breaking news
tanay tyagarajan
-
కరీంనగర్ భారీ స్కోరు.. రంగారెడ్డి లక్ష్యం ఎంతంటే?
తెలంగాణ టీ20 (టీజీ20) లీగ్- 2026లో భాగంగా గురువారం నాటి మధ్యాహ్నం మ్యాచ్లో కరీంనగర్ డైమండ్స్- రంగారెడ్డి రైజర్స్ తలపడుతున్నాయి. ఉప్పల్ వేదికగా రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో టాస్ గెలిచిన రంగారెడ్డి మొదట బౌలింగ్ ఎంచుకోగా.. కరీంనగర్ బ్యాటింగ్కు దిగింది.కరీంనగర్ భారీ స్కోరు.. రంగారెడ్డి లక్ష్యం ఎంతంటే?ఓపెనర్లు సాత్విక్ రెడ్డి (24), కెప్టెన్ తన్మయ్ అగర్వాల్ (29) ఫర్వాలేదనిపించగా.. సింహా, రాహుల్ రాదేశ్ ఆకాశమే హద్దుగా చెలరేగారు. సింహా 38 బంతుల్లోనే 60 పరుగులు చేయగా.. రాహుల్ 37 బంతుల్లోనే 72 పరుగులు సాధించాడు. చందన్ సహానీ (19), శుభం శర్మ (17 నాటౌట్) రాణించారు. ఫలితంగా నిర్నీత 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి కరీంనగర్ 230 పరుగులు సాధించింది. రంగారెడ్డి బౌలర్లలో తనయ్ జడ్డు రెండు వికెట్లు తీయగా.. తనయ్ త్యాగరాజన్, నితిన్ సాయి యాదవ్ తలా ఒక వికెట్ పడగొట్టారు.తుదిజట్లుకరీంనగర్ డైమండ్స్తన్మయ్ అగర్వాల్ (కెప్టెన్), హెచ్కే సింహ, రాహుల్ రాదేశ్ (వికెట్ కీపర్), చందన్ సహానీ, టీవీఎస్ నారాయణ తేజ, హరీశ్ ఠాకూర్, శుభం శర్మ, రత్లావత్ దినేశ్, ఆశిష్ శ్రీవాస్తవ్, సతీశ్ కుమార్.రంగారెడ్డి రైజర్స్తనయ్ త్యాగరాజన్ (కెప్టెన్), ఆరోన్ జార్జ్ వర్గీస్, అవినాశ్ రావు (వికెట్ కీపర్), అలంకృత్ రాపోల్, జ్ఞానప్రకాశ్ రెడ్డి, ఆదిత్య జవ్వాజి, నితిన్ సాయి యాదవ్, నానావత్ రాకేశ్, అరుణ్ కుమార్, తనయ్ జడ్డు, ఆర్యన్ కరియప్ప. -
త్యాగరాజన్ ఆల్రౌండ్ షో.. ఫాల్కన్స్పై రైజర్స్ ఘన విజయం
తెలంగాణ టీ20 లీగ్-2026లో భాగంగా ఇవాళ (జూన్ 23) రాత్రి జరిగిన మ్యాచ్లో మెదక్ ఫాల్కన్స్పై రంగారెడ్డి రైజర్స్ 5 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్లో టాస్ గెలిచి తొలుత బౌలింగ్ చేసిన రైజర్స్.. ఫాల్కన్స్ను 164 పరుగులకే (8 వికెట్ల నష్టానికి) కట్టడి చేసింది. అనంతరం రైజర్స్ బ్యాటర్లు మరో 10 బంతులు మిగిలుండగానే లక్ష్యాన్ని ఛేదించారు (5 వికెట్ల నష్టానికి). కెప్టెన తనయ్ త్యాగరాజన్ బంతితో (4-0-36-3), బ్యాట్తో (11 బంతుల్లో 21) సత్తా చాటి రైజర్స్ గెలుపులో కీలకపాత్ర పోషించాడు.రాణించిన బౌలర్లుతనయ్ త్యాగరాజన్ 3 వికెట్లతో పాటు ఓ క్యాచ్ పట్టి ఫాల్కన్స్ను కట్టడి చేశాడు. మిగతా బౌలర్లలో జడ్డూ, కరియప్ప తలో 2 వికెట్లు తీయగా.. అరుణ్ కుమార్ ఓ వికెట్ దక్కించుకున్నాడు. ఫాల్కన్స్ ఇన్నింగ్స్లో 49 పరుగులు చేసిన విక్రమ్ నాయక్ టాప్ స్కోరర్గా నిలిచాడు. సాయి కాకులమర్రి (38), నమన్ అగర్వాల్ (37) ఓ మోస్తరు స్కోర్లు చేశారు.శుభారంభం అందించిన ఓపెనర్లు165 పరుగుల లక్ష్య ఛేదనలో రైజర్స్ ఓపెనర్లు శుభారంభం అందించారు. ఆరోన్ జార్జ్ (27), అరవెల్లి అవనీశ్ (25) మెరుపు ఇన్నింగ్స్లతో గెలుపుకు గట్టి పునాది వేశారు. ఆతర్వాత వచ్చిన ఆదిత్య (12), అలంక్రిత్ (9) నిరాశపరిచినా.. రాకేశ్ (38 నాటౌట్) బాధ్యతాయుతంగా ఆడి రైజర్స్ను గెలుపుతీరాలకు చేర్చాడు. అతనికి తనయ్ త్యాగరాజన్, నితిన్ యాదవ్ (28 నాటౌట్) సహకరించారు. ఫాల్కన్స్ బౌలర్లలో వరుణ్ 2 వికెట్లు పడగొట్టగా.. రవితేజ, అబ్బాస్, అశ్విన్ రామ్ తలో వికెట్ దక్కించుకున్నారు. -
Hyd: 7 వికెట్లతో చెలరేగిన బౌలర్.. మనోళ్లదే ఆధిపత్యం
Ranji Trophy- Hyderabad vs Nagaland, Plate 1st Semi Final: రంజీ ట్రోఫీ- 2024 ప్లేట్ గ్రూపు తొలి సెమీ ఫైనల్లో హైదరాబాద్ ఆధిపత్యం కొనసాగిస్తోంది. నాగాలాండ్తో శుక్రవారం మొదలైన ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన హైదరాబాద్ తొలుత బ్యాటింగ్ చేసింది. తన్మయ్, తిలక్ సెంచరీలు ఓపెనర్ తన్మయ్ అగర్వాల్ (192 బంతుల్లో 164; 12 ఫోర్లు, 3 సిక్స్లు), కెప్టెన్ తిలక్ వర్మ (135 బంతుల్లో 101; 6 ఫోర్లు, 5 సిక్స్లు) సెంచరీలతో కదంతొక్కారు. రోహిత్ రాయుడు (59; 3 ఫోర్లు, 3 సిక్స్లు) అర్ధ సెంచరీ చేశాడు. తన్మయ్, రోహిత్ రాయుడు రెండో వికెట్కు 143 పరుగులు... తన్మయ్, తిలక్ మూడో వికెట్కు 155 పరుగులు జోడించారు. 462 డిక్లేర్డ్ ఇక రాహుల్ సింగ్ (5), రవితేజ (15) తక్కువ స్కోరుకే వెనుదిరిగారు. కె.నితీశ్ రెడ్డి 26, ప్రజ్ఞయ్ రెడ్డి 47 పరుగులు సాధించగా.. తనయ్ త్యాగరాజన్ 22 రన్స్ స్కోరు చేశాడు. ఈ క్రమంలో రెండో రోజు ఆటలో భాగంగా మొత్తంగా 107 ఓవర్ల ఆట ముగిసిన తర్వాత 8 వికెట్ల నష్టానికి 462 పరుగుల హైదరాబాద్ తమ తొలి ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది. సాకేత్ 3, కార్తికేయ 12 పరుగులతో అజేయంగా నిలిచారు. ఈ క్రమంలో శనివారం బ్యాటింగ్ మొదలుపెట్టిన నాగాలాండ్కు హైదరాబాద్ బౌలర్లు చుక్కలు చూపించారు. 60.1 ఓవర్లలోనే నాగాలాండ్ ఆట కట్టించారు. తనయ్ త్యాగరాజన్ ఏడు వికెట్లతో చెలరేగగా.. రవితేజ రెండు, సాకేత్ ఒక వికెట్ దక్కించుకున్నారు. 206 పరుగులకే ఆలౌట్ చేసి.. ఫాలో ఆన్ నాగాలాండ్ బ్యాటర్లలో ఓపెనర్ జోషువా ఒజ్కుమ్ అర్ధ శతకం(50)తో రాణించగా.. కెప్టెన్ రాంగ్సెన్ జొనాథన్ 41, జగనాథ్ సినివాస్ 44, సుమిత్ కుమార్ 38 పరుగులు చేశారు. మిగతావాళ్లలో ఒక్కరు కూడా కనీసం 12 పరుగుల మార్కు కూడా అందుకోలేకపోయారు. ఈ క్రమంలో 206 పరుగులకే నాగాలాండ్ ఆలౌట్ కాగా.. హైదరాబాద్కు తొలి ఇన్నింగ్స్లో 256 పరుగుల ఆధిక్యం లభించింది. ఈ క్రమంలో నాగాలాండ్ను ఫాలో ఆన్ ఆడించేందుకు హైదరాబాద్ మొగ్గు చూపింది. ఫలితంగా మళ్లీ బ్యాటింగ్కు దిగిన నాగాలాండ్ శనివారం నాటి ఆట పూర్తయ్యే సరికి 5 ఓవర్లలో వికెట్ నష్టానికి 20 పరుగులు చేసింది. కాగా ఈ మ్యాచ్లో గెలిస్తే హైదరాబాద్ జట్టు మళ్లీ ఎలైట్ డివిజన్కు అర్హత సాధిస్తుంది. చదవండి: Ind vs Eng: గాయమా? నో ఛాన్స్.. అందుకే అయ్యర్పై వేటు! ఇప్పట్లో నో ఎంట్రీ -
హైదరాబాద్ 415
జింఖానా, న్యూస్లైన్: కూచ్ బెహర్ అండర్-19 నాకౌట్ ట్రోఫీలో భాగంగా హైదరాబాద్తో జరిగిన మ్యాచ్లో ఢి ల్లీ జట్టు బౌలర్ రావత్ (6/118) చక్కటి బౌలింగ్తో బ్యాట్స్మెన్ను కట్టడి చేశాడు. ఢిల్లీలో బుధవారం రెండో రోజు ఓవర్నైట్ స్కోరు 306/4తో బరిలోకి దిగిన హైదరాబాద్ 124.4 ఓవర్లలో 415 పరుగులు చేసి ఆలౌటైంది. తనయ్ త్యాగరాజన్ (76) అర్ధ సెంచరీతో రాణించాడు. అనంతరం తన తొలి ఇన్నింగ్స్ను ప్రారంభించిన ఢిల్లీ ఆట ముగిసే సమయానికి 60 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 150 పరుగులు చేసింది. అరోర (56) అర్ధ సెంచరీతో అజేయంగా నిలవగా... రంజన్ (40), శర్మ (24 నాటౌట్) ఫర్వాలేదనిపించారు.


