడి తీర ప్రాంత రాడార్ సైట్లతో పాటు డ్రోన్, మిసైళ్ల నిల్వ, ప్రయోగ కేంద్రాలను తాజా దాడుల్లో ధ్వంసం చేసినట్టు ప్రకటించాయి. ఎర్రసముద్రంలో ఉగ్ర మూకల దాడులను సహించబోమనేందుకు ఈ దాడులు తాజా రుజువని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ పేర్కొన్నారు. ఎర్రసముద్రంలో అంతర్జాతీయ రవాణా నౌకలపై హౌతీల మతిలేని దాడికి చరమగీతం పాడి తీరతామన్నారు. అందుకోసం మరిన్ని తీవ్ర చర్యలకు కూడా వెనకాడబోమని ఆయన స్పష్టం చేశారు. ‘‘చరిత్రలోనే తొలిసారిగా యాంటీ షిప్ బాలిస్టిక్ మిసైళ్లను హౌతీలు ప్రయోగిస్తున్నారు. ఇది అంతర్జాతీయ వర్తకానికి, నౌకలకు, నావికులకే గాక అమెరికా రక్షణ సిబ్బందికి కూడా ప్రమాదకరంగా మారింది’’ అంటూ మండిపడ్డారు. పరిస్థితులు ఉద్రిక్తం సనాలో శుక్రవారం తెల్లవారుజామున కనీసం నాలుగు భారీ పేలుళ్లు సంభవించాయని స్థానిక జర్నలిస్టులు వెల్లడించారు. నగర పశి్చమాన రేపు ప్రాంతంలో కూడా ఐదుకు పైగా భారీ పేలుళ్లు జరిగినట్టు చెబుతున్నారు. అక్కడికి దక్షిణాన ఉన్న తైజ్, ధమర్ వవంటి నగరాలపై కూడా దాడులు జరిగాయని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. అమెరికా హెచ్చరికల నేపథ్యంలో కొద్ది రోజుల పాటు దాడులకు దూరంగా ఉన హౌతీలు గత మంగళవారం ఉన్నట్టుండి భారీగా విరుచుకుపడటం తెలిసిందే. ఎర్రసముద్రంలోని నౌకలపైకి పెద్ద సంఖ్యలో క్షిపణులు ప్రయోగించాయి. అమెరికా, బ్రిటన్ యుద్ధ నౌకలు, ఫైటర్ జెట్లు తక్షణం స్పందించాయి. 18 డ్రోన్లను, రెండు మిసైళ్లు, ఒక యాంటీ షిప్ మిసైల్ను నేలకూల్చాయి. గురువారం కూడా గల్ఫ్ ఆఫ్ ఏడెన్లో ఒక నౌకపైకి హౌతీలు షిప్ విధ్వంసక బాలిస్టిక్ మిసైల్ను ప్రయోగించారు. అది గురి తప్పడంతో భారీ నష్టం తప్పింది. దాంతో పరిస్థితిపై మంగళవారమే బైడెన్ అత్యవసర సమీక్ష జరిపారు. హౌతీలపై దాడులను తీవ్రతరం చేయాల్సిందిగా ఆదేశాలిచ్చారు. మరోవైపు బ్రిటన్ రాయల్ ఎయిర్ఫోర్స్ కూడా హౌతీలపై పెద్దపెట్టున దాడులు జరిపిందని ప్రధాని రిషీ సునాక్ ప్రకటించారు. తమ సంయుక్త దాడులకు నెదర్లాండ్స్, కెనడా, బెహ్రయిన్ దన్నుగా నిలిచాయన్నారు. దాడులకు స్వస్తి పలకాలని ఆ్రస్టేలియా, డెన్మార్క్, జర్మనీ, నెదర్లాండ్స్, బహ్రయిన్, న్యూజిలాండ్, దక్షిణ కొరియా తదితర దేశాలు కూడా ఇప్పటికే హౌతీలను హెచ్చరించాయి. ఎర్రసముద్రంలో నౌకల భద్రత నిమిత్తం 22 దేశాలతో కలిసి ‘ఆపరేషన్ ప్రాస్పరిటీ గార్డియన్’ పేరిట కొత్త సముద్ర రక్షణ మిషన్కు అమెరికా తాజాగా తెరతీసింది. ఇందులో భాగంగా నౌకల రక్షణార్థం అమెరికా తదితర దేశాల యుద్ధ నౌకలు ఎర్రసముద్ర జలాల్లో నిరంతరం గస్తీ కాస్తున్నాయి. -
అమెరికన్లంటే ద్వేషం.. తెరపైకి అల్ఖైదా కొత్త చీఫ్ పేరు!
న్యూయార్క్: నిషేధిత ఉగ్రసంస్థ అల్ఖైదా చీఫ్ అయ్మన్ అల్ - జవహిరి(71)ని.. ఎట్టకేలకు మట్టుపెట్టగలిగింది అమెరికా. అఫ్గనిస్థాన్ రాజధాని కాబూల్ ఇంటిలోనే డ్రోన్ స్ట్రయిక్ ద్వారా అతన్ని నేల కూల్చింది. గతంలో పాక్ భూభాగంలో అల్ ఖైదా ‘ఎమిర్’(చీఫ్ కమాండర్) బిన్లాడెన్ను ఎలాగైతే మట్టుపెట్టిందో.. ఇప్పుడు ఆ తర్వాతి చీఫ్ను సైతం పక్కా దాడితో మట్టుపెట్టి.. ఉగ్ర సంస్థకు నాయకత్వం లేకుండా చేసింది. అయితే.. అమెరికా డ్రోన్ దాడిలో అల్ ఖైదా నాయకుడు హతమై కొన్నిగంటలు గడవక ముందే కొత్త నాయకుడి పేరు తెర మీదకు వచ్చింది ఇప్పుడు. అతని పేరే సైఫ్ అల్-అడెల్. అల్ ఖైదా వ్యవస్థాప సభ్యుడిగా, సీనియర్ మెంబర్గా, సంస్థలో నెంబర్ త్రీ పొజిషన్లో ఇంతకాలం ఉన్నాడతను. తర్వాతి నాయకత్వ పగ్గాలు అందుకునే అవకాశాలు ఉన్నాయని మిడిల్ ఈస్ట్ ఇనిస్టిట్యూట్ ఓ కథనం ప్రచురించింది. ► ఎఫ్బీఐ రికార్డుల ప్రకారం.. అడెల్ ఏప్రిల్ 11న 1960-63 మధ్యలో జన్మించాడు. ► జవహిరిలాగే.. అడెల్ కూడా ఈజిప్ట్ పౌరుడే. అక్కడి ఆర్మీలో కల్నల్ ర్యాంకుతో పని చేశాడు. ► జవహిరి స్థాపించిన ఇజిప్టియన్ ఇస్లామిక్ జిహాద్లో సైఫ్ అల్-అడెల్ పని చేశాడు. అందులో అతనికి ఎక్స్ప్లోజివ్ ఎక్స్పర్ట్గా పేరు ఉంది. ► 1980లలో ఆఫ్ఘనిస్తాన్లో రష్యా దళాలతో కూడా పోరాడాడు. ► అమెరికన్లనే మాట వింటే చాలు రగిలిపోతాడతను. గతంలో అమెరికన్లను హతమార్చిన ఘటనలు, అమెరికన్లకు చెందిన ఆస్తుల విధ్వంసం, అమెరికా భద్రతా విభాగాల్ని విచ్ఛిన్నం చేసే ప్రయత్నం తదితర ఆరోపణలు అతనిపై ఉన్నాయి. అందుకే ఎఫ్బీఐ సైఫ్ అల్ అడెల్ను మోస్ట్ వాంటెడ్గా ప్రకటించింది. ► 1998లో టాంజానియా, కెన్యాలోని రాయబార కార్యాలయాల్లో బాంబు పేలుళ్ల ద్వారా అమెరికన్లను హతమార్చే యత్నం కింద అతనిపై నేరారోపణలు నమోదు చేసిన అమెరికా.. పట్టించినా, సమచారం అందించిన వాళ్లకు 10 మిలియన్ డాలర్ల రివార్డు ప్రకటించింది. ► 1993 అక్టోబర్లో సోమాలియా మోగడిషూ దగ్గర జరిగిన బ్లాక్ హాక్ డౌన్ ఘటనకు మూల కారణం..సైఫ్ అల్-అడెల్. ఆ ఘటనలో అమెరికాకు చెందిన పద్దెనిమిది మంది సర్వీస్మెన్ బలయ్యారు. ► ఒసామా బిన్ లాడెన్ సెక్యూరిటీ చీఫ్గా పని చేయడంతో సైఫ్ అల్-అడెల్ బాగా ఆప్తుడిగా మెదిలేవాడు. జవహిరి కంటే అడెల్కు ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చేవాడు లాడెన్. ► 2001 నుంచే ఎఫ్బీఐ మోస్ట్-వాంటెడ్ లిస్ట్లో ఉన్నాడు. ► బిన్ లాడెన్ మరణించినప్పటి నుండి, అల్-అడెల్ ఒక ముఖ్యమైన వ్యూహకర్తగా మారాడని అనేక వార్తా సంస్థలు తెలిపాయి. అయితే,బ్లాక్ హాక్ డౌన్ తరువాత చాలాకాలం పాటు ఇరాన్లోనే ఉన్నాడు. ప్రస్తుతం అతనెక్కడ ఉన్నాడన్నది మాత్రం తెలియదు!. ► కేడర్ హోదాలో తర్వాతి ఎమిర్ అయ్యే అవకాశాలు సైఫ్ అల్-అడెల్కు ఎక్కువగా ఉన్నాయి. -
‘చాలా సిగ్గరి.. ఉగ్రవాదిగా మారి షాకిచ్చింది’
కోల్కతా: జమాత్ ఉల్ ముజాహిదీన్ బంగ్లాదేశ్ (జేఎంబీ) ఉగ్రవాద సంస్థకు చెందినట్లు అనుమానిస్తున్న పశ్చిమ బెంగాల్ యువతి ప్రగ్యా దేబ్నాథ్ అలియాస్ ఆయేషా జన్నత్ మోహనాను శుక్రవారం బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో అరెస్ట్ చేశారు. ఈ క్రమంలో ఆమె తల్లి చట్ట ప్రకారం తన కుమార్తెను శిక్షించాలని కోరుతున్నారు. ఆ వివరాలు.. పశ్చిమ బెంగాల్ హుగ్లీ ధానియఖాలి గ్రామానికి చెందిన ప్రగ్యా దేబ్నాథ్ నాలుగేళ్ల క్రితం అనగా 2016, సెప్టెంబర్ 25 ఉదయం దుర్గామాత పూజ సందర్భంగా బయటకు వెళ్లి వస్తానని తల్లిదండ్రులకు చెప్పి ఇంటి నుంచి వెళ్లింది. ప్రతిరోజు ప్రగ్యా అలా బయటకు వెళ్లడం సాధారణమే. దాంతో తల్లిదండ్రులు కూడా అనుమానించలేదు. గంటలు గడుస్తున్నా ప్రగ్యా ఇంకా ఇంటికి తిరిగి రాలేదు. ఆందోళనకు గురైన ప్రగ్యా తల్లిదండ్రులు ఆమెకు ఫోన్ చేశారు. స్విచ్ఛాఫ్ అని వచ్చింది. దాంతో పోలీసు స్టేషన్కు వెళ్లి ఫిర్యాదు చేశారు. చుట్టుపక్కల గాలించడం ప్రారంభించారు. ఈ క్రమంలో రెండు రోజుల తర్వాత మధ్యాహ్నం సమయంలో ప్రగ్యా తల్లికి ఓ గుర్తు తెలియని నంబర్ నుంచి కాల్ వచ్చింది. చేసింది ఆమె కుమార్తె. తాను ప్రస్తుతం బంగ్లాదేశ్లో ఉన్నానని.. ఇస్లాంలోకి మారానని.. తల్లి ఆశీర్వాదం కోసం ఫోన్ చేశానని తెలిపింది ప్రగ్యా. అంతేకాక ఇదే తన చివరి కాల్ అని కూడా అన్నది. ఈ విషయం గురించి ప్రగ్యా తల్లి పోలీసులకు సమాచారం ఇచ్చింది. కానీ వారు ఆ నంబర్ను ట్రేస్ చేయలేకపోయారు. దాదాపు నాలుగేళ్ల తర్వాత శుక్రవారం కౌంటర్ టెర్రరిజమ్ అండ్ ట్రాన్స్మిషనల్ క్రైమ్ యూనిట్ పోలీసులు ఢాకాలో ప్రగ్యాను అరెస్ట్ చేశారు. దీని గురించి స్థానిక మీడియాలో వార్తలు వచ్చాయి. ధనియాఖాలి ప్రాంతానికి చెందిన యువతి.. ఉగ్రవాద సంస్థలో చేరింది అని ప్రచారం చేయడంతో ఆమెని తన కుమార్తెగా గుర్తించింది ప్రగ్యా తల్లి. (చొరబాట్లను ఆపుతూ అమరులయ్యారు) దీనిపై ప్రగ్యా తల్లి స్పందిస్తూ.. ‘ఇంటి నుంచి వెళ్లడానికి ముందు నా కుమార్తె ప్రవర్తనలో ఎలాంటి తేడాను మేం గమనించలేదు. ఏదైనా విషయంలో మాకు ఎదురుతిరగడం కూడా మేం ఎప్పుడు చూడలేదు. అలాంటిది ఏకంగా ఉగ్రవాద గ్రూపులో చేరింది. చట్ట ప్రకారం నా కుమార్తెను శిక్షించండి’ అని కోరింది. ఈ విషయం గురించి ఇరుగుపొరుగు వారు మాట్లాడుతూ.. ‘ప్రగ్యా చాలా సాధారణమైన అమ్మాయి. ప్రతి రోజు ఉదయం సైకిల్ మీద కిలోమీటర్ దూరంలో ఉన్న కాలేజీకి వెళ్లి మధ్యాహ్నం వచ్చేది. తనకు తెలిసిన వారు ఎదురుపడితే.. నవ్వుతూ పలకరించేది. ఎవరితో ఎక్కువగా కలిసేది కాదు. చాలా సిగ్గరి. అలాంటి అమ్మాయి ఉగ్రవాదిగా మారింది అంటే నమ్మబుద్ధి కావడం లేదు’ అంటున్నారు. (నా భర్తని హత్య చేశారు: ఎమ్మెల్యే భార్య) -
కేరళ, తమిళనాడులో తీవ్రవాదుల సంచారం
సాక్షి ప్రతినిధి, చెన్నై: కన్యాకుమారి జిల్లాలోని చెక్పోస్టులో స్పెషల్ బ్రాంచ్ ఎస్ఐ విల్సన్ను తీవ్రవాద ముఠా హతమార్చడం తీవ్ర స్థాయిలో కలకలం రేపింది. ఈ ఘటన జరిగిన ప్రాంతం కేరళ సరిహద్దులో ఉండడం, నిందితులు ఆ రాష్ట్రానికి పారిపోయినట్లు ప్రాథమిక సమాచారంతో రెండు రాష్ట్రాల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఎస్ఐని కాల్చిచంపిన కేసు నేపథ్యంలో ఐదుగురిని పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేశారు. హత్యకు పాల్పడినవారు కేరళకు పారిపోయేందుకు సహకరించిన నేరంపై కేరళలో దాక్కుని ఉన్న ముగ్గురిని, ఢిల్లీలో మరో ఇద్దరిని క్యూబ్రాంచ్ పోలీసులు అరెస్ట్ చేశారు. కన్యాకుమారి జిల్లా కిళియక్కావిళై మార్కెట్ రోడ్డులో పోలీసు చెక్పోస్టులో ఎస్ఐ విల్సన్ విధుల్లో ఉండగా బుధవారం రాత్రి ఇద్దరు అగంతుకులు తుపాకీతో కాల్పులు జరిపి హతమార్చిన సంఘటన రాష్ట్ర పోలీసు యంత్రాగాన్ని ఉలిక్కిపడేలా చేసింది. కన్యాకుమారి జిల్లా కలెక్టర్, ఎస్పీ, చెన్నై నుంచి డీజీపీ హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని ఐదు ప్రత్యేక పోలీసు బృందాలతో కేసు విచారణ ప్రారంభించారు. తుపాకీ కాల్పులకు పాల్పడే ముందు ఎస్ఐని కత్తులతో పొడిచి చిత్రవధకు గురిచేసినట్లు పోస్టుమార్టం రిపోర్టులో తేలింది. హతుని శీరరం నుంచి తీవ్రవాదులు వినియోగించిన తుపాకీ తూటాలను పోలీసులు సేకరించారు. హత్య జరిగిన ప్రాంతం కేరళ సరిహద్దు కావడంతో ఆ రాష్ట్ర డీజీపీ, ఇతర పోలీసు అధికారులు సైతం చెక్పోస్టును పరిశీలించారు. హత్య జరిగిన పరిసరాల్లో సీసీటీవీ కెమెరాల పుటేజీలో నమోదైన దృశ్యాల ద్వారా తిరువితాంగోడుకు చెందిన అబ్దుల్ సమీం, నాగర్కోవిల్కు చెందిన తవుబిక్లే ఈ ఘాతుకానికి ఒడిగట్టినట్లు గుర్తించారు. హంతకులు కేరళ పారిపోయి ఉంటారని అనుమానిస్తున్నారు. నిందితుల ఆచూకీ తెలిపిన వారికి రూ.2 లక్షలు బహుమతి ఇస్తామని తమిళనాడు పోలీసుశాఖ, రూ.5 లక్షలు బహుమానమని కేరళ ప్రభుత్వం ప్రకటించాయి. ఇదిలా ఉండగా నిందితులు పారిపోయేందుకు సహకరించిన నేరంపై కేరళ రాష్ట్రం పాలకోట్టైకి చెందిన ముగ్గురిని క్యూబ్రాంచ్ పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేసి రహస్య ప్రదేశంలో ఉంచి విచారణ జరుపుతున్నారు. దీనివల్ల కన్యాకుమారి–కేరళ సరిహద్దుల్లో తీవ్రవాద ముఠా సానుభూతిపరులు ఉన్నట్లు భావిస్తున్నారు. -
వీడు సామాన్యుడు కాదు!
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్లో తలదాచుకుని బీహార్లోని బోధ్గయ పేలుళ్లకు కుట్ర పన్నిన జమాత్ ఉల్ ముజాహిద్దీన్ బంగ్లాదేశ్(జేఎంబీ) కీలక ఉగ్రవాది మహ్మద్ జహీదుల్ ఇస్లాం అలియాస్ కౌసర్ సామాన్యుడు కాదని నిఘా వర్గాలు చెప్తున్నాయి. బంగ్లాదేశ్ ప్రభుత్వాన్ని గడగడలాడించేందుకు తక్కువ తీవ్రత గల 500 బాంబు పేలుళ్లకు ఒకేసారి పాల్పడ్డాడని, ఈ కేసులో అరెస్టు అయిన తర్వాత ఆరుగురు పోలీసుల్ని చంపి కస్టడీ నుంచి తప్పించుకున్నాడని పేర్కొంటున్నాయి. బోధ్గయ పేలుళ్లకు సంబంధించి జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) సోమవారం పట్నాలోని ప్రత్యేక న్యాయస్థానంలో కౌసర్సహా మరికొందరిపై సప్లమెంటరీ చార్జ్షీట్ దాఖలు చేసిన విషయం విదితమే. బంగ్లాదేశ్కు చెందిన కౌసర్ చిన్నతనంలోనే ఉగ్రవాద భావజాలానికి ఆకర్షితుడయ్యాడు. 2000లోనే జేఎంబీలో చేరి కీలక వ్యక్తిగా మారాడు. పేలుడు పదార్థాల వినియోగంపై పట్టు ఉండటంతో జేఎంబీ ఎక్స్ప్లోజివ్స్ మాడ్యూల్ చీఫ్ సిద్ధిఖుర్ రెహ్మాన్ అలియాస్ బంగ్లా భాయ్కి కుడిభుజంగా మారాడు. బంగ్లాదేశ్లో వరుస పేలుళ్లు... కౌసర్ సూచనల మేరకు భారీ కుట్ర పన్ని 2005 ఆగస్టు 17న బంగ్లాదేశ్లో వరుస పేలుళ్లకు పాల్పడ్డాడు. బంగ్లాదేశ్లో ఉన్న 64 జిల్లాల్లోనూ జేఎంబీ క్యాడర్ ఏర్పాటు చేసుకుంది. వారి సాయంతో ఉదయం 11.30 నుంచి 12 గంటల మధ్య 63 జిల్లాల్లోని 300 ప్రాంతాల్లో 500 పేలుళ్లకు పాల్పడ్డారు. తక్కువ తీవ్రత కలిగిన ఈ బాంబుల్ని కేవలం తమ సందేశాలు ప్రజలకు చేర్చడానికే వినియోగించారు. ఈ నేపథ్యంలోనే ఇవి పేలినప్పుడు అందులో నుంచి కరపత్రాలు ఎగిరిపడ్డాయి. వీటిని బంగ్లా ప్రభుత్వం లెటర్ బాంబులుగా పేర్కొంది. ఎక్కడా ప్రాణనష్టం లేనప్పటికీ ఢాకాలో మాత్రం ఓ బాంబును గుర్తించిన ఇంటెలిజెన్స్ అధికారి దాన్ని తన చేతిలోకి తీసుకున్నారు. ఆ వెంటనే అది పేలిపోవడంతో ఆయన మరణించారు. ఈ కేసులో అరెస్టు అయిన కౌసర్ జైల్లో ఉండగా బంగ్లా పోలీసులతో జరిగిన ఎన్కౌంటర్లో రెహ్మాన్ మృతిచెందాడు. న్యాయస్థానం కౌసర్కు జీవితఖైదు విధించింది. జైల్లో ఉన్న ఇతడిని రక్షించడానికి జేఎంబీ క్యాడర్ 2009లో పట్టపగలు దాడి చేసింది. ఆ సందర్భంలో ఆరుగురు పోలీసుల్ని చంపేసిన కౌసర్ తప్పించుకుని సరిహద్దులు దాటి భారత్లో తలదాచుకున్నాడు. తొలినాళ్లలో పశ్చిమ బెంగాల్లోని బురాధ్వన్లో షెల్టర్ తీసుకున్నాడు. కొందరు జేఎంబీ ఉగ్రవాదుల్ని అక్కడకు పిలిచి దేశీయంగా పేలుళ్లకు కుట్రపన్నాడు. అయితే, ఆ ఏడాది అక్టోబర్ 2న వీరి గదిలో తయారు చేస్తున్న బాంబు పేలి ఇద్దరు చనిపోగా కౌసర్ తప్పించుకుని పారిపోయాడు. ఆపై చెన్నైతోపాటు హైదరాబాద్లోని మారేడ్పల్లిలోనూ కొన్నాళ్లు వ్యాపారిగా అవతారమెత్తి షెల్టర్ తీసుకున్నాడు. హైదరాబాద్లో ఉండగానే బిహార్లోని బోధ్గయను టార్గెట్గా ఎంచుకున్నాడు. మయన్మార్లో రోహింగ్యాలపై జరుగుతున్న అఘాయిత్యాలకు ప్రతీకారం తీర్చుకోవాలని జమాత్ ఉల్ ముజాహిద్దీన్ బంగ్లాదేశ్(జేఎంబీ) ఉగ్రవాద సంస్థ భావించింది. బౌద్ధ ప్రార్థన స్థలాలను టార్గెట్ చేయడం ద్వారా ప్రపంచ దృష్టిని ఆకర్షించడంతోపాటు తమ ప్రతీకారం తీర్చుకోవాలని గత ఏడాది జనవరి 19న తమ పథకాన్ని అమలు చేశారు. ఈ కేసును దర్యాప్తు చేసిన ఎన్ఐఏ అధికారులు గత ఏడాది ఆగస్టులో కౌసర్ను బెంగళూరులో పట్టుకున్నారు. దేశంలోని అనేక కేసులతోపాటు బంగ్లాదేశ్లోనూ ఇతడు మోస్ట్వాంటెడ్గా ఉన్నాడు. ఇక్కడి కేసుల విచారణ తర్వాత ఆ దేశానికి తీసుకువెళ్లనున్నారు.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
Best Photos Of The Week : ఈ వారం ఉత్తమ చిత్రాలు (మార్చి 04-10)
లైంగిక ఆరోపణల కేసు.. రేవణ్ణ అరెస్టు
ఆర్సీబీతో మ్యాచ్.. గుజరాత్ జట్టులోకి కొత్త ప్లేయర్! తుది జట్లు ఇవే
గవర్నర్పై ఆరోపణలు.. మమత సర్కారు దూకుడు
ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్: టీడీపీ దుష్ప్రచారంపై ఈసీ సీరియస్
'లగ్గం' షూటింగ్ పూర్తి.. త్వరలో థియేటర్లలో రిలీజ్
త్వరలో కాంగ్రెస్ చీలిపోతుంది: ఆచార్య ప్రమోద్ కృష్ణం
బోయింగ్ ‘స్టార్ లైనర్’.. సునీత ‘స్టార్ ట్రెక్’!
నా ఐపీఎల్ టీమ్కు మాటిచ్చా.. అందుకే సినిమాలకు బ్రేక్
పలమనేరు: ఉప్పొంగిన అభిమాన సంద్రం (ఫొటోలు)
తప్పక చదవండి
- రాకాసి నర్సుకు 760 ఏళ్ల జైలు శిక్ష : అసలు ఏమైందంటే..!
- బీజేపీలో చేరిన ఢిల్లీ మాజీ కాంగ్రెస్ చీఫ్ అరవిందర్ సింగ్
- నాలుగుసార్లు అబార్షన్ అయిందా? క్లారిటీ ఇచ్చిన స్టార్ హీరోయిన్
- రాయ్బరేలి బరిలో రాహుల్.. వయనాడ్ ఓటర్ల ఫీలింగ్ ఇదే..!
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
- మా భూమి మాది కాకపోతే మరెవరిది రామోజీ..?: మంత్రి బొత్స
- చంద్రబాబు మేనిఫెస్టో మాయలు గుర్తున్నాయా?: సీఎం జగన్
- 2024 లోక్సభ ఎలక్షన్స్.. 9 లక్షల మందికి ఉపాధి!
- Tech Layoffs 2024: షాకింగ్ రిపోర్ట్: ఒక్క నెలలోనే 21 వేల టెకీలకు ఉద్వాసన
- చంద్రబాబు, కోట్లకు కౌంటరిచ్చిన మంత్రి బుగ్గన
Advertisement