-
కొత్త ఏడాది తొలి రోజునే సూర్య ఆసక్తికర పోస్టు
టీమిండియా సంచలనం సూర్యకుమార్ యాదవ్ నూతన సంవత్సర వేడుకలను తనదైన స్టైల్లో సెలబ్రేట్ చేసుకున్నాడు. కొత్త సంవత్సరం తొలి రోజున ముంబైలోని ప్రఖ్యాత సిద్ది వినాయక గుడిని సందర్శించి దీవెనలు అందుకున్నాడు. సిద్ది వినాయక ఆశీర్వాదాలు అందుకున్నా.. ఈ ఏడాది అంతా మంచి జరగాలని కోరకున్నా అంటూ ఇన్స్టాగ్రామ్లో ఫోటో షేర్ చేసి క్యాప్షన్ జత చేశాడు. ఇక సూర్యకుమార్ గతేడాది అద్భుత ప్రదర్శన కనబరిచాడు. ముఖ్యంగా టి20 క్రికెట్లో తనదైన మార్క్ చూపించిన సూర్యకుమార్ ఐసీసీ మెన్స్ టి20 క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ అవార్డుకు కూడా నామినేట్ అయ్యాడు. మిస్టర్ 360 పేరును సార్దకం చేసుకున్న సూర్యకుమార్ గతేడాది టి20 క్రికెట్లో 1164 పరుగులు చేసి 2022లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్గా తొలిస్థానంలో నిలిచాడు. అంతేకాదు 2022లో టి20 క్రికెట్లో 68 సిక్సర్లు బాది అత్యధిక సిక్సర్లు బాదిన ఆటగాడిగా నిలిచాడు. రెండు సెంచరీలు సహా తొమ్మిది హాఫ్ సెంచరీలు అతని ఖాతాలో ఉన్నాయి. ఇక టి20 ప్రపంచకప్లో టీమిండియా తరపున రెండో టాప్ స్కోరర్గా నిలిచాడు. ఆరు మ్యాచ్లు కలిపి 189 స్ట్రైక్రేట్తో 239 పరుగులు చేశాడు. ఇందులో మూడు అర్థసెంచరీలు ఉన్నాయి. ఈ ఏడాది కూడా సూర్యకుమార్ తన ఫామ్ను కంటిన్యూ చేసి టీమిండియాను వన్డే వరల్డ్కప్లో విశ్వవిజేతగా నిలపడంలో కీలకపాత్ర పోషించాలని కోరుకుందాం. As we enter the year 2023, with unexplainable gratitude in my heart, I thank you for all the love and support you have showered upon me this year ♥️ Here’s hoping for an even greater year ahead, wishing you all a very happy new year 🤩 pic.twitter.com/mu44f5Mz41 — Surya Kumar Yadav (@surya_14kumar) December 31, 2022 చదవండి: ఇలా చేయడం సిగ్గుచేటు.. రోహిత్ శర్మ భార్య ఆగ్రహం మహిళా అథ్లెట్ కోచ్కు లైంగిక వేధింపులు.. క్రీడామంత్రిపై కేసు -
‘భారత్ కే వీర్’కు రూ.7 కోట్లు
న్యూఢిల్లీ: జవాన్ల కుటుంబాల కోసం ప్రజలు ఇప్పటి వరకు రూ.7 కోట్ల సాయం ప్రకటించారు. కేంద్ర హోం శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఆన్లైన్ పోర్టల్ ‘భారత్ కే వీర్’ ద్వారా ఈ విరాళాలు పోగయ్యాయి. ‘కొన్ని నకిలీ సంస్థలు కూడా సాయుధ దళాలకు సాయం పేరుతో విరాళాలు వసూలు చేస్తున్నాయి. వాటిపై అప్రమత్తంగా ఉండండి. భారత్ కే వీర్ మాత్రమే విరాళం ఇవ్వండి’ అని హోం మంత్రి రాజ్నాథ్ ప్రజలను కోరారు. షిర్డీ ట్రస్టు సాయం 2.51 కోట్లు సాక్షి ముంబై: అమరుల కుటుంబీకులకు రూ. 2.51 కోట్ల సాయం చేస్తామని షిర్డీ సాయి సంస్థాన్ ట్రస్ట్ అధ్యక్షులు డాక్టర్ సురేశ్ హావరే చెప్పారు. ఇప్పటికే ముంబైలోని ప్రఖ్యాత శ్రీ సిద్ధి వినాయక ఆలయ ట్రస్టు రూ. 50 లక్షల సాయం ప్రకటించింది. ప్రతి ఒక్క అమరవీరుని కుటుంబానికి రూ. 5 లక్షల చొప్పున ఆర్థిక సాయం చేస్తానని బిగ్ బీ అమితాబ్ బచ్చన్ ప్రకటించారు. -
సైనికుల సహాయ నిధికి ప్రముఖ ఆలయ ట్రస్ట్ విరాళం
సాక్షి, ముంబై: పుల్వామా ఉగ్రదాడిలో అమరులైన సైనికుల కుటుంబాలను ఆదుకునేందుకు పలువురు స్వచ్ఛందంగా స్పందిస్తున్నారు. ఈ క్రమంలో ముంబైలోని ప్రముఖ శ్రీసిద్ధి వినాయక ఆలయ ట్రస్ట్ సైనికుల సహాయ నిధికి భారీ విరాళాన్ని ప్రకటించింది. బాధిత కుటుంబాల సహాయార్థం రూ. 51 లక్షల విరాళాన్ని ప్రకటించింది. మరోవైపు పుల్వామాలో ముష్కరులు జరిపిన ఆత్మాహుతి దాడిలో అమరులైన సీఆర్పీఎఫ్ జవానుల సంఖ్య 49కి చేరింది. కాగా దేశంకోసం ప్రాణాలర్పించిన సైనికుల కుటుంబాలకు అండగా నిలిచే విషయంలో టాలీవుడ్ యంగ్ హీరో విజయ్ దేవరకొండ అందరికంటే ముందుగా తన వంతు సాయాన్ని అందించి పెద్ద మనసు చాటుకున్నారు. ఈమేరకు తన ట్విట్టర్లో ఆర్థిక సాయం అందించిన సర్టిఫికెట్ను షేర్ చేస్తూ.. సైనికుల కుటుంబాలకి అండగా నిలవాల్సిన సమయం వచ్చింది. మనవంతు సహాకారం అందిద్దాం.. ఎంతో కొంత సాయం చేసి మనమంతా వారికి మన మద్దతును అందించాలంటూ ట్వీట్ చేసిన సంగతి తెలిసిందే. -
అంగారిక సంకష్టికి..అంతా రెడీ
సాక్షి, ముంబై : ముంబై ప్రభాదేవిలోని ప్రముఖ దేవాలయాలలో ఒకటైన సిద్ధివినాయకుని ఆలయంలో అంగారికి సంకష్టి కోసం దాదాపు అన్ని ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. ఆరు నెలలకోసారి వచ్చే ఈ సంకష్టి ఈ సారి జూలె 15వ తేదీ మంగళవారం వచ్చింది. దీన్ని పురస్కరించుకుని ముంబైతోపాటు చుట్టుపక్కల ప్రాం తాల నుంచి లక్షలాది మంది భక్తులు సిద్దివినాయకున్ని దర్శించుకునేందుకు తరలివస్తారు. ఈ నేపథ్యంలో భక్తులు ఎలాంటి ఇబ్బందులు పడకుండా ఉండేం దుకు నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు చేశారు. దర్శన వేళలు * సోమవారం అర్ధరాత్రి 1.30 గంటల నుంచి మంగళవారం తెల్లవారుజాము 3.15 గంటల వరకు * మళ్లీ 3.50 నుంచి రాత్రి 8.10 వరకు * రాత్రి 10.55 నుంచి అర్ధరాత్రి 2.00 గంటల వరకు మహాపూజ, హారతి వేళలు * సోమవారం అర్ధరాత్రి 12.10 నుంచి 1.30 వరకు * మంగళవారం తెల్లవారు జాము 3.15 నుంచి 3.50 గంటల వరకు * మంగళవారం రాత్రి 8.55 నుంచి 10.55 గంటల వరకు రోజు వారి పూజలు ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ సారి కూడా సోమవారం అర్ధరాత్రి 1.30 గంటల నుంచి మంగళవారం తెల్లవారుజాము 3.15 గంటల వరకు సిద్ధివినాయకుని దర్శనం కోసం ఆలయం ద్వారాలు తెరిచి ఉంచనున్నారు. తెల్లవారుజాము 3.30 గంటల నుంచి రాత్రి 8.15 గంటల వరకు, అనంతరం రాత్రి 101.5 గంటల నుంచి తెల్లవారుజాము రెండు గంటల వరకు గర్భగుడిలోకి భక్తులకు అనుమతిస్తారు. ఇక కాకడ్ హారతి, మహాపూజను అర్ధరాత్రి 12.10 గంటల నుం చి అర్ధరాత్రి 1.30 గంటల వరకు, తెల్లవారుజాము 3.15 గంటల నుంచి తెల్లవారుజాము 3.30 గంటల వరకు హారతి, రాత్రి 8.15 గంటల నుంచి రాత్రి 10.15 గంటల వరకు మహాపూజతోపాటు నైవేద్యం, హారతిని అందించనున్నారు. ప్రత్యేక వసతులు ముఖ్యంగా వికలాంగులు, గర్భిణులు, సీనియర్ సిటీజన్లు, పిల్లతల్లుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. వీరికోసం గేట్ నెంబర్ మూడు నుంచి లోనికి అనుమతించనున్నారు. మరోవైపు భక్తుల కోసం ఏర్పాటు చేసిన మండపంలో ఉక్కపోత నుంచి ఉపశమనం పొందేందుకు అక్కడక్కడా ఫ్యాన్లు బిగించారు. అలాగే లైట్లు, తాగునీరు, టీ, అల్పాహారం, సంచార మరుగుదొడ్లు సౌకర్యాలు కల్పించా రు. మండపంలో అగ్నిమాపక పరికాలు అందుబాటులో ఉంచారు. ఒక ఫైరిం జన్, అంబులెన్స్, వైద ్య బృందం, ప్రథమ చికిత్సకు అవసరమైన మందులు అందులో ఉంచారు. భక్తులు సెల్ఫోన్లు, ల్యాప్టాప్లు, కెమరాలు, ఇతర ఎలక్ట్రానిక్ వస్తువులు తీసుకురావద్దని ట్రస్టీ విజ్ఞప్తి చేసింది. సిద్ధివినాయకుని అందరూ క్యూను పాటించి దర్శించుకోవాలని ఈఓ మంగేష్ షిందే కోరారు. ట్రాఫిక్ మళ్లింపు అంగారకి సంకష్టిని పురస్కరించుకుని జూలై 14 నుంచి ప్రభాదేవి సిద్ధివినాయకుని ఆలయం చుట్టుపక్కల పరిసరాలలోని రోడ్లపై ట్రాఫిక్లో పలు మార్పులు చేశారు. అంగారికి సంకష్టి జూలై 15 మంగళవారం అయినప్పటికీ సోమవారం అర్ధరాత్రి 12 గంటలకు దర్శనం చేసు కోవాలన్న తపనతో అనేక మంది భక్తులు ఆలయం వద్దకి చేరుకుంటారు. ఆలయ పరిసరాలన్ని భక్తులతో కిటకిటలాడుతాయి. ఈ నేపథ్యంలో ట్రాఫిక్ మళ్లింపులు, కొన్ని మార్గాల్లో రాకపోకలను నిలిపివేయనున్నారు.
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
తప్పక చదవండి
- ముంబై హోర్డింగ్ ఘటన.. కారులోనే నలిగిన దంపతుల ప్రాణాలు
- ‘ఫ్యాన్’దే ప్రభంజనం.. సీఎం జగన్ సరికొత్త రికార్డ్!
- రోడ్డు ప్రమాదం వల్ల పవిత్ర చనిపోలేదు.. అసలు కారణం ఇదే!
- ఐశ్వర్యారాయ్ టోట్ బ్యాగ్ ధర తెలిస్తే నోరెళ్లబెడతారు!
- టీడీపీ గుండాల అరాచకం.. ఫ్యాన్కు ఓటేసిందని ట్రాక్టర్తో తొక్కించబోయారు
- కొత్త మార్కును దాటిన బంగారం! ఏకంగా ఎంత ఎగిసిందంటే..
- Virat Kohli: ఒక్కసారి క్రికెట్కు వీడ్కోలు పలికితే.. కోహ్లి నోట రిటైర్మెంట్ మాట!
- భారత సంతతి బాలుడికి దుబాయ్ పోలీసుల సత్కారం!
- IPL 2024: సన్రైజర్స్ ప్లే ఆఫ్స్ చేరదు.. ఆ నాలుగు జట్లే! ఫ్యాన్స్ ఫైర్
- మళ్లీ మనదే అధికారం.. చరిత్ర సృష్టించబోతున్నాం: సీఎం జగన్
Advertisement