breaking news
Sibi Chakravarthy
-
కోలీవుడ్ స్టార్ హీరోతో నేషనల్ క్రష్ రొమాన్స్!
తమిళ హీరో శివ కార్తికేయన్, హీరోయిన్ రష్మికా మందన్నా జంటగా నటించనున్నారా? అంటే అవుననే అంటున్నాయి కోలీవుడ్ వర్గాలు. హీరో శివ కార్తికేయన్, దర్శకుడు సిబీ చక్రవర్తి కాంబినేషన్లో వచ్చిన కాలేజ్ క్యాంపస్ డ్రామా ‘డాన్’ (2022) హిట్ మూవీగా నిలిచింది. ఈ ఇద్దరి కాంబినేషన్లో తాజాగా మరో సినిమా రానుందనే టాక్ తెరపైకి వచ్చింది. అంతేకాదు... ఈ సినిమాలో హీరోయిన్గా రష్మికా మందన్నా నటించనున్నారనే ప్రచారం కూడా కోలీవుడ్లో జరుగుతోంది. ప్రస్తుతం ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో శివ కార్తికేయన్ ఓ సినిమా చేస్తున్నారు. ఈ సినిమాలో హీరోయిన్గా తొలుత రష్మికా మందన్నా పేరు వినిపించింది. ఆ తర్వాత కియారా అద్వానీ పేరు కూడా తెరపైకి రాగా.. ఫైనల్గా కన్నడ బ్యూటీ రుక్ష్మిణీ వసంత్ హీరోయిన్గా చాన్స్ దక్కించుకున్నారు. మరి... ప్రచారంలో ఉన్నట్లుగా ఈసారైనా శివ కార్తికేయన్, రష్మికల జోడీ సెట్ అవుతుందా? వేచి చూడాల్సిందే. -
జయలలితకు కంగ్రాట్స్ చెప్పినందుకు...
భోపాల్: తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితకు అభినందలు తెలిపిన మధ్యప్రదేశ్ ఐఏఎస్ అధికారి ఒకరు చిక్కుల్లో పడ్డారు. తమిళనాడులో వరుసగా రెండోసారి విజయం సాధించిన జయలలితను అభినందిస్తూ మధ్యప్రదేశ్ లోని నర్సింగ్పూర్ కలెక్టర్ శిబి చక్రవర్తి తన ఫేస్బుక్ పేజీలో అభినందలు తెలుపుతూ కామెంట్స్ పోస్ట్ చేశారు. మే 19న 'కంగ్రాట్స్ అమ్మ' అంటూ పోస్ట్ పెట్టారు. దీంతో ఆయనపై మధ్యప్రదేశ్ ప్రభుత్వం కన్నెర్ర చేసింది. సివిల్ సర్వీసు నిబంధనలు ఉల్లఘించారంటూ ఆయనకు నోటీసు జారీ చేసింది. తన వ్యాఖ్యలపై విమర్శలు చెలరేగడంతో ఫేస్బుక్ నుంచి వాటిని తొలగించారు. ఈ వివాదంపై స్పందించేందుకు చక్రవర్తి నిరాకరించారు జవహర్ లాల్ నెహ్రును ప్రశసించి, నరేంద్ర మోదీని విమర్శించినందుకు బర్వానీ కలెక్టర్ అజయ్ గంగ్వార్ ను మధ్యప్రదేశ్ ప్రభుత్వం బదిలీ చేసింది. ఫేస్బుక్ లో చేసిన కామెంట్లపై వివరణ ఇవ్వాలని ఆయనను ఆదేశించింది. -
శిబిచక్రవర్తి దాతృత్వం
పురానీతి విశ్వవిఖ్యాతి పొందిన మహాదాతలలో శిబిచక్రవర్తి పేరును ముందుగా చెప్పుకోవాలి. ధర్మనిరతిలోను, దానగుణంలోను శిబిచక్రవర్తి పేరు ప్రఖ్యాతులు దేవలోకం వరకు వ్యాపించాయి. అయితే, శిబిచక్రవర్తి నిజంగానే ధర్మనిరతి గలవాడా? దానగుణ సంపన్నుడా? ఇదేదో తేల్చుకోవాలంటే అతడికి ఒక పరీక్ష పెట్టాలనుకున్నాడు యమధర్మరాజు. ఈ విషయంలో అతడికి తోడుగా ఉండటానికి సిద్ధపడ్డాడు దేవేంద్రుడు. ఈ సంగతి తెలియని శిబి చక్రవర్తి ఒకరోజు తన రాజప్రాసాదం మేడ మీద కూర్చుని ప్రకృతిని తిలకిస్తూ ఉన్నాడు. ఎక్కడి నుంచో ఒక పావురం శరవేగంగా ఎగురుకుంటూ వచ్చి ఆయన చెంత వాలింది. ఈలోగా దానిని తరుముతూ ఒక గద్ద వచ్చింది. అనుకోని పరిణామానికి నివ్వెరపోయాడు శిబిచక్రవర్తి. ప్రాణభయంతో వణుకుతున్న పావురం ‘రాజా! నన్ను నీవే కాపాడాలి’ అంటూ మొరపెట్టుకుంది. ‘తప్పక కాపాడతాను. నా రాజ్యంలో ఎట్టి పరిస్థితుల్లోనూ బలహీనులకు రక్షణ ఉంటుంది’ అని భరోసా ఇచ్చాడు. పావురాన్ని తరుముతూ వచ్చిన గద్ద ఊరుకోలేదు. ‘రాజా! నేను ఆకలితో అలమటిస్తున్నాను. ఆ పావురం నా సహజ ఆహారం. దానిని వదిలేస్తే నా ఆకలి తీర్చుకుంటాను’ అని అడిగింది. ‘రక్షణ కల్పిస్తానని పావురానికి నేను మాట ఇచ్చాను. దానిని వదల్లేను. నీ ఆకలి తీర్చుకోవడానికి మరేది అడిగినా ఇస్తాను. పావురాన్ని వదిలేయి’ అని బదులిచ్చాడు శిబిచక్రవర్తి. ‘రెండు షరతులకు అంగీకరిస్తే పావురాన్ని వదిలేస్తాను’ అని చెప్పింది గద్ద. సరేనన్నాడు శిబిచక్రవర్తి. షరతులేమిటో చెప్పమన్నాడు. ‘పావురం బరువుకు సమానమైన మాంసాన్ని నీ శరీరం నుంచే కోసి ఇవ్వాలి. మాంసం ఇస్తున్నప్పుడు నువ్వు కంటతడి పెట్టరాదు’ అంది గద్ద. షరతులకు అంగీకరించాడు శిబిచక్రవర్తి. వెంటనే ఒక తక్కెడను, తన శరీరం నుంచి మాంసాన్ని కోసేందుకు కత్తిని తెప్పించాడు. గుప్పెడు మాంసం కోసిస్తే పావురం బరువుకు సరిపోతుందనుకున్నాడు. తన కుడితొడ నుంచి గుప్పెడు మాంసం కోసి తక్కెడలోని ఒకవైపు పళ్లెంలో వేశాడు. మరోవైపు పళ్లెంలో పావురాన్ని నిలిపాడు. పావురమే బరువు తూగింది. మరికొంత మాంసాన్ని తీసి వేశాడు. అయినా పావురమే బరువు తూగింది. శిబి చక్రవర్తి తన శరీరంలోని కుడివైపు ఉన్న మాంసమంతా తక్కెడలో వేసేశాడు. అయినా పావురమే బరువు తూగింది. ఇదేదో మాయలా ఉందనుకున్నాడు. అయితే, ఏదైనా కానీ తాను మాత్రం ధర్మానికి కట్టుబడే ఉండాలనుకున్నాడు. సరిగ్గా ఆ సమయంలో శిబిచక్రవర్తి ఎడమకంట ఒక కన్నీటి బిందువు ఉబికింది. దానిని చూడగానే గద్ద... ‘రాజా! నీవేదో అయిష్టంగా నీ మాంసాన్ని ఇస్తున్నట్లున్నావు. అలాగైతే నీ మాంసం నాకు అక్కర్లేదు. నీ అండలోని పావురాన్ని వదిలేస్తే శుభ్రంగా తినేసి పోతా. నీ శరీరం తిరిగి పూర్వస్థితికి వచ్చేలా చేస్తా’ అంది. ‘పక్షిరాజా! నువ్వు పొరబడుతున్నావు. నీ ఆకలితీర్చే అదృష్టం నా శరీరంలోని కుడిభాగానికి దక్కినందుకు ఎడమభాగం ఆనందంతో పులకిస్తోంది. అందుకే నా ఎడమకన్ను ఆనందబాష్పాన్ని చిందిస్తోంది. నీ ఆకలి తీర్చడానికి నా శరీరంలోని ఎడమభాగం కూడా సిద్ధంగా ఉంది. చూడు! ఎడమభాగంలోని మాంసాన్ని కూడా వేసేస్తాను’ అంటూ మళ్లీ కత్తికి పనిచెప్పబోయాడు. శిబిచక్రవర్తి ధర్మనిరతికి, దానగుణానికి సంతోషించిన దేవతలు పూలవాన కురిపించారు. అతడి శరీరానికి పూర్వరూపం ఇచ్చారు. గద్దరూపంలో ఉన్న యమధర్మరాజు. పావురం రూపంలో ఉన్న ఇంద్రుడు తమ నిజరూపాలతో ప్రత్యక్షమయ్యారు. ‘ఇదంతా నీ ధర్మనిరతిని పరీక్షించేందుకు ఆడిన నాటకం’ అని చెప్పి అంతర్ధానమయ్యారు. నీతి: ఎట్టి పరిస్థితుల్లోనైనా మాట తప్పకపోవడమే ధర్మం.