breaking news
small movies
-
ఐసీయూలో టాలీవుడ్ 'చిన్న' సినిమా
ఓ రాజ్యం ఉంది. అందులో రాజు, రాణి, మంత్రి, సైనికులు, ప్రజలు.. ఇలా అందరూ ఉన్నారు. రాజుకి అందరూ జేజేలు పలుకుతారు. కానీ సైనికులు లేకపోతే ఆయనకు విలువ ఎక్కడిది? ఇలా ఆలోచించేవాళ్లు ఎంతమంది? టాలీవుడ్ పరిస్థితి కూడా ఇలానే తయారైనట్లు కనిపిస్తోంది! రాజు లాంటి స్టార్ హీరోల మూవీస్ని పట్టించుకుంటున్న ప్రేక్షకుడు.. సైనికుడు లాంటి చిన్న సినిమాని లైట్ తీసుకుంటున్నాడు. ఇంతకీ దీనికి కారణమేంటి? ఇండస్ట్రీలో అసలేం జరుగుతోంది?ఒకప్పుడు కూడా తెలుగులో స్టార్ హీరోలు ఉన్నారు. వాళ్లు సినిమాలు చేసేవారు. కానీ ఎప్పుడూ పెద్దా చిన్నా అని తేడా ఉండేది కాదు. తెలుగు మూవీ అని మాత్రమే అని మాట్లాడుకునేవారు. ఎప్పుడైతే పాన్ ఇండియా ట్రెండ్ మొదలైందో అప్పటినుంచి రోజురోజుకీ టాలీవుడ్లో చిన్న చిత్రాల పరిస్థితి అంతకంతకు దిగజారుతూ వచ్చింది. చూసే ప్రేక్షకుల ఆలోచన విధానంలోనూ చాలా మార్పులొచ్చాయి.ఒకప్పుడు ఎంటర్టైన్మెంట్ అంటే సినిమా మాత్రమే. దీంతో వీకెండ్ వస్తే చాలు థియేటర్లకు వెళ్లేందుకు ఆసక్తి చూపించేవారు. చిన్నపెద్దా మూవీస్ అన్నీ చూసేవారు. ఇప్పుడు మీడియం బడ్జెట్ సినిమాలు అనగానే ఎలానూ నెలరోజులకు ఓటీటీల్లోకి వచ్చేస్తాయిగా, ఇంట్లో చూసుకోవచ్చులే అని చాలామంది.. ముందే ఫిక్స్ అయిపోతున్నారు. అందుకే మీడియం బడ్జెట్ చిత్రాల్ని థియేటర్లలో రిలీజ్ చేసినా సరే వాటికి పెద్దగా ఆదరణ ఉండట్లేదు.గీతా ఆర్ట్స్, సితార, మైత్రీ, ఎస్వీసీ లాంటి పెద్ద సంస్థలు నిర్మించే మీడియం బడ్జెట్ సినిమాలకు కాస్తోకూస్తో హైప్ ఉంటుంది. అందుకు తగ్గట్లే వాళ్లు ప్రమోషన్ చేస్తుంటారు. ఖర్చు విషయంలో అస్సలు వెనకాడరు. స్టార్స్తోనూ ప్రమోషన్స్ చేయిస్తారు. దీంతో ఆయా పెద్ద నిర్మాణ సంస్థల నుంచి వచ్చే చిత్రాలకు మాత్రం అంతో ఇంతో ఆదరణ దక్కుతోంది. మిగిలిన వాటి వైపు ఆడియెన్స్ చూడటమే గగనమైపోతోంది.మూవీ టీమ్ చేసే కొన్ని పనులు కూడా చిన్న సినిమాలని ప్రేక్షకులు లైట్ తీసుకునేలా చేస్తున్నాయి. సినిమా రిలీజ్ కావడమే లేటు.. మా మూవీ తోపు, బంపర్ హిట్ అని సోషల్ మీడియాలో ప్రచారం చేయించుకుంటున్నారు. కంటెంట్ ఉంటే పర్లేదు లేదంటే మాత్రం.. వీటిని చూసి నమ్మి, థియేటర్కి వెళ్లిన చాలామంది.. పలుమార్లు మోసపోయారు. ఇలా జరిగిన తర్వాత చిన్న సినిమా అంటే ఇంతే అని ఓ అభిప్రాయం వాళ్లకు కచ్చితంగా ఏర్పడుతుంది.చిన్న చిత్రాలంటే బడ్జెట్ తక్కువే. అందుకు తగ్గట్లే క్వాలిటీ, కంటెంట్ ఉంటుంది. ప్రస్తుతం ఓటీటీల్లో ఇంటర్నేషనల్ క్వాలిటీ కంటెంట్ చూస్తున్న ప్రేక్షకుడు.. మన నిర్మాతలు తీసే రొటీన్ రొట్టకొట్టుడు చిత్రాలకు ఎందుకు వెళ్తాడు? ఈ విషయంపై దర్శకనిర్మాతలు కచ్చితంగా దృష్టిపెట్టాలి. రెగ్యులర్ కమర్షియల్, థ్రిల్లర్, హారర్ చిత్రాలు తీస్తే.. పరుగెత్తుకుని వచ్చి చూసేసే రోజులు కావివి. కామెడీ కావొచ్చు, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ కావొచ్చు సమ్థింగ్ డిఫరెంట్ ఉంటేనే ఆడియెన్స్, థియేటర్కి వచ్చి చూస్తారు. లేదంటే కనీసం ఆ వైపు కూడా చూడరు.చిన్న సినిమాల్లో స్టార్స్ పెద్దగా ఉండరు. సదరు హీరో లేదా హీరోయిన్ కోసం థియేటర్కి వెళ్లి చూడాలా? అని సగటు ప్రేక్షకుడు కచ్చితంగా అనుకుంటాడు. స్టార్ హీరోల సినిమాలు రిలీజైనప్పుడు ఇంతింత టికెట్ రేట్లు పెట్టి చూస్తారు. వాటికే మొత్తం ఖర్చు పెట్టేస్తే చిన్న చిత్రాలు వచ్చినప్పుడు చూసేందుకు డబ్బులు ఎక్కడుంటాయి?ఈ వీకెండే తీసుకుందాం. ఒకటి రెండు కాదు అరడజనుకు పైగా చిన్న సినిమాలు ఒకేసారి రిలీజయ్యాయి. వీటిలో ఒక్కదానికి మాత్రమే పాజిటివ్ టాక్ వచ్చింది. మిగిలిన వాటికి మిక్స్డ్, నెగటివ్ టాక్ వచ్చింది. ఇలా ముకుమ్మడి విడుదల కూడా మీడియం బడ్జెట్ చిత్రాల్ని చంపేస్తోందని చెప్పొచ్చు. ఇలా చాలా చాలా అంశాలు టాలీవుడ్లో చిన్న సినిమాలకు రోజురోజుకీ శాపంగా మారుతున్నాయా అనిపిస్తోంది! -
టాలీవుడ్ చిన్న చిత్రాలు.. సూపర్ హిట్స్.. అందువల్లే సక్సెస్..!
టాలీవుడ్లో ఈ ఏడాది చాలా సినిమాలు రిలీజ్ అయ్యాయి. పెద్ద పెద్ద స్టార్స్ సినిమాలతో చిన్న చిత్రాలు కూడా థియేటర్లలో సందడి చేశాయి. భారీ తారాగణ, పెద్ద బడ్జెట్ సినిమాలకు కలెక్షన్స్ వస్తాయి. మరి చిన్న సినిమాల సంగతేంటి? అగ్రతారలు లేకపోయినా సినిమాలకు ఆదరణ దక్కడం అంతా ఈజీ కాదు. కంటెంట్ ఉంటే బాక్సాఫీస్ వద్ద రాణిస్తాయి. లేకపోతే వారం రోజుల్లోనే కనుమరుగవుతుంటాయి. కానీ కంటెంట్ ఉన్న చిన్న చిత్రాలు మాత్రం ఈ ఏడాది సత్తా చాటాయి. ఈ ఏడాదిలో పెద్ద స్టార్స్ లేకుండానే బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ కొట్టిన వచ్చిన ఆ చిన్న సినిమాలేవో ఓ లుక్కేద్దాం.కోర్ట్ మూవీ..ఈ ఏడాది సూపర్ హిట్గా నిలిచిన చిత్రాల్లో కోర్టు ఒకటి. మార్చి 14న థియేటర్లలోకి వచ్చిన కోర్ట్ మూవీ బాక్సాఫీస్ వద్ద ఆడియన్స్ ఆదరణ దక్కించుకుంది. ఓ చిన్న సినిమా అద్భుత విజయాన్ని సాధించింది. హీరో నాని నిర్మించిన ఈ మూవీ.. అదిరిపోయే కలెక్షన్స్ రాబట్టింది. ఈ చిత్రంలో ప్రియదర్శి ప్రధాన పాత్రలో నటించగా.. హర్ష రోషన్-శ్రీదేవి జంటగా అలరించారు. రామ్ జగదీశ్ అనే కొత్త దర్శకుడు తీసిన ఈ చిత్రంలో పోక్సో చట్టం గురించి ప్రస్తావించారు. ఈ మూవీ కేవలం రూ. 5 కోట్ల బడ్జెట్తో తీస్తే.. దాదాపు రూ. 55 కోట్లు వసూలు చేసి బ్లాక్బస్టర్గా నిలిచింది.8 వసంతాలు..ఈ ఏడాగి సినీ ప్రియులను అలరించిన ప్రేమ కథా చిత్రం '8 వసంతాలు'. ఈ ఏడాది జూన్ 20న విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద హిట్ టాక్ను సొంతం చేసుకుంది. అయితే థియేటర్లలో పెద్దగా రెస్పాన్స్ రాని ఈ సినిమా మాత్రం ఓటీటీలో అదరగొట్టింది. 8 వసంతాల డైరెక్టర్ ఫణీంద్ర నర్సెట్టి దర్శకత్వం వహించారు.లిటిల్ హార్ట్స్..ఈ ఏడాది సూపర్ హిట్గా నిలిచిన మరో చిన్న సినిమా లిటిల్ హార్ట్స్. యూట్యూబర్ మౌళి, శివాని నాగారం జంటగా నటించిన ఈ చిత్రం థియేటర్ల వద్ద అదరగొట్టిది. కేవలం మౌత్ టాక్తో పుంజుకుని ఏకంగా రూ. 50 కోట్లు వసూలు చేసి అందరినీ ఆశ్చర్యపరిచింది. ఈ సినిమాకు సాయి మార్తాండ్ దర్శకత్వం వహించారు.మ్యాడ్ స్క్వేర్..గతంలో వచ్చి సూపర్ హిట్ కొట్టిన ఫుల్ కామెడీ ఎంటర్టైనర్ మ్యాడ్. ఈ మూవీకి సీక్వెల్గా మ్యాడ్ స్క్వేర్ తెరకెక్కించారు. ఈ ఏడాది ఉగాదికి థియేటర్లలోకి వచ్చిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద హిట్గా నిలిచింది. ఫస్ట్ పార్ట్ అంతా సూపర్ హిట్ కాకపోయినా ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ సినిమాకు కలెక్షన్స్ కూడా బాగానే వచ్చాయి. కళ్యాణ్ శంకర్ దర్శకత్వంలో వచ్చిన ఈ యూత్ ఫుల్ కామెడీ ఎంటర్టైనర్ సుమారు రూ. 65 కోట్లు రాబట్టింది. ఈ చిత్రంలో ఎన్టీఆర్ బామ్మర్ది నార్నే నితిన్, సంగీత్ శోభన్, రామ్ నితిన్ కీలక పాత్రల్లో మెప్పించారు.రాజు వెడ్స్ రాంబాయి..ఇటీవలే రిలీజైన సూపర్ హిట్ కొట్టిన మరో చిన్న సినిమా రాజు వెడ్స్ రాంబాయి. యధార్థ సంఘటనల ఆధారంగా తెరకెక్కించిన ఈ విలేజ్ బ్యాక్డ్రాప్ లవ్ స్టోరీ బాక్సాఫీస్ వద్ద అదరగొట్టింది. కేవలం రూ. 3 కోట్ల బడ్జెట్తో తెరకెక్కిన ఈ సినిమా సుమారు దాదాపు రూ. 15 కోట్ల వరకు వసూలు చేసింది. ఈ చిత్రాన్ని సాయిలు కంపటి దర్శకత్వంలో తెరకెక్కించారు.అరిఈ ఏడాది విడుదలై మంచి విజయం సాధించిన మరో చిన్న సినిమా అరి. అంతర్గత శత్రువులుగా పరిగణించే అరిషడ్వర్గాల నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం అక్టోబర్ 10న విడుదలై విమర్శకుల ప్రశంసలతో పాటు మంచి కలెక్షన్స్ రాబట్టింది. ‘పేపర్బాయ్’ లాంటి సెన్సిబుల్ సినిమాను తెరకెక్కించిన జయశంకర్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. వినోద్ వర్మ , అనసూయ భరద్వాజ్, సాయి కుమార్, శ్రీకాంత్ అయ్యంగార్, వైవా హర్ష, శ్రీనివాస రెడ్డి, చమ్మక్ చంద్ర, శుభలేక సుధాకర్ కీలక పాత్రలు పోషించారు. అరిషడ్వర్గాల్ని జయించడం ఎలాగో, మనిషి మార్పు ఎప్పుడు ఎలా సాధ్యమవుతుందో ఈ చిత్రం ద్వారా కళ్లకు కట్టినట్లు చూపించారు. -
ఇండస్ట్రీని లూటీ చేస్తున్నారు
‘‘తెలుగు పరిశ్రమలోని ముగ్గురు నిర్మాతలు చేస్తున్న నిర్వాకాల వల్ల చిన్న సినిమా మనుగడ ప్రశ్నార్థకంగా మారింది’’ అన్నారు తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ (టీఎఫ్సీసీ) చైర్మన్ ప్రతాని రామకృష్ణ గౌడ్. టీఎఫ్సీసీ ఆధ్వర్యంలో బుధవారం నిర్వహించిన మహాధర్నాలో రామకృష్ణ గౌడ్ మాట్లాడుతూ– ‘‘సినిమాను థియేటర్లో ప్రదర్శించే డిజిటల్ కంటెంట్ ప్రొవైడర్స్ ‘క్యూబ్, యూఎఫ్వో, పీఎక్స్ డీ’ తెలుగు నిర్మాతల నుంచి థియేటర్లలో ప్రదర్శనకు వారానికి రూ. పది వేలు, మల్టీప్లెక్స్లో వారానికి 15 వేలు వసూలు చేస్తున్నారు. ఇతర రాష్ట్రాల్లో ఈ చార్జీలు రూ. 2500 నుంచి 3 వేల రూపాయలు మాత్రమే. ఇండస్ట్రీలోని ముగ్గురు నిర్మాతలు ఈ డిజిటల్ ప్రొవైడింగ్ కంపెనీల్లో భాగస్వామ్యంగా ఉంటూ తెలుగు పరిశ్రమను లూటీ చేస్తున్నారు. థియేటర్స్లో తినుబండారాల ధర, టికెట్ రేట్లు భారీగా ఉంటున్నాయి. దీంతో సామాన్య ప్రేక్షకుడు చిన్న సినిమాను థియేటర్స్లో చూసేందుకు రావడం లేదు. ఈ సమస్యలపై ప్రభుత్వం స్పందించి చర్యలు తీసుకోవాలి’’ అని పేర్కొన్నారు. ఎత్తరి గురురాజ్, సాయి వెంకట్, డీఎస్ రెడ్డి, రవి, సన్నీ, సిరాజ్ తదితరులు పాల్గొన్నారు. -
స్టార్ నుంచి స్టోరీ వైపు..
భారీ తారాగణం, వందల కోట్ల బడ్జెట్తో స్క్రీన్ను కమ్మేయకుండా మన జీవితాలకు రంగుల ఫ్రేమ్ను సెట్ చేస్తే? మనిల్లు లాంటి ఇల్లు.. మన ఫ్యామిలీ లాంటి ఫ్యామిలీ.. మన ఇరుగు పొరుగు అంతా కథలో పాత్రలయితే.. థియేటర్ దాటినా ఆ అనుభూతి వెంటాడుతుంది.. ఆత్మీయులందరినీ కూర్చోబెట్టి టైటిల్ కార్డ్స్ నుంచి ఎండ్ కార్డ్ దాకా సీన్ టు సీన్ చెప్పాలనిపిస్తుంది! ఎన్నేళ్లయింది ఇలాంటిది అనుభవంలోకి రాక..? ఈ మాట విన్నదేమో మన తెలుగు కథ.. వెండి తెరకు బలమై.. మంచి సినిమాలా వెలుగుతోంది!ఆ మలయాళం సినిమా చూశారా..? సహజత్వం.. కథా గమనం..! ఎంత అద్భుతంగా ఉందో కదా..! భారీ బడ్జెట్ లేకున్నా పెద్ద సక్సెస్ సినిమాలు ఇలా కూడా తీస్తారా..! అవును నిజమే.. ఫీల్ గుడ్ మూవీస్కు కేరాఫ్ మలయాళం చిన్న కథలు.. మెస్మరైజ్ చేసే టేకింగ్ నిజ జీవితాలకు దగ్గరగా ఉండే పాత్రలు సరే.. మాలీవుడ్ మూవీస్ గొప్పగానే ఉండొచ్చు మరి టాలీవుడ్ సినిమా సంగతేంటి ?పొరుగు సినిమాలు విపరీతంగా చూసి మన దగ్గర అసలు విషయం ఏమాత్రం లేదనుకుంటాం గానీ.. మల్లు సినిమాలను మించి అద్భుతమైన కథ, కథనాలతో ఈ మధ్య కాలంలో విడుదలైన తెలుగు చిత్రాలు సైలెంట్గా సక్సెస్ సాధిస్తున్నాయి. స్టార్ హీరోలు, స్టార్ డైరెక్టర్స్ సినిమాలను పక్కన పెడితే.. రొటీన్ ఫార్ములాలకు భిన్నంగా మనసుకు హత్తుకునే సినిమాలతో తెలుగుతెర పులకించిపోతోంది. వందల కోట్ల బడ్జెట్,భారీ తారాగణం, పెద్దపెద్ద సెట్టింగులు.. ఇవి ఉంటేనే సినిమా అనే రోజులు పోయాయి. మూస సినిమాలు చూసి బోరుకొట్టిన తెలుగు ప్రేక్షకులకు ఈ ఏడాది చిన్న సినిమాలు విందు భోజనమే పెట్టాయి. కుటుంబ కథా చిత్రాల నుంచి సస్పెన్స్ థ్రిల్లర్ వరకు ఈ తరహా సినిమాలు సిల్వర్ స్క్రీన్తో పాటు ఓటీటీలోనూ మంచి పేరు తెచ్చుకుంటున్నాయి. గొప్పగొప్ప సినిమాలన్నీ తమిళ, మలయాళం వాళ్లే తీస్తారు.. తెలుగు వాళ్ల దగ్గర అంత క్రియేటివిటీ లేదు అన్న విమర్శలకు చిన్న సినిమాలు తమ సక్సెస్తో సమాధానం చెబుతున్నాయి. పెద్ద సినిమాల కంటే చిన్న బడ్జెట్ సినిమాలే ఎక్కువగా ఫిల్మ్ ఇండస్ట్రీని డామినేట్ చేస్తున్నాయిఏడాదంతా చిన్న సినిమాల పండగే2024ను చిన్న సినిమాల నామ సంవత్సరంగా చెప్పుకోవచ్చు. అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్, ఆరంభం, పేకమేడలు, కమిటీ కుర్రోళ్లు, ఆయ్, వీరాంజనేయులు విహార యాత్ర, 35 చిన్న కథ కాదు, మత్తు వదలరా 2, సోపతులు, జనక అయితే గనక.. ఇవన్నీ ఈ ఏడాది మూవీ లవర్స్తో శభాష్ అనిపించుకున్న చిన్న సినిమాలే. ఐఎమ్బీ (ఐMఆ) రేటింగ్స్లో ఈ మూవీస్ అన్నీ టాప్ లిస్టులో ఉన్నవే. తెరపై కనిపించే నటీనటుల నుంచి తెర వెనుక పనిచేసే సాంకేతిక నిపుణుల వరకు అందరూ కలిసి ఈ చిన్న సినిమాలకు ప్రాణం పోశారు. ఊహాజనితమైన కథలు, పాత్రలకు భిన్నంగా నేటివిటీకి చాలా దగ్గరగా ఈ చిత్రాలు కనిపిస్తాయి. సామాన్య జన జీవితాలే ప్రధాన పాత్రలుగా తెరకెక్కిన ఈ చిత్రాలు మాలీవుడ్ సినిమాలను మైమరపిస్తున్నాయి. స్టార్ హీరోలు ఉన్న సినిమాలు మాత్రమే బాక్సాఫీస్ను డామినేట్ చేస్తాయన్న అభిప్రాయాన్ని చిన్న బడ్జెట్ సినిమాలు బ్రేక్ చేశాయి. ప్రేక్షకులను థియేటర్ల వైపు నడిపించడంలో చిన్న సినిమా దర్శకులు విజయం సాధిస్తున్నారు.కటౌట్ కాదు కంటెంట్ ముఖ్యంఒక సినిమా విజయానికి కలెక్షన్ల సునామీ ఒక్కటే గీటురాయి కాదు. కమర్షియల్గా నిర్మాతలకు కోట్లు కుమ్మరించలేకపోయినా కొన్ని సినిమాలు ప్రేక్షకుల గుండెలను తాకుతాయి. ఫీల్ గుడ్ మూవీస్గా నిలిచిపోతాయి. ఇలాంటి సినిమాల్లో ఉండేది కంటెంట్ మాత్రమే. హీరో హీరోయిన్లు, దర్శక నిర్మాతలు, చిత్ర తారాగణం వీటన్నింటికంటే కథ.. ఆ కథను దర్శకుడు నడిపించిన తీరే చిన్న సినిమాల సక్సెస్కు అసలు కారణం. హీరోల ఇమేజ్, దర్శకుల పాపులారిటీ కారణంగా పెద్ద సినిమాలు ఒక వేవ్ క్రియేట్ చేస్తాయి. ఇలాంటి సినిమాలు అభిమానులతో పాటు కొన్ని వర్గాలను మాత్రమే మెప్పిస్తాయి. ఈ తరహా సినిమాలు ప్రేక్షకులను ఎంతగా ఎంటర్టైన్ చేసినా చిన్న సినిమాలు మాత్రం మనసుకు హత్తుకుని మళ్లీ మళ్లీ చూసేలా చేస్తున్నాయి. కేవలం సినిమా కోసమే కథలు.. హీరోలను ఎలివేట్ చేయడం కోసమే పాత్రలు, పాటల కోసమే హీరోయిన్లు.. ఇలా దారి తప్పిన సినిమాను యువతరం దర్శకులు తమ సృజనాత్మకతను జోడించి గాడిన పెడుతున్నట్టుగా అనిపిస్తోంది. 2024లో విడుదలై సత్తా చాటిన చిన్న సినిమాలే ఇందుకు నిదర్శనం.మీకో కథ చెబుతా చూస్తారా..ఇన్నోవేటివ్ స్టోరీ టెల్లింగ్.. యువ దర్శకులకు బాగా తెలిసిన విద్య. సినిమాను అతుకుల బొంతలా కాకుండా ప్రేక్షకుడి మనసును తాకేలా కథలను రాసుకుని అంతే వినూత్నంగా తెరపై ప్రజెంట్ చేస్తున్నారు. ఈ ఏడాది సక్సెస్ రుచి చూసిన సినిమాలన్నింటిలోనూ ఇది కనిపిస్తోంది. నిజ జీవితాలకు దగ్గరగా, నేటివిటీ ఉండేలా ముఖ్యంగా ప్రేక్షకులు సినిమాలో లీనమైపోయేలా చిన్న సినిమాలు ఉంటున్నాయి. కథలో కొత్తదనం.. ప్రేక్షకులతో కనెక్ట్ అయ్యే పాత్రలు సినిమా సక్సెస్ను నిర్ణయిస్తున్నాయి. పెద్ద బడ్జెట్ చిత్రాలన్నీ స్టార్ పవర్ పైనా, హీరోల ఇమేజ్ పైనా ఆధారపడుతుంటే.. చిన్న చిత్రాలు మాత్రం మంచి కథలను మాత్రమే నమ్ముకుంటున్నాయి. సక్సెస్ఫుల్ డైరెక్టర్లుగా పేరున్న వారు కూడా ఈ మధ్య ఆడియన్స్ను మెప్పించడంలో తడబడుతుంటే యంగ్ అండ్ డైనమిక్ డైరెక్టర్స్ తమ ఇన్నోవేటివ్ స్టోరీ టెల్లింగ్తో వెండితెరపై భావోద్వేగాలను పండిస్తున్నారు. పల్లెటూరి స్నేహాలు వాటి చుట్టూ అల్లుకున్న జీవితాలు, కుల పట్టింపులు, స్థానిక రాజకీయాలు వీటన్నింటి మధ్య ఎమోషన్స్ ను చూపించిన ‘కమిటీ కుర్రోళ్లు’ మంచి సక్సెస్ సాధించింది. చిన్ననాటి స్నేహాన్ని, అమాయకత్వాన్ని, మమకారాన్ని హృద్యంగా చూపించిన సోపతులు ఫీల్ గుడ్ మూవీగా నిలిచిపోయింది. నివేదా థామస్, విశ్వదేవ్, ప్రియదర్శి నటించిన ‘35 చిన్న కథ కాదు’ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులతో మంచి మార్కులు వేయించుకుంది. కండోమ్ కంపెనీపై యుద్ధం ప్రకటించే వ్యక్తిగా సుహాస్ నటించిన ‘జనక అయితే గనక’ సినిమా మంచి రేటింగ్తో థియేటర్లతో పాటు ఓటీటీలోనూ పెద్ద చర్చనే రేపింది.ఓటీటీ మెచ్చితే అదే పెద్ద విజయంఓటీటీలు వచ్చిన తర్వాత ఎంటర్టైన్మెంట్ ముఖచిత్రమే మారిపోయింది. వివిధ భాషా చిత్రాలు అందుబాటులో ఉండటంతో కంటెంట్ వినియోగం కూడా పెరిగిపోయింది. భిన్న అభిరుచి గల ప్రేక్షకులు తమకు నచ్చిన కంటెంట్ను వీక్షించడం అలవాటు చేసుకున్నారు. అందుకే థియేటర్ రిలీజ్ కాకుండా ఓటీటీ ప్లాట్ఫామ్స్ ద్వారా చిన్న సినిమాలకు పెద్ద ఎత్తున వ్యూయర్షిప్ వస్తోంది. మంచి కథలతో వస్తున్న తెలుగు చిన్న సినిమాలు ఓటీటీ వేదికలపై సత్తా చాటుతున్నాయి. థియేటర్లో రిలీజ్ అయిన తర్వాత ఓటీటీలోకి ఆ సినిమా ఎప్పుడు వస్తుందా అని ప్రేక్షకులు ఎదురుచూసే రోజులు వచ్చాయి. మౌత్ టాక్తో పాటు సోషల్ మీడియా ప్రమోషన్స్ చిన్న సినిమాలను ఓటీటీల ద్వారా ప్రేక్షకులకు మరింత చేరువ చేస్తున్నాయి. దీంతో చిన్న చిత్రాలు పెద్ద సక్సెస్ను నమోదు చేసుకుంటున్నాయి.వైవిధ్యం.. విజయ రహస్యంకథలో వైవిధ్యం, కథనంలో కొత్తదనం.. మలయాళ సినిమా విజయ రహస్యం ఇక్కడే ఉంది. అందుకే దేశమంతా మాలీవుడ్ చిత్రాల గురించి గొప్పగా చెప్పుకుంటారు. టాలెంట్, క్రియేటివిటీ ఈ రెండూ సరిహద్దులు లేనివి. ప్రేక్షకులను మెప్పించే స్థాయిలో మంచి కథలు రాసే దర్శకులు, వాటిని అందంగా చిత్రీకరించే సాంకేతిక నిపుణులు అన్ని సినీ పరిశ్రమల్లోనూ ఉంటారు. సరైన అవకాశాలు, అభిరుచి ఉన్న నిర్మాతలు దొరికినప్పుడు ఆ కథలు మంచి చిత్రాలుగా ప్రేక్షకులకు చేరతాయి. టాలీవుడ్ సినిమాలను కంటెంట్ మాత్రమే శాసించడం మొదలుపెట్టి చాలా కాలమైంది. చదవండి: పెళ్లిలో మెరిసిన అల్లు అర్జున్, మెగాస్టార్.. ఫోటోలు వైరల్!చిన్న సినిమాల సక్సెస్ కూడా ఈ ఏడాదికి మాత్రమే పరిమితమైంది కాదు. పెద్ద సినిమాలు, హీరోల ఆధిపత్యాలు చలామణి అవుతున్న రోజుల్లో కూడా మంచి కథలతో వచ్చిన సినిమాలను ప్రేక్షకులు గుండెలకత్తుకున్నారు. ఈ నగరానికేమైంది, c/o కంచరపాలెం, మిడిల్ క్లాస్ మెమరీస్, బలగం, కలర్ఫోటో ఇలా భిన్న కథాంశాలతో కూడిన చిత్రాలెన్నో విజయం సాధించి చిన్న సినిమాను నిలబెట్టాయి. ఆ ట్రెండ్ను కొనసాగిస్తూ నేటి యువ దర్శకులు, సాంకేతిక నిపుణులు లోబడ్జెట్ సినిమాను తెలుగులో ట్రెండ్గా మార్చేశారు. అందుకే 2024 సినీ ప్రేమికులకు మంచి అనుభూతులను మిగిల్చింది.చిన్న సినిమాల వెనుక పెద్ద నిర్మాతలుస్టార్ హీరోలు, స్టార్ డైరెక్టర్లు, వందల కోట్ల వసూళ్లు ఈ రొటీన్ సినిమాటిక్ ఫార్ములా నుంచి నిర్మాతలు ఇప్పుడిప్పుడే బయటపడుతున్నారు. మంచి కథలతో ముందుకొచ్చే కొత్త దర్శకులను ప్రోత్సహిస్తున్నారు. ఈ మధ్య సక్సెస్ చూసిన చిన్న సినిమాల వెనుక పెద్ద ప్రొడ్యూసర్స్ ఉండటం విశేషం. ‘35 చిన్న కథ కాదు’ చిత్రానికి సురేష్ ప్రొడక్షన్స్ నుంచి నటుడు రానా ప్రమోట్ చేశారు. యంగ్ టాలెంట్ను ప్రోత్సహిస్తున్న అల్లు అరవింద్ గీతా ఆర్ట్స్ 2 బేనర్పై ఆయ్ చిత్రాన్ని నిర్మించారు. అంజి కె మణిపుత్ర దర్శకత్వం వహించిన ఈ సినిమా పెద్ద చిత్రాలతో పోటీపడి మరీ మంచి సక్సెస్ సాధించింది. మెగా ఫ్యామిలీకి చెందిన నిహారిక కొణిదెల ‘పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్’ బ్యానర్పై ‘కమిటీ కుర్రోళ్లు’ నిర్మించి బిగ్ సక్సెస్ సాధించారు. తెలుగులో పెద్ద సినీ నిర్మాణ సంస్థగా ఉన్న మైత్రీ మూవీ మేకర్స్కు చిన్న సినిమా ‘మత్తు వదలరా 2’ సక్సెస్ మంచి కిక్ ఇచ్చింది. ఒకప్పుడు కొత్త దర్శకులు కథలు పట్టుకుని నిర్మాతల చుట్టూ తిరగాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు కంటెంట్ ఉన్న దర్శకులను నిర్మాతలు వెతుక్కుంటూ వెళ్తున్నారు. మాస్ ఎంటర్టైన్ మెంట్ సినిమాలకు, స్టార్ హీరోల చిత్రాలకు మార్కెట్లో ఎప్పుడూ గిరాకీ ఉంటుంది. అయితే ఈ సినిమాలపై ప్రేక్షకులకు విపరీతమైన అంచనాలు ఉంటాయి. అంచనాలు తలకిందులైతే సీన్ మారిపోతుంది. అభిమానులు కూడా పెదవి విరిచే పరిస్థితి తలెత్తుతుంది. చిన్న సినిమాలతో ఈ సమస్య లేదనే చెప్పాలి. తక్కువ బడ్జెట్తో కొత్త సాంకేతిక నిపుణులతో తెరకెక్కే చిన్న చిత్రాలకు మినిమమ్ గ్యారెంటీ ఉంటోంది.ఇదొక గుడ్ సైన్‘అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్’ లాంటి చిన్న సినిమాను గీతా ఆర్ట్స్ పెద్ద ఎత్తున రిలీజ్ చేసింది. దీన్ని చిన్న సినిమాకు దక్కిన గౌరవంగా భావిస్తాను. ఒకప్పుడు చిన్న సినిమాను చిన్న ప్రొడ్యూసర్స్, కొత్త ప్రొడ్యూసర్సే తీయాలి అని ఉండేది. కాని ఇప్పుడు చిన్న సినిమాలను తీయడానికి, డిస్ట్రిబ్యూట్ చేయడానికి పెద్ద పెద్ద ప్రొడక్షన్ హౌసెస్ ముందుకొస్తున్నాయి. కొత్త కథకులను, కొత్త డైరెక్టర్స్ను ఎంకరేజ్ చేస్తున్నాయి. మంచి కథలకు డెఫినెట్గా ఇదొక గుడ్ సైన్!∙ దుష్యంత్, దర్శకుడురెస్పెక్ట్ దొరికింది‘వీరాంజనేయులు విహార యాత్ర’తో నాకొక రెస్పెక్ట్ దొరికింది. కుటుంబమంతా కలిసి చూడగలిగే హెల్దీ హ్యూమర్తో హెల్దీ ఫిల్మ్ తీయడం వల్లేమో మరి! ఇంకో మంచి విషయం ఏంటంటే.. ఇలాంటి సినిమా కథలను ప్రొడక్షన్ హౌస్లు వెదుక్కోవడం. ఇదివరకైతే స్క్రిప్ట్ పట్టుకుని ప్రొడక్షన్ హౌస్ల చుట్టూ తిరగాల్సి వచ్చేది. ఇప్పుడు ప్రొడక్షన్ హౌస్లే కథాబలమున్న స్క్రిప్ట్లను వెదుక్కుంటున్నాయి. వైవిధ్యమైన కథలు, ఆ కథల మీద గట్టి నమ్మకం, రాజీపడని తత్వం ఉంటే తప్పకుండా మంచి సినిమాలు వస్తాయని అర్థమైంది.అనురాగ్, దర్శకుడుతప్పకుండా ఆదరిస్తారుఇప్పుడున్న పరిస్థితుల్లో ఎంటర్టైన్మెంట్ స్క్రిప్ట్లు తక్కువగా వస్తున్నాయి. అందులోకి గోదావరి బ్యాక్డ్రాప్లో మన నేటివిటీని బేస్ చేసుకుని వినోదాన్ని పంచే స్క్రిప్ట్లు వంశీ, జంధ్యాల వంటి దర్శకుల తర్వాత పెద్దగా రావట్లేదని చెప్పొచ్చు. అందుకే మన నేటివిటీని యూజ్ చేసుకుని ప్రేక్షకులకు ఎంటర్టైన్మెంట్ ఇవ్వగలిగితే సినిమా హిట్ అవుతుందనిపించి.. ‘ఆయ్’ సినిమా తీశాను. ఫస్ట్ సినిమాకే పెద్ద బ్యానర్ దొరకడం, అది హిట్ అవడం నిజంగా అదృష్టం. ఇండస్ట్రీలో పది పన్నెండేళ్ల నా స్ట్రగుల్ మంచి రిజల్ట్నే ఇచ్చింది. చాలా హ్యాపీగా ఉంది. మన నేటివిటీ, నిజ జీవితంలో కనిపించే పాత్రలతో కథను పండించగలిగితే ప్రేక్షకులు తప్పకుండా ఆదరిస్తారని ప్రూవ్ అయింది. అంజి కె మణిపుత్ర, దర్శకుడుప్రయత్నాన్ని నమ్మారు..‘కమిటీ కుర్రోళ్లు’ వల్ల గనుక నిర్మాతలు నష్టపోతే ఇక భవిష్యత్తులో ఎవరూ చిన్న సినిమా మీద డబ్బు పెట్టడానికి ముందుకురారు అనే భయం ఉండింది. కథాబలంతో చిన్న సినిమా ఉనికి చాటాలనేదే నా ప్రయత్నం. నా ప్రయత్నంలోని నిజాయితీని నిర్మాతలు, ప్రేక్షకులు నమ్మారు. చిన్న సినిమాలకు ఆదరణ ఉంటుందని నిరూపించారు. యదు వంశీ, దర్శకుడుఫణికుమార్ అనంతోజు -
మొదటి ప్రయాణం మరచిపోకూడదు: త్రినాథరావు నక్కిన
‘‘నాది, బెక్కెం వేణుగోపాల్గారి ప్రయాణం చిన్న సినిమా నుంచే ప్రారంభమైంది. అప్పట్లో మా సినిమా పొస్టర్, టీజర్, ట్రైలర్లను ఎవరు రిలీజ్ చేస్తారా? అని ఎదురు చూసే వాళ్లం. ఇప్పుడు పెద్ద సినిమాలు చేస్తున్నామని మా మొదటి ప్రయాణం మరచిపొకూడదు కదా?. అందుకే ఎవరైనా సపొర్ట్ కావాలని అడిగితే మా వంతు సపొర్ట్ చేయటానికి,ప్రొత్సహించటానికి వెనుకాడం’’ అని డైరెక్టర్ త్రినాథరావు నక్కిన అన్నారు. చంటి, లహరి జంటగా కేవీఆర్ దర్శకత్వంవహిస్తున్న చిత్రం ‘ఏపీ 31’. ‘నెంబర్ మిస్సింగ్’ అన్నది ట్యాగ్ లైన్. అన్నపూర్ణేశ్వరి సినీ క్రియేషక్స్ పై నారాయణ స్వామి.ఎం నిర్మిస్తున్నారు. ఈ సినిమా మోషన్ పొస్టర్ను త్రినాథరావు నక్కిన, ఫస్ట్ లుక్ని నిర్మాత బెక్కెం వేణుగోపాల్ రిలీజ్ చేసి, ‘ఏపీ 31’ హిట్ కావాలన్నారు. ‘‘అందరి సపొర్ట్తో సినిమాను పూర్తి చేస్తున్నాం’’ అన్నారు కేవీఆర్. -
ఏ సినిమానీ చిన్నది అనొద్దు
‘‘ఏ సినిమానీ చిన్నది అనొద్దు. కొత్త వాళ్ల సినిమా అనాలి. నేను రావడం వల్ల ఓ సినిమాకు మంచి జరుగుతుందంటే ప్రమోషన్కు వస్తాను.. అది నాకు తృప్తినిస్తుంది’’ అని హీరో విశ్వక్ సేన్ అన్నారు. చైతన్యా రావ్, లావణ్య జంటగా చెందు ముద్దు దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘అన్నపూర్ణ ఫొటో స్టూడియో’. యష్ రంగినేని నిర్మించిన ఈ చిత్రం నేడు విడుదలవుతోంది. ఈ చిత్రం ప్రీ రిలీజ్ వేడుకలో విశ్వక్ సేన్ మాట్లాడుతూ–‘‘ఈ మూవీ హిట్ అవుతుందని ట్రైలర్ చూసినప్పుడే అనిపించింది. యూనిట్కి మంచి సక్సెస్ రావాలి’’ అన్నారు.. -
చిన్న సినిమాలకు ప్రభుత్వం సహకారం
సాక్షి, విశాఖపట్నం: థియేటర్లు దొరక్క ఇబ్బందులు పడుతున్న చిన్న సినిమాలకు రాష్ట్ర ప్రభుత్వం సహకారం అందిస్తోందని, అందులో భాగంగానే ‘ఫస్ట్ డే.. ఫస్ట్ షో’ను ప్రారంభించిందని పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ చెప్పారు. ఏపీ ఫైబర్నెట్ ఆధ్వర్యంలో సినిమా విడుదలైన రోజునే ఇంట్లోనే కూర్చొని వీక్షించేలా రూపొందించిన ఈ కార్యక్రమాన్ని మంత్రి అమర్నాథ్ శుక్రవారం విశాఖలో లాంఛనంగా ప్రారంభించారు. ఈ ప్రోగ్రామ్ ద్వారా తొలి సినిమాగా నిరీక్షణ చిత్రాన్ని విడుదల చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఫైబర్నెట్ సేవలను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రాష్ట్రవ్యాప్తంగా విస్తరిస్తున్నారని, ఇప్పటికే 8 వేల పంచాయతీలకు ఈ సేవలు అందుబాటులోకి తెచ్చారని చెప్పారు. ప్రస్తుతం టాలీవుడ్లో ఏడాదికి 100 సినిమాలు షూటింగ్ పూర్తి చేసుకుంటే.. అందులో 20 మాత్రమే విడుదలవుతున్నాయని, మిగిలినవన్నీ ల్యాబ్లకే పరిమితమవుతున్నాయని విచారం వ్యక్తం చేశారు. ఏపీ ఫైబర్నెట్ ద్వారా కొత్త సినిమా రిలీజ్ అయిన రోజునే 99 రూపాయిలకే 24 గంటలపాటు ఇంట్లో నుంచి చూసే అవకాశం కల్పిస్తున్నామని తెలిపారు. ఏపీ స్టేట్ ఫైబర్నెట్ లిమిటెడ్ (ఏపీఎస్ఎఫ్ఎల్) చైర్మన్ గౌతమ్రెడ్డి మాట్లాడుతూ ప్రజల ముంగిటకే పరిపాలన తీసుకొచ్చిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్.. ఇప్పుడు ప్రజల ఇంటికే కొత్త సినిమాను తెస్తున్నారన్నారు. సినిమా డిస్ట్రిబ్యూటర్లు కూడా ఇబ్బందులు పడకుండా త్వరలోనే ట్రై పార్టీ అగ్రిమెంట్కు విధివిధానాలు సిద్ధం చేస్తున్నామని తెలిపారు. నిర్మాత సి.కల్యాణ్ మాట్లాడుతూ చిన్న సినిమాల్ని ఆదరించేలా, ప్రొడ్యూసర్లకి చేయూతనందించేలా ఈ కార్యక్రమాన్ని రూపొందించిన సీఎం వైఎస్ జగన్కు కృతజ్ఞతలు తెలిపారు. దీనివల్ల థియేటర్లకు ఎలాంటి నష్టం లేదన్నారు. ఇది క్లిక్ అయితే ఆరు నెలల్లోనే పెద్ద సినిమాల ప్రొడ్యూసర్లు కూడా ఫైబర్నెట్ను ఆశ్రయిస్తారని చెప్పారు. నిరీక్షణ చిత్ర నిర్మాత రామ సత్యనారాయణ మాట్లాడుతూ పెద్ద సినిమాలకు లాభాలు వచ్చేందుకు అనేక దారులుంటాయని, చిన్న సినిమాలకు ఇప్పుడే దారి దొరికిందని అన్నారు. సీఎం వైఎస్ జగన్ ప్రవేశ పెట్టిన నవరత్నాల తర్వాత 10వ రత్నం ఫస్ట్ డే ఫస్ట్ షో అని కొనియాడారు. భవిష్యత్తులో ఫైబర్నెట్ కోసం సినిమాలు తీసే రోజులు వస్తాయని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి, ఏపీ క్రియేటివిటీ అండ్ కల్చరల్ కమిషన్ క్రియేటివ్ హెడ్ జోగినాయుడు, ఏపీఎస్ఎఫ్ఎల్ ఎండీ మధుసూధన్రెడ్డి, నిరీక్షణ హీరో సాయిరోనక్, డైరెక్టర్ వంశీకృష్ణ తదితరులు పాల్గొన్నారు. -
చిన్న నిర్మాతలకు అన్యాయం చేశారు
‘‘తెలంగాణ ప్రభుత్వం సినీ ఇండస్ట్రీకి వరాలు కురిపించిందని ఇండస్ట్రీ పెద్దలు అంటున్నారు. కానీ చిన్న చిత్రాలకు న్యాయం జరిగినట్లు అనిపించడంలేదు’’ అన్నారు ‘తెలుగు ఫిలిం చాంబర్ ప్రొడ్యూసర్స్ సెక్టార్’ చైర్మన్ యేలూరు సురేందర్ రెడ్డి. శుక్రవారం ఆయన మాట్లాడుతూ– ‘‘ఓ ఏడాదిలో వచ్చే 200 సినిమాల్లో పెద్ద సినిమాలు 20 నుంచి 30 వరకు ఉంటాయి. మిగిలినవి చిన్నవే. కొత్త నటీనటుల్ని, సాంకేతిక నిపుణులను తీసుకువచ్చేది, సామాజిక స్పృహ ఉన్న చిత్రాలని తీసేది చిన్న నిర్మాతలే. 30 వేల మంది కార్మికులకు పని ఇచ్చేది ఈ నిర్మాతలే. థియేటర్స్లో మధ్యాహ్నం 2 గంటల షో కచ్చితంగా చిన్న సినిమా ప్రదర్శించాలని, షూటింగ్కి ఫ్రీగా లొకేషన్స్ ఇవ్వమని అడిగాం. థియేటర్స్లో సినిమా ప్రదర్శనకు డిజిటల్ ప్రొవైడర్స్ అన్యాయంగా వారానికి 12,000 వేలు వసూలు చేస్తున్నారు. మేమడిగిన ఈ మూడే మూడు డిమాండ్లను పక్కన పడేశారు. సంవత్సరంలో 180 చిత్రాలను తీస్తున్న చిన్న నిర్మాతలకి అన్యాయం చేశారు’’ అన్నారు. -
ఒకే రోజు పది సినిమాల రిలీజ్!
ఈ శుక్రవారం టాలీవుడ్ బాక్సాఫీస్ ముందు చిన్న సినిమా పండుగ జరగనుంది. పెద్ద హీరోలు బరిలో లేకపోవటంతో, నెలాఖరున సాహో మేనియా మొదలవుతుండటంతో చిన్న సినిమాలన్ని ఆగస్టు 23న రిలీజ్కు క్యూ కట్టాయి. దీంతో ఒకే రోజు 10 సినిమాలో బాక్సాఫీస్ బరిలో తలపడుతున్నాయి. అయితే వీటిలో ఒకటి రెండు సినిమాలు తప్ప మిగతా సినిమాలు రిలీజ్ అవుతున్నట్టుగా కూడా ప్రేక్షకులకు తెలియదు. తమిళ్లో సక్సెస్ అయిన కనా సినిమాను తెలుగులో కౌసల్యా కృష్ణమూర్తి పేరుతో రీమేక్ చేసి రిలీజ్ చేస్తున్నారు. ఈ సినిమాతో పాటు ఏదైనా జరగొచ్చు సినిమాలపై కాస్త అంచనాలు ఉన్నాయి. వీటితో పాటు బాయ్, ఉండిపోరాదే, నివాసి, హవా లాంటి సినిమాల సందడి మీడియాల కాస్త కనిపిస్తుంది. నేనే కేడీ నెం 1, జిందా గ్యాంగ్, నీతోనే హాయ్ హాయ్, కనులు కనులు దోచేనే విషయంలో ఆ సందడి కూడా కనిపించటం లేదు. మరి ఈ పది సినిమాల్లో ప్రేక్షకులు ఎన్ని సినిమాలను ఆదరిస్తారో చూడాలి. -
ఒకేరోజు 9 సినిమాల రిలీజ్.. విశాల్పై ఆరోపణలు
సాక్షి, చెన్నై: తమిళ నిర్మాతల మండలిలో వర్గపోరు తారాస్థాయికి చేరుకుంది. సినిమాల రిలీజ్ విషయంలో ఎదురవుతున్న పోటి వివాదానికి మరింత ఆజ్యం పోసింది. ఈ నెల 21న తమిళనాట ఏకంగా 9 సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. దీంతో ఇన్ని సినిమాలను ఒకేసారి రిలీజ్ చేసేలా ఎలా పర్మిషన్ ఇస్తారంటూ చిన్న సినిమాల నిర్మాతలు, నిర్మాతల మండలి అధ్యక్షుడు విశాల్ను నిలదీస్తున్నారు. వీరికి నిర్మాతల మండలిలోని విశాల్ వ్యతిరేఖవర్గం మద్ధుతు తెలపడంతో వివాదం మరింత ముదిరింది. ఒకే రోజు పెద్ద సంఖ్యలో సినిమాల విడుదలకు పర్మిషన్ ఇవ్వడాన్ని నిరసిస్తూ టీనగర్లోని నిర్మాతల సంఘం ఆఫీస్లకు తాళం వేశారు. ఒకే రోజు ఇన్ని సినిమాలు రిలీజ్ అయితే చిన్న సినిమా నిర్మాతల పరిస్థితి ఏంటని వారు ప్రశ్నిస్తున్నారు. -
విజయ్ను స్టార్ చేసింది మేమే!
సాక్షి, చెన్నై: హీరో విజయ్ను స్టార్ చేసింది తామేనని ప్రముఖ ఎగ్జిబిటర్ అభిరామినామనాథన్ పేర్కొన్నారు. బుధవారం సాయంత్రం స్థానిక సాలిగ్రామంలోని ప్రసాద్ ల్యాబ్లో జరిగిన ఆరమ్ తిణై చిత్రం ఆడియో ఆవిష్కరణ కార్యక్రమంలో అతిథిగా పాల్గొన్న అభిరామినామనాథన్ ప్రసంగించారు. అనంతరం ఇదే వేదికపై దివంగత అబ్దుల్ కలాం సలహాదారుడు పొన్రామ్ మాట్లాడుతూ.. థియేటర్ల యాజమాన్యం చిన్న చిత్రాలను కొల్లగొడుతున్నారని ఆరోపణలు చేశారన్నారు. తాను ఈ ఏడాది 50 చిత్రాలను ఎగ్జిబ్యూషన్ చేశానని ఆయన అన్నారు. వాటిలో 45 చిన్న చిత్రాలేనని తెలిపారు. ఒక్కోసారి థియేటర్లో ఐదారుగురు ప్రేక్షకులు కూడా ఉండరని, అలాంటప్పుడు తమకు ఏసీ ఖర్చు కూడా రాదని అలాంటి చిత్రాలను నిలిపేయకుండా ఎలా ప్రదర్శించమంటారని ప్రశ్నించారు. నటుడు విజయ్ ఆదిలో నటించిన చిత్రాలు చిన్నవేనని, అలాంటి ఆయన్ని స్టార్ నటుడిని చేసింది తామేనని అభిరామిరామనాథన్ వ్యాఖ్యానించారు. ఎంఆర్కేఎన్ఎస్ సినీ మీడియా పతాకంపై ఆర్.ముత్తుకృష్ణ, వేల్మణి కలిసి నిర్మించిన ఈ చిత్రాన్ని అరుణ్శ్రీ దర్శకత్వం వహించారు. విజయ్ టీవీ ఫేమ్ వైశాలిని హీరోయిన్గా నాన్కడవుల్ రాజేంద్రన్ హీరో నటించిన ఈ హర్రర్, థ్రిల్లర్, కామెడీ చిత్రానికి రాజన్ చోళన్ సంగీతాన్ని అందించారు. చిత్ర ఆడియోను దర్శక నటుడు కే.భాగ్యరాజ్ ఆవిష్కరించగా అభిరామి రామనాథన్ తొలి ప్రతిని అందుకున్నారు. -
జగపతిబాబు ఆవేదన
సాక్షి, విజయవాడ: చిన్న సినిమాలను కాపాడాల్సిన అవసరం ఉందని సినీనటుడు జగపతిబాబు అన్నారు. ధియేటర్లు కొంతమంది చేతుల్లో వుండటం వల్ల చిన్న సినిమాలు దెబ్బతింటున్నాయని, కళాకారులు ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తాను సినిమాల్లోకి వచ్చి ముప్పై ఏళ్లు పూర్తైన సందర్భంగా విజయవాడ వన్టౌన్ వీధుల్లో ఛారిటి వాక్ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... తన నడక వెనుక ఎటువంటి రాజకీయ ప్రాధాన్యత లేదన్నారు. రాజకీయ వ్యాఖ్యలు చేసేందుకు తాను రాలేదని స్పష్టం చేశారు. ఏపీ ప్రత్యేకహోదా అంశంపై మాట్లాడేందుకు ఆయన నిరాకరించారు. కాగా ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన నంది అవార్డుల్లో ఉత్తమ విలన్గా జగపతిబాబు ఎంపికయ్యారు. లెజెండ్ సినిమాలో నటనకు ఆయన అవార్డు లభించింది. (మరిన్ని చిత్రాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
చిన్నచిత్రాలకే అవార్డుల పంట
- అవార్డులకు నోచుకోని స్టార్స్ తమిళనాడు: రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఏటా ఉత్తమ చిత్రాలను, కళాకారులను ఎంపిక చేసి అవార్డులతో ప్రోత్సహించడం ఆనవాయితీగా వస్తోంది. అయితే కొన్నేళ్లుగా ఈ అవార్డుల ప్రదాన కార్యక్రమాలను నిర్వహించడం లేదు. ఇలాంటి పరిíస్థితుల్లో గురువారం ఓకేసారి 2009 నుంచి 2014 ఏడాది వరకూ సినీ అవార్డులను ప్రభుత్వం ప్రకటించడం విశేషం. కాగా ఈ ఆరేళ్లలోనూ ఉత్తమ అవార్డుల పట్టికలో చిన్న చిత్రాలే చోటు చేసుకోవడం, ప్రముఖ నటులకెవరికీ అవార్డులు దక్కకపోవడం గమనార్హం. అయితే ఈ అవార్డులపై అసంతృప్తి అన్నది అక్కడక్కడా వినిపిస్తున్నా 90 శాతం సినీ వర్గాలు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నాయి. చిన్న చిత్రాలు మైనా, వాగై చూడవా, వళక్కు ఎన్ 18/9, రామానుజన్, కుట్రం కడిదల్ వంటి మంచి ప్రేక్షకాదరణ పొందిన చిన్న చిత్రాలు ఉత్తమ చిత్రాలుగా ఎంపిక కావడం హర్షణీయం. ఇక 2009 ఏడాదికి గానూ ఉత్తమ నటుడిగా కరణ్, 2010 లో విక్రమ్, 2011 లో విమల్, 2012 లో జీవా, 2013 లో ఆర్య, 2014 లో సిద్ధార్థ్ వంటి యువ నటులు ఉత్తమ నటుడి అవార్డు అందుకోనున్నారు. ఆ పట్టికలో ప్రముఖ నటులకు చోటు దక్కక పోవడం వారి అభిమానులకు నిరాశ అవుతుంది. రాజకీయ హస్తం ఉందా? ఈ ఆరేళ్ల కాల వ్యవధిలో ప్రముఖ నటులు నటించిన పలు చిత్రాలు మంచి విజయాలను సాధించాయి. సాధారణంగా ఒక్క ప్రముఖ నటుడికైనా అవార్డు దక్కే అవకాశం ఉంటుందని, అలాంటిది ఈ సారి ఏ ఒక్క ప్రముఖ నటుడికీ అవార్డు రాకపోవడంతో రాజకీయ హస్తం ఉంటుందనే ప్రచారం వెలుగు చూస్తోంది. నటుడు రజనీకాంత్ అందరు రాజకీయ నాయకులతోనూ సన్నిహితంగా ఉంటున్నా, ఇటీవల ప్రస్తుతం తమిళనాడులో రాజకీయ వ్యవస్థ సరిగా లేదని సంచలన వ్యాఖ్యలు చేయడం కలకలాన్ని సృష్టించింది. అదే విధంగా నటుడు విజయ్ జల్లికట్టు విషయంలో ఆవేశంగా మాట్లాడిన వీడియోను విడుదల చేసి సంచలనాలకి కారణం అయ్యారు. ఇక నటుడు కమలహాసన్ ఇటీవల రాజకీయపరిణామాలపై ఘాటుగానే స్పందిస్తున్నారు. ఇకపోతే 2015, 2016 సంవత్సరాలకు అవార్డులను వెల్లడించలేదు. అందుకు కారణాలేమిటనే ప్రశ్న తలెత్తుతోంది. అవార్డులకు ఎంపికైన నటీనటులు, దర్శక నిర్మాతలు, ఇతర సాంకేతిక వర్గం తమ సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. కథానాయికల పట్టికలో నయనతార, ఓవియ, ఐశ్వర్యరాజేశ్, అమలాపాల్, పద్మప్రియ, లక్ష్మీమీనన్ చోటు చేసుకున్నారు. దర్శకుల విషయానికొస్తే వసంతబాలన్, ప్రభుసాల్మన్, ఏఎల్.విజయ్, బాలాజీ శక్తివేల్, రామ్,రాఘవన్ అవార్డులకు ఎంపికయ్యారు. ఇంకా సంగీతదర్శకులు, గీతరయితలు అవార్డులకు ఎంపికైనవారిలో ఉన్నారు. -
జాతులు, కులాలతో చండాలంగా చిత్ర పరిశ్రమ
-
చండాలంగా కళారంగం
జాతులు, కులాలు, వర్గాల ఆధిపత్యపోరు పెరిగింది భాషపై అంకిత భావం లేనివారు తెలుగువారే: ఎస్పీ బాలు లబ్బీపేట (విజయవాడ తూర్పు): ప్రస్తుతం కళారంగం (సినిమా) జాతులు, కులాలు, వర్గాలు ఆధిపత్య పోరుతో చండాలంగా మారిందని ప్రముఖ సినీ నేపథ్యగాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చెప్పారు. ఫ్యాన్స్ మాత్రమే సినిమాలను చూస్తే కలెక్షన్లు రావని, అందరు అన్ని సినిమాలను ఆదరిం చాలని కోరారు. తాను 15 భాషల్లో పాటలు పాడుతున్నానని, భాషపై అంకితభావం లేనివారు తెలుగువారేనని ఆవేదన వ్యక్తం చేశారు. రోటరీ క్లబ్ ఆఫ్ విజయవాడ ఆధ్వర్యంలో బాలసుబ్రహ్మణ్యానికి ఆదివారం విజయవాడలో జీవిత సాఫల్య పురస్కా రాన్ని ప్రదానం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సినిమా స్థాయిని ప్రజలే నిర్ణయించాల్సి ఉందన్నారు. మన సంస్కృతి, సంప్రదాయాలు, భాషను సైతం విస్మరిస్తూ చిత్రాలు రావడం దురదృష్టకరమ ని చెప్పారు. అలాంటి వాటిని విమర్శించే ధైర్యం తనకు లేదన్నారు. ఒకపాట విజయవంతం కావాలంటే గాయకుడితో పాటు రచయిత, సంగీత దర్శకుడు, నటుల కృషి ఉంటుందని చెప్పారు. శంకరాభర ణంలో పాట పాడేందుకు తాను అర్హుడిని కాదని భావించి చాలాకాలం తప్పుకొని తిరిగానని, వచ్చిన అవకాశాన్ని వదులుకో కూడదని భావించి పాడానని గుర్తుచేసుకు న్నారు. మనకు అక్షరశిల్పులు చాలామంది ఉన్నారని, మల్లాది, సముద్రాల, ఆరుద్ర, జాలాది వంటి వారు గొప్పపాటలు అందిం చారని చెప్పారు. వేటూరి సుందరరామమూర్తి, సిరివెన్నెల సీతారామశాస్త్రి వంటి గొప్పరచయితలు మనకు ఉన్నారన్నారు. మహ్మద్ రఫీ మంచి గాయకుడని, ఆయన ప్రభావం తనపై ఉందని చెప్పారు. -
చిన్న హీరోలను కాజల్ చిన్నచూపు చూస్తోందా ?
-
సినిమా బావుంది కానీ...
-
చిన్న సినిమాలు...పెద్ద అలోచనలు


