-
డబ్బుతో వస్తేనే టీడీపీ టికెట్లు
రాయచోటి టౌన్: తెలుగుదేశం పార్టీలో సూట్కేసుల్లో డబ్బు తీసుకొచ్చినవారికే టికెట్లు కేటాయిస్తున్నారని, ఎన్నో ఏళ్లుగా జెండామోసినవారికి, పార్టీకోసం అహరి్నశలు కష్టపడినవారికి మొండిచెయ్యి చూపుతున్నారని టీడీపీ పొలిట్బ్యూరో సభ్యుడు శ్రీనివాసులరెడ్డి(వాసు) సోదరుడు, అన్నమయ్య జిల్లా రాయచోటి టీడీపీ నేత, లక్కిరెడ్డిపల్లి మాజీ ఎమ్మెల్యే ఆర్.రమేష్కుమార్రెడ్డి ఆరోపించారు. రాయచోటిలోని తన కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ పాతికేళ్లుగా అధికారంలో ఉన్నా, లేకున్నా పార్టీ కోసం పని చేశానని, నియోజక వర్గంలోని అన్ని ప్రాంతాలు తిరుగుతూ జెండాలను మోశానని, టికెట్ ప్రకటించేటప్పుడు కనీసం తనను సంప్రదించలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. టికెట్లు కేటాయింపులో ఏకపక్షంగా వ్యవహరించిందని మండిపడ్డారు. పార్టీ నాయకులకు గ్యారంటీ ఇవ్వలేని చంద్రబాబు ప్రజలకు ఏం గ్యారెంటీ ఇస్తారని నిలదీశారు. ముఖ్యమంత్రి సీటు కోసం చంద్రబాబు నాయుడు లేని హైప్ సృష్టిస్తున్నారని వ్యాఖ్యానించారు. కొత్త కొత్త వ్యక్తులతో కవ్వింపు చర్యలకు పాల్పడుతున్నాడని ఆరోపించారు. ఎంపీ అభ్యర్థిగా మాగంటి శ్రీనివాసులరెడ్డి, నెల్లూరు వేమిరెడ్డి ప్రభాకర్రెడ్డి, పెమ్మసాని చంద్రశేఖర్ ఇలా విదేశాల నుంచి అప్పటికప్పుడు సూట్ కేసులతో దిగిన వారికి టికెట్లు ఇస్తున్నారన్నారు. రాయచోటి, రాజంపేట, ప్రొద్దుటూరు, మదనపల్లె ఇలా చాలా అసెంబ్లీ స్థానాల్లో అభ్యర్థులను రెచ్చగొట్టి రేసులో పెట్టారని వాపోయారు. అందుకే ఆ పార్టీకి, పార్టీ సభ్యత్వానికి, ఇన్చార్జి పదవికి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. నేడు వైఎస్సార్సీపీలో చేరిక వినుకొండ దగ్గర జరుగుతున్న మేం సిద్ధం బస్సుయాత్రలో సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి సమక్షంలో బుధవారం ఉదయం ఎనిమిది గంటలకు వైఎస్సార్సీపీలో చేరనున్నట్టు రమేష్కుమార్ రెడ్డిప్రకటించారు. తన వ్యక్తిత్వం తెలిసినవారు, తన పనితీరు నచ్చి నవారు తనతో కలసి వస్తారని ఓ విలేకరి అడిగిన ప్రశ్నకుసమాధానంగా తెలిపారు. వైఎస్సార్సీపీలో పదవులకోసం కాకుండా తెలుగు దేశం పార్టీ ఓటమే ధ్యేయంగా పని చేస్తానని, అందుకోసం అహరి్నశలు కృషి చేస్తానని స్పష్టం చేశారు. -
కడపలో పడకేసిన టీడీపీ
సాక్షి ప్రతినిధి, కడప: టీడీపీకి కడప లోక్సభ స్థానంలో అభ్యర్థి కరువయ్యారా.. ఓడిపోయే స్థానంలో పోటీకి ఆ పార్టీ నాయకులు విముఖత వ్యక్తం చేస్తున్నారా.. అంటే అవుననే విశ్లేషకులు చెబుతున్నారు. టీడీపీ అభ్యర్థిగా పొలిట్బ్యూరో సభ్యుడు శ్రీనివాసులరెడ్డి పోటీలో ఉంటారని ఇంతకాలం జిల్లా నేతలు భావించారు. అయితే ఈమారు ఎన్నికల్లో తాను కడప పార్లమెంట్కు పోటీ చేయలేనని అధినేత చంద్రబాబుకు వాసు తేల్చి చెప్పినట్లు సమాచారం. కడప అసెంబ్లీ బరిలో తన సతీమణీ విజయం కోసం ప్రత్యేకంగా కృషి చేయాల్సిన అవసరమూ లేకపోలేదని చెప్పుకొచి్చనట్లు తెలుస్తోంది. దీంతో తెరపైకి మాజీ ఎమ్మెల్యే వీరశివారెడ్డిని తీసుకొస్తే ఎలా ఉంటుందని టీడీపీ ఆలోచిస్తున్నట్లు సమాచారం. ఆ మేరకు సోమవారం టీడీపీ ఐవీఆర్ఎస్ ఫోన్ సర్వే కూడా చేపట్టింది. కడప పార్లమెంట్ సీటు వైఎస్ కుటుంబానికి కంచుకోట. 1989లో తొలిసారి వైఎస్సార్ గెలుపుతో ప్రారంభమైన విజయప్రస్థానం అప్పటి నుంచి అప్రతిహతంగా కొనసాగుతూ వస్తోంది. వైఎస్ కుటుంబసభ్యులు క్రమం తప్పకుండా పదిసార్లు విజయం సాధించారు. టీడీపీ ఆవిర్భావం నుంచి ఒకే ఒక్కసారి 1984లో మాత్రమే డాక్టర్ డీఎన్ రెడ్డి విజయం సాధించారు. 1989 నుంచి వరుసగా నాలుగు సార్లు వైఎస్సార్ ఎంపీగా విజయం సాధించారు. తర్వాత వైఎస్ వివేకానందరెడ్డి, వైఎస్ జగన్, ప్రస్తుత ఎంపీ వైఎస్ అవినా‹Ùరెడ్డిలను క్రమం తప్పకుండా జిల్లా ప్రజానీకం ఆదరించారు. 2024లో మరోమారు వైఎస్ అవినాష్ రెడ్డి కడప ఎంపీ అభ్యర్థిగా పోటీకి సిద్ధమయ్యారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు టీడీపీ–జనసేన–బీజేపీ ఉమ్మడి అభ్యర్థిగా బరిలో దిగేందుకు నాయకులు వెనుకాడుతున్నారు. ఇంతకాలం పొలిట్బ్యూరో సభ్యుడు శ్రీనివాసులరెడ్డి పోటీ చేస్తారని భావించినా సోమవారం మాజీ ఎమ్మెల్యే వీరశివారెడ్డి అభ్యర్థిత్వంపై టీడీపీ ఐవీఆర్ఎస్ సర్వే చేపట్టింది. కమలాపురం కలిసివస్తుందనే దిశగా.. వీరశివారెడ్డి టీడీపీ ఎంపీ అభ్యరి్థగా బరిలో నిలిస్తే కమలాపురం నియోజకవర్గంలో ఉపయోగం ఉంటుందనే దిశగా ఆ పార్టీ అధిష్టానం యోచిస్తున్నట్లు సమాచారం. పదేళ్లుగా ప్రత్యక్ష ఎన్నికలకు దూరంగా ఉన్న వీరశివా రెడ్డి పోటీ వల్ల ఆయన వర్గం ఎన్నికల్లో పటిష్టంగా పనిచేయగలదనే దిశగా ఆలోచిస్తున్నట్లు తెలిసింది. కమలాపురంలో ఇప్పటికే టీడీపీ ఇన్చార్జి పుత్తా నరసింహారెడ్డికి కాకుండా ఆయన తనయుడు పుత్తా చైతన్యరెడ్డి అభ్యర్థిత్వాన్ని పార్టీ ఖరారు చేసింది. ఈనేపథ్యంలో ఎంపీగా వీరశివారెడ్డిని బరిలో నిలిపితే ఏమేర ఉపయోగం ఉంటుందని తర్జనభర్జనలో ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు కాంగ్రెస్ అభ్యర్థిగా పీసీపీ అధ్యక్షురాలు షరి్మల పోటీలో నిలిస్తే టీడీపీ తరఫున ఎవరిని నిలిపితే ఆమెకు ప్రయోజనకారిగా ఉంటుందనే దిశగానూ ఆలోచిస్తున్నట్లు సమాచారం. టీడీపీ ఓట్లు చీలిస్తే ఉపయోగమా? లేక తక్కువ ఓట్లు తెచ్చుకునే అభ్యర్థిని బరిలో నిలిపితే కాంగ్రెస్ అ భ్యర్థి షరి్మలకు ప్రయోజనమా? అనే దిశగానూ బాబు యుక్తులు పన్నుతున్నట్లు ఆ పార్టీ సీనియర్ నేత ఒకరు చెప్పుకొచ్చారు. అందులోభాగంగా అటు శ్రీనివాసులరెడ్డి, ఇటు వీరశివారెడ్డి పేర్లతో సోమవారం ఐవీఆర్ఎస్ ఫోన్ సర్వే నిర్వహించినట్లు తెలుస్తోంది. వీరశివారెడ్డి బీసీ నేతల అసంతృప్తి అనంతపురం జిల్లాలో బీసీల్లోని సీనియర్ నేతలు చంద్రబాబు తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చేనేత వర్గానికి చెందిన నిమ్మ ల కిష్టప్ప బాబు తమను వాడుకుని వదిలేశారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. పెనుకొండ నియోజకవర్గానికి చెందిన మరో సీనియర్ నేత బీకే పార్థసారథి వర్గమూ బాబుపై అసంతృప్తిగా ఉంది. ఇక పుట్టపర్తి సీటును పల్లె రఘునాథరెడ్డి కోడలికి టికెట్ ఇవ్వడంపై ఆగ్రహం వ్యక్తమవుతోంది. 2014లో వైఎస్సార్సీపీ తరఫున కదిరి ఎమ్మెల్యేగా గెలిచి తర్వాత టీడీపీలోకి వెళ్లిన చాంద్బాషాకు ఈ దఫా మొండిచేయి చూపడంతో ముస్లింలూ ఆ పార్టీపై మండిపడుతున్నారు. చాంద్కు టికెట్ ఇవ్వకుండా నకిలీ డీడీల కేసుల్లో శిక్ష పడిన కందికుంట ప్రసాద్ కుటుంబానికి ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తున్నారు. కళ్యాణ దుర్గం టికెట్ కోసం పోటీపడిన ఉన్నం హనుమంతరాయ చౌదరి, ఉమామహేశ్వర నాయుడిని కాదని బాబు బడా కాంట్రాక్టర్ అమిలినేని సురేంద్రబాబును తెరమీదకు తేవడంపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. గుంతకల్లు టికెట్ను వైఎస్సార్ సీపీ బహిష్కృత నేత గుమ్మనూరు జయరామ్కు ఇస్తే అసమ్మతి రేగుతుందని టీడీపీ భయపడుతోంది. అనంతపురం అర్బన్ సీటునూ అసమ్మతి సెగతో పెండింగ్లో పెట్టింది. శ్రీకాకుళంలో సిగపట్లు ఉమ్మడి జిల్లాలోని పలాస, ఎచ్చెర్ల, పాతపట్నం, శ్రీకాకుళం నియోజకవర్గాలకు టీడీపీ అభ్యర్థుల్ని ఇప్పటివరకు ఖరారు చేయలేదు. ఈ నాలుగు నియోజకవర్గాల్లోనూ ఆ పార్టీని వర్గపోరు వేధిస్తోంది. పలాసలో గౌతు శిరీషకు చెక్ పెట్టాలని ఆ పార్టీ నాయకులే చూస్తున్నారు. పాతపట్నంలో కలమట వెంకటరమణ, మామిడి గోవిందరావు సిగపట్లు పడుతున్నారు. శ్రీకాకుళంలో గుండ లక్ష్మీదేవి, గొండు శంకర్ మధ్య యుద్ధమే జరుగుతోంది. ఎచ్చెర్ల, శ్రీకాకుళం, పాతపట్నం నియోజకవర్గాలపై బీజేపీ కన్నేసింది. ఈ మూడింటిలో ఏదో ఒకటి కేటాయించాలని పట్టుపడుతోంది. జనసేన కూడా పాతపట్నం, ఎచ్చెర్ల, పలాసల్లో ఒక సీటును ఆశిస్తోంది. కొలికపూడి మాకొద్దు బాబూ..! ఎనీ్టఆర్ జిల్లా తిరువూరు టీడీపీ అభ్యర్థి కొలికపూడి శ్రీనివాస్ తమకొద్దని ఆ పార్టీ నేతలు టీడీపీ అధిష్టానానికి అలి్టమేటం జారీ చేస్తున్నారు. ఆయన చరిత్ర చూస్తే ఆది నుంచి వివాదాస్పదమే. ఆయన అభ్యర్థిత్వం ఖరారైన తర్వాత తిరువూరు నియోజకవర్గంలో ఆయన వ్యవహార శైలి సొంత పార్టీ నేతలకూ మింగుడు పడడం లేదు. మూడునెలల తరువాత రాష్ట్రంలో వైఎస్సార్ విగ్రహాలన్నీ కూలి్చవేస్తామని శ్రీనివాస్ వ్యాఖ్యానించడంతో ప్రజల నుంచి ప్రతిఘటన ఎదురైంది. తాగునీటి సమస్యపై పాదయాత్ర పేరుతో రెండు కిలోమీటర్లు కూడా నడవకుండానే హడావుడి చేయడం, డ్రెయినేజీలో ఉన్న కప్పలను పట్టి కూర వండి పంపిప్తాను తినండి అంటూ మున్సిపల్ అధికారులను కించపరచడం, ఆర్యవైశ్యుల సమావేశంలో మిగతా కులాలను కించపరిచేలా మాట్లాడడం, పదో తరగతి పరీక్ష కేంద్రంలోకి వెళ్లి ప్రచారం చేసి, ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించడంతో ఆయన తీరుపై నేతలు విసిగిపోయారు. ఈయన మాకొద్దు బాబు..! అంటూ చంద్రబాబుకు ఫిర్యాదు చేసినట్లు చర్చసాగుతోంది. గత ఎన్నికల్లో టీడీపీ తరఫున పోటీ చేసిన జవహర్, ఇక్కడ మళ్లీ పోటీ చేయాలనే యోచనలో ఉన్నట్లు సమాచారం. -
ఉమాదేవికి దక్కని టికెట్.. ఆమెకే ఇన్చార్జ్ పదవి..
సాక్షి ప్రతినిధి, కడప: టీడీపీ కడప నియోజకవర్గ ఇన్చార్జిగా శుక్రవారం పొలిట్బ్యూరో సభ్యుడు ఆర్ శ్రీనివాసులరెడ్డి సతీమణీ ఆర్ మాధవి పేరు ఖరారు చేస్తూ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు నియామకపు ఆదేశాలు జారీ చేశారు. దీంతో జిల్లా కేంద్రమైన కడప టీడీపీలో అంతర్గత విభేదాలు ఒక్కమారుగా బట్టబయలయ్యాయి. ఇన్చార్జిగా నియమిస్తారని ఎంతోకాలంగా ఆశలు పెట్టుకున్న కార్పొరేటర్ ఉమాదేవి కుటుంబం భగ్గుమంటోంది. స్థానికులకు అవకాశం కల్పించమని కోరినా ఫలితం లేకపోవడమే అందుకు ప్రధాన కారణంగా తెలుస్తోంది. స్థానికుల సత్తా ఏమిటో స్థానికేతరులకు చూపించాలనే దిశగా అడుగులు వేస్తున్నారు. కడప నియోజకవర్గం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి కంచుకోటగా నిలుస్తోంది. వరుసగా రెండు పర్యాయాలు ఆ పార్టీ అభ్యర్థి ఎస్బీ అంజద్బాషా ఘన విజయం సాధించారు. 1999 ఎన్నికల తర్వాత టీడీపీ కడప గడపలో వరుసగా ఓటమి చవిచూసింది. 2004 నుంచి కాంగ్రెస్, తర్వాత వైఎస్సార్కాంగ్రెస్ పార్టీ విజయదుంధుబి మోగిస్తోంది. మరోమారు ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో టీడీపీ అభ్యర్థిత్వంపై ఆ పార్టీ ఏకై క కార్పొరేటర్ జి ఉమాదేవి కుటుంబం ఆశలు పెంచుకుంది. ఆమేరకు టీడీపీ నుంచి సిగ్నల్స్ రావడంతో గ్రౌండ్ వర్క్పై గత కొంతకాలంగా పథక రచన చేపట్టారు. ఓటింగ్ ఎలా అనుకూలంగా పెంచుకోవాలనే దిశగా ముమ్మర యత్నాలు చేశారు. క్షేత్రస్థాయిలో క్రమం తప్పకుండా మంతనాలు నిర్వహిస్తూ పలువురు క్రియాశీలక వ్యక్తుల మద్దతు కోరుతూ చాపకింద నీరులా ఉమాదేవి మామ ఆలంఖాన్పల్లె లక్ష్మీరెడ్డి వ్యవహరిస్తూ వచ్చారు. అంతలోనే టీడీపీ ఇన్చార్జిగా ఆర్ మాధవిని నియమిస్తూ రాష్ట్ర అధ్యక్షుడు ఆచ్చెన్నాయుడు ఆదేశాలు జారీ చేశారు. ఊహించని పరిణామంతో లక్ష్మీరెడ్డి కుటుంబం కినుక వహించింది. ఆయన మద్దతుదారులు ఎన్నికల్లో ఎవరి సత్తా ఏమిటో చూపించాలని బాహాటంగా ఆరోపణలు సంధిస్తున్నట్లు సమాచారం. స్థానికతను పరిగణలోకి తీసుకోవాలని కోరినా... టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడును పలుమారు కలిసి స్థానికులకు ప్రాధాన్యత ఇవ్వాలని కడప టీడీపీ నేతలు అభ్యర్థించారు. స్థానికులను పరిగణలోకి తీసుకుని టికెట్ ఆశిస్తున్న అమీర్బాబు, జి ఉమాదేవి ఎవరికై నా టికెట్ కేటాయించాలని, మేమంతా కలిసికట్టుగా టీడీపీ విజయం కోసం కృషి చేస్తామని టీడీపీ నేత లక్ష్మీరెడ్డి చెప్పినట్లు సమాచారం. సామాజిక వర్గ సమీకరణ నేపథ్యంలో మైనార్టీ వర్గాలకు ప్రాధాన్యత ఇవ్వాలనుకుంటే అమీర్బాబును పరిగణలోకి తీసుకోవాలని కోరినట్లు తెలుస్తోంది. బలిజలు ప్రాధాన్యత ఇవ్వాలనుకుంటే దుర్గాప్రసాద్ లేదా హరిప్రసాద్లను పరిశీలించాలని, రెడ్డికి టికెట్ కేటాయించాల్సి వస్తే తమ కుటుంబాన్ని పరిగణలోకి తీసుకోవాలని లేదంటే గోవర్ధన్రెడ్డికి కట్టబెట్టినా తామంతా కలిసికట్టుగా పనిచేస్తామని తేల్చి చెప్పినట్లు సమాచారం. అలా కాకుండా ఆర్ శ్రీనివాసులరెడ్డికి కట్టబెడితే పార్టీకి పనిచేసే ప్రసక్తే లేదని తేల్చి చెప్పినట్లు తెలుస్తోంది. అయినప్పటీకీ టీడీపీ అధిష్టానం వాసు కుటుంబానికి ఇన్చార్జి బాధ్యతలను కట్టబెట్టింది. అధిష్టానం నిర్ణయంతో కడప గడపలోని తెలుగుతమ్ముళ్లు రగిలిపోతున్నారు. వ్యూహాత్మక అడుగులు వేసిన వాసు... కడపలో ఆలంఖాన్పల్లె లక్ష్మీరెడ్డి కుటుంబాన్ని కట్టడి చేసేందుకు పొలిట్బ్యూరో సభ్యుడు ఆర్ శ్రీనివాసులరెడ్డి వ్యూహాత్మక అడుగులు వేశారని రాజకీయ పరిశీలకులు వెల్లడిస్తున్నారు. నారా లోకేష్ యువగళం పాదయాత్ర ప్రారంభించేందుకు కుప్పం వెళ్తూ కడప ఎయిర్పోర్టు నుంచి ఆలంఖాన్పల్లె మీదుగా కడపలోకి ప్రవేశించాల్సి ఉండగా, ఆ కార్యక్రమాన్ని తెరవెనుక మంత్రాంగం నిర్వహించి అడ్డుకున్నారు. రింగ్రోడ్డు వెంబడి దేవుని కడప, పెద్దదర్గా దర్శించేలా ప్రణాళిక రూపొందించారు. తర్వాత చంద్రబాబు జోన్–6 ప్రాంతీయ సదస్సు నిర్వహణ కార్యక్రమం ఎయిర్పోర్టు సమీపంలో లక్ష్మీరెడ్డి స్థలంలో ఏర్పాటు చేయాలని భావించినా, ఆ కార్యక్రమాన్ని కూడా అడ్డుకున్నారు. లక్ష్మీరెడ్డి కుటుంబం టీడీపీలో ఫోకస్ కాకుండా వ్యూహాత్మకంగా శ్రీనివాసులరెడ్డి అడ్డుకున్నారని విశ్లేషకులు వెల్లడిస్తున్నారు. ఈనేపథంలో కడప తెలుగుతమ్ముళ్లు ఇన్చార్జి ఆర్ మాధవికి ఏమాత్రం సహకరిస్తారో వేచి చూడాల్సిందే.! -
శ్రీనివాసుల రెడ్డి హత్య కేసు... ప్రధాన కుట్రదారుడు టీడీపీ నేత సుబ్బారెడ్డి !
కడప అర్బన్ : వైఎస్సార్సీపీ నేత శ్రీనివాసులరెడ్డి హత్య కేసులో ప్రధాన కుట్రదారుడు టీడీపీ నేత పాలెంపల్లె సుబ్బారెడ్డిగా పోలీసుల దర్యాప్తులో తేల్చారు. ఏ3 నిందితుడు ల్యాబ్ శ్రీనుతో నిర్వహించిన రహస్య ఒప్పందం మేరకు హత్య ప్రణాళిక రచించినట్లు తేటతెల్లమైంది. ప్రధాన నిందితుల రిమాండ్ అనంతరం ఫోన్ కాల్స్, వాట్సా్ప్ చాటింగ్, గూగుల్ టేకౌట్ పరిశీలన దిశగా దర్యాప్తు చేసిన పోలీసులకు కీలక సమాచారం లభించింది. సుబ్బారెడ్డి కోసం గాలిస్తుండగా అప్పటికే తన మొబైల్ ఫోన్ ఇంట్లో పడేసి, హైదరాబాద్కు వెళ్లినట్లు పోలీసులు పసిగట్టారు. వివిధ ప్రాంతాల్లో గాలించిన పోలీసులు టీడీపీ నేత సుబ్బారెడ్డిని అదుపులోకి తీసుకొని విచారించిన తర్వాత అరెస్టు చేసినట్లు సమాచారం. మరోవైపు ల్యాబ్ శ్రీను టీడీపీ నేత సుబ్బారెడ్డితో చేసుకున్న ఒప్పందం వ్యవహారం వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. హతుడు...నిందితులు ఒకనాటి మిత్రులే.. హత్యకు గురైన సి శ్రీనివాసులరెడ్డి, ప్రధాన నిందితులు ప్రతాప్రెడ్డి, పాలెంపల్లె సుబ్బారెడ్డి వీరంతా ఒకనాటి మిత్రులే. 2019 ఎన్నికల్లో వీరంతా తెలుగుదేశం పార్టీ విజయం కోసం పనిచేశారు. అప్పటికే కడపలో కొన్ని వివాదాస్పద వ్యవహారాల్లోనూ ముగ్గురు ఉన్నారు. సుబ్బారెడ్డి, శ్రీనివాసులరెడ్డి మధ్య విభేదాలు తలెత్తడంతో 2020లో విడిపోయా రు. ఆ తర్వాత శ్రీనివాసుల రెడ్డితో సన్ని హి తంగా ఉన్న ప్రతాప్ రెడ్డి కూడా అతనితో విభేదాలు వచ్చి విడిపోయాడు. ఈ క్రమంలో ప్రతాప్ రెడ్డి, ల్యాబ్ శ్రీను పాలెంపల్లె సుబ్బారెడ్డితో హత్య విషయమై మంతనాలు నిర్వహించారు. దీనికి సుబ్బారెడ్డి ప్రోత్సాహం ఇవ్వడంతో శ్రీనివాసులరెడ్డి హత్యకు ప్రణాళిక రచించి అంతమొందించారు. కాగా ఇదే విషయమై ల్యాబ్ శ్రీను వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ‘శ్రీనువాసులరెడ్డి మాకు మోసం చేశాడు, డబ్బులు ఇవ్వలేదు, శ్రీనువాసులరెడ్డిని హత్య చేయాలనుకుంటున్నాం’ అంటూ ఇంటికి వెళ్లి చెప్పి నట్లుగా ల్యాబ్ శ్రీను వివరించారు. ‘రూ.30 లక్షలు ఇస్తా.. కోర్టు వ్యవహారం చూసుకుంటా’నని సుబ్బారెడ్డి హామీ ఇచ్చినట్లు ల్యాబ్ శ్రీను అందులో వెల్లడించడం గమనార్హం. పాలెంపల్లె సుబ్బారెడ్డి అరెస్టు – కడప డీఎస్పీ ఎండీ షరీఫ్ వెల్లడి కడప అర్బన్ : కడప నగరంలోని సంధ్యా సర్కిల్ వద్ద జూన్ 23న ఉదయం చిన్న నాగిరెడ్డి గారి శ్రీనివాసులరెడ్డి హత్య కేసులో ప్రధాన కుట్రదారుడైన పాలెంపల్లి సుబ్బారెడ్డి అలియాస్ రాజు సుబ్బారెడ్డి (42)ని అరెస్టు చేసినట్లు కడప డీఎస్పీ ఎండీ షరీఫ్ వెల్లడించారు. ఈనెల 5న బుధవారం సాయంత్రం ఇర్కాన్ సర్కిల్ వద్ద అరెస్టు చేసినట్లు వివరించారు. గురువారం సాయంత్రం డీఎస్పీ మీడియాతో మాట్లాడారు. గత నెల హత్యకు గురైన చిన్ననాగిరెడ్డిగారి శ్రీనివాసులరెడ్డి ప్రస్తుతం అరెస్టు చేసిన పాలెంపల్లి సుబ్బారెడ్డి ఇద్దరూ 2020 సంవత్సరం వరకూ సన్నిహితంగా ఉంటూ కలిసి వ్యాపారాలు చేసుకునేవారు. అనంతరం ఇద్దరి మధ్య మనస్పర్థలు వచ్చి విడిపోయారు. పరస్పర దాడులు చేసుకునే స్థితికి వెళ్లారు. ఈ పరిస్థితుల్లో శ్రీనివాసులరెడ్డికి సన్నిహితులుగా ఉన్న ప్రతాప్రెడ్డి, ల్యాబ్ శ్రీనివాసులు సైతం విడిపోయారు. దీంతో శ్రీనివాసులరెడ్డిని హత్య చేసేందుకు ల్యాబ్ శ్రీను సుబ్బారెడ్డితో చర్చలు నిర్వహించారు. హత్య చేసేందుకు నిందితులకు సుబ్బారెడ్డి ప్రోత్సాహం ఇవ్వడంతో పాటు రూ. 30 లక్షలు డబ్బులు ఇవ్వడంతో పాటు కోర్టు వ్యవహారాలు చూసుకుంటానని భరోసా ఇచ్చాడు. హత్య కేసులో ఇదివరకే అరెస్టు అయిన ఏ3 నిందితుడు మేరువ శ్రీనివాసులు అలియాస్ ల్యాబ్ శ్రీను హత్యకు కొన్ని రోజుల ముందు సుబ్బారెడ్డి ఇంటిలో కూర్చుని హత్యకు కుట్ర చేసినట్లు తమ విచారణలో వెల్లడైంది. హత్య చేసిన తర్వాత ఏ3 అయిన ల్యాబ్ శ్రీను పాలెంపల్లి సుబ్బారెడ్డికి ‘హత్య చేశాం..అతను చనిపోయాడు..’అంటూ ఫోన్ ద్వారా సమాచారం ఇచ్చాడు. గూగుల్ టేక్ అవుట్ ద్వారా సాంకేతిక ఆధారాలను పరిశీలించి చూడగా సుబ్బారెడ్డి ప్రమేయం స్పష్టమైందని డీఎస్పీ తెలిపారు. నిందితుడు సుబ్బారెడ్డి తన సెల్ ఫోన్లోని వాట్సాప్ మెసేజ్లను డిలీట్ చేసారు. వాటిని రిట్రీవ్ చేసేందుకు ప్రయత్నిస్తున్నా మని డీఎస్పీ వివరించారు. ప్రస్తుతం అరెస్ట్ చేసిన సుబ్బారెడ్డి పై 12 కేసులు నమోదై ఉన్నాయి. ఇందులో రెండు హత్యాయత్నం కేసులు, రెండు ఆత్మహత్య కు ప్రేరేపించిన కేసులతో పాటు ఎస్.సి.,ఎస్.టి అట్రాసిటీ కేసులోనూ నిందితుడుగా ఉన్నాడు. -
వైఎస్ఆర్సీపీ నేత హత్య కేసులో ఆరుగురి అరెస్ట్
కడప అర్బన్ : వైఎస్ఆర్సీపీ నాయకుడు, రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకుంటూ జీవనం సాగిస్తున్న చిన్ననాగిరెడ్డిగారి శ్రీనివాసులరెడ్డి(42) హత్య కేసులో ఆరుగురిని అరెస్ట్ చేశారు. శ్రీనివాసులరెడ్డిని ఈ నెల 23న ఉదయం 8:10 గంటల సమయంలో కడప నగరం ఒన్టౌన్ పోలీస్స్టేషన్ పరిధిలోని సంధ్యా సర్కిల్ సమీపంలో దారుణంగా హత్య చేసిన విషయం తెలిసిందే. ఈ సంఘటనలో ప్రధాన నిందితుడు మోపురు ప్రతాప్రెడ్డితోపాటు మరో ఐదుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. సోమవారం కడపలోని జిల్లా పోలీసు కార్యాలయం వద్ద వున్న ‘పెన్నార్’ పోలీస్ కాన్ఫరెన్స్ హాల్లో నిర్వహించిన మీడియా సమావేశంలో నిందితులను తీసుకుని వచ్చి హాజరు పరిచారు. ఈ సంఘటనపై జిల్లా ఎస్పీ కేకేఎన్ అన్బురాజన్ విలేకరులకు వివరాలు తెలియజేశారు. అరెస్టయిన వారిలో పెండ్లిమర్రి మండలం కొండూరుకు చెందిన ప్రధాన నిందితుడు మోపురు ప్రతాప్రెడ్డి ప్రస్తుతం కడపలో జిల్లా కోర్టు కాంప్లెక్స్ వెనుకభాగాన ఓ ఇంటిలో నివాసం వుంటున్నాడు. రెండవ నిందితుడు కడప పాలెంపల్లికి చెందిన మేరువ శ్రీనివాసులు ప్రస్తుతం సాయిపేటలో నివాసం వుంటున్నాడు. మూడవ నిందితుడు కడప నగరంలోని పాతకడపకు చెందిన కల్లూరు సురేష్కుమార్ అలియాస్ ఫ్రాన్సిస్, కడప నగర శివార్లలోని పుచ్చలపల్లి సుందరయ్యకాలనీకి చెందిన బరకం హరిబాబు, కడప నగరంలోని శంకరాపురంలో నివాసముంటూ వార్డు వలంటీర్గా వున్న కోనేరు వెంకటసుబ్బయ్య, కడప నగరం పాతకడపకు చెందిన పత్తూరు భాగ్యరాణి వున్నారు. గతంలో శ్రీనివాసులరెడ్డితో కలిసి ప్రతాప్రెడ్డి, శ్రీనివాసులు కడప చుట్టుపక్కలా, ఇతర ప్రాంతాల్లో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేశారు. ఈ విషయంలో వారికి విభేదాలు తలెత్తాయి. ప్రతాప్రెడ్డితోపాటు మరో నిందితుడు మేరువ శ్రీనివాసులుకు శ్రీనివాసులరెడ్డి తీవ్రంగా ఆర్థిక నష్టం కలిగించాడని భావించారు. అంతేగాక కిరాయి హంతకులతో తనను అంతమొందించడానికి ప్రయతిస్తున్నాడని ప్రతాప్రెడ్డి భావించాడు. శ్రీనివాసుల రెడ్డి తన రియల్ ఎస్టేట్ వ్యాపారానికి అడుగడుగునా అడ్డు తగులుతున్నాడని ప్రతాప్రెడ్డి భావించాడు. దీంతో శ్రీనివాసులరెడ్డిని హత్య చేసేందుకు తనతో పాటు వున్న మేరువ శ్రీనివాసులు, నిందితురాలు భాగ్యరాణి పరిచయం చేసిన మిగిలిన నిందితులతో కలిసి ప్రతాప్రెడ్డి పథకం పన్నాడు. కల్లూరు సురేష్కుమార్ అలియాస్ ఫ్రాన్సిస్, బరకం హరిబాబు, వెంకటసుబ్బయ్యతో పరిచయం చేసుకుని హత్యకు కుట్ర పన్నారు. ఈ పథకంలో భాగంగానే ఈనెల 23న ఉదయం మోపురు ప్రతాప్రెడ్డి, సురేష్కుమార్ అలియాస్ ఫ్రాన్సిస్ బురఖాలు ధరించారు. తమతోపాటు మారణాయుధాలైన బాకు, కత్తిని, కొడవలిని తీసుకున్నారు. శ్రీనివాసులరెడ్డి కదలికలను గమనించారు. శ్రీనివాసులరెడ్డి రాబిట్ ఫిట్నెస్కు వెళ్లినప్పటి నుంచి బయటకు వచ్చేంత వరకు కాపుకాశారు. అతను రాగానే మృతుడి రాయల్ఎన్ఫీల్డ్ మోటార్ సైకిల్కు కోనేరు వెంకటసుబ్బయ్య తన మోటార్ సైకిల్ను అడ్డు పెట్టాడు. అప్పటికే బురఖాలు ధరించి కత్తులు చేతపట్టిన ప్రతాప్రెడ్డి, సురేష్కుమార్ అలియాస్ ఫ్రాన్సిస్ ఒక్కసారిగా శ్రీనివాసులరెడ్డిపై దాడి చేశారు. ఈ దాడిలో శ్రీనివాసులరెడ్డి ఛాతీకి, గుండెకు బలమైన గాయాలు కావడంతో కొంతదూరం వెళ్లి కుప్పకూలిపోయాడు. హత్య జరిగిన తరువాత మేరువ శ్రీనివాసులు అక్కడే వుండి గమనించసాగాడు. హరిబాబుతో ఫోన్లో మాట్లాడుతూ అతని మోటార్సైకిల్పై ప్రతాప్రెడ్డి, ఫ్రాన్సిస్ ఊరిబయటికి వెళ్లిపోయారని ఎస్పీ తెలిపారు. హత్యకు ఉపయోగించిన ఆయుధాన్ని, బురఖాను అక్కడే వదిలేసి వెళ్లారన్నారు. వాటిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ప్రధాన నిందితులకు ఫ్రాన్సిస్ను పరిచయం చేయడంలో కీలకంగా వ్యవహరించిన పాత కడపకు చెందిన భాగ్యరాణిని 109 (హత్యకు ప్రేరేపించడం) నేరం కింద అరెస్ట్ చేశారు. హత్యకు ఉపయోగించిన నాలుగు మోటార్ సైకిళ్లను స్వాధీనం చేసుకున్నారు. ఇంకా కొంతమందిపై అనుమానాలున్నాయని, వారికి నోటీసులు ఇచ్చామని, మరికొంతమందిపై వారి నుంచి సమాధానాలు రావాలని ఎస్పీ పేర్కొన్నారు. కాల్ డీటైయిల్స్ ఆధారాలు, వాట్సాప్ చాట్లు, గూగుల్ టేక్ అవుట్ తదితర సాంకేతిక అంశాల ద్వారా వివరాలు రాబడుతున్నామనీ, ఎవరిపై అనుమానాలు వచ్చి నిరూపణ అయితే వారిని కూడా అరెస్ట్ చేస్తామన్నారు. ఈ సంఘటన చాలా దురదృష్టకరమైనదనీ ఎస్పీ అన్నారు. ఆ మహిళ.. అందరికీ స్ఫూర్తిదాయకం హత్య జరిగే సమయంలో ఓ మహిళ ధైర్యంగా కత్తిని అక్కడి నుంచి తీసిందని, సదరు మహిళను సన్మానిస్తామని ఎస్పీ తెలిపారు. పబ్లిక్లో ఇలాంటి సంఘటనలు జరిగేటపుడు పౌరులు తమవంతు బాధ్యతగా ప్రతిఘటించాలని కోరారు. కేసును తాము తేలిగ్గా తీసుకోవడం లేదని, ఇంకా కొన్ని అనుమానాలు వు న్నాయని, అలాంటి వారిని కూడా అరెస్ట్ చేస్తామ న్నారు. హత్యలో ఎలాంటి రాజకీయం లేదని, హత్య కేవలం ప్రాపర్టీ, డబ్బుల కోసమే జరిగిందన్నారు. ఈ సంఘటనలో అవాస్తవాలు ఎక్కువ ప్రచారం జరుగుతున్నాయని, అలాంటి వాటిపైన కూడా దృష్టి సారించి చర్యలు తీసుకుంటామని తెలిపారు. భూ కబ్జాకు కేసుకు సంబంధం లేదని, ఒకవేళ భూ కబ్జాకు సంబంధించి వుంటే బాధితులు పోలీసులను ఆశ్రయిస్తారని, అలాంటిదేమీ లేదన్నారు. ● ఈ హత్య కేసును ఛేదించి నిందితులను అరెస్ట్ చేయడంలో కడప డీఎస్పీ ఎం.డి షరీఫ్ ఆధ్వర్యంలో కీలకపాత్ర పోషించిన కడప ఒన్టౌన్ సీఐ ఎన్.వి నాగరాజు, కడప రూరల్ సీఐ కె.అశోక్రెడ్డి, ఎస్ఐలు మధుసూదన్రెడ్డి, సిద్దయ్య, సైబర్క్రైమ్ ఎస్ఐ మధుమల్లేశ్వర్రెడ్డి, ఏఎస్ఐ మల్లయ్య, హెడ్కానిస్టేబుల్ ఎన్.వేణుగోపాల్, కానిస్టేబుళ్లు ఖాదర్హుసేన్, చంద్ర, నారాయణరెడ్డి, కిరణ్, బాషలను జిల్లా ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
T20 WC 2024: టీమిండియా టీ20 వరల్డ్ కప్ జెర్సీ ఇదే.. ఫోటోలు వైరల్
కాంగ్రెస్కు పాకిస్తాన్ మద్దతు ఉంది: అనురాగ్ ఠాకూర్
టాలీవుడ్ హీరో డ్రీమ్ ప్రాజెక్ట్.. రెబల్ స్టార్ ఎంట్రీ!
ఇరాన్ నుంచి పారిపోయి కొచ్చికి భారత మత్స్యకారులు
పాఠశాల నేపథ్యంలో వస్తోన్న సత్య.. ఆసక్తిగా ట్రైలర్!
Best Pictures Of The Day : ఈ రోజు ఉత్తమ చిత్రాలు (06-05-2024)
Video: కేసీఆర్ బస్సును తనిఖీ చేసిన ఎన్నికల అధికారులు
'దేవర' షూటింగ్లో తేనెటీగల కలకలం.. 20 మందికి గాయాలు
ఎస్ఆర్హెచ్తో ముంబై కీలక పోరు.. కొత్త ప్లేయర్ ఎంట్రీ
వారితో భయంకరమైన అనుభవాలు ఎదుర్కొన్నా: హీరామండి నటి
తప్పక చదవండి
- అలా చేస్తే ఆ కిక్కే వేరు! అతడితో లవ్లో ఉన్నా: నటి
- సూపర్ మచ్చీ.. ఇలాంటి గ్రూపు డ్యాన్స్ మీరెపుడైనా చూశారా?
- డైరెక్టర్తో హీరోయిన్ పెళ్లి.. మామయ్యను మండపానికి రానివ్వలేదట!
- మాచర్లలో సీఎం జగన్ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)
- పూంచ్ ఉగ్రదాడి.. టెర్రరిస్టులపై రూ.20 లక్షల రివార్డు
- కాంగ్రెస్ కీలక నిర్ణయం: బరిలోకి మాజీ ముఖ్యమంత్రులు
- ‘SRH కాదు.. పరుగుల విధ్వంసానికి మారు పేరు ఆ జట్టే’
- సమ్మర్లో కొబ్బరిబోండంలోని నీటిని నేరుగా తాగేస్తున్నారా..?
- చంద్రబాబు మోసాల చరిత్రను గుర్తు తెచ్చుకోండి: సీఎం జగన్
- కల్వకుంట్ల కవితకు బిగ్ షాక్
Advertisement