-
సాత్విక–శ్రావ్య జంటకు రజతం
గువాహటి: ఖేలో ఇండియా యూత్ గేమ్స్లో చివరి రోజు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లకు ఒక్కో రజత పతకం లభించింది. టెన్నిస్ అండర్–21 బాలికల డబుల్స్ విభాగంలో సామ సాత్విక–శ్రావ్య శివాని జంట రన్నరప్గా నిలిచి రజత పతకాన్ని దక్కించుకుంది. ఫైనల్లో సాత్విక–శ్రావ్య శివాని ద్వయం 6–3, 3–6, 7–10తో మిహికా యాదవ్–స్నేహల్ మానె (మహారాష్ట్ర) జంట చేతిలో పోరాడి ఓడిపోయింది. స్విమ్మింగ్లో అండర్–21 బాలుర 200 మీటర్ల బ్రెస్ట్స్ట్రోక్ ఈవెంట్లో ఆంధ్రప్రదేశ్ స్విమ్మర్ ఎం.లోహిత్ రజతం సాధించాడు. లోహిత్ 2ని:21.32 సెకన్లలో రేసును ముగించి రెండో స్థానంలో నిలిచాడు. బుధవారంతో ముగిసిన ఈ క్రీడల్లో ఓవరాల్గా తెలంగాణ 7 స్వర్ణాలు, 6 రజతాలు, 8 కాంస్యాలతో కలిపి మొత్తం 21 పతకాలు సాధించి 15వ స్థానంలో నిలిచింది. ఆంధ్రప్రదేశ్ 3 స్వర్ణాలు, 7 రజతాలు, 7 కాంస్యాలతో కలిపి మొత్తం 17 పతకాలతో 22వ స్థానంలో నిలిచింది. మహారాష్ట్ర 78 స్వర్ణాలు, 77 రజతాలు, 101 కాంస్యాలతో కలిపి మొత్తం 256 పతకాలతో అగ్రస్థానంలో నిలిచింది. హరియాణా (68+60+72) మొత్తం 200 పతకాలు నెగ్గి రెండో స్థానంలో... ఢిల్లీ (39+36+47) మొత్తం 122 పతకాలు సాధించి మూడో స్థానంలో నిలిచాయి. -
నాట్యంలో మేటి.. నటనలో సాటి
తల్లి కూచిపూడి నాట్యకారిణి.. తండ్రి గాయకుడు. తల్లిదండ్రులను ఆదర్శంగా తీసుకున్న వారి బిడ్డ శ్రవ్య మానస భోగిరెడ్డి 9 ఏళ్ల ప్రాయంలో కూచిపూడి నృత్యం నేర్చుకునేందుకు నడుంబిగించింది. నాలుగేళల్లో నాట్యంలో చక్కటి ప్రావీణ్యం సాధించి తనను తాను నిరూపించుకునేందుకు ప్రదర్శనలు ఇచ్చింది. ప్రతి వేదికపైనా విమర్శకుల నుంచి ప్రశంసలు అందుకుంది. ఓ పక్క నాట్యంలో నాట్యంలో పీహెచ్డీ చేస్తూనే.. సమాజంలో మహిళలపై జరుగుతున్న ఆకృత్యాలపై యువతను చైతన్యం చేసేందుకు స్వయంగా నాటికలు రాసి నటిస్తోంది. మరోపక్క శ్రావ్య మానస నాట్య గురువుగానూ ఇప్పుడు వందల మందికి శిక్షణనిస్తోంది. సాక్షి,సిటీబ్యూరో: మోతీనగర్కు చెందిన భోగిరెడ్డి శ్రీనివాస్, లలిత దంపతుల కుమార్తె శ్రవ్యమానస మల్లారెడ్డి ఇంజినీరింగ్ కాలేజీలో డిగ్రీ, ఎంటెక్ పూర్తి చేసింది. అయితే, ఆమె చిన్నప్పటి నుంచి నాట్యంపై అమితాశక్తి ఉండడంతో అటువైపు అడుగులు వేసింది. ప్రస్తుతం హెచ్సీయూలో ప్రొఫెసర్ డాక్టర్ ఎం.ఎస్.శివరాజు పర్యవేక్షణలో డ్యాన్స్లో పీహెచ్డీ చేస్తోంది. కూచిపూడి నృత్యం నేర్చుకుంటున్న సమయంలోనే వెస్ట్రన్ డ్యాన్స్ కూడా చేస్తుండేది. అలా 4వ తరగతిలో ఉన్నప్పుడు స్కూల్ వార్షికోత్సవంలో చేసిన డ్యాన్స్కు తొలిసారి బహుమతి అందుకోవడంతో డ్యాన్స్పై ప్రేమను పెంచుకుంది. ‘సుమధుర ఆర్ట్స్ అకాడమీ’ని స్థాపించి తను ప్రదర్శనలు ఇస్తూ.. మరో 200 మందికి నాట్యంలో శిక్షణనిస్తోంది. అంతేకాదు.. దేశవ్యాప్తంగా వందల సంఖ్యలోప్రదర్శనలు ఇచ్చి అందరి మెప్పు పొందింది. మలేసియా, దుబాయ్లోనూ.. తెలుగు రాష్ట్ర ప్రభుత్వాల ఆహ్వానం మేరకు కృష్ణా, గోదావరి పుష్కరాలకు శ్రవ్యమానస తన బృందంతో పుష్కరాల విశిష్టతను చెబుతూ కూచిపూడి ప్రదర్శనలు ఇచ్చింది. నగరంలో జరిగిన ప్రపంచ తెలుగు మహాసభల్లోనూ ప్రదర్శనలు ఇచ్చారు. చిదంబరం, ఒడిశా, ఢిల్లీల్లో జరిగిన ఉత్సవాల్లోనూ తన నాట్యంతో మెప్పించింది. మలేసియాలో జరిగిన దసరా సంబరాలు, అబుదాబిలో ఉగాది, శ్రీరామనవమి వేడుకల్లో తన నాట్యంతో ఆ దేశాల్లోని తెలుగువారిని మంత్రముగ్ధులను చేసింది. మహిళలపై జరుగుతున్న అకృత్యాలను అరికట్టాలంటూ శ్రావ్య పలు నాటికలను స్వయంగా రూపొందించి çప్రదర్శనలు ఇస్తోంది. ఇటీవల రవీంద్రభారతిలో ‘నిర్భయ’, యాసిడ్ విక్టమ్ లక్ష్మి అగర్వాల్ పడిన వేదనను శ్రావ్య నటలో చూపిన తీరు ప్రేక్షకులను కన్నీరు పెట్టించింది. కేవలం స్త్రీ పాత్రల కాదు.. ‘శ్రీరాముడు, శివుడు, రావణుడు, మహావిష్ణు, శ్రీకృష్ణుడు’ తదితర పురుష పాత్రల్లోనూ చక్కగా ఒదిగిపోయింది. శ్రావ్య మానస తన నటన, నాట్యంతో ప్రతి వేదికపైనా సత్కారాలు, పురస్కారాలు సైతం అందుకుంది. మొదట్లో లైట్ తీసుకున్నా కూచిపూడి నాట్యాన్ని తొలుత సీరియస్గా తీసుకోలేదు.. అయితే ప్రదర్శనలు ఇచ్చేకొద్దీ వచ్చిన ప్రశంసలతో పట్టుదల పెరిగి ఇష్టంగా నేర్చుకున్నా. ఇప్పుడే నేనే గురువుగా వందల మందికి నాట్యం నేర్పుతున్నాను. నా శిష్యులు కూడా ఎంతో పట్టుదలగా నాట్యం నేర్చుకుంటుండడంతో ఈ రంగంపై భక్తిభావం పెరిగింది. – శ్రవ్యమానస భోగిరెడ్డి -
ఓటమినీ గెలిపించండి
లైఫ్లో పాస్ అవుతాం. ఫెయిల్ అవుతాం. అసలంటూ ఏదో ఒకటి అవడం ‘గెలుపు’. ఫైట్ చేశాం కదా. అందుకే అది గెలుపు. ఫైటింగ్లో ఓడామని ఫీల్ అయితే.. అసలు ఓటమి కన్నా ఫీల్ అవడం ఇంకా పెద్ద ఓటమి అవుతుంది. అందుకే ఓటమినీ గెలిపించాలి. శ్రావ్య అదే పని చేస్తున్నారు. పల్లెల్లో పర్యటించి.. పరిస్థితుల్ని ఎదిరించి జీవించడమే గెలుపు అని చెబుతున్నారు. రెండుసార్లు ఐఏఎస్ ప్రిలిమ్స్ క్లియర్ అయ్యి మెయిన్స్లో పోయాయి. అయినా శ్రావ్య నిరాశ పడలేదు. అంతే ఉత్సాహంగా మూడో ఎటెంప్ట్కి రెడీ అయింది. ప్రిపరేషన్ మొదలుపెడుతున్న సమయంలో తెలిసింది అంతకుముందు జరిగిన ఐఏఎస్ పరీక్షలో ఉత్తీర్ణులు కాలేదని ఒక అమ్మాయి, అబ్బాయి ఆత్మహత్య చేసుకున్నట్టు! అబ్బాయి తెలుగువాడే. శ్రావ్యకు తెలిసిన వ్యక్తే. అతనిది చాలా పేద కుటుంబం. తల్లిదండ్రులు ఇద్దరూ కూలీలే. పైసా పైసా కూడబెట్టి కొడుకును చదివిస్తున్నారు. ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ అయిన ఆ అబ్బాయి తల్లిదండ్రుల గురించి ఏమాత్రం ఆలోచించకుండా కేవలం రెండుసార్లు ఐఏఎస్ మెయిన్స్ క్లియర్ చేయలేకపోయానే అని ఆత్మహత్య చేసుకున్నాడు. శ్రావ్య వాళ్ల ఫ్రెండ్స్ అంతా కండోలెన్స్ మీటింగ్ ఏర్పాటు చేశారు. శ్రావ్య వెళ్లలేదు. ఫ్రెండ్స్ నిష్టూరమాడారు. ఎందుకు ఆలోచించరు? ‘‘ఎందుకు రావాలి? ఆ అబ్బాయిది ఎంత పిరికితనం? ఐఏఎస్ రాకపోతే లైఫ్ లేదా? ఇంజనీరింగ్ చదివినవాడు ఐఏఎస్ రాకపోతే ఇంకేదీ చేయలేడా? అతని తల్లిదండ్రులు కొడుకు ఐఏఎస్సే కావాలనే ఆశతో ఉన్నా... ఆ ప్రయత్నం ఫెయిల్ అయితే ఇంకోటి సాధించి తన తల్లిదండ్రుల ఆలోచననూ మార్చాలి. జీవితంలో అనుకున్నవన్నీ జరగవనీ, అయినా అధైర్య పడకుండా అనుకోనివి ఎంత సక్సెస్గా అఛీవ్ చేయగలుగుతామో చూపించాలి. ఇన్స్పైర్ చేయాలి. అదీ చదువు నేర్పిన ఓర్పు, విచక్షణ! అంతేకాని నిరాశతో సూసైడ్ చేసుకోవడం కాదు. అరే చేతికొచ్చిన కొడుకు పోయాడు.. ఇప్పుడు ఆ తల్లిదండ్రుల గతేంటి? సింగిల్ మినిట్ అయినా వాళ్ల గురించి ఆలోచించాడా అతను? ఆలోచిస్తే ఇలా ఆత్మహత్య చేసుకునేవాడు కాదు. అందుకే నేను కండోలెన్స్ మీటింగ్కి రాలేదు’’ అని తెగేసి చెప్పింది శ్రావ్య. ముప్పై రోజుల్లో అరవై గ్రామాలు ఫ్రెండ్స్తో చెప్పడమే కాదు తన ఆలోచనా తీరునూ మార్చుకుంది అప్పటి నుంచే శ్రావ్య. ఇప్పుడు తన ముందున్నది ఐఏఎస్ కాదు... అంతకుమించిన లక్ష్యం! సమాజం కోసం ఏమన్నా చేయాలి... ఏం చేయాలి? పరిశోధన ప్రారంభించింది. ప్రతి జిల్లాలో 60 గ్రామాల చొప్పున తెలంగాణలోని అన్ని జిల్లాల్లో పర్యటించింది. జూలై 1న ప్రయాణం మొదలుపెట్టిన ఈ ప్రయాణం జూలై 31కి పూర్తయింది. ఆర్థిక, సామాజిక, రాజకీయ సమస్యలెన్నో తెలుసుకుంది. అంతకుమించిన అనుభవం గడించింది. శ్రావ్య పూర్తిపేరు మందడి శ్రావ్యారెడ్డి. తల్లిదండ్రులు.. మందడి చంద్రశేఖర్రెడ్డి, కాంట్రాక్టర్. తల్లి నీరజారెడ్డి, అడ్వకేట్. శ్రావ్యకు ఓ చెల్లెలు.. శ్రీహారెడ్డి, ఏమ్బీఏ గోల్డ్మెడలిస్ట్. శ్రావ్య విద్యాభ్యాసం.. స్కూలింగ్.. సెయింట్ ఆన్స్, శ్రీచైతన్య కాలేజ్లో ఇంటర్, నల్లమల్లారెడ్డి కాలేజ్లో కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్. జన్మభూమి నా దేశం..! శ్రావ్య ఎనిమిదవ తరగతిలో ఉన్నప్పుడే బెల్జియం దేశానికి సంబంధించిన ఓ సంస్థ నిర్వహించిన జనరల్ నాలెడ్జ్, ఎలక్యూషన్ కాంపిటీషన్స్లో నెగ్గింది. ఆమె ప్రతిభకు ముచ్చటపడ్డ ఆ సంస్థ తమ ఖర్చుతో బెల్జియంలో శ్రావ్య చదువుకునే చాన్స్నూ ఇచ్చింది. అంతేకాదు చదువు తర్వాత ఉద్యోగావకాశాన్నీ ఇస్తామంది. కానీ శ్రావ్య ‘నో’ అంది.‘ తెలియనితనంతో కాదు.. తెలిసిన పరిణతితోనే’ అలా అన్నానని అంటుంది ఆమె. ‘‘ఒక్కసారి వాళ్ల ఆఫర్కు ఓకే అన్నామంటే జీవితాంతం ఆ దేశానికి ఊడిగం చేయాలి. అదేదో నా దేశానికే చేసుకోవచ్చు కదా! అనే అభిప్రాయంతో రిజెక్ట్ చేశాను’’ అని చెప్తుంది. ఆ దృఢ నిశ్చయానికి ఆమె తల్లిదండ్రులూ సంబరపడ్డారట కాని అయ్యో అంత అద్భుతమైన అవకాశాన్ని వద్దనుకుంటోందే అని బాధపడలేదట.. ప్రెషర్ పెట్టలేదట. స్కూల్ ప్రిన్సిపాలే ఒకటికిరెండు సార్లు ‘‘వెళితే స్కూల్ పేరు కూడా ఎలివేట్ అవుతుంది కదా’’ అని ప్రస్తావించారట. అయినా శ్రావ్య ‘నో’ అనే మాటమీదే ఉంది. అంటే సొంతంగా నిర్ణయాలు తీసుకోవడం, అనుకున్నదాని మీద నిలబడ్డం చిన్నప్పటి నుంచే ఉన్నాయి. అది ఆమె వ్యక్తిత్వం. అలాగే నాయకత్వ లక్షణాలు కూడా. బాధ్యత తీసుకున్న లీడర్ స్కూలింగ్ అప్పటి నుంచే క్లాస్ లీడర్గా ఉంది శ్రావ్య. ఇంజనీరింగ్ వరకూ ఆ లీడర్షిప్ కంటిన్యూ అయింది. ఏ టాస్క్ ఇచ్చినా సమర్థవంతంగా పూర్తిచేసేది. ప్రశ్నించే తత్వం ఉండేది. ఇంజనీరింగ్ అయిపోయాక అందరిలాగే కార్పొరేట్ జాబ్ గూగుల్లో చేరింది. కాని ఎక్కడో అసంతృప్తి. ఏదో చేయాలనే చివరకు ఇదా చేస్తోంది అని తనను తానే విమర్శించుకుంది. విశ్లేషించుకుంది. ఐఏఎస్ సాధిస్తే చాలామందికి ఉపయోగపడొచ్చు కదా అని సివిల్స్కి సిద్ధమైంది. అదిగో అప్పుడే పైన చెప్పిన సంఘటన (ఇద్దరి ఆత్మహత్య) జరిగి.. మొత్తం తన దిశనే మార్చుకుంది. ‘‘మాతో పాటు సివిల్స్కి ప్రిపేర్ అయిన ఆ ఇద్దరి ఆత్మహత్య నన్ను చాలా ఆలోచించేలా చేసింది. మన దగ్గర కంప్లయినింగ్ నేచర్ చాలా ఎక్కువ. ఏం చేయలేకపోయినా తప్పు సమాజం మీద, దేశం మీదకు నెట్టేస్తాం. బా«ధ్యత తీసుకోవడానికి మాత్రం ముందుకు రాం. అలాంటప్పుడు ప్రశ్నించే హక్కు ఎక్కడుంది? రెస్పాన్సిబుల్ సిటిజన్స్గా మనమేం చేస్తున్నాం? హావ్ టు బ్రింగ్ దట్ చేంజ్ అనుకున్నా. ముందుగా కొన్ని ఎన్జీవోలతో కలిసి పనిచేశా’’ అంటూ తన ప్రయాణ ప్రారంభాన్ని చెప్పింది శ్రావ్య. వన్ ఉమన్ ఆర్మీ పనిచేసిన ఎన్జీవోలు, అటెండ్ అయిన సెమినార్లు శ్రావ్యకు చాలా విషయాలే నేర్పాయి. ముఖ్యంగా మన దగ్గర స్త్రీల పరిస్థితి గురించి! రేప్ జరిగినా అమ్మాయిదే తప్పు, భర్త చనిపోతే శుభానికి పనికిరాదు మహిళ, మొగుడు విడాకులిచ్చినా అవమానం మోసేది స్త్రీయే.. ప్రతి తప్పును ఆడవాళ్లే మోయాలి ఎందుకు? ఈ అనుభవమే శ్రావ్య ‘‘వియ్ అండ్ షి’’ అనే సంస్థను పెట్టి తెలంగాణ జిల్లాలను చుట్టేలా చేసింది. ప్రతి ఊరూ వెళ్తున్నా కొద్దీ.. తెలియని కోణాలు, ఊహించని పరిస్థితులు ఆమె కళ్ల ముందు! ఇంకా ఆగని బాల్యవివాహాలు, బాల వితంతువులు.. చదువు, ఉపాధి లేకుండా.. బానిస బతుకులు ఈడుస్తూ.. ఆమె కడుపు తరుక్కు పోయింది. కొంతమందికి అయితే ప్రభుత్వ పథకాల గురించి కూడా తెలియదు. పెన్షన్ ఆగిపోయిన వాళ్లు, పక్కా ఇళ్లు లేని వాళ్లు ఉన్నారు. జోగినీ వృత్తికి దూరమైనా ఇంకా అవమానాలపాలవుతున్న మహిళలు, ‘‘మీకెంతమంది నాన్నలురా’’ అని ఎగతాళికి గురవుతున్న వాళ్ల పిల్లలు, వరకట్న బాధితులు.. ఇలాంటి దాదాపు 73 కేస్లను ఐడెంటిఫై చేసింది. తక్షణమే సాయం కావల్సిన వాళ్లకు తనకు తెలిసిన వాళ్ల ద్వారా ఆ సహాయం అందేలా చూసింది. మిగిలిన వాళ్ల వివరాలు రాసుకుంది. కదలండి.. కదలి రండి శ్రావ్య ఇప్పుడు సూసైడల్ టెండెన్సీ ఉన్న వాళ్లను మామూలు మనుషులుగా చేసే ప్రయత్నంలో ఉంది. తర్వాత వాళ్ల నైపుణ్యం, అభిరుచులకు అనుగుణంగా స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ చేపడుతుందట. వాటికి కావల్సినవి సమకూర్చుకుంటోంది. తన సంస్థకు సంబంధించిన ఆఫీస్ను ప్రారంభించింది. వన్ ఉమన్ ఆర్మీగా సాగుతున్న ఈ జర్నీకి ఆమె ఎవరినుంచీ ఆర్థిక సహకారం ఆశించట్లేదు. వలంటీర్స్నూ ఆహ్వానించట్లేదు. ఒంటరి స్త్రీలకు మెరుగైన జీవితం ఇవ్వడానికి ఒంటరిగానే పోరాడుతోంది శ్రావ్య. కాకపోతే ఎవరైనా వలంటరీగా సర్వీసెస్ ఇస్తామని ముందుకు వస్తున్నవాళ్లకు ఒకటే చెప్తోంది.. ‘‘మీరున్న చోటే.. మీకు వీలైనప్పుడు మీ చుట్టుపక్కల ఉన్న పరిస్థితులను చక్కదిద్దడానికి ప్రయత్నం చేయండి.. మీకు తోచిన పని చేయండి’’ అని. యువతలోని చాలామంది ఆ స్ఫూర్తిని పంచుకుంటున్నారు. శ్రావ్య ఇప్పుడు లా కూడా చదువుతోంది. లాయర్ అయి పేదరికంలో ఉన్న మహిళలకు న్యాయసహాయం కూడా చేయాలని ఆమె ఉద్దేశం. అలాగే అవగాహన కూడా కల్పించే పనిలో ఉంది ఆమె. సర్పంచ్లు అడ్డుకునేవారు! ‘‘చిన్న చిన్న వానచినుకులే సముద్రాన్ని నింపుతాయి. అలా నేను వేసిన అడుగు కూడా చిన్న వాన చినుకులాంటిదే. తెలంగాణ టూర్కి నేనే ఫైనాన్స్ చేసుకున్నా. జాబ్ చేస్తున్నప్పటి నా సేవింగ్స్, నాకున్న కొంచెం జ్యూయెలరీ, మా నాన్న ఇచ్చిన ఎమౌంట్ అన్నీ కలిసి రెండు లక్షలు అయ్యాయి. వాటితోనే రోడ్ ట్రిప్ ప్లాన్ చేసుకున్నా. కొన్ని చోట్ల ఊళ్లోకి అడుగు పెట్టనివ్వకుండా సర్పంచ్లు అడ్డుకున్నారు. వాళ్లను కన్విన్స్ చేశా.. వినలేదు కొంతమంది. నేనూ అంతే మెండిగా ఊరి పొలిమేరలో కూర్చున్నా కానీ వెనకడుగు వేయలేదు. వాళ్లకు విసుగొచ్చి సరే వెళ్లండి అని ఊళ్లోకి పర్మిషన్ ఇచ్చారు. గవర్నమెంట్ సర్వే జరగని ఊళ్లకు కూడా వెళ్లా. నన్ను చూసి వాళ్లెంత సంతోషపడ్డారో.. వాళ్ల బాధలన్నీ ఏకరువు పెట్టారు. సర్వే కోసం ఎవరైనా వస్తే.. సర్పంచ్లు డబ్బులిచ్చేసి ఊళ్లోకి రానివ్వకుండా పంపించేస్తారని తెలిసి షాక్ అయ్యా. ఇలాంటి నిజాలెన్నో తెలిశాయి. వెల్ఫేర్ గర్ల్స్ హాస్టల్స్లో పిల్లల పక్కనే పడుకున్నా. వాళ్ల సమస్యలన్నీ షేర్ చేసుకున్నారు. శ్మశానంలోనే ఇళ్లున్న బ్యాదరి వాళ్ల దగ్గరా ఉన్నా. ఒళ్లు గగుర్పొడిచే లైఫ్ వాళ్లది. వాళ్లకు పెన్షన్ లేదు.. పక్కా ఇల్లు ఉండదు. సోషల్బాయ్కాట్! తలచుకుంటే ఇప్పటికీ మనసు మెలేసినట్టవుతుంది. ఇండిపెండెన్స్ వచ్చి ఇన్నేళ్లయినా ఇంకా ఈ స్థితిలో ఉన్నాం. బాగవ్వాలి. ప్రస్తుతం మా చెల్లెలు నాకు చాలా హెల్ప్ చేస్తోంది. ఫ్రెండ్స్ కూడా చాలా ఎంకరేజ్ చేస్తున్నారు. మా పేరెంట్స్ సపోర్ట్ గురించైతే చెప్పనవసరం లేదు’’ అంటోంది శ్రావ్యారెడ్డి. – సరస్వతి రమ -
చాంపియన్ శ్రావ్య–హుమేరా జోడీ
సాక్షి, హైదరాబాద్: అఖిల భారత టెన్నిస్ సంఘం (ఐటా) 50కే ప్రైజ్మనీ టోర్నమెంట్లో హైదరాబాద్ క్రీడాకారిణి శ్రావ్య శివాని సత్తా చాటింది. ఎల్బీ స్టేడియంలో జరిగిన ఈ టోర్నీలో డబుల్స్ విభాగంలో విజేతగా నిలిచిన శివాని... సింగిల్స్ కేటగిరీలో రన్నరప్ ట్రోఫీని అందుకుంది. శుక్రవారం జరిగిన మహిళల డబుల్స్ ఫైనల్లో టాప్సీడ్ శ్రావ్య శివాని–షేక్ హుమేరా (తెలంగాణ) ద్వయం 6–0, 6–4తో ఆకాంక్ష–ముష్రత్ అంజుమ్ జంటపై గెలుపొందింది. సింగిల్స్ టైటిల్పోరులో సహజ యామలపల్లి (తెలంగాణ) 6–4, 6–4తో శ్రావ్య శివానిని ఓడించి చాంపియన్గా అవతరించింది. పురుషుల సింగిల్స్ విభాగంలో ఏపీకి చెందిన బి. సాయి శరణ్ రెడ్డి రన్నరప్తో సరిపెట్టుకున్నాడు. ఫైనల్లో టాప్ సీడ్ పృథ్వీ శేఖర్ (తమిళనాడు) 6–3, 6–0తో సాయి శరణ్ రెడ్డిపై గెలుపొందాడు. పోటీల అనంతరం జరిగిన బహుమతి ప్రదాన కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర టెన్నిస్ సంఘం కోశాధికారి డి. చంద్రశేఖర్ ముఖ్య అతిథిగా విచ్చేసి విజేతలకు ట్రోఫీలను బహూకరించారు. -
శ్రావ్యా.. ప్లీజ్..!
‘నేనేంటి మీకు?’ గుడ్లు తేలేశాడు శ్రీరామ్. ‘నేనేంటి మీకు?’ గద్దించింది శ్రావ్య. ‘అర్థం కాలేదు శ్రావ్యా. భర్తకు భార్య ఏమౌతుంది? భార్యే కదా!’ అన్నాడు శ్రీరామ్. ‘అవుతుంది నిజమే. నేను మీకు అయ్యానా..’ అంది శ్రావ్య. శ్రీరామ్ భయంగా చూశాడు. అది ఆఫీస్ టైమ్. ఆఫీస్కు వెళ్లే ముందు కానీ, ఆఫీస్ నుంచి వచ్చాక కానీ సడన్గా ఇలా టాటా, బైబై చెబుతుంటుంది శ్రావ్య. ‘ఏంటి అవడం శ్రావ్యా?’.. వెనక్కు వస్తూ అన్నాడు. ‘నేను మీ భార్యను అని కదా అన్నారు. అనడం వరకేనా? అనుకోవడం వరకూనా?’ ‘అనుకోకుండా అనడం ఉంటుందా ఎక్కడైనా?’ ‘కానీ నాకు తెలుస్తోంది శ్రీరామ్.. మీకు నా మీద ప్రేమ పోయింది’. ‘ఎలా చెప్తావ్ శ్రావ్యా?’ ‘పెళ్లికి ముందు మీరిలా లేరు!’ ‘ఇలా’ అంటే? ‘అప్పుడున్నట్లు ఇప్పుడు లేరు’. ‘అప్పుడెలా ఉండేవాడిని?’ ‘అది కూడా గుర్తు లేదా?’ ‘గుర్తు లేకపోవడం కాదు శ్రావ్యా.. ఇప్పుడున్నట్లే అప్పుడూ ఉన్నట్లు గుర్తు. నీకు కోపం వచ్చిందని అర్థం అవుతూనే ఉంది కానీ.. ముందు ‘మీరు’ అనడం ఆపు నన్ను’. ‘అప్పుడు నా కోసం ఎదురు చూసేవాడివి. నా మాట కోసం ఆరాటపడేవాడివి. నా నవ్వు కోసం...’ ‘ఇప్పుడు?’ ‘చూశావా.. నా మాట వినడం కూడా విసుగ్గా ఉంది నీకు!’ ‘విసుగా?! ‘నా నవ్వు కోసం నువ్వేం చేసేవాడివో చెప్పబోతుంటే వినకుండా.. ‘ఇప్పుడు?’ అని బ్రేక్ చేశావ్. ‘ఏం బ్రేక్ చేశాను?’ ‘నా మాటను బ్రేక్ చేశావ్?’ ‘సరే.. చెప్పు. నీ నవ్వు కోసం నేనేం చేసేవాడిని?’ ‘అక్కర్లేదు’. ‘ఏంటక్కర్లేదు’ ‘నా నవ్వు కోసం నువ్వేం చేసేవాడివో నేను గుర్తు చెయ్యనక్కర్లేదు. నువ్వు గుర్తుకు తెచ్చుకోనక్కర్లేదు’. ‘ఏమైంది శ్రావ్యా.. నీకు? టార్చర్ పెడుతున్నావు తెలుసా?’ ‘టార్చరా!! నువ్వా, నేనా.. టార్చర్ పెడుతున్నది శ్రీరామ్?’ ‘రాత్రంతా బాగానే ఉన్నావ్ కదా!’ ‘బాగా.. ఉన్నానా?! ‘అదే.. శ్రావ్యా.. మన మధ్య గొడవేం జరగలేదు కదా అని!’ ‘గొడవ జరగ్గపోతే బాగున్నట్టు.. గొడవ జరిగితే బాగోలేనట్టు.. ఏంటిది శ్రీరామ్? ఏం మాట్లాడుతున్నావ్?’ ‘బాగోవడం, బాగోలేకపోవడం.. గొడవల వల్లే కదా శ్రావ్యా?’ ‘మరి ఏ గొడవా లేకుండానే.. అప్పుడెందుకు నువ్వు అన్నిసార్లు ‘ఏంటి శ్రావ్యా అలా ఉన్నావ్?’ అని అడిగేవాడివి?! ‘అప్పుడు.. అంటే?’ ‘పెళ్లికి ముందు’. ‘పెళ్లికి ముందా?!’ ‘అవును. అప్పుడు ఒంట్లో బాగున్నా.. ‘అలా ఉన్నావేంటి?’ అని అడిగేవాడివి. ఇప్పుడు ఒంట్లో బాగోలేకున్నా ‘ఎలా ఉన్నావ్?’ అని కూడా అడగడం లేదు’. ‘పెళ్లికి ముందు.. పెళ్లికి తర్వాత.. ఒకేలా ఎలా ఉంటుంది శ్రావ్యా?’ ‘చూశావా.. నువ్వే ఒప్పుకున్నావ్.. మారిపోయానని’ ‘నేను మారిపోవడం, నువ్వు మారిపోవడం కాదు శ్రావ్యా.. ప్రేమలో ఎలా ఉంటామో.. పెళ్లి తర్వాత కూడా అలా ఉండలేం అని అంటున్నా’. ‘అంటే.. ప్రేమ ఉండదనా.. శ్రీరామ్?’ ‘ఉండదు అని కాదు శ్రావ్యా.. ఉందీ అని చెప్పడానికి సరిపడినంత టైమ్ ఉండదూ అని’. ‘ప్రేమ ఉంటే టైమ్ ఉండదా శ్రీరామ్?’ ‘మనసుంటే.. మార్గం ఉండదా అన్నట్లు అడిగావ్ శ్రావ్యా. పెళ్లికి ముందు నీ కోసం ఎదురు చూసింది నిజమే. ఇప్పుడూ చూస్తున్నా.. ఆఫీస్లో ఉండి, నీ ఫోన్ కాల్ కోసం! పెళ్లికి ముందు నీ మాట కోసం ఆరాటపడిన మాట నిజమే. ఇప్పుడూ పడుతున్నా.. నా పది మాటలకు అలకలో నువ్వొక్క మాటైనా బదులు చెప్పనప్పుడు. పెళ్లికి ముందు కట్టు కథలు చెప్పి నిన్ను నవ్వించాలని చూసింది నిజమే. ఇప్పుడూ చెప్పాలని ట్రయ్ చేస్తున్నా..’ అన్నాడు శ్రీరామ్ నీరసంగా. ‘సో.. ట్రయ్ చేస్తున్నావ్. ప్రేమగా ఉండడానికి ట్రయ్ చేస్తున్నావ్. ప్రేమించడానికి ట్రయ్ చేస్తున్నావ్. ప్రేమ లేకున్నా, ప్రేమ ఉన్నట్లు నమ్మించడానికి ట్రైయ్ చేస్తున్నావ్. అంతే తప్ప.. నిజంగా నీకు నా మీద ప్రేమ లేదు’. ‘శ్రావ్యా.. ప్లీజ్. ఆఫీస్కి టైమ్ అవుతోంది. బయల్దేరేదా?’ ‘వెళ్లండి. కానీ సమాధానం చెప్పి వెళ్లండి’. ‘దేనికి సమాధానం?’ ‘నేనేంటి మీకు?’ (‘నువ్వు’ లోంచి మళ్లీ ‘మీరు’ లోకి వచ్చేసింది శ్రావ్య). సినిమాలో సంసారం (మణిరత్నం ‘సఖి’ చిత్రంలోని సీన్ ఇది. మాధవన్, షాలిని లవ్ కపుల్. పెద్దల్ని కాదని, పెళ్లి చేసుకుని వేరుగా ఓ అపార్ట్మెంట్లో ఉంటారు. ఇద్దరివీ ఉద్యోగాలు. సాయంత్రం మాధవన్ వచ్చేటప్పటికి ఇంటికి తాళం వేసి ఉంటుంది. బయట చాలా సేపటిగా వెయిట్ చేస్తాడు. చేస్తూ ఉంటాడు...) సారీ, కూరలు తేవడానికి వెళ్లాను. లేటైంది. నలభై ఐదు నిముషాలుగా వెయిట్ చేస్తున్నాను. సారీ.. ర.. (ర అంటే.. ఇంట్లోకి రమ్మని) లేటౌతుందంటే తాళం చెవి పైన పెట్టి వెళ్లొచ్చుగా. కొంచెం లేటయింది. దానికింత కోపమా? నువ్వు ఎక్కడికైనా వెళ్లి, ఎంత లేటుగా అయినా రావచ్చు. నేను మాత్రం బయట వెయిట్ చెయ్యాలా? నేను మాత్రం ఏమైనా షికార్లు కొట్టడానికి వెళ్లానా? మీకు వండి పెట్టడానికేగా వెళ్లాను. ఎవరు కాదన్నారు? నన్నెందుకు బయట గూర్ఖాలా వెయిట్ చెయ్యించడం? పెళ్లికి ముందు మూడు గంటలు వెయిట్ చెయ్యలా.. బీచ్లో. ఇప్పుడు పది నిముషాలు వెయిట్ చెయ్యలేరా?అది వేరు.. వేరు అంటే?! అదప్పుడు పెళ్లి కాక ముందు. మరి పెళ్లి తర్వాత? అంతేనా? ఇప్పుడు ఆ మాట ఎవరన్నారు? తలుపు తియ్. ఇప్పుడు నువ్వన్నావ్గా. తలుపు తియ్ శాంతీ. మాట మార్చకు. తలుపు తియ్. మరెందుకన్నావ్? నువ్ మాత్రం ఎందుకలా మాట్లాడావ్? నువ్వు అన్నావా లేదా? బయట నించుని ఇప్పుడు గొడవ దేనికి? లోపలికి పద చెప్తాను. చెప్పు నాకు. చెప్తాను పదా... (లోపలికి వెళ్లగానే షాలిని అలక తీర్చేపనిలో పడిపోతాడు మాధవన్) సంసారంలో పడ్డాక, బాధ్యతల్లో తలమునకలై మునుపటి ప్రేమానురాగాలు తగ్గినట్లు అనిపిస్తుంది కానీ, నిజంగా తగ్గినట్లు కాదు. గొడవలు, అలకలు కూడా ప్రేమానురాగాల్లో భాగమే.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
వైఎస్సార్సీపీ అభ్యర్థులకే మా మద్దతు
బోల్తా కొట్టిన బాబు బుల్బుల్ పిట్ట
‘సిద్ధం’ పాటల సీడీని ఆవిష్కరించిన భారతమ్మ
Lok Sabha Election 2024: ఎన్డీఏకు 150 సీట్లూ కష్టమే
మంత్రి పీఎస్ పనిమనిషి ఇంట్లో కోట్లు
ధైర్యంగా చెబుతున్నా.. సర్వేపల్లిని అభివృద్ధి చేశా
దళితులపై దాడి.. టీడీపీ నేతలపై కేసు
మహిళపై దాడి కేసులో నిందితుడికి శిక్ష
‘దురాయి’ని అడ్డం పెట్టుకుని..
నోటాకు చోటు
తప్పక చదవండి
- RRR రీ-రిలీజ్ ప్రకటన.. స్పెషల్ ఏంటో తెలుసా..?
- 34 ఏళ్లుగా బీజేపీకి కంచుకోట.. శేషన్, రాజేష్ ఖన్నా బలాదూర్!
- వింటున్నావా ఈసీ.. బాబు కారుకూతలు
- భారత్ సేవల రంగం నెమ్మది
- ఈసారి ఉల్లంఘిస్తే జైలే: ట్రంప్కు కోర్టు హెచ్చరిక
- నీకే దిక్కు లేదు.. నా కూతురికి సీటు ఇస్తావా?
- అందరివాడు జగన్ను ఆశీర్వదించండి
- అక్రమాలు కో‘కొల్లు’లు
- పేదల అక్షరంపై కక్ష
- సూర్య విధ్వంసకర సెంచరీ.. ఎస్ఆర్హెచ్పై ముంబై విజయం
Advertisement