breaking news
Sydapuram
-
ఎడతె‘గని’ మంత్రాంగం
సాక్షి టాస్స్పోర్స్: శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా సైదాపురంలో గడువు ముగిసిన గనుల లీజు పునరుద్ధరణ ద్రస్తాలు చకచకా కదులుతున్నాయి. వాస్తవానికి ఇండియన్ బ్యూరో ఆఫ్ మైన్స్ (ఐబీఎం) పరిధిలో ఉండే మైన్స్ శాఖ లీజు పునరుద్ధరణ చేయాల్సి ఉంది. అయితే నిబంధనలకు విరుద్ధంగా రాష్ట్ర గనుల శాఖ మంత్రి కార్యాలయం రివిజన్కు ఆహ్వానించడంపై దుమారం రేగుతోంది. నెల్లూరు టీడీపీ ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్రెడ్డి అనుచరుడు సైదాపురంలో లీజు ముగిసిన గనులను చేజిక్కించుకొని పునరుద్ధరణ కోసం మంత్రి పేషీలో చక్రం తిప్పుతున్నారు. రూ.కోట్ల ముడుపులు ముట్టజెప్పి లీజుల వ్యవహారాన్ని చక్కబెట్టేందుకు యత్నిస్తున్నారు. జరిగేది ఇలా.. సైదాపురం మండలంలోని తూర్పు రొండ్ల రెవెన్యూలోని సర్వే నంబర్లు 551, 553, 554.. మొలకల పూండ్లలో సర్వే నంబర్ 815 నుంచి 825లో 19,927 హెక్టార్ల విస్తీర్ణంలో క్వార్ట్జ్, పల్స్పర్, మైకా ఖనిజాలు తవ్వుకునేందుకు 1972లో 20 ఏళ్ల పాటు శోభారాణి పేరుతో లీజు కేటాయించారు. ఆపై మరో 30 ఏళ్లు లీజును పొడిగించారు. ప్రస్తుతం ఈ గడువు పూర్తయింది. సాధారణంగా 50 ఏళ్లు దాటిన గనుల లీజును పునరుద్ధరించరు. మేజర్ మినరల్ క్వార్ట్జ్ మైన్స్ కావడంతో లీజు పునరుద్ధరణ ఐబీఎం పరిధిలోకి వెళ్తుంది.తాజాగా కూటమి ప్రభుత్వం రావడంతో టీడీపీ నేతల దృష్టి గడువు ముగిసిన గనులపై పడింది. శోభారాణి క్వార్ట్జ్ గనిని తీసుకొని వెంటనే మైనింగ్ కమిషనర్కు లీజు పునరుద్ధరణ కోసం దరఖాస్తు పంపారు. వాస్తవంగా ఈ క్వార్ట్జ్ గని లీజు 2023 ఆగస్టులో ముగిసింది. వెంటనే నెల వ్యవధిలో పునరుద్ధరణ కోసం దరఖాస్తు చేసుకోవాలి. గతేడాది జూన్లో స్థానిక మైనింగ్ అధికారులను మేనేజ్ చేసుకొని దరఖాస్తు పంపారు. అయితే 11 నెలల తర్వాత లీజు కోసం దరఖాస్తు రావడంతో గనుల శాఖ కమిషనర్ ప్రవీణ్కుమార్ తిరస్కరించారు. శోభారాణి గనిపై రూ.32.11 కోట్ల పెనాల్టీ శోభారాణి పేరుతో ఉన్న గనిలో గతంలో లీజు గడువు ముగిసినా అక్రమంగా క్వార్ట్జ్ మెటల్ తవ్వి విక్రయాలు చేశారు. దీంతో కూటమి ప్రభుత్వంలోనే మైనింగ్ అధికారులు దాడులు జరిపి అక్రమంగా తవ్వేసిన క్వార్ట్జ్ మెటల్ను లెక్కించి రూ.32.11 కోట్ల పెనాల్టీ వేశారు. ఈ మేరకు డిమాండ్ నోటీసును ఇచ్చారు. పెనాల్టీ ని ఇంకా చెల్లించలేదు.పాత తేదీలతో ద్రస్తాలు కదిలించి గనుల శాఖ కార్యాలయానికి ఆ గని లీజు కోసం మంత్రి రివిజన్కు ఆహా్వనించాలని ఆదేశాలొచ్చాయి. వెంటనే నెల్లూరు గనులు, భూగర్భ శాఖ కార్యాలయం నుంచి ఆగమేఘాలపై పాత తేదీలతో ద్రస్తాలను కదిలించారు. మంత్రి కార్యాలయంలో రివిజన్కు ఆహ్వానించడం వరకు ఫైలు చకచకా కదిలింది. ఈ డీల్ వెనుక రూ.కోట్లు చేతులు మారాయనే ఆరోపణలున్నాయి. ఇదే బాటలో మరో నాలుగు చాగణంలోని భారత్ సిద్ధి వినాయక మైన్స్కు లీజు గడువు పూర్తయింది. ఆయా గనుల్లో అక్రమంగా వ్యాపారం జరిగిందని మైనింగ్ అధికారులు దాడులు చేసి పెనాల్టీ లు విధించారు. ఈ మైన్స్ లీజుల పునరుద్ధరణ పనిలో కూటమి నేతలు పడ్డారు. నిబంధలకు విరుద్ధంగా లీజు పునరుద్ధరణ కోసం మంత్రి రివిజన్కు ఫైళ్లు పంపారని తెలుస్తోంది.ఐబీఎం పరిధిలో ఉన్నా.. ప్రస్తుతం చిన్న తరహా ఖనిజాల జాబితాలో ఉన్న బెరైటీస్, క్వారట్జ్, పల్స్పర్, మైకా ప్రధాన ఖనిజాలను సైతం మేజర్ మినరల్స్ జాబితాలోకి చేరుస్తూ కేంద్రం గెజిట్ ప్రచురించింది. గతంలో ఇవి ప్రధాన ఖనిజాల జాబితాలోనే ఉండేవి. 2015లో మైనర్ మినరల్స్ జాబితాలోకి చేర్చి రాష్ట్ర ప్రభుత్వం లీజులు మంజూరు చేసేది. తాజాగా ఇక నుంచి లీజుల కేటాయింపు ఐబీఎం పరిధిలో చేర్చి అనుమతులు ఇచ్చేలా గెజిట్ను ప్రచురించారు. ప్రస్తుతం సైదాపురం గనులన్నీ ఐబీఎం పరిధిలో ఉంటాయి. ఇకపై లీజులకు అనుమతులను కేంద్ర ప్రభుత్వ పరిధిలోనే ఇవ్వాల్సి ఉంది. గడువు పూర్తయిన వాటిని వేలం ద్వారా కేటాయిస్తారు. ఎన్జీటీలో కేసులు ఉన్నా.. సైదాపురం గనుల వ్యవహారమై నేషనల్ గ్రీన్ ట్రిబ్యూనల్లో కేసులు నడుస్తున్నాయి. అక్కడ గనులను పరిశీలించి నివేదిక ఇవ్వాలని కలెక్టర్కు ఆదేశాలివ్వడంతో జాయింట్ ఇన్స్పెక్షన్ చేయించారు. నెల్లూరు ఆర్డీఓ, పొల్యూషన్ బోర్డు ఈఈ సమక్షంలో ఈ ప్రక్రియ జరిగింది. అక్రమంగా నడుస్తున్నాయంటూ నివేదిక ఇచ్చారని సమాచారం. అయినా మైనింగ్ అధికారులు ఈ గనులకు మంత్రి కార్యాలయానికి రివిజన్ పంపడం చర్చనీయాంశమైంది. 1956 ఎంఎం డీఆర్ యాక్ట్ ప్రకారం మేజర్ మినరల్ 50 ఏళ్లయితే ప్రభుత్వం వేలం ద్వారా లీజులు కేటాయించాలి. ఈ గనులపై హైకోర్టులో కేసులు నడుస్తున్నాయని తెలుస్తోంది. -
సైదాపురం మండలంలో ఆగని అక్రమ మైనింగ్ దందా
-
మేం చచ్చిపోతాం.. ఎలా బతకాలి సార్
-
విదేశీ యువతిపై అత్యాచారయత్నం
సైదాపురం/గూడూరు: అంతర్జాతీయ మహిళా దినోత్సవం నాడే శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో దారుణం జరిగింది. భారత దేశ పర్యటనకు వచ్చిన ఓ విదేశీ యువతిపై అత్యాచారయత్నానికి పాల్పడ్డారు ఇద్దరు యువకులు. వారి నుంచి తప్పించుకున్న బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. సీఐ శ్రీనివాసులురెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. లిథువేనియా దేశానికి చెందిన ఓ యువతి (26) భా రత దేశం పర్యటనకు వచ్చింది. సోమవారం శ్రీలం క నుంచి చెన్నై విమానాశ్రయానికి చేరుకుంది. గో వా వెళ్లేందుకు చెన్నై నుంచి బెంగళూరుకు బస్సులో బయల్దేరింది. ఆమె వద్ద ఇండియన్ కరెన్సీ లేకపోవడంతో బస్సు డ్రైవర్ ఆమెను బస్సు నుంచి దించేశా డు. అదే బస్సులోనే ఉన్న నెల్లూరు జిల్లా మనుబోలు మండలం బద్దెవోలు వెంకన్నపాళెం గ్రామానికి చెందిన ఇంగిలాల రమణయ్య కుమారుడు సాయికుమార్ ఆమెకు తన వద్ద ఉన్న డబ్బులు ఇచ్చాడు. ఆమెను పరిచయం చేసుకున్నాడు. సందర్శనీయ స్థలాలు చూపిస్తానని నమ్మించి తన స్వగ్రామం బద్దెవోలు వెంకన్నపాళెంకు తీసుకొచ్చాడు. గూడూరు రూరల్ పరిధిలోని ఎల్ఏపీ స్కూల్ ప్రాంతంలోని శారదానగర్కు చెందిన తన స్నేహితుడు షేక్ అబిద్తో కలిసి ఆమెపై అత్యాచారానికి పథకం రూపొందించాడు. మంగళవారం ఆమెకు కృష్ణపట్నం పోర్టు చూపుతామని చెప్పి, అబీద్తో కలిసి మోటార్ బైక్పై ఎక్కించుకుని బయలుదేరాడు. నిందితుల అరెస్టు చూపుతున్న పోలీసులు సైదాపురం సమీపంలోని అటవీ ప్రాంతానికి తీసుకెళ్లి అత్యాచారం చేయాలనుకున్నారు. ఆ ప్రాంతం అనుమానాస్పదంగా ఉండడంతో వారి నుంచి తప్పించుకుని ఆ యువతి రోడ్డుపైకి వచ్చింది. రోడ్డుపై ఒంటరిగా భయంతో నిలబడ్డ ఆ యువతిని చూసి స్థానికులు సైదాపురం పోలీస్ స్టేషన్కు తీసుకొచ్చారు. ఆమె జరిగిన విషయాన్ని పోలీసులకు తెలిపింది. ఈలోగా యువకులిద్దరూ పరారయ్యారు. జిల్లా ఎస్పీ విజయారావు ఆదేశాలతో డీఎస్పీ రాజగోపాల్రెడ్డి పర్యవేక్షణలో సీఐ శ్రీనివాసులరెడ్డి, సైదాపురం, గూడూరు రూరల్, మనుబోలు ఎస్సైలు టీంలుగా ఏర్పడి గాలించి నిందితులను అరెస్టు చేశారు. -
నీట మునిగిన 100 ఇళ్లు
సైదాపురం (శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా) : సైదాపురం మండలం గిద్దలూరు పంచాయతీ కొత్తూరు బీసీ కాలనీలో 100 ఇళ్లు నీట మునిగాయి. మూడు రోజుల నుంచి భారీగా వర్షం కురుస్తుండటంతో ఇళ్లలోకి నీళ్లు చేరాయి. అధికారులు కరెంటు కూడా తీసివేయడంతో తాగునీరుకు కూడా కష్టమయింది. -
వైఎస్సార్సీపీ నాయకుల ఇళ్లపై తెలుగు తమ్ముళ్ల దాడి
సైదాపురం (నెల్లూరు) : ఇసుక అక్రమ రవాణాను అడ్డుకుంటున్నారనే అనుమానంతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకుడు, కార్యకర్త ఇళ్లపై తెలుగు తమ్ముళ్లు రాళ్ల దాడికి పాల్పడ్డారు. ఈ ఘటన నెల్లూరు జిల్లా సైదాపురం మండలం దేవరవేమూరు గ్రామంలో శుక్రవారం మధ్యాహ్నం జరిగింది. టీడీపీ నాయకుడు శరత్, అతని అనుచరులు వైఎస్సార్ కాంగ్రెస్ నాయకుడు ఎ.ప్రసన్నకుమార్రెడ్డి, కార్యకర్త తిరుపతయ్య ఇళ్లపై రాళ్ల దాడి చేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు గ్రామానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. -
స్కూల్ బస్సు బోల్తా: 10 మందికి గాయాలు
నెల్లూరు: శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా సైదాపురం మండలం కమ్మవారిపాలెం సమీపంలో స్కూల్ విద్యార్థులతో వెళ్తున్న బస్సు బోల్తా పడింది. ఈ ఘటనలో 10 మంది విద్యార్థులు గాయపడ్డారు. స్థానికులు వెంటనే స్పందించి విద్యార్థులను బస్సులో నుంచి బయటకు తీసి... పోలీసులకు సమాచారం అందంచారు. పోలీసులు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకుని విద్యార్థులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. బస్సు డ్రైవర్ అతి వేగమే ప్రమాదానికి కారణమని స్థానికులు ఆరోపిస్తున్నారు. దాంతో పోలీసులు డ్రైవర్ను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి విచారిస్తున్నారు. -
చదువులేని బతుకు వద్దమ్మా..
కొడవలూరు మండలంలోని నార్త్రాజుపాళెం నివాసి పోలిశెట్టి పద్మమ్మ కుమార్తె హారికకు చదువంటే ప్రాణం. ఇటీవల పదో తరగతిలో పదికి 8.3 పాయింట్లు సాధించింది. భవిష్యత్పై ఎన్నో కలలు కంటూ ఇంటర్లో చేరాలని భావించింది. భర్త చనిపోయి కుటుంబం గడవడమే కష్టమైన పద్మమ్మకూ కూతురిని చదివించాలనే ఆశ ఉన్నా ఆర్థికలేమి అడ్డంకిగా మారింది. ‘అమ్మా నిన్ను చదివించాలనే కోరిక నాకూ ఉంది. కాని చదువంటే మాటలు కాదు..డబ్బుతో పని. మనదగ్గర డబ్బులేకుండా నిన్ను ఎలా చదివించాలి’ అని తన నిస్సహాయతను వ్యక్తం చేసింది అమ్మ పద్మమ్మ. చదువులేని జీవితం వృథా అని కాబోలు ఆ బిడ్డ సైదాపురం మండలం చాగణంలో మేనత్తగారి ఇంట్లో బుధవారం ఆత్మహత్యకు పాల్పడింది. సైదాపురం, న్యూస్లైన్: కొడవలూరు మండలంలోని నార్త్రాజుపాళెం నివాసి పోలిశెట్టి పద్మ పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తోంది. కొంతకాలం కిందట పద్మమ్మ భర్త చనిపోయారు. పద్మమ్మకు కుమారుడు, కుమార్తె ఉన్నారు. కుమార్తె హారిక రాజుపాళెం లో చదివి ఇటీవల పదో తరగతి 8.3 పాయింట్లు సాధించింది. ‘అమ్మా నేను ఇంటర్లో చేరుతా. పెద్ద చదువులు చదువుకుంటా’ అని తల్లిని ప్రాథేయపడింది హారిక. ‘నాన్న చనిపోయాడు కదమ్మా. నీవు చదువుకునేందుకు మన దగ్గర డబ్బులేదు. ఇక చదువు మా నేయి’ అని బాధను దిగమింగుకుని బిడ్డకు తల్లి సర్ది చెప్పింది. చదువును ప్రాణంగా ప్రేమించే హారిక మనసును తల్లి మాటలు మార్చలేకపోయాయి. సైదాపురం మండలంలోని చాగణంలో ఉన్న మేనత్త రాజేశ్వరమ్మ దగ్గరికి వెళుతున్నానని చెప్పి సోమవారం అమ్మకు వీడ్కోలు చెప్పింది. మేనత్తగారింటికి వచ్చిన హారిక దిగులుగానే ఉండింది. అనుక్షణం తానిక చదువుకు దూరంగా ఉండాలనే ఆలోచన హృదయాన్ని కలచివేసింది. చదువులేని బతుకు ఎందుకని జీవితంపై విరక్తితో మంగళవారం రాత్రి మేనత్త ఇంట్లో ఉన్న పురుగుల మందు తాగింది. అపస్మారక స్థితిలో ఉన్న హారికను రాపూరు ఆస్పత్రికి తరలించారు. ప్రాథమిక చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం నెల్లూరుకు తరలించారు. నెల్లూరులో చికిత్స పొందుతూ బుధవారం ఆ చదువుల బిడ్డ తుదిశ్వాస విడిచింది. ఎస్ఐ సందీప్ సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం పూర్తి చేయించి బంధువులకు అప్పగించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్ఐ తెలిపారు. అమ్మా వెళుతున్నా.. అమ్మా వెళుతున్నా అంటూ హారిక తన తల్లితో అన్న చివరిమాటలు. శవమై బిడ్డ ఇంటికి రావడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు. కుటుంబం ఆర్థిక పరిస్థితే హారిక మృతికి కారణమని గ్రామస్తులు తెలిపారు.