-
అమెరికాలో మన గిరాకీ!
భారత్ - అమెరికా బంధాలు రోజు రోజుకు గట్టిపడుతున్నాయని చెప్పవచ్చు. ముఖ్యంగా పీవీ నరసింహారావు వేసిన పునాదులపైన ఆ బంధాలు మరింత దృఢపడుతున్నాయి. అమెరికాలో నివసించే భారతీయుల సంఖ్య కూడా గణనీయంగా పెరుగుతోంది. అగ్రరాజ్యంలో ఎవరు అధికారంలో వున్నా, భారతీయులు కీలక భూమిక పోషిస్తున్నారు. పాలనలో,రాజకీయాలలోనూ,ఐటీ పరిశ్రమలోనూ, ఆ దేశ ఆర్ధిక వృద్ధిలోనూ మన పాత్ర ప్రశంసాపాత్రంగా ఉంటోంది. తాజాగా భారత్ పై అమెరికా రాయబారి కురిపించిన ప్రశంసలు, చేసిన వ్యాఖ్యలు ఈ తీరుకు అద్దం పడుతున్నాయి. ఎవరైనా అమెరికా వెళ్లాలని ఉవ్విళ్లూరుతారు! అమెరికా రాయబారి ఎరిక్ గార్శెట్టి మాత్రం భవిష్యత్తును దర్శనం చేసుకోవాలంటే భారత్కు రండి..అంటూ పిలుపునిచ్చారు.ఎరిక్ ప్రస్తుతం అమెరికా రాయబారిగా మన దేశంలో వున్నారు. దిల్లీలో జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన పాల్గొని ఉపన్యాసం అందించారు. అందులో ఆయన చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి.ప్రపంచ దేశాలు అప్పుడే చర్చించుకోవడం మొదలుపెట్టాయి. "మేం ఇక్కడికి పాఠాలు బోధించేందుకు రాలేదు, నేర్చుకోవడానికి వచ్చాం " అని ఆయన అన్నారు. ఇరు దేశాల మధ్య అవగాహన కూడా బాగా పెరుగుతూ వస్తోందని చెప్పడానికి ఇది ఉదాహరణగా నిలుస్తుంది. అమెరికాలో ఖలిస్తాన్ ఉగ్రవాది గురు పత్వంత్ సింగ్ పన్నూ హత్యకు సంబంధించిన కుట్ర కేసులో భారతీయుడుపై అభియోగాలు వచ్చాయి. ఈ అంశం రెండు దేశాల బంధంపై ఎటువంటి ప్రభావం చూపిస్తుందో? అనే చర్చ పెద్దఎత్తున జరుగుతూనే వుంది.అయితే! ఈ కేసు దర్యాప్తు విషయంలో భారత్ అందిస్తున్న సహకారాన్ని అమెరికా మెచ్చుకుంటోంది. ఆ దేశ జాతీయ భద్రతా సలహాదారు జేక్ సలివాన్ కూడా అమెరికా -భారత్ బంధం పట్ల గొప్ప ఆశాభావాన్ని వ్యక్తం చేయడం కూడా గమనార్హం. రిచర్డ్ నిక్సన్ - ఇందిరాగాంధీ సమయంలో ఇరు దేశాల మధ్య బంధాలు ఏ మాత్రం బాగా ఉండేవి కాదు. పీవీ నరసింహారావు అద్భుతమైన బంధాన్ని ఏర్పరచారు. మన్మోహన్ సింగ్ అదే దారిలో నడిచారు. బుష్- సింగ్ కాలంలో ఈ స్నేహం ఎంతో వికసించింది. నరేంద్రమోదీ - డోనాల్డ్ ట్రంప్ సమయంలో మరింత ఆత్మీయంగా మారింది. జో బైడెన్ మొదటి నుంచి భారత్ పై ప్రత్యేకమైన అభిమానం,గౌరవం చూపిస్తూ వస్తున్నారు. ఆయన అధ్యక్షుడుగా అధికార పీఠం అధిరోహించినప్పటి నుంచి మరింత ప్రభావశీలంగా సాగుతోంది. బరాక్ ఒబామా పరిపాలనా కాలంలోనూ బాగా నడిచింది. డోనాల్డ్ ట్రంప్ మళ్ళీ అధ్యక్షుడుగా అధికారం చేపట్టడానికి సిద్ధమవుతున్నారు. జో బైడెన్ -ట్రంప్ మధ్య పెద్ద పోటీ నడుస్తోంది. భవిష్యత్తు ఎన్నికల్లో ఎవరు అధికారంలోకి వచ్చినా, ఇరుదేశాల ప్రయాణానికి ఎటువంటి ఢోకా ఉండదని అంచనా వెయ్యవచ్చు. వాణిజ్యం, పెట్టుబడుల పెరుగుదల, భద్రతా సహకారం మొదలైన విషయాల్లో భారత్ వైపు అమెరికా గట్టిగా నిలబడుతోంది. ప్రపంచ ఆర్ధిక, వాణిజ్య వేదికలలో భారతదేశ స్థాయిని, ప్రాతినిధ్యాన్ని పెంచడంలో అమెరికా కీలక భూమిక పోషిస్తోంది. ఎగుమతులు, సాంకేతిక భాగస్వామ్యంతో ఉమ్మడి తయారీ అంశాల్లోనూ అగ్రరాజ్యం మనకు సంపూర్ణ సహకారాన్ని అందిస్తోంది. ప్రపంచంలో తమకు ఎంతో ఇష్టమైన దేశాలలో భారత్ తొలివరుసలో ఉంటుందని అమెరికా ప్రజలు అంటున్నారు. వస్తువులు, సేవలు రెండింటిలోనూ ద్వైపాక్షిక వాణిజ్యం పెరుగుతూ రావడం శుభ పరిణామం.బ్రిటిష్ పాలనా కాలంలోనూ, స్వాతంత్ర్యానంతర భారతంలోనూ చాలా ఏళ్ళు రెండు దేశాల మధ్య బంధాలు అంత ఆరోగ్యం లేవన్నది పచ్చినిజం. ముఖ్యంగా ఈ రెండు దశాబ్దాలలో ఆరోగ్యకరమైన బంధాలు సాగుతున్నాయి. మన దేశానికి ప్రత్యక్ష పెట్టుబడులు అందించే దేశాలలో అగ్రరాజ్యానిది విశిష్టమైన స్థానం.వాణిజ్య భాగస్వామిగా అమెరికాది రెండో స్థానం.అమెరికాలో మన భారతీయుల జనాభా సుమారు 1.35 శాతం వున్నట్లు సమాచారం.ఆ దేశంలో బాగా సంపాయిస్తున్న జాతుల్లో భారత జాతీయులకు సమున్నత స్థానం వున్నది.మన తెలుగువారి స్థానం గణనీయం.అక్కడ మన దేశ భాషలు మాట్లాడేవారిలో అందరికంటే అగ్రస్థానం తెలుగు వారిదే. ఆ తర్వాత తమిళ, బెంగాలీలు వస్తారు. ఆ తర్వాతి స్థానంలో హిందీ వుంది.1910 ప్రాంతంలో అమెరికాలోని భారతీయుల జనాభా కేవలం 2,545.2020 జనాభా లెక్కల ప్రకారం సుమారు 50లక్షలమంది వున్నారు.ఈ నాలుగేళ్లలో ఇంకా పెరిగారు. సాఫ్ట్ వేర్ రంగం అభివృద్ధిలోకి వచ్చాక అమెరికాలో నివసిస్తున్న తెలుగువారి సంఖ్య గణనీయంగా పెరుగుతూ వస్తోంది.2000ప్రాంతంలో మనవారు సుమారు 90వేల మంది ఉండేవారు. ప్రస్తుతం ఆ సంఖ్య దాదాపు 12లక్షల 40వేలకు పెరిగింది. వీరిలో ఉద్యోగస్తులతో పాటు విద్యార్థులు కూడా ఉంటారు. వివిధ రంగాల్లో అక్కడ రాణిస్తున్న మనవాళ్ళ పేర్లు చెప్పాలంటే పెద్ద జాబితా అవుతుంది. అయితే! మనవాళ్ళపై జాతి విద్వేషాలు, వైషమ్యాలు జరుగుతూనే వున్నాయి. అవి ఆగాలి. వీసా ఇబ్బందులు తీరడం లేదు.అవి తీరాలి. ఉద్యోగాల కల్పనలోనూ,జీత భత్యాల విషయంలోనూ అసమానతలు పెరుగుతూనే వున్నాయి. వీటికి చరమగీతం పాడాలి.ప్రపంచంలోనే భారత్ ది అతి పెద్ద మార్కెట్. జనాభాలో త్వరలోనే చైనాను సైతం మనం అధిగమిస్తాం. ఎల్లకాలం అగ్రరాజ్యంగా ఉండాలన్నది అమెరికా ఆశ. చైనాను దెబ్బకొట్టాలన్నది మరో వ్యూహం. ఇస్లాం తీవ్ర వాద భయాలు కూడా ఆ దేశానికి బాగా వున్నాయి. ప్రపంచ దేశాల ప్రయాణంలో భారత్ తో స్నేహం, సహకారం అమెరికాకు ఎంతో అవసరం.ఆర్ధిక, రాజకీయ, సామాజిక స్వార్థంతో, మన దేశంతో అమెరికా గట్టి బంధాలను కోరుకుంటోంది. మనకు కూడా ఆ దేశంతో ఎంతో అవసరం ఉంది. అనేక అంశాలలో రెండు దేశాలు కలిసి సాగాల్సిన చారిత్రక అవసరాలు వున్నాయి.మానవవనరుల అభివృద్ధిలో మన ప్రయాణం ఆ దేశానికి ఎంతో నచ్చింది. రెండు దేశాల మధ్య ఇచ్చిపుచ్చుకొనే ధోరణులు మరింత పెరగాలి. మనం భవిష్యత్తులో ద్వితీయ స్థానాన్ని ఆక్రమిస్తే? అప్పుడు అమెరికా మనతో ఎలా ఉండబోతుందో కాలచక్రంలోనే తెలుస్తుంది. మొత్తంగా చూస్తే, అమెరికా దృష్టిలో మన గిరాకీ పెరిగింది. -మాశర్మ -
పసిడి రుణాల ఎన్బీఎఫ్సీలదే హవా..
న్యూఢిల్లీ: బ్యాంకుల నుంచి గట్టి పోటీ ఉంటున్నప్పటికీ పసిడి రుణాలిచ్చే నాన్–బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీల (ఎన్బీఎఫ్సీ) వ్యాపార కార్యకలాపాలు పటిష్టంగా సాగుతున్నాయి. కరోనా సమయంతో పోలిస్తే కాస్తంత తగ్గినా మార్కెట్లో అవి తమ ఆధిపత్యాన్ని నిలబెట్టుకుంటున్నాయి. క్రిసిల్ రేటింగ్స్ నివేదిక ప్రకారం 2021 మార్చి నుంచి 2023 సెపె్టంబర్ మధ్య కాలంలో మార్కెట్ పరిమాణం రూ. 2.5 లక్షల కోట్లకు చేరగా, వాటి మార్కెట్ వాటా 61 శాతంగా నమోదైంది. కరోనా విస్తృతంగా ఉన్న 2022 ఆర్థిక సంవత్సరంలో మార్కెట్ పరిమాణం దాదాపు రూ. 2 లక్షల కోట్లుగా ఉండగా, పసిడి రుణాల ఎన్బీఎఫ్సీల వాటా 64 శాతంగా ఉండేది. ఆ తర్వాత 2023 ఆర్థిక సంవత్సరంలో మార్కెట్ రూ. 2.3 లక్షల కోట్లకు చేరగా, వాటి వాటా 62 శాతానికి పరిమితమైంది. మార్కెట్లో మూడింట రెండొంతుల వాటా ప్రైవేట్ సంస్థలదే ఉన్నప్పటికీ.. అత్యధికంగా పసిడి రుణాలిచి్చన సంస్థగా (రూ. 1.3 లక్షల కోట్లు) ప్రభుత్వ రంగ కెనరా బ్యాంకు ఉంది. వాటా పెంచుకుంటున్న బ్యాంకులు.. బ్యాంకులు కూడా క్రమంగా పసిడి రుణాల మార్కెట్లో తమ వాటాను పెంచుకుంటున్నాయి. రూ. 2.5 లక్షల కోట్ల మార్కెట్లో 39 శాతం వాటాను (1 శాతం వృద్ధి) దక్కించుకున్నాయి. అలాగే, గత మూడేళ్లుగా వ్యవసాయేతర బంగారు రుణాలపై.. ముఖ్యంగా రూ. 3 లక్షల పైబడిన లోన్స్పై ఎక్కువగా దృష్టి పెడుతున్నాయి. కొత్త ప్రాంతాల్లో మరిన్ని శాఖలను ఏర్పాటు చేయడం, ఆన్లైన్లో రుణాలివ్వడం, ఇంటి వద్దకే సర్వీసులు అందించడం వంటి వ్యూహాలతో పసిడి రుణాల ఎన్బీఎఫ్సీలు ముందుకెడుతున్నట్లు క్రిసిల్ రేటింగ్స్ డైరెక్టర్ బి. మాళవిక తెలిపారు. బంగారం ధరల పెరుగుదల కూడా ఎన్బీఎఫ్సీల పోర్ట్ఫోలియో వృద్ధిని ప్రభావితం చేస్తున్నాయి. ఎన్బీఎఫ్సీల గోల్డ్ లోన్స్ ఏయూఎం వృద్ధికి ప్రధానంగా మూడు కారణాలు ఉంటున్నాయని క్రిసిల్ పేర్కొంది. కస్టమర్లు చేజారిపోకుండా ఎన్బీఎఫ్సీలు తగు ప్రయత్నాలు చేస్తుండటం, చిన్న..మధ్య స్థాయి రుణాలపై దృష్టి పెట్టడం, శాఖల నెట్వర్క్ను పెంచుకోవడం ద్వారా కస్టమర్లకు మరింత చేరువయ్యే ప్రయత్నాలు చేస్తుండటం ఇందుకు దోహదపడుతున్నట్లు వివరించింది. -
పవన్ ఏం చెబుతాడోనని అందరూ ఎదురుచూశారు
-
సంక్షేమ జాతర.. అర్హులకు టోకరా!
సాక్షి ప్రత్యేక ప్రతినిధి :రాష్ట్ర ప్రభుత్వం ప్రజా సంక్షేమమే లక్ష్యంగా అనేక పథకాలు ప్రవేశ పెడుతోంది. అయితే అవి అర్హులకు అందడం లేదని, నిరుపేదలకు నిరాశే ఎదురవుతోందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. రాజకీయ దన్ను లేదా బలమైన సిఫారసు ఉంటేనే గృహలక్ష్మి, బీసీ, మైనారిటీ బంధు పథకాల జాబితాలో చోటు దక్కుతోందని ఆయా పథకాలకు అన్ని విధాలా అర్హులైన వారు వాపోతున్నారు పోటీ తీవ్రంగా ఉండటంతో.. ‘ఇప్పటికైతే పార్టీలో ముఖ్య నాయకులు, కార్యకర్తలకే పంచేద్దాం..ఈ మేరకు గ్రామాల వారీగా జాబితాలు పంపండి’ అంటూ ఎమ్మెల్యేల కార్యాలయాల నుంచి వచ్చిన ఆదేశాల మేరకు జాబితాలు సిద్ధం అవుతున్నాయనే ఆరోపణలు వెల్లువెత్తు తున్నాయి. గృహలక్ష్మి పథకం కింద రాష్ట్రవ్యాప్తంగా 3.57 లక్షల ఇళ్లకు గాను 14.91 లక్షల దరఖాస్తులు వచ్చాయి. బీసీబంధు పథకం కింద ఒక్కో నియో జకవర్గంలో 300 మందికి, మైనారిటీ బంధు కింద 100 మందికి ఆర్థిక సహా యం చేయాలని నిర్ణయించారు. ఈ రెండు పథకాలకూ వేలల్లో దర ఖాస్తు లు వచ్చాయి. పలు జిల్లాల్లో లబ్ధిదారుల ఎంపికను దాదాపు పూర్తి చేశారు. వాస్తవానికి అత్యంత నిరుపేదలకు, ఇచ్చే ఆర్థిక సహాయాన్ని జీవనోపాధికి ఉపయోగించుకునే సాంకేతికత, ఇతర పరిజ్ఞానం ఉన్న వారికే ప్రాధాన్యత ఇవ్వాల్సి ఉన్నా.. ఎమ్మెల్యేలు చెప్పినవారికి, బంధుగణానికి ప్రాధాన్యత ఇస్తున్నారని, కొన్ని చోట్ల అర్హుల జాబితాల్లో చేర్చేందుకు 10 నుంచి 30% కమీషన్ మాట్లాడుకుంటున్నారనే ఆరోపణలు విన్పిస్తున్నాయి. ఎమ్మెల్యేలు ఇచ్చే జాబితాలను తమసిబ్బందితో కలిసి పరిశీలించాల్సిన జిల్లా యంత్రాం గాలు, కనీస పరిశీలన లేకుండానే ఆమోద ముద్ర వేసేసి చేతులు దులుపు కొంటూ సంక్షేమాన్ని పక్కదారి పట్టిస్తున్నాయనే విమర్శలు వస్తున్నాయి. పథకం ఏదైనా అదే తీరు.. డబుల్ బెడ్రూంలు దక్కని నిరుపేద తన సొంత జాగాలో ఇల్లు కట్టుకుంటే మూడు దశల్లో రూ.3 లక్షల ఆర్థిక సహాయం అందజేస్తారు. ఇందులో బీసీలకు 50 శాతం, ఎస్సీలకు 20, ఎస్టీలకు10, ఇతరులకు 20 శాతం రిజర్వేషన్లు కల్పించాలి. ఆయా కులాల్లో దివ్యాంగులుంటే వారికి 5 శాతం కేటాయించాలి. కానీ మెజారిటీ నియోజకవర్గాల్లో ఈ నిబంధనలు పాటించలేదు. చేతి వృత్తులే జీవనాధారమైన నాయీ బ్రాహ్మణ, రజక, సగర పూసల, మేదరి, వడ్డెర, ఆరెకటిక, కమ్మరి, కుమ్మరి, వడ్రంగి, కంసాలి, కంచరి ఇతర ఎంబీసీ కులాల్లో పేదరికం, వృత్తి నైపుణ్యం ఆధారంగా ఆర్థిక సహాయం చేయాలని నిర్ణయించారు. అయితే ఈ ప్రాధాన్యతలేవీ పాటించటం లేదని జిల్లా కలెక్టర్లకు చేరిన జాబితాలు చూస్తే అర్థం అవుతోంది. మైనారిటీ బంధులో లబ్ధిదారుల సంఖ్య తక్కువే ఉన్నప్పటికీ ఇందులో కూడా నిబంధనలు, ప్రాధాన్యతల పాటింపుపై అక్కడక్కడా ఆరోపణలు విన్పిస్తుండటం గమనార్హం. పథకాలు కలెక్టర్లకు అప్పగించాలి.. ప్రస్తుతం అమలు చేస్తున్న దళిత, మైనారిటీ, బీసీ బంధుతో పాటు నిరుపేదల ఇంటి నిర్మాణానికి రూ.3 లక్షల ఆర్థిక సహాయం పథకాలు పూర్తి పక్కదారి పట్టాయి. రాష్ట్ర ప్రజలు పన్నులతో వచ్చిన ఆదాయం దుర్వినియోగం అవుతోంది. నిజమైన అర్హులకు కాకుండా గ్రామ స్థాయి పార్టీ నాయకులు, ఎమ్మెల్యేల ద్వారా జరుగుతున్న ఎంపికలతో వాస్తవ పేదలకు న్యాయం జరగడం లేదు. వెంటనే ఈ పథకాన్ని పూర్తిస్థాయిలో కలెక్టర్లకు అప్పగించడం ద్వారా ప్రభుత్వం అందించే ప్రతి పైసా నిరుపేదల ఆర్థిక ప్రగతికి ఉపకరించేలా చర్యలు తీసుకోవాలి. – పద్మనాభరెడ్డి, ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ గృహ‘లక్షీ కటాక్షం’ లేదంట పూరి గుడిసెలో జీవితాన్ని వెల్లదీస్తున్న ఈమె పేరు గాలి ఉపేంద్ర. మహబూబా బాద్ జిల్లా నల్లెల గ్రామం. డబుల్ బెడ్రూం రాలేదు. చివరకు సొంత జాగాలో ఇల్లు కట్టుకునేందుకు గృహలక్ష్మి పథకంలో రూ.3 లక్షలైనా ఇస్తారన్న ఆశతో దరఖాస్తు చేసింది. అన్ని అర్హతలున్న తనకు లబ్ధి చేకూరుతుందని ఎదురుచూసింది. కానీ ఈ మారు కూడా ఇళ్లు ఇవ్వటం లేదని గ్రామ నాయకులు తేల్చేశారు. అర్హతలున్నా ఎంపిక చేయలేదు..! ఈమె పేరు రాచమల్ల మంజుల. సీఎం కేసీ ఆర్ ప్రాతినిథ్యం వహిస్తున్న గజ్వేల్ నియో జకవర్గంలోని అలిరాజపేట గ్రామం. ఇటీ వల భర్త చనిపోవటంతో కొడుకు శ్రీకాంత్తో కలిసి ఇస్త్రీ షాపునకు అవసరమయ్యే పని ముట్లు కొనేందుకు బీసీబంధు పథకంలో లక్ష రూపాయల కోసం దరఖాస్తు చేసుకుంది. ఇలా ఈ ఊరిలో మొత్తం 33 మంది దరఖాస్తు చేసుకుంటే కేవలం ఇద్దరినే ఎంపిక చేశారు. అయితే ఆ ఇద్దరు తమకంటే అన్ని విధాలుగా బాగా ఉన్నవారేనని మంజుల పేర్కొంది. -
ఆ సమస్యలను సాధారణీకరించే నిర్వహణకు చైనా పిలుపు!
చైనా అంతర్జాతీయ సరిహద్దులో విభేదాలను సాధారణీకరించే నిర్వహణకు పిలుపుచ్చింది. గాల్వన్ ఘటన నేపథ్యంలో ఇరుదేశాల రక్షణమంత్రుల మొదటి సమావేశంలో కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ ఇచ్చిన బలమైన సందేశం తదనంతరం చైనా జనరల్ లీ షాంగ్ఫూ ఇలా వ్యాఖ్యానించారు. ఈ మేరకు చైనా రాయబార కార్యాలయం ఒక ప్రకటనలో.. ఇరుపక్షాలు దీర్ఘకాలికి దృక్పథాన్ని తీసుకోవాలి. ద్వైపాక్షిక సంబంధాలలో సరిహద్దు సమస్యను తగిన స్థానంలో ఉంచాలి. సరిహద్దు పరిస్థితిని సాధారణీకరించే నిర్వహణకు ప్రోత్సహించాలి అని పేర్కొంది. ఐతే ఇది భారత్కు ఆమోదయోగ్యం కాదు. సరిహద్దు పరిస్థితి రెండు దేశాల మధ్య బంధాల విస్తరణతో ముడిపడి ఉందని భారత్ స్పష్టం చేసింది. కానీ చైనా భారత్తో విభేదాల కంటే సాధారణ ప్రయోజనాలనే పంచకుంటుందని తెలిపింది. ఇరు పక్షాల ద్వైపాక్షిక సంబంధాలు, పరస్పర అభివృద్ధిని, సమగ్ర దీర్ఘకాలికి వ్యూహాత్మక కోణం నుంచి చూడాలని చైనా నొక్కి చెబుతోంది. తద్వారా ప్రపంచానికి వివేకం, బలాన్ని సంయుక్తంగా అందించాలని చైనా పేర్కొంది. ఇదిలా ఉండగా, షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ సమావేశం సందర్భంగా ఇరు పక్షుల మంత్రుల సమావేశం తర్వాత భారత్ తన ప్రకటనలో భారత్ చైనా మధ్య సంబంధాల అభివృద్ధి శాంతి ప్రాబల్యంపైనే ఆధారపడి ఉందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ స్పషం చేశారు. సరహద్దు సమస్యలు ద్వైపాక్షిక ఒప్పందాలకు, నిబంధనలకు అనుగుణంగా పరిష్కరించాల్సిన అవసరం ఉందన్నారు. ఒప్పందాల ఉల్లంఘన ద్వైపాక్షిక సంబంధాల మొత్తం ప్రాతిపదికన క్షీణింపచేస్తుందని హెచ్చరించారు. సరిహద్దులను విడదీయడంతో ఈ సమస్య మరింత తీవ్రతరం అవుతుందని రక్షణ మంత్రి రాజ్నాథ్ పునరుద్ఘాటించారు. చైనా మాత్రం సరిహద్దుల్లో పరిస్థితి సాధారణంగా స్థిరంగా ఉందని ఇరు పక్షాల సైనికు దౌత్య మార్గాల ద్వారా చర్చలు కొనసాగించాయని చెబుతోంది. అందువల్ల పరస్పర విశ్వాసాన్ని పెంపొందించేలా కలిసి పనిచేయాలని ఆశిస్తున్నామని అందుకు సహకరించండి అని చైన పేర్కొనడం గమనార్హం. (చదవండి: నా కూతురు కారణంగానే అతను ప్రధాని అయ్యారు! సుధామూర్తి)
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
T20 WC 2024: టీమిండియా టీ20 వరల్డ్ కప్ జెర్సీ ఇదే.. ఫోటోలు వైరల్
కాంగ్రెస్కు పాకిస్తాన్ మద్దతు ఉంది: అనురాగ్ ఠాకూర్
టాలీవుడ్ హీరో డ్రీమ్ ప్రాజెక్ట్.. రెబల్ స్టార్ ఎంట్రీ!
ఇరాన్ నుంచి పారిపోయి కొచ్చికి భారత మత్స్యకారులు
పాఠశాల నేపథ్యంలో వస్తోన్న సత్య.. ఆసక్తిగా ట్రైలర్!
Best Pictures Of The Day : ఈ రోజు ఉత్తమ చిత్రాలు (06-05-2024)
Video: కేసీఆర్ బస్సును తనిఖీ చేసిన ఎన్నికల అధికారులు
'దేవర' షూటింగ్లో తేనెటీగల కలకలం.. 20 మందికి గాయాలు
ఎస్ఆర్హెచ్తో ముంబై కీలక పోరు.. కొత్త ప్లేయర్ ఎంట్రీ
వారితో భయంకరమైన అనుభవాలు ఎదుర్కొన్నా: హీరామండి నటి
తప్పక చదవండి
- సోనాక్షితో ఇంటిమేట్ సీన్స్.. ఆమె తల్లి ఏమన్నారంటే: నటుడు
- అలా చేస్తే ఆ కిక్కే వేరు! అతడితో లవ్లో ఉన్నా: నటి
- హీట్వేవ్ నుంచి ఉపశమనం.. త్వరలో వర్షాలు: వాతావరణ శాఖ
- డైరెక్టర్తో హీరోయిన్ పెళ్లి.. మామయ్యను మండపానికి రానివ్వలేదట!
- మాచర్లలో సీఎం జగన్ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)
- కాంగ్రెస్ కీలక నిర్ణయం: బరిలోకి మాజీ ముఖ్యమంత్రులు
- హార్దిక్ కాదు!.. రోహిత్ తర్వాత టీమిండియా కెప్టెన్ అతడే!
- సమ్మర్లో కొబ్బరిబోండంలోని నీటిని నేరుగా తాగేస్తున్నారా..?
- చంద్రబాబు మోసాల చరిత్రను గుర్తు తెచ్చుకోండి: సీఎం జగన్
- కల్వకుంట్ల కవితకు బిగ్ షాక్
Advertisement