-
తమ్ముళ్ల తన్నులాట
– ఎస్ఎంసీ ఎన్నికల్లో గొడవ –రామిరెడ్డి, రాజశేఖర్రెడ్డి వర్గీయుల బాహాబాహీ –ఎన్నికలు వాయిదా మంత్రాలయం రూరల్: పాఠశాల యాజమాన్య కమిటీ(ఎస్ఎంసీ) ఎన్నికల్లో తెలుగు తమ్మళ్లు తన్నుకున్నారు. బాహాబాహీకి దిగి మరోమారు విభేదాలను బయటపెట్టుకున్నారు. తమ్ముళ్ల తన్నులాటతో మాధవరం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో బుధవారం ఉద్రిక్తత చోటుచేసుకుంది. దీంతో ఎన్నికలూ వాయిదా పడ్డాయి. మండల పరిధిలోని మాధవరం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు గతంలో కోరం లేని కారణంగా ఎన్నికలు వాయిదా పడిన విషయం విదితమే. బుధవారం తిరిగి కమిటీ ఎన్నిక జరిపారు. ఉదయాన్నే టీడీపీ సీనియర్ నేత రామిరెడ్డి, జెడ్పీటీసీ మాజీ సభ్యుడు రాజశేఖర్రెడ్డి వర్గీయులు గుంపులుగా పాఠశాలకు చేరుకున్నారు. అయితే విద్యార్థుల తల్లిదండ్రులను మాత్రమే పాఠశాలలోకి అనుమతించారు. ఎన్నికల అధికారి జగదీష్ ఆధ్వర్యంలో 6వ తరగతి విద్యార్థుల తల్లిదండ్రులతో ఎన్నికలు నిర్వహించి అభ్యర్థులను ప్రకటించారు. అయితే ఏడో తరగతి విద్యార్థి తల్లితండ్రుల వివరాలను సేకరించే సమయంలో రాజశేఖర్రెడ్డి, రామిరెడ్డి వర్గీయులు ఒకరినొకరు కొట్టుకున్నారు. సీఐ నాగేశ్వర రావు, ఎస్ఐ సునీల్కుమార్ ఇరువర్గాలను లాఠీలతో చెదరగొట్టారు. ఇరువర్గాలను కూర్చోబెట్టి చర్చించి ఎన్నికలు వాయిదా వేశారు. -
నీరు చెట్టు అంతా కనికట్టు
కార్యకర్తలే కాంట్రాక్టర్లు ‘నీరు–చెట్టు’ పథకంతో నిలువుదోపిడీ పనులన్నీ పచ్చ చొక్కాలకే నిబంధనలకు నీళ్లొదిలి మట్టిపనులు నిఘా లోపంతో తూతూ మంత్రంగా ముగింపు వర్షాలొచ్చి నీరు చేరినా ఆగని ‘పచ్చ’ తమ్ముళ్లు రూ.కోట్లలో నిధులు దోచుకుంటున్న వైనం సాక్షి ప్రతినిధి: శ్రీకాకుళం/పీఎన్ కాలనీ: ‘నీరు–చెట్టు’ పథకం పేరు చెబితే ఈ రెండు నియోజకవర్గాల్లోనే కాదు జిల్లాలో దాదాపు అన్నిచోట్లా ఇంచుమిం చు ఇదే పరిస్థితి కనిపిస్తుంది. చెరువుల్లో పూడిక తీయడం, వాటి గట్లు పటిష్టం చేయడం, అవసరమైన చోట చప్టాలు, కాలువలు ఏర్పాటు చేసుకోవడం ఈ పథకం లక్ష్యాలు. కానీ చాలాచోట్ల ఇందుకు విరుద్ధంగా పనులు జరిగా యి. జిల్లాలో ఈ పథకం కింద రూ.349.47 కోట్లు అంచనా వ్యయంతో 5,084 పనులకు జలవనరుల శాఖ అధికారులు ప్రతిపాదనలు పంపారు. వాటిలో 4,997 పనులకు రూ.331.90 కోట్లతో ఆమోదం లభించింది. వాటిలో ఇప్పటివరకూ 2,250 పనులు పూర్తి అయ్యినట్లు అధికారులు చెబుతున్నారు. ఇంకా 1,263 పనులు జరుగుతున్నాయి. నిబంధనలకు ‘గండి’ వాస్తవానికి ఈ పథకం కింద చెరువుల్లో నిర్ణీత క్యూబిక్ మీటర్ల మట్టిని మాత్రమే తీయాల్సి ఉంటుంది. ఆ మట్టితో గట్లు పటిష్టం చేయాల్సి ఉన్నప్పటికీ దాన్ని కూడా టీడీపీ కార్యకర్తలు సొమ్ము చేసుకున్నారు. చెరువుల్లో తవ్విన మట్టిని గట్లకు వేయకుండా ఇటుక బట్టీలకు, రియల్ ఎస్టేట్ వ్యాపారుల వెంచర్లలో స్థలాలను చదును చేయడానికి అమ్ముకొని రూ.కోట్లలోనే లాభం గడించారు. దీనివల్ల చెరువు అభివృద్ధి పనుల ద్వారా వచ్చే నిధుల కన్నా ఈ అక్రమ వ్యవహారం వల్లే ఎక్కువ కావడం గమనార్హం. వర్షాలు ప్రారంభమైన తర్వాత కూడా చాలా పనులు చేపట్టిన తెలుగు తమ్ముళ్లు తూతూమంత్రంగా పూర్తి చేసి చేతులు దులుపుకుంటున్నారు. అరకొర పనులకు తార్కాణాలు టెక్కలి నియోజకవర్గంలో పాత జాతీయ రహదారికి పక్కనే ఉన్న రాచబంద చెరువును అభివృద్ధి చేసేందుకు సుమారు రూ.7 లక్షల నిధులతో ‘నీరు–చెట్టు’ పథకం కింద పనులు చేస్తున్నారు. ఇప్పటికే వర్షాకాలం ప్రారంభం కావడంతో చెరువులో నీరు చేరింది. అయినా పనులు కొనసాగుతూనే ఉన్నాయి. వీటిని చేపట్టింది అధికార పార్టీ కార్యకర్త కాబట్టి ఎవ్వరూ అడగట్లేదు. ∙పాతపట్నం మండలంలో 34 పంచాయతీల పరిధిలో 98 పనులకు రూ. 6.50 కోట్లు విడుదలయ్యాయి. నామినేటెడ్ విధానంలో మొదటి విడతలో 45 పనులు, రెండో విడతలో మరో 53 పనులు మంజూరయ్యాయి. ఈ రెండు విడతల్లో కలిపి మొత్తం 50 పనులు మాత్రమే జరిగాయి. గుమ్మాగెడ్డలో రూ.50 లక్షలతో చేపట్టిన పనుల్లో అవకతవకలు చోటుచేసుకున్నాయని ఆయకట్టు రైతులు ఆవేదన చెందుతున్నారు. బడ్డుమర్రి చెరువు గట్టు పనులు 15 శాతం కూడా చేయలేదు. ఈ మండలం మొత్తం మీద పనులు 20 శాతం మించకపోయినా బిల్లులు మాత్రం 80 శాతం మేర చెల్లించాలని అధికార పార్టీ నాయకుల నుంచి తీవ్ర ఒత్తిళ్లు వస్తున్నాయి. కొత్తూరు మండలంలో 68 చెరువుల అభివృద్ధి పనులకు రూ.3.80 కోట్లు మంజూరయ్యా యి. ఇంతవరకు కారిగూడ, ఇరపాడు, కడు ము, మదనాపురం, ఆకులతంపర, మాతల, సిరుసువాడ గ్రామాల్లో నామమాత్రంగా జరిగాయి. ఎల్.ఎన్.పేట మండలంలోని చెరువుల్లో కొన్నేళ్లుగా ఉపాధిహామీ పథకం తవ్విన బంటాల్లోనే ఇప్పుడు నీరు–చెట్టు పథకం కింద కాస్త మెరుగులు దిద్ది బిల్లులు చేయించుకుంటున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. 19 పంచాయతీల్లో మొదటి విడతలో 80 పనులకు రూ.7.35 కోట్లు మంజూరయ్యాయి. రెండో విడతలో 15 పనులకు రూ.కోటి మంజూరైంది. హిరమండలంలో వంశధార అధికారులు 13 పనుల కోసం రూ.కోటి మంజూరైంది. పనుల్లో అనేక అక్రమాలు జరిగాయని ఆరోపణలు వినిపిస్తున్నాయి. పెద్దకొల్లివలస ఊర చెరువులో పనులే దీనికి ప్రత్యక్ష నిదర్శనం. ఆమదాలవలస మండలంలో 134 చెరువులు, 38 కాలువల్లో పనులు చేపట్టారు. సరుబుజ్జిలి మండలంలో 98 చెరువులకు రూ. 5.24 కోట్లతో ప్రతిపాదనలు పెట్టగా ఈ ఏడాది 54 చెరువుల్లో అరకొరగానే పనులు జరిగాయి. యంత్రాలతో తూతూ మంత్రంగానే చేసి గట్టెక్కేశారు. జి.సిగడాంలో స్థానిక ఎమ్మెల్యే బంధువొకరు బినామీల పేరుతో పనులు చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. నాగులవలస, పెంట, సీతంపేట, గేదెలపేట, మర్రివలస ప్రాంతాల్లో జరిగిన పనుల్లో కనీస నాణ్యత లేకున్నా బిల్లులు చెల్లించేశారు. లావేరు మండలంలో మండల పరిషత్ ప్రత్యేక ఆహ్వానితుడు తాళ్లవలస, చిగురుకొత్తపల్లి గ్రామాల్లో చేపట్టిన పనుల్లో కనీసం నాణ్యత లేదు. ఎచ్చెర్ల మండలంలోని ఎస్ఎం పురం పెద్దచెరువలో జిల్లా పరిషత్తులో ముఖ్యనేత కుమారుడు, స్థానిక సర్పంచ్ ఆధ్వర్యంలో చేపట్టిన మట్టిపనుల్లో కనీసం నాణ్యత లేదని ఆరోపణలు ఉన్నాయి. కుప్పిలి, ముద్దాడ గ్రామాల్లోనూ అదే పరిస్థితి. రణస్థలం మండలంలో టీyీ పీ నాయకులు చేసిన పనుల్లో కనీసం నాణ్యత ప్రమాణాలు పాటించలేదు. నరసన్నపేట నియోజకవర్గం సారవకోట మండలంలో అవసరం లేనిచోట నీరు–చెట్టు పనులు చేశారు. రూ.7.40 కోట్లతో తలపెట్టిన 95 పనులు టీడీపీ నాయకులకు, కార్యకర్తలకే కేటాయించారు. మిగతా మూడు మండలాల్లోనూ తూతూమంత్రంగానే పనులు చేసి, బిల్లుల కోసం అధికారులపై ఒత్తిడి తెస్తున్నారు. కరువు మండలమైన భామినిలో రూ.4.94 కోట్లతో 61 పనులు మంజూరయ్యాయి. చాలా చెరువుల్లో తూతూమంత్రంగానే పనులు చేసిన అధికార పార్టీ కార్యకర్తలు బిల్లుల మంజూరు కోసం పరుగులు పెడుతున్నారు. పాలకొండ మండలంలో రూ.7 కోట్లతో 92 పనులు మూడు నెలలు క్రితం చేపట్టినా 25 శాతం మాత్రమే పనులు పూర్తి అయ్యాయి. పనుల్లో నాణ్యతా లోపాలున్నా అధికారుల పర్యవేక్షణ కొరవడింది. పలాస మండలంలో మొత్తం 19 పనులకు రూ. 1.20 కోట్లు నిధులు మంజూరయ్యాయి. ఇప్పటికి 9 మాత్రమే చేపట్టారు. వర్షాలు పడడంతో అసంపూర్తిగా ఉంటుండగానే పూర్తి చేసినట్లు చూపించి బిల్లులు చేయించుకుంటున్నారు. దీనికి నిదర్శనం పలాస మున్సిపాలిటీ 2వ వార్డులోని జయరామచంద్రపురం కుంకుమసాగరం. మందస మండలంలో మఖరజోల సంకుజోడు చెరువు, బాలిగాం కారిచెరువుల పరిస్థితి అంతే. రాజాం మండలంలో రూ.7 కోట్లతో 135 పనులు కేటాయించారు. వాటిలో చాలాచోట్ల పచ్చతమ్ముళ్లు హడావుడిగా పనులు ముగించేశారు. సంతకవిటి మండలం రామారాయపురం పంచాయతీ చింతలపేట గ్రామంలో ప్రధాన రహదారి పక్కనే ఉన్న అచ్చెమ్మకోనేరు చెరువుకు ఆయకట్టు లేకున్నా జన్మభూమి కమిటీ సభ్యులు రూ. 3.93 లక్షలను తూతూ మంత్రంగా పనులు చేసి ఎగనామం పెట్టారు. వంగర మండలం గీతనాపల్లిలో గణపతిరాజు చెరువు ఆయకట్టు భూములు మడ్డువలస రిజర్వాయర్లో మునిగిపోగా ఆ చెరువు పేరుతో రూ.4.80 లక్షలు మంజూరు చేయించడం విశేషం. శివ్వాం మంగళవాని, బాగెంపేట కొండోడు చెరువు ఇలా పదుల సంఖ్యలో ఆయకట్టులేని చెరువులకు నిధులు కాజేసేందుకు ప్రయత్నాలు జోరుగా సాగుతున్నాయి. రేగిడి మండలంలో చాలాచోట్ల ఉపయోగం లేకున్నా రూ.9 లక్షలు చొప్పున ఖర్చుచేసి చెక్డ్యామ్లు నిర్మిస్తున్నారు. ఉపాధికి గండి వలసలను నివారించాలనే ఉద్దేశంతో ఉపాధి హామీ పథకం ఇన్నాళ్లూ అమలు చేశారు. దీంతో ప్రతి గ్రామంలో ఏటా చెరువు పనులు చేయడం వల్ల స్థానిక వేతనదారులకు ఉపాధి లభించేంది. ఇప్పుడు టీడీపీ ప్రభుత్వం చేపట్టిన ‘నీరు–చెట్టు’ పథకం ద్వారా లక్ష్యానికి గండిపడనుంది. ఈ పథకం కింద మట్టిపని చేపట్టిన ఏ చెరువులోనైనా తదుపరి ఐదేళ్ల వరకూ ఉపాధి పథకం కింద పనులు చేపట్టడానికి వీల్లేదు. టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఒక్కొక్కరు ఒక్కో చెరువును పంచేసుకొని ‘నీరు–చెట్టు’ పథకం కింద పనులు చేసేస్తున్నారు. తమ స్వలాభం కోసం తూతూమంత్రంగా పనులు చేస్తున్నారు. దీనివల్ల ఇటు చెరువులు బాగుపడక రైతులు... భవిష్యత్తులో ఆ చెరువుల్లో ఉపాధి పనులు లేక వేతనదారులు చాలా ఇబ్బందులు పడాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. మళ్లీ జిల్లా నుంచి వలసలు మొదలయ్యాయి. నిద్రపోతున్న నిఘా నీరు–చెట్టు పనులను జలవనరుల శాఖతో పాటు డ్వామా, విజిలెన్స్ అధికారులు ఎప్పటికప్పుడు తనిఖీ చేయాల్సి ఉంటుంది. అలాగే మండలస్థాయిలో రెవెన్యూ, పంచాయతీరాజ్ అధికారులు కూడా చేయవచ్చు. ఇంతమంది పర్యవేక్షణ ఉన్నా టీడీపీ కార్యకర్తలు, నాయకులు మాత్రం తమకు నచ్చినట్లు పనులు చేసుకుపోతున్నారు. దీనికి కారణం స్థానిక ప్రజలకు ‘నీరు–చెట్టు’ పథకం నిబంధనలపై అవగాహన లేకపోవడం ఒక కారణమైతే... ఇవి తెలిసిన అధికారులు అధికార పార్టీ నాయకులకు తలొగ్గడం ప్రధాన కారణం. -
ఆహ్వానం దుమారం!
♦ దేవగుడి సోదరుల కరపత్రంపై టీడీపీలో అలజడి ♦ అధిష్టానానికి ఫిర్యాదు చేసిన తెలుగుతమ్ముళ్లు సాక్షి ప్రతినిధి, కడప: ‘మొగుడు కొట్టినందుకు కాదు, తోడికోడలు నవ్వినందుకు కోపం’అన్న చందంగా దేవగుడి సోదరుల కరపత్రం తెలుగుదేశం పార్టీలో దుమారం రేపుతోంది. జమ్మలమడుగులో బుధవారం ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి కార్యకర్తల సమావేశం నిర్వహిస్తున్నారు. ఈ సమావేశానికి ఇన్చార్జి మంత్రి గంటా శ్రీనివాసరావు ముఖ్య అతిథిగా హాజరవుతున్నారు. ఈ కార్యక్రమనికి కార్యకర్తలు హాజరుకావాల్సిందిగా ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి, ఎమ్మెల్సీ నారాయణరెడ్డి ఫొటోలు ముద్రించి జమ్మలమడుగు తెలుగుదేశం పార్టీ తరుఫున ఓ కరపత్రాన్ని పంపిణీ చేశారు. ఈవైనం తెలుగుదేశం పార్టీ శ్రేణుల్లో అలజడి రేపింది. దేవగుడి సోదరులకు తెలుగుదేశం పార్టీ పట్ల అభిమానం లేదని, ముఖ్యమంత్రి చంద్రబాబు, ప్రధాన కార్యదర్శి లోకేష్ ఫొటోలు లేకుండా కేవలం వారి ఫొటోలు మాత్రమే ముద్రించి కరపత్రాలు పంపిణీ చేశారని ఆరోపిస్తూ కొందరు నేతలు అధిష్టానానికి ఫ్యాక్స్ ద్వారా ఫిర్యాదులు పంపినట్లు సమాచారం. మూడున్నర్ర దశాబ్దాలుగా టీడీపీని అంటిపెట్టుకుని ఉన్నవారిని కాదని అరువు నేతలను తెచ్చుకుంటే పరిస్థితి ఇలాగే ఉంటుందని, అధిష్టానం ఇప్పటికైనా మేల్కోవాలని ఆ ఫిర్యాదులో శ్రేణులు వివరించినట్లు తెలుస్తోంది. -
ఆ పొగడ్తలు విన్న తరువాత...
ఆ పొగడ్తలు విన్న తరువాత ఇక ఆ సీటు మీద ఆశలు వదులుకోవాల్సిందేనని ఒక నిర్ధారణకు వచ్చారట తెలుగు తమ్ముళ్లు. శాసనమండలి చైర్మన్గా కాంగ్రెస్ సీనియర్ నేత ఎ.చక్రపాణి వ్యవహరిస్తున్నారు. శాసనసభ, మండలి సమావేశాల చివరి రోజున సీఎం చంద్రబాబు నాయుడు మండలికి హాజరయ్యారు. ఈ సందర్భంగా సభ్యులు పలు అంశాలపై ప్రసంగించారు. అందులో టీడీపీ నేతలు తమ అధినేతను ఆకాశానికెత్తారు. ఇదే సమయంలో నాకు కూడా మాట్లాడేందుకు అవకాశం ఇవ్వండి అని కోరిన చక్రపాణి సీఎం చంద్రబాబును పొగడ్తలతో ముంచెత్తారు. మీ అంత పరిపాలనాదక్షుడు లేడు అని మొదలుపెట్టి తాను ఏమేరకు పొగడగలరో ఆ మేరకు పొగిడారు. దీంతో సీఎం సహా టీడీపీ నేతలందరూ బ్రహ్మాండంగా పొగిడారంటూ అభినందించారు. చక్రపాణి పదవీకాలం వచ్చే ఏడాది ముగియనుంది. ఆయన పదవీ కాలం ముగిసిన వెంటనే చైర్మన్ కుర్చీలో తమలో ఎవరో ఒకరు కూర్చోవచ్చని టీడీపీ ఎమ్మెల్సీలందరూ ఆరాటపడ్డారు. సీఎం వద్ద తమకు చేతనైన రీతిలో పైరవీలు కూడా ప్రారంభించారు. చక్రపాణి పొగడ్తలు విన్న తరువాత ఇక ఆ కుర్చీ మీద ఆశలు వదులు కోవాల్సిందేనని వారు నిర్ణయించుకున్నారు. తాము పార్టీలో ఉన్నాం కాబట్టి అధినేతను పొగడక తప్పదని, మా చైర్మన్ కరుడుకట్టిన కాంగ్రెస్ వాది అయినా పార్టీ సిద్ధాంతాలు వైగైరా పక్కన పెట్టి చంద్రబాబును పొగిడిన తీరు చూస్తుంటే ఆయన పదవీకాలం పొడిగింపు ఖాయమని తేలిపోయిందని ఓ టీడీపీ ఎమ్మెల్సీ వ్యాఖ్యానించారు. గత సభలో కూడా సభ్యుడిగా ఉన్న కృష్ణా జిల్లాకు చెందిన ఓ ఎమ్మెల్సీ మాత్రం చక్రపాణి గారు వైఎస్ రాజశేఖరరెడ్డి, కె.రోశయ్య, ఎన్.కిరణ్కుమార్రెడ్డి సీఎంగా ఉన్నపుడు ఏ రకంగానైతే పొగడ్తల వర్షం కురిపించారో, ఇపుడు కూడా అదే తీరుగా వ్యవహరించారు. ఆయన పదవి కాపాడుకోవటానికి పొగిడారు, వాటికి ఎవరైనా పడిపోతే మనం ఏమీ చేయలేం అని నిట్టూర్చారు. -
తమ్ముళ్లకు ఝలక్
నెల్లూరు (రవాణా): టీడీపీ అధినేత, రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు జిల్లా తమ్ముళ్లకు ఝలకిచ్చారు. ఎమ్మెల్సీల ఎంపికలో జిల్లాకు మొండిచేయి చూపారు. ఎమ్మెల్సీగా అవకాశం దక్కుతుందని పలువురు ఆశావాహులు ఎదురుచూశారు. పార్టీ సీనియర్ నాయకులు సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి, జిల్లా అధ్యక్షుడు బీద రవిచంద్రలు పోటీపడ్డారు. ఎమ్మెల్సీ పదవి కోసం ఇద్దరు నేతలు అధినేత చుట్టూ ప్రదక్షణలు చేశారు. గత ఎన్నికల్లో పోటీచేసిన వ్యక్తులకు ఎమ్మెల్సీ అవకాశం ఇచ్చేదిలేదని పార్టీ తీసుకున్న నిర్ణయంతో బీదాకు ఆశలు మరింత పెరిగాయి. టీడీపీకి దక్కే 3 ఎమ్మెల్సీల్లో బీద రవిచంద్ర పేరు దాదాపు ఖరారైందని జోరుగా ప్రచారం నడిచింది. ఈ నేపథ్యంలో ఒక ఎమ్మెల్సీ భారతీయ జనతాపార్టీకి కేటాయించాల్సిందిగా ఆ పార్టీకి చెందిన కొందరు నేతలు ప్రతిపాదనను తెర పైకి తీసుకువచ్చారు. దీంతో ఇరు పార్టీల మధ్య కొంత తర్జనభర్జన జరిగింది. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు బీజేపీ నేతలకు నచ్చజెప్పడంతో చివరి నిమిషం వరకు ఎమ్మెల్సీగా బీద రవిచంద్ర పేరు వినిపించింది. అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నందున అధినేతను కలిసేందుకు బీద తరఫున పాస్లు కూడా జారీచేశారు. అయితే సోమవారం పార్టీ మంత్రులు, సీనియర్ నాయకులు సమావేశం తర్వాత బీద అశలపై అధినేత నీళ్లు చల్లారు. రాయలసీమ, గోదావరి, విజయనగరం జిల్లాలకు చెందిన నేతలకు ఎమ్మెల్సీలుగా అవకాశం కల్పించారు. దీంతో జిల్లాకు చెందిన తెలుగు తమ్ముళ్లు చంద్రబాబు నిర్ణయంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. గ్రూపులు కారణంగానే.. జిల్లాలో తెలుగు తమ్ముళ్లు 3 గ్రూపులుగా ఏర్పడటంతోనే ఎమ్మెల్సీ పదవి దక్కలేదనే ప్రచారం జోరుగా సాగుతుంది. జిల్లాలో తెలుగు తమ్ముళ్లు సోమిరెడ్డి, మంత్రి నారాయణ, ఆదాల గ్రూపులుగా చెలామణి అవుతున్నారు. పార్టీ కార్యక్రమాల సైతం గ్రూపుల వారీగానే నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్సీగా బీసీలకు అవకాశం కల్పిస్తే, రెడ్డి సామాజికవర్గం దూరమవుతుందన్న కారణంతో పార్టీ అధినేత నిర్ణయాన్ని మార్చుకున్నారన్న వ్యాఖ్యానాలు వినిపిస్తున్నాయి. మొదట నుంచి జిల్లాలో సీనియర్ నాయకుడిగా తనకు అవకాశం కల్పించాలని సోమిరెడ్డి పట్టుబడుతున్న సంగతి తెలిసిందే. ప్రతిపక్షంలో పదేళ్లు పార్టీని నెట్టుకువచ్చిన విషయాన్ని గుర్తుచేస్తున్నారు. బీద మాత్రం తనకు ఎమ్మెల్సీ అవకాశం కల్పిస్తామన్న హామీతోనే గత ఎన్నికల బరిలో నుంచి తప్పుకున్న విషయాన్ని తెరపైకి తీసకువస్తున్నారు. అయితే ఇద్దరు నేతల ఆశలపై పార్టీ అధినేత చంద్రబాబు నీళ్లు కుమ్మరించారు. వచ్చే నెలలో మరో 8 ఎమ్మెల్సీ ఖాళీలు రానున్నట్లు తెలిసింది. అయితే టీడీపీకి 5 దక్కే అవకాశం ఉంది. వాటిలో జిల్లాకు రెండు ఎమ్మెల్సీ లు కేటాయిస్తారనే ఆశల్లో తెలుగు తమ్ముళ్లు ఉన్నారు. ఒకే ఎమ్మెల్సీ పదవి కేటాయిస్తే అప్పుడు పరిస్థితి ఏంటన్న చర్చ జరుగుతుంది. మళ్లీ ఇప్పటి మాదిరి జిల్లాలో తమ్ముళ్లు పోటీపడితే అసలు ఎమ్మెల్సీ పదవి కేటాయించకపోవచ్చన్న ప్రచారం సాగుతోంది. పార్టీ అధినేత వద్ద మంత్రి నారాయణ మాట మాత్రమే చెల్లుబాటవుతుంది. ఆయన మనసులో మాట ఏంటోనన్న విషయం బయటకు రాలేదు. మరో నెలరోజులు తెలుగు తమ్ముళ్లు ఎమ్మెల్సీ పదవి కోసం ఎదురుచూడాల్సిందే.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
పోటాపోటీ హామీలు
దేశమంతా ‘మోదీ’ గాలి వీస్తోంది
హజ్ యాత్రికులకు టీకాలు
ఎన్నికల తర్వాత మరిన్ని పథకాలు
ఓసీపీల్లో పనివేళల మార్పు
● మూడు ఎంపీ నియోజకవర్గాల్లో కానరాని ఈఎస్ఐ ఆస్పత్రి ● బీడీ, గ్రానైట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు సేవలు దూరం ● ఆన్ డిమాండ్ అంగన్వాడీ సెంటర్లకు ప్రతిపాదనలేవి? ● ఊసే లేని మైనార్టీ స్కిల్ డెవలప్మెంట్ కేంద్రాలు
ప్రజాస్వామ్యవాదులు గౌరవించేలా హైకోర్టు తీర్పు
ఓసీపీల్లో పని వేళలు మార్చాలి
కార్మికుల పనివేళలు మార్చాలి
మూడు పార్టీలకూ...‘కంటోన్మెంట్’ కీలకం
తప్పక చదవండి
- ఓటమి భయంలో కొడుకు.. డబ్బు మూటలతో తండ్రి!
- నెహ్రూ తండ్రి అప్పటి అంబానీ: కంగనా కీలక వ్యాఖ్యలు
- సుచరితకు హ్యాండిచ్చిన కాంగ్రెస్.. పూరీ బరిలో ఆయనే..
- వరుస ఫ్లాప్స్.. పూజా హెగ్డేకు మరో ఛాన్స్
- AP: ఆ జిల్లాల్లో రెండు రోజుల పాటు వర్షాలు
- నిజ్జర్ కేసులో అరెస్ట్.. భారత్కు సంబంధంలేదన్న జయశంకర్
- క్యాన్సర్తో పోరాటం.. ఇప్పుడేవీ సరిగా గుర్తుండట్లేదు: హీరోయిన్
- ఐరాసలో జగన్ విజన్
- బెంగళూరు గెలుపు ‘హ్యాట్రిక్’
Advertisement